Monday, December 13, 2010

మీడియాలో అందరం చూస్తున్నాము. వాళ్ళ హోమ్ మినిస్టరే యేడాదికింద ప్రకటించిన కేసుల ఎత్తివేత అమలు చేయండి అంటే యెంత యాగీ చేస్తున్నారో చూస్తున్నాము.వంగవీటి మోహనరంగా,రాజీవ్ గాంధీ లు చంపబడ్డపుడు ఎన్ని గృహదహనాలు,ఎంత ఆస్తుల విధ్వంసం ,ఎన్ని బస్సుల కాల్చివేత, ఎన్ని ప్రైవేట్ ఆస్తులు బుగ్గిపాలు అయ్యింది మనం మర్చిపోలేదు ఇంకా.అందులో పాల్గొన్నవాళ్లు చాలా మంది గూండాలు,హంతక చరిత్ర ఉన్నవాళ్లే, అయిన గూడా రాజ్యానికి ముఖ్యంగా జయప్రకాష్ నారాయణ లాంటి చట్టాలను గురించి మాట్లాడే వాళ్ళకు ఏది గుర్తుకు రాలేదు.తమ వర్గం,తమ కులం వాళ్ళ పైన కేసులు ఎత్తివేస్తే ఆయా సర్కారులను వీళ్ళు పల్లెత్తు మాట అనలేదు సరికదా అభినందించిన వాళ్ళే వీళ్ళంతా.అది ఎంత చట్టవ్యతిరేకమయింది అయిన కానివ్వండి ఎంత అమానవీయమైంది అయినా కానివ్వండి తమ రాజకీయాలను ఆమోదించే వాళ్లెనా,తమ అడుగులకు మడుగులు ఒత్తే వాళ్లెనా అయితే ఏ కేసులు ఉండవు .వై ఎస్సార్ బాడీ గార్డ్ సూరీడు రాజీవ్ విద్యామిస్సిన్ లోని కోట్లాది రూపాయలను పసి పిల్లలకు దక్కవలసినవి వాళ్ళ విద్యావసరాలు తీర్చ వలసిన సొమ్ము అప్పనంగా బొక్కి కూర్చుంటే సూర్యనారాయణ మీదగాని ఆయన ఉంపుడుగత్తెమీద గాని ఏ కేసులు ఉండవు.
రాజ్యాంగ బద్ధంగా దక్కవలసిన హక్కులను కలరాస్తున్న వేల కడుపు మండిన యువత రాజ్యాంగం లో ఉన్న అవకాశాల మేరకే ఉద్యమిస్తే 307 హత్యా ప్రయత్నం కేసులు పెట్టి తీవ్రమయిన నేరాలకు పాల్పద్దవారిని ఎలా విడిచి పెడుతాము అని ఒక హోమ్ మంత్రి అన్నా ఒక j p అన్నా తెలంగాణ ప్రజలు ఎలా సాహిస్తారు అన్న కనీస ఇంగిత జ్ఞానం లేని రాజ్యం ఆ రాజ్యాన్ని సమర్థిస్తున్న తెలంగాణ శాసన సభ్యులను తెలంగాణ ప్రజలు ఎంతమాత్రం క్షమించరు.
కానీ అధికార పీఠం పయిన కూర్చున్న పెద్దలకు ప్రజల అభిప్రాయాలతో ఏమీ సంబంధం లేనట్లుగానే వాల్లు ప్రవర్తిస్తున్నారు. అది అరిస్టాటిల్ చెప్పింది అయినా అంబేడ్కర్ చెప్పింది అయినా ప్రజల అభీస్టమ్ మేరకే పరిపాలన సాగాలి.కానీ ఏమి జరుగుతున్నదో చూస్తున్నాము, వాళ్ళ వాళ్ళ రాజకీయాలకు ఇబ్బన్దులు గానీ వాళ్ళ ఆర్థిక ప్రయోజనాలకు ఇబ్బందులు గాని జరుగనంత వరకు ప్రజలు ఎంత అరిచి గీ పెట్టిన రాజ్యం పట్టించుకోవడం లేదు అనేది మనం ప్రత్యక్షంగా చాలా చాలా విషయాలల్లో చూస్తున్నాము. అది హైద్రాబాద్ చుట్టుపక్కల భూముల కుంభకోణం గాని సెజ్జులు గాని,జలయజ్ఞం గాని, ఘనుల కుంభకోణం గాని, k v p కొండ సురేఖ పంచాయితీ గాని బోఫోర్స్ కుంభకోణం నుండి బొగ్గుల వాగు ఓపన్ కాస్ట్ కుంభకోణం దాకా అన్నింటిలో ఒకటే ధోరిని అవలంభిస్తున్నారు.
తెలంగాణ విషయం లో కూడా వాళ్ళ రాజకీయ అవసరాలకోసం అప్పుడప్పుడు అది కాంగ్రెస్ కానివ్వండి తెలుగు దేశం కానివ్వండి,ప్రజారాజ్యం కానివ్వండి,రేపు జగన్ పార్టీ కానివ్వండి తెలంగాణ అంటున్నారు, అంటూనే ఉంటారు, తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలన్న తమ బలమయిన ఆకాంక్ష ను అనేక సార్లు చాలా స్పస్టంగా kcr మాటల ప్రకారం దిమ్మ దిరిగి పోయేలా చెప్పినారు.TRS చెప్తున్నట్లు రేపు 16 డిసెంబర్ నాడు 25 లక్షల మంది తో ప్రదర్శన్ చేస్తే ఈ గుడ్డి సర్కారుకు జ్ఞానోదయం అయ్యేది కొత్తగా ఏమీ ఉండది అనేది జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న వారికి అందిరికి సులభంగానే అర్థం అవుతున్నది.ప్రజల అభిప్రాయం ఏమిటో ఇప్పటికే చాలా స్పస్టంగా ప్రజలు పదే పదే చెప్పినారు.బలప్రదర్శన కూడా ఇప్పటికే అనేకసార్లు జరిగింది. కొత్తగా ఈ బల ప్రదర్శనతోటి అదనంగా జరిగేది,ఒరిగేది ఏమీ లేదు.ఖర్చూ కాలయాపన దప్ప .
ఆనాడు బ్రిటిష్ సర్కారును ఎదురించడానికి ఏ సహాయ నిరాకరణ అయితే చేపట్టినామో ఇప్పుడు కూడా పోరాడుటము, ఉద్యమిస్తాము అని చెప్పే శక్తులు,శ్రేణులు, రాజకీయ పార్టీలు,ఒక చంద్రబాబు, ఒక లగడపాటి, ఒక జగన్మోహన రెడ్డి, ఒక కావూరి, ఒక సుబ్బిరామి రెడ్డి, ఒక రామోజీ, ఒక మోహన్ బాబు, ఒక చిరంజీవి, ఒక మురలి మోహన్,ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరైతే తెలంగాణ కు వ్యతిరేకంగా పనిజేస్తూ తెలంగాననే మార్కెట్ గా సొమ్ముజేసుకుంటున్నారో వాళ్లందరి ఆర్థిక ప్రయోజనాలను దెబ్బకొట్టే విధంగా ప్రణాళికలు వేసుకొని అమలు చేస్తేనే ప్రయోజనం ఉంటుంది తప్ప ఇక ఈ మీటింగులు చాటింగులతో ప్రయోజనం ఉండదు, అసలే ఉండడా అంటే ఉంటుంది వాళ్ళ వాళ్ళ ఓట్లు, సీట్ల ప్రయోజనం ఉంటుంది ,తెలంగాణ వచ్చినా మంచిదే రాకున్నా మంచిదే రేపటి లోకల్ బాడీ ఎన్నికల్లో తెలంగాణ పేరుతో మాకిన్ని ఒట్లూ,మా వెంట తురుగుతున్నవాళ్లకు కొన్ని సీట్లు దక్కితే చాలా సంతోషం అనుకునే వాళ్ళు చేసే జిమ్మీక్కులు ఇంకా ఎంతో కాలం జనం నమ్మరు,
ఇప్పటికయినా ప్రత్యక్ష పోరాటానికి ఉద్యమ శక్తులు పిలుపునివ్వాలి. ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని చెప్పడానికి నిదర్శనం ఇంకా ఇప్పటికీ జరుగుతున్న ఆత్మహత్యలే. సీరియస్ పోరాటాలు ఉంటే ఆత్మహత్యలు ఉండవు.

Sunday, December 5, 2010

చల్గల్ గడి -గుడి గా మారుస్తామంటున్న ప్రజలు.

తెలంగాణలో గడీలు ఆనాడు నిర్భందాలకు నిలయాలు. దొరలమాటలను,అధికారాలను ధిక్కరించడం కాదుగాదా కేవలం ప్రశ్నించినా కూడా పాపమే అయినరోజులను ఈ నాడు పాడుపడిన గడిల శిథిలాలలో ప్రజలు నెమరు వేసుకుంటున్నారు.అది కరీంనగర్ జిల్లా
ఈ జిల్లాలో మొత్తం 7 గడీలు ఉన్నాయి.బండలింగాపూర్,భీమారం,చల్గల్,ఇటిక్యాల,నేరెళ్ళ,రాజారం,మద్దునూర్ లల్లో ఈ గడీలు ఉన్నాయి.1978 లో జగిత్యాల జైత్రయాత్ర నాటికి ఈ గదీలన్నీ దాదాపుగా తామరాజశాన్ని కొనసాగిస్తూ ఉన్నెవే.ప్రజల చైతన్యాన్ని అంచనా వేసిన కొందరు తెలివైన దొరలు గడీలని విడిచి హైద్రాబాద్ లాంటి చోట భూములు కొనుక్కొని పారిశ్రామిక వేత్తలుగా తమ రూపాలను మార్చుకున్నారు.కేవలం ప్రజలతో ఘర్షణ పడి గడి విడిచింది కేవలం మద్దునూరి రాజేశ్వరావు దొర మాత్రమే.దొరలు గడీలను విడిచి పట్టణాలకు పోయినా గడీలను మాత్రం అమ్మకుండా గడీ పాలనలోని వ్యవసాయ భూములను మాత్రం అమ్ముకొన్నారు.దొరలు అమ్ముకున్న ఆ భూములతోనే పట్నం లో లింగాపుర్భావనమ్(హిమాయత్నగర్)నేరెళ్ళబాపూది నేరెళ్ళ భవనం.ఇంకా అనేక పరిశ్రమలు స్టాపించుకోవడానికి ఇక్కడి గడిల భూములన్నీ ఇందనం అయినాయి.

ఈ గడిల అమ్మకం మాత్రం కేవలం 5 సంవస్తారాలనుండి ప్రారంభం అయింది.ఇప్పటికే నేరెళ్ళగడి పూర్తిగా అమ్మితే రాజారం గడి మాత్రం పాక్షికంగా అమ్ముకుంటే ఇటిక్యాల గడిని సత్యనారాయణ రావు దొర వారసులు ఊరికి ఉచితంగానే వదిలి పెట్టినారు.కానీ జగిత్యాల పక్కనే ఉన్న చెలగాల్ గడిని దొరవరసులు ఒక కోటి డెబ్బై లక్షలకు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్ముకున్నట్లు ప్రజలకు తెల్సిందట.

నిజాం నవాబుల పాలన రాజుతోత్సవాల సందర్భంగా కరీంనగర్ జిల్లాలోని జగిత్యాలలో ఒక గడి,జగిత్యాల పట్టణం లో ఒక టవర్ గడియారం నిర్మించాలని కోరినారాట .ఆనాటి చల్గల్ దొర జువ్వాడి ధర్మ జగపతి రావు నిజాము ప్రభువు కోరిన విధంగా ఆ నిర్మాణాలు చేస్తూనే చల్గల్ లో కూడా తనకంటూ ఒక గడి నిర్మించుకున్నాడట.ఈ జువ్వాడి జగపతి రావు ధర్మపురి మండలం లోని తిమ్మాపూర్ అనే గ్రామం నుండి చేల్గల్ కు ఇల్లరికం వచ్చినాడట. ఈయన కరుడుగట్టిన దోరే అయిన ఈయనకు ధర్మ జగపతి రావు అనే పేరు ఎందుకు వచ్చిందట అంటే ఈ దొర దర్శనానికి వచ్చే సామాన్యులకు అప్పుడప్పుడు దర్శనం ఇచ్చే వాడట. ఇతని దర్శనం కోసం జనం రోజుల తరబడి గడి ముందు వేచి ఉండే వారట. దొర బయటికి వచ్చినప్పుడు దర్శనం కోసం వేచి ఉన్న ప్రజలకు తల ఒక పైసా దానం ఇచ్చే వాడట. ఆ పైసా దానం చేసినందుకే ప్రజ్లలు ఎంతో దాతృత్వం తో ధర్మ ప్రభువు అనే బిరుదాన్ని అయంకు దానం చేశారు.ధర్మ జగపతిర రావు కొడుకు రాజగోపాల రావు.గడిపై ఇతని పేరే ఉంది.రాజగోపాల రావు కొడుకులు కృష్ణ భూపాల రావు,డా.రాంభూపాల రావు.రాంభూపాల రావు హైద్రాబాద్ లోని సత్య కిడ్నీ సెంటర్ యజమాని,ఆయన మరణాంతరం ఆయన కూతురు సత్య కిడ్నీ సెంటర్ చూసుకుంటున్నది.కృష్ణ భూపాల రావు మాత్రం జీవించి ఉన్నాడు.ఇతనికి ఇద్దరు బిడ్డలు. ప్రస్తుతం కృష్ణ భూపాల రావు గడిని అమ్మకానికి పెట్టినాడు.

ప్రజల వాదన ఏమంటే గడికి చెందిన 700 ఎకరాల సస్యశ్యామల మైన భూములను అమ్ముకుంటే మేమి అడ్డం తిరుగలేదు.మారెక్కల కస్టమ్ తో కట్టబడిన ఈ గడిని మేమే కంటికి రెప్పల ఇన్నాళ్ళు కాపాడుకున్నాము ఈ గడి ని గ్రామానికి విడిచి పెడితే దొరకు ఏమి నస్టమ్ అంటున్నారు. కానీ దొర అది మా ఆస్తి మేము ఎందుకు వదిలి పెడుతము అని అమ్మకానికి పెట్టినాడు.ఏమి దైవ మాయోగాని రియాయల్టర్లు భూమిని చదును చేస్తుంటే అందులోనుండి పురాతన శిల్పాలు,విగ్రహాలు తవ్వకాల్లో నుండి బయట పడ్డాయి,ఇంకేముంది ప్రజలంతా గడిని గుడి గా మారుద్దామ్ అంటూ ఏక కంటమ్ తో ఉన్నారు.రియల్టర్ దొరకు ఫిర్యాదు అయ్యాడు.దొర పోలీసు బలగాలతోనవంబర్ 5నా చల్గల్ కు వచ్చినాడు.దొర కారు కూడా దిగకుండానే ప్రజలంతా ఆయన్ని అడ్డుకున్నారు.గడిని అమ్మేది లేదని ఖరఖండిగా తెగేసి చెప్పినారు.తోపులాట జరిగింది.పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ప్రజలు తమ చేతికి అందిన రాళ్ళు రప్పలతో పోలీసులపైనా తిరుగుబాటు చేస్తూ తమ పైన లాఠీ చార్జ్ చేసిన పోలీసులను ఒక కిలోమేటర్ దూరం తరిమి వేసినారు. తర్వాత పోలీసులు గాల్లోకు ఫైరింగ్ చేసినారు.ప్రజలు అప్పటికి చెల్లాచెదురు అయినారు కానీ తెల్లవారి గడీ మొత్తం గ్రామస్తులచే నిండి పోయింది.గడి ప్రస్తుతం ప్రజల అధీనం లో ఉంది.

ఈ గడిలు ఉన్న ప్రతి గ్రామం లోని ప్రజలు అంటున్నదేమిటంటే మేము గత 50 సంవస్తారాలుగా ఈ దొరలు అమ్ముతున్నా భూములు కొనడానికే మా రెక్కల కస్టమ్ అంతా ధరబోస్తున్నాము.మంచి బట్ట కట్టింది లేదు మంచి బువ్వ తిన్నది లేదు. అన్నాడు మాతాతలు,అయ్యలు దొరల వద్ద వెట్టి చాకిరు చేసి బతికితే మేము ఇప్పుడు ఆ దొరల భూములు కొనుక్కోవడానికి మా రెండు తరాల కుటుంబాలు అరువ చాకిరీ చేసి వాళ్ళ పెట్టుబడులు మరింతగా పెంచుకోవడానికి మేము మరింత చాకిరీ చేయ వలసి వస్తున్నదని వాపోతున్నారు.

భూమా,పెట్టుబడా ఎడైతే ఏమి అది పెరుగడానికి మానవ శ్రమే ఆధారం అనేది చల్గల్ ప్రజలు మరోసారి ప్రపంచ ప్రజల దృస్టికి తీసుకొనే వచ్చినారు.

Sunday, November 28, 2010

ఆకసాయిపల్లే-అవతార్

ఆకసాయిపల్లి -అవతార్
ఆ భూముల్లో ఖనిజాలు ఉండడం అక్కడి ప్రజలకు శాపం అవుతున్నది.ఖనిజాలు,ఇందనాలు సహజ సంపదలు పరిమితంగా
ఉండి అపరిమితంగా వాడితే అంతరించి పోయే అవకాశం ఉన్న వనరులు.ఇట్టి వనరులు గటకొంత కాలంగా కాంట్రాక్టర్ల లాభాపేక్షకు బలి అయి
పోతున్నాయి.ఆ విషయం తెలియని వారికి ఏమీ తెలియదు కూడా కానీ తెలిసిన వారు కూడా మరి అభివృద్ధి జరుగాలంటే వనరులను వాడుకోకుంటే
ఎలా అనే ప్రశ్నిస్తున్నారు. వనరులను విచ్చలవిడిగా వాడుతున్నందున అలివిగాని వాయి,జల,ధ్వని కాలుష్యాలతో పర్యావరణానికి జరుగుతున్నా
విఘాతాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు.
అది కరీంనగర్ జిల్లాలోని ధర్మపురి మండల కేంద్రం లోని 15 వ వార్డు.ఈ ధర్మపురి గ్రామ పంచాయతీ లో ఆ 15 వ వార్డు పేరు ఆకసాయి పల్లె.
ఆ పల్లె పరిధిలో 10 కిలోమీటర్ల విస్తీర్ణం లో సున్నపు రాయి నిలువలు ఉన్నాయట. ఇకనేమీ మైనింగ్ కాంట్రాక్టర్ల దృస్తి పదనే పడ్డది. తాను సమ్
తృప్తీ చెందిన భూగర్భ వనరుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ తన లేఖ సంక్య. 8125/ఏం.పి. ఎల్./08 ద్వారా సర్వే నంబర్ 145,146 లోని 52 హెక్టార్ల
భూమిని కేటాయించాలని రెవెన్యూ అధికారులకు రాశాడు.రెవెన్యూ అధికారులు సర్వే చేస్తుండగా ఆకసాయి పల్లె ఆడ బిడ్డలు,అడివి బిడ్డలు అడ్డుకున్నారు.
ఎవరి సర్వేలను కొనసాగా నివ్వమని కరాఖండి గా తెగేసి చెప్పినారు.సర్వే అధికారులను అక్కడనుండి ఆ ఆడ తల్లులు తరిమి వేసినారు.
ఆకసాయి పల్లెలో వారికి బుద్ధి తెలిసి నప్పటి నుండి ఆ నాయకపు కులం (shedul tribs)కుటుంబాలు అక్కడ నివసిస్తున్నాయి.
దాదాపు 70 సంవస్తారాల వయసున్న రామేళ్ళ పోషమ్ లస్మక్క దంపతులతో మాట్లాడినప్పుడు వాళ్ళు తమ తాత ముత్తాతలనుండి అదే
గ్రామం లో నివసిస్తున్నట్టు తెలిపినారు. తమ చిన్నతనం లో ఆ గుట్టల పైన ఉండే కట్టెలను కొట్టుకొని పోయి ధర్మపురిలో అమ్ముకొని
తమ పిల్లలను కుటుంబాలను పోషించుకొనేవారమని తెలిపినారు.మొట్ట మొదట అక్కడ కేవలం మూడు గుడిసెలు ఉందేవట .ప్రస్తుతం 200
కుటుంబాలు,600 జనాభా ఉన్నది.తూర్పు నుండి పడమరవైపునకు వాలి ఉన్న ఆ గుట్ట బోరు పైన వీళ్ళ ఇండ్లు ఉన్నాయి.ఇండ్ల చుట్టూ
దాదాపు 400ఏకరాలల్లో సేద్యం చేస్తున్నారు.100 ఏకరాలల్లో వారి,300 ఏకరాలల్లో ఇతర పంటలు పండించుకుంటున్నారు. నాయకపు
కులం లోని బద్ధి,గడ్డం,తాట్ల,రామిల్ల,మేకల,బట్టుపల్లి వంశస్తులు కుటుంబాలు ఉన్నాయి, వేరేకులం వాళ్ళు ఎవ్వరూ లేరు.ఈ ఊరుకి ఆకసాయి
పల్లె అని పేరు రావడానికి కారణం ఆకాశం నుండి కురిసే వాన ఆధారంగానే ఈ గడ్డ పైన పంటలు పండుతాయి. వర్షాకాలం లో వానలు
పడ్డతర్వాత ఇక వానలు పడక పోయినా ఇక్కడ పంటలు ఎండి పోవు. ఇక్కడి సేదిమెంటరీ శిలలు పడిన వాన చినుకులను తమలో
దాచుకొని నెమ్మదిగా., తడి ఆరిపోతున్నాకొద్ది నెల తల్లి గొంతును తడుపుతున్న సంగతిని మేము కళ్ళారా చూశాము.బెత్తెడు మందం
మట్టిని తొలగిస్తే తేమ కనిపిస్తున్నదక్కడ.వానచినుకులు పడగానే మక్కలు కందులు కలిపి పంట వేస్తారట, మక్క పంట అయిపోగానే బబ్బెర్లు
వేస్తారట.బబ్బెర పంట కోసుకొని పెసర లేదా కూర అలసంద వేస్తారట. ఎల్లిపాయలు,ఉల్లిగడ్డలు,ధనియాలు,పసుపు పండిస్తున్నారు,.
,వీటికి వెతికి కూడా వాళ్ళు ప్రత్యేకించి తడి పెట్టరాట. ఒక వైపు విదేశాలనుండి కందులు దిగిమతి చేసుకుంటూ ఇక్కడ మనకు కందులు
పండించి పెడుతున్న భూములనేమో తవ్వి వేస్తామంటే ఇదెక్కడి అబ్నివృద్ధి అని ఆకసాయి పల్లె ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
గుట్టలు అంటే కేవలం బండలు మాత్రమే కాదు అవి. ఈ భూగోళానికి తాపం తీర్చే ఓవర్ హెడ్ టాంకులు, అవసరం వచ్చినప్పుడల్లా
నీటిని వాడుకోవడానికి ఉన్న భూగర్భ సంపులు అవి. మిగులు జలాలను చెరువులకు,బావులకు,కుంటలకు, నదులకు దానం
చేస్తున్న దానకర్నూలు ఈ గుట్టలు. విచక్షణా రహితంగా ఈ గుట్టలను ధ్వంసం చేసుకుంటే మనలను మనం చంపుకున్నట్టే.
ధర్మపురి వద్ద ఈ మధ్య కాలం లో గోదావరి చాలా సార్లు ఎండి పోయింది. కానీ ఆకసాయి పల్లెలోని బావి ఎండి పోలేదు సరికదా
ధర్మపురి వాసులకు దాహార్తిని తీర్చింది. ఆకసాయి గుట్ట పసుల పాపన్న గుట్ట,బొరె గుట్ట లల్లో విస్తారమైన సున్నపు రాయి ఖనిజం
ఉంది.మైనింగ్ కాంట్రాక్టర్ల మాయలోబడి ఖనిజాలను తవ్వుకోవడానికి అనుమతి ఇస్తే మాత్రం గోదావరి ఎండి పోవడం మాత్రమే గాదు
దాదాపు20 కిలోమీటర్ల రేడియస్ లో బూమంతా ఎడారిగా మారిపోయి మానవ మనుగదే ప్రశ్నార్థకం కానుంది.
నిరక్షరాస్యులైన గిరిజనులు చేస్తున్నపాటి పోరాటమైన మనం చేయకుంటే మన భావి తరాలకు మనం తీరని అన్యాయం
చేసి న వాళ్లం అవుతాము.

Sunday, October 3, 2010

ప్రజల అమాయకత్వాన్నే ఆస్తులుగా మార్చుకుంటున్నారు.

ప్రజల అమాయకత్వాన్నే ఆస్తులుగా మలుచుకుంటున్నారు.
అది కరీంనగర్ జిల్లా గొల్లపల్లి మండలం బి బి రాజ్ పల్లి.చిన్న పల్లెటూరు, చుట్టూ గుట్టలు
ఉన్నందున ఆ పల్లెను గుట్టల పల్లె అని కూడా పిలుస్తారరట. ఈ పల్లెలో దాదాపు 400 ఇండ్లు
ఒక వేయి పై చిలుకు జనాభా ఉన్నారు. ఆ గ్రామానికి సర్పచు దాసరి లక్ష్మి, కానీ సర్పచు
ఎవరు అని అడిగితే మాత్రం అందరూ దాసరి లక్ష్మి భర్త శంకరయ్య అనే చెప్తున్నారు. గ్రామం లో
ఉన్న జనాభాను కమ్యూనిటీ పరంగా చూస్తే ఎక్కువ మంది దళితులు ఉన్నారు.
ఒక పెద్ద మనిషి ని వాకబు చేయగా ఈ ప్రణతమ్ లో శంకరపల్లే నుండి మ్యాడమ్ పెళ్ళి వరకు
ఉన్న దాదాపు 8 కిలోమీటర్ల దూరం వరకు ఉన్న భూమి అంతా వెనుకత దొరలదే అని అన్నాడు.
ఈ గుట్టల మధ్యన అక్కడక్కడ వ్యవసాయానికి పనికి వచ్చే భూముల్లో దళితులు గుడిసెలు
వేసుకొని నివసించే వారని, గుట్టల పైన దొరికే సీతాఫలాలు, తేనె, వంట చెరుకు, తునికి,మోదుగ
ఆకుల సేకరణ, గొర్రె,మేకల,ఆవుల పెంపకం తో పొట్టపోసుకొనే వాల్లట. కానీ అరుగాలం పని దొరికే
వ్యవసాయం చేసుకోవడానికి తమకంటూ స్వంతంగా భూమి లేని కారణంగా ఇక అక్కడ ఎక్కువ
కాలం బతుకు కొనసాగించడం సాధ్యపడని భావించిన జనం అక్కడి నుండి వెళ్ళి పోవడానికి
సిద్ధ పడినట్లు చిప్పినారు. అయితే తెలంగాణ ప్రాంతం లో జరిగిన సాయుధ పోరాటం ఫలితంగా
ఆ ఉర్లన్నిటికి జాగీరుదారులైన తాండ్ర వంశస్టులైన వెలమదొరలకు అప్పటికే అక్కడ నివసిస్తున్న
దళితులకు ఆ భూములు పంచక తప్పని పరిస్తీతి ఎదురైంది అని స్థానిక హరిజన పెద్ద మనిషి
చెప్పినాడు. అప్పటి నుండి ఈ అరవై ఎండ్లుగా కస్టమో సుఖమో అందరూ ఒక్క చోట ఆ గుట్టల
మధ్యన వాళ్లంతా జీవిస్తున్నారు.
మూడు సంవస్తారాల క్రితం తమిళనాడు అధినాయకురాలు జయలలితా అనుచరుదనంటూ
అంబరీషన్ అనే వ్యాపార వేత్త ఒకరు వచ్చినారు. మీ భూములు మీకే ఉంటాయి ఇంకా కాదంటే
మేము ఈ భూముల్ల నుండి గ్రానైట్ అనే రాళ్ళు తీసివేసిన తర్వాత మీ భూములు ఇంకా చదును
అవుతాయి అని మాయా మాటలు చెప్పి ఒక్కో ఎకరా పదహారు వెయిల చొప్పున 22 సంవస్ట
రాలకు కౌలుకు రైంచుకొని పోయినాడు. కానీ అతడు క్వారి ప్రారంభించలేదు. ఇప్పుడు స్టానిక
నాయకులకు ఆ గుట్టల పైన కన్ను పడింది.
గ్రామం లో ప్రధానంగా ఉన్న గొల్లకురుమ కులస్తులకు 2000 వెయిలకు పైగా గొర్రెమేకలు
ఉన్నాయి. వాటిని మేపుకోవడానికి సీలింగు లోని మిగులు భూములను యాదవ సంగానికి
సీత ఫలాల సేకరణకు ముదిరాజ్ కులస్తులకు ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది. ఈ భూములను లబ్ది
దారులు అమ్ముకోవడానికి వీలు లేదు. ఈ గ్రామాలకు రెవెన్యూ గ్రామం అయిన ఇబ్రాహీం నగర్
పట్వారీ రాజేందర్ రావు ను పట్టుకున్నారు గ్రానైట్ బకాసురులు. మీరు ఈ భూముల్లో వ్యవసాయం
చేయడం లేదు కనుక ప్రభుత్వం మీ భూములను స్వాధీనం చేసుకోబోతున్నది, మీరు మాకు
ఈ భూములు వద్దు అనిగనుక సంతకాలు చేస్తే మీకు ఎకరా 70 వేల చొప్పున ఇప్పిస్తానని
రాజేందరావు తో చెప్పించారు.అమాయకులైన ముదిరాజ్ ,గొల్లలు సంతకాలు చేశారు. అలాగే
పట్టభూములకు ఎకరా లక్ష చొప్పున 22 ఏండ్లకు కౌలుకు రాయించుకున్నారు. రెపోమాపో
గ్రానైట్ క్వారి మొదయితే ఆ పచ్చదనం మచ్చుకు కూడా లేకుండా పోతుందనీ, వేసుకున్న
పంటలపైనా దుమ్ము కప్పికొని పోయి పుప్పొడి ఉండక వేసిన కంకులకు గింజలు రావని,
బ్లాస్టింగ్ చప్పుళ్ళకు గుట్టల పైన ఉన్న గుడ్డేలుగులు ఊళ్ళోకి వస్తాయని, సీతాఫలాలు ఇక
ఉండవని, భూమిలోని నీరు ఇంకి పోతుందని, పడవలసిన వానలు ఇకనుంది ఇక్కడ పడవని
ఆ భూమి ఇక నివాస యోగ్యం కాదని వాళ్ళకు తెలియదు. తెలిసి చెప్పవలసిన రాజకీయ
నాయకులు గానీ ప్రజలకు ట్రస్టీలు గా నిలువవలసిన అధికారులు గాని వాస్తవాలు ప్రజలకు
చెప్పకుండా అభివృద్ధి అంటే ఇదే అని అంటున్నారు

ప్రజల అమాయకత్వాన్నే ఆస్తులుగా మార్చుకుంటున్నాఋ

Monday, September 13, 2010

చెట్లు-గుట్టలు -అవే రేపటి మన జాడలు-2 !

చుట్టూ ఉన్న ఈ గుట్టల వలన కురిసే వర్షాపాతం తో ఊరికి ఉన్న మూడు పెద్ద చెరువులు,
నాగుల చెరువు ,ఊరచెరువు ,ఆరేడు చెరువు నిండుతాయి. గుట్ట ఏనెల పొంటి ఉన్న ముప్పై
ఆరు కుంటలు నిండుతాయి . ఈ మూడు చెరువులు ముప్పైయారు కుంటలు ప్రతి సంవస్తారం
నిండుతున్న కారణంగా ముఖ్యంగా భూగర్భ జలాలు బాగా పైన ఉండి గ్రామం లో మూడు వందల
వ్యవసాయ బావులలో సమృద్దిగా నీరు ఉండి రెండు పంటలకు రెండు వేల ఏకరాల్లో వరి, రెండు
వందల ఏకరాల్లో మామిడి, వంద ఎకరాల టేకు, అరవై ఏకరాల నిమ్మ తోటలతో, భూమి ఉన్న
వాళ్ళకు మాత్రమే గాకుండా భూమిలేని వ్యవసాయ కూలీలకు కూడా ఏడాదికి పన్నెండు నెల్లు
.చేతి నిండా పని దొరుకుతున్నది.
ఈ గుట్టల పైన కురిసే వాన చిన్నచిన్న కుంటలు నింపడంతో బాటుగా నాగుల చెరువు,
అన్నారం చెరువు, రంగం పేర చెరువులను నింపి మిగిలిన నీరు మానేరు నదిలో ,కలుస్తుంది
మరోవైపు నుండి ఈదులాగట్టేపల్లి చెరువు, అన్నారం ఊరడి చెరువు, రంగంపేట చెరువులను
నింపి మిగిలన్ నీటిని మానేటిలో వదులుతుంది. ఇంకొక వైపునుండి లలితపూర్ గుట్టల్ల నుంచి
దేవంపల్లిచెరువు నింపి రంగంపేట్ గ్రామానికి చెందిన గుండ్ల కుంట నింపి మానేరును చేరుతుంది.
కరీంనగర్ జిల్లాలో గంభీరావ్ పేట నుండి మొదలై కాటారం మండలం దామరకుంట వద్ద
గోదావరిలో సంగమించే మానేరు నది జిల్లాలోని 40 మండలాలకు పరీవాహక ప్రాంతమైన జీవనదీ.
ఆ జీవనదికి జీవగర్రలు ఈ బండల కొండలు.
గ్రానైట్ క్వారీల వలన ఎత్తైన గుట్టల స్తానమ్ లో బండలు పెకిలించబడ్డ బొందలతో ఊర్ల చుట్టూ
పగులగొట్టబడిన రాళ్ళు,మట్టి దిబ్బలు,వెలసి వర్షాలు లేక భూగర్భ జలాలు అడుగంటిపోయి
భూములన్నీ ఏడార్లుగా మారే ప్రమాదం ఉంది. క్వారీల బ్లాస్టింగుల మూలంగా ఎగసిపడే రాళ్ళు,
దుమ్ముతో ... ఉన్న పంటలు పర-పరాగ సంపర్కానికి దూరమై, వరి, మామిడి, నిమ్మ, మక్కా,
కూరగాయతోటలన్ని నాశనమై పోతాయి. గందకం కర్బండయాక్సైడ్ సిలికాన్ అణువులు గాలిని
సాంధ్రీకరించడం వలన సిలికోసిస్, బాంక్రయిట్స్ వ్యాధులు ప్రభలే ప్రమాదం ఉంది. అలాగే
లక్షల ఏండ్ల నుండి కొండల ఉపరితలాలు గాలికి సూర్య రశ్మికి ఎక్స్పోస్ కావడం వలన రేడియో
ధార్మిక శక్తిని ఎమిషన్ చేసి వదిలించుకున్నాయి కానీ ఇప్పుడు నూతనంగా కొండలను
పగలేసినందున బండల్లో ఇమిడియున్న యురేనియామ్ ,థోరియం లాంటి మూలకాలు సూర్య
రశ్మికి ,గాలిలో ఉన్న వివిధ వాయువులతో ఎక్స్పోజ్ అయ్యి రేడియో ధార్మిక కిరణాలను విడుదల
చేయడం వలన కాన్సర్ లాంటి భయంకర వ్యాధులు విజృంభించే ప్రమాదం ఉంటుంది.
కర్ణాకర్ణిగా ఈ విషయాలన్నీ తెలుసుకున్న ప్రజలు గ్రామం లో సర్పంచును నిలదీశారు.
గ్రామానికి సంబంధించి ఏ విషయమైనా గ్రామం లో డప్పు చాటింపు వేయించి గ్రామ సభ పెట్టి
ప్రజలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని పంచాయత్ రాజ్ చట్టం లో చెప్పబడింది.అలాంటిదేమీ
లేకుండానే గ్రానైట్ క్వారి గుత్తేదారులు బహూకరించిన పర్సులతో సంతృప్తి చెందిన గ్రామ పరి-
పాలన యంత్రాంగం అనుమతి ఇచ్చింది. గ్రామ పంచాయితీ తీర్మానం చట్ట ప్రకారం జరిగిందా లేదా
అని పరిశీలించి పైకి పంపవల్సిన తహసిల్దార్ తన వాటా తనకు ముట్టగానే పైకి పంపించారు.
ఇలా ఎవరి వాటాలు వారు తీసుకొని మానవ మనుగడనే అపహాస్యం పాలు చేస్తున్నారు.
గ్రానైట్ క్వారికి వ్యతిరేకంగా ఆగస్టు 16 నాడు జిల్లా చరిత్రలోనే ప్రప్రథమంగా రెండు వేల మంది
మహిలలతో కలక్టరేటును ముట్టడించి మెమోరాండం సమర్పించినారు.మానకొండూరు శాసన
సభ్యులు ఆరేపల్లి మోహన్కు మెమోరాండం ఇచ్చారు.అభివృధిని అడ్డుకోగూడదని ఉచిత సలహా
ఇచ్చారు, జిల్లా కలెక్టర్ ను కలువడానికి గ్రామస్తులు రెండు సార్లు వచ్చిన వారికి ఇంటర్వ్యూ
లభించ లేదు. సెప్టెంబర్ 9 నాడు స్టానికేతరురాలైన మనకొండూరు తహసిల్దార్ అన్నారంలో
గ్రామ సభ పెట్టింది. ప్రజలు గ్రానైట్ క్వారి గురించి ఆమెను నిలదీస్తే ధిక్కారమున్ సైతునా అని
తలచిన సీమాంద్ర అధికారిణి చిత్తు కాగితాలు ఏరుకొనే మాదిగ ముండలు నన్ను ప్రశ్నించే
వారయ్యరా అని కులం పేరుతో దూషించింది. కోపోద్రికులైన మహిళలు తహసిల్దారును గ్రామ
పంచాయితీ గదిలోకి నెట్టి తలుపులు వేశారు. సరే... పోలీసులు వచ్చి విడుపించుక పోయారుగానీ
ప్రభుత్వాధికారిని విధులకు ఆటంకం కలిగించారని తెల్లవారి సెప్టెంబర్ 10 నాడు ఆరుగురిని అరెస్ట్
చేసి తీసుకు వెళ్లారు. కులం పేరుతో దూషించిన సీమాంధ్ర అధికారిణి పై కేసేందుకు పెట్టరు అని
ఐదు వందల మంది మహిళలు పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తే గాని ఎస్సై స్పందించ లేదు.
ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు విచారణకని సెప్టెంబర్ 11 నాడు అన్నారం వెళ్లిన ఎస్సై గ్రామస్తులను
తీవ్రంగా బెదిరించి వచ్చారు.
గ్రామ సభ కొరకు డప్పుచాటింపు చేయకుండా గ్రామస్తులకు మాటమాత్రం చెప్పకుండా
గ్రామసభ పెట్టకుండానే తీర్మానం రాసి పంపిన సర్పంచ్ పైనా కేసు ఉండదు, ఆ కాగితాలు పరిశీలించ
చకుండా చేతులు తడిపిన పుణ్యానికి పంటలను పశువులను పర్యావరణాన్ని ప్రజల ఆయుర్-
ఆరోగ్యాలను ధ్వంసం చేయడానికి సిఫారసు చేయడం తో బాటుగా కులం పేరుతో దూషించిన
తహసిల్దార్ పై ఏ చేర్యా ఉండదు. ఎక్కడినుండో వచ్చి ఇక్కడి సంపదను మరెక్కడికో తరలించుక
పోతూ ఇక్కడి ప్రజలను వనరులను కొల్లగొట్టుక పోతున్న గ్రానైట్ గుత్తేదారులపై ఏ కేసు ఉండదు,
రాజ్యాంగ కల్పించిన అవకాశం మేరకు శాసనా సభ్యుడుగా ఎన్నికై ఈ ప్రజల ప్రయోజనాలకు
కట్టు బడి ఉంటానని దాని పైనే ప్రమాణంచేసి గద్దెనెక్కి .,ఆ ప్రజల బ్రతుకులను బండలు చేస్తున్న
విధ్వంసకులైన క్వారి యజమానులకు దన్నుగా నిలిచిన స్టానిక ఎమ్మెల్లే పైన ఏ కేసు ఉండదు
ప్రజాభిప్రాయ సేకరణ జరుగకుండానే డిసాస్టర్ మేనేజ్మెంటుకూ అవసరమైన చర్యలేమీ గైకొన
కుండానే అనుమతి మంజూరు చేసిన గనుల శాఖ అధికారుల పైన ఏ చర్యా ఉండదు. కానీ...
రేపటి తరాలకు అన్నం కోసం, అవసరాలకోసం , ఆరోగ్యాల కోసం తల్లడిల్లిన జనం ఇది తగదు
తగదు అంటే తన్ని కేసులు పెడుతారా? ఇదెక్కడి ప్రజాస్వామ్యం?
ప్రజాస్వామ్యయుతంగా వినతి పత్రాలు ఇచ్చారు, ధర్నాలు చేశారు, అధికారులను కలిశారు,
తీడితేనే తిరుగబడ్డారు. ప్రజాస్వామ్యయుత పోరాటాలకు ,పరిష్కారాలకు ఈ ఎల్లక్షన్ల డెమోక్రసీ
స్కోప్ ఇవ్వకుంటే ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుంటారని కేంద్ర గృహ మంత్రి
చిదంబరం ఏడాది క్రితమే చెప్పినాడు.
రాజ్యం , ఓపెన్ కాస్టులు అంటది,, ఇనుప ఖనిజాలు అంటది , గ్రానైట్ క్వారీలు అంటది, అదే
అభివృద్ధి అంటున్నది. మాకు అన్నం పెట్టె మన్నును తవ్వోద్దంటే మర్ల బడుతార అని తుపాకీ
తీస్తున్నది. ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వానికి వలెనే ఈ నాటికి అదే పద్దతి అవలంభిస్తున్న ఈ సర్కారు
ప్రజలనుండి... ప్రజలకొరకూ.. అని చెప్పుకుంటే ప్రజలు ఇంకా ఎంతో కాలంనమ్మరు , సహించరు.

చెట్లు-గుట్టలు-అవే రేపటికి మన జాడలు !

అన్నారం ఒక చిన్న గ్రామం. చుట్టూ లక్షల సంవస్తారాల నుండి ఆ భూమి పైన జరుగుతున్న
మార్పులను వెయిల సంవస్తారాలనుండి మనుషుల ఆరాట పోరాటాలను గమనిస్తూ గమ్యం
చూపుతున్న పెద్ద పెద్ద నల్లటి బండసరం రాళ్లతో మోదుగ,తునికి,సీతాఫలం,ఉండ్రుగ,వేప చెట్లతో
పచ్చని ఎత్తయిన గుట్టలు , ఆ గుట్టల నడుమ పాటగాడు చెప్పినట్టు భూమికి పచ్చని రంగేసి-
నట్టున్న పచ్చటి పంటపొలాలతో,పల్లె నిజంగానే పాడిపంటల పల్లెసీమే. కరీంనగర్ జిల్లా కేంద్రానికి
సమీపాన ఉండటంతో ఆధునిక వ్యవసాయ పద్దతులు,అక్షరాస్యత,చేతివృత్తులు,అందరికీ చేతి
నిండా పని.
ఉన్నట్టుండి మూడు నెలల క్రితం ఆ వూళ్ళో గ్రానైట్ బాంబు పడింది.ఊరికి ఉత్తరాన ఉన్న ఊర-
గుంట, నాగులమ్మ గుట్టల్లో బ్లాస్టింగ్ చప్పుళ్ళతో ఊరు ఉలిక్కి పడ్డది. సంగతేందని ఆరదీసింది.
కొందరు సంపన్నులైన గుత్తేదార్లు నాగులమ్మ గుట్ట, ఊరగుట్టలోని బండరాళ్లను తవ్వి తీసి
గ్రానైట్ గా మార్చి దేశవిదేశాలకు అమ్ముకోవడానికి అనుమతి తెచ్చుకున్నారని తెలిసింది.
ఆ గుట్టలతో మనకు వచ్చెదేంది పొయ్యేదీందని కొందరు అనడం తోటి అందరూ పెద్దగా ఏమీ
పట్టించుకోలేదు. పుట్టల్లోని చీమలు తెట్టెల్లోని తేనె చిన్నా చిన్న జీవరాసుల తింటూ ఇంతవర-
దాకా , పిల్లాపాపలతో గుట్టల దోనల్లో చీకు చింత లేకుండా జీవిస్తున్న గుడ్డేలుగులు బ్లాస్టింగు
బాంబింగులకు బెదిరి పోయి పట్టపగలే ఊరిమీద పడి దొరికిన వాల్లను దొరికినట్లు నోటితో కొరికి
పంజా తో గాయ పరిచి నాయి. కొరిజీవి మిగిలినా ,కండ్లు కాళ్ళు,చేతులు కోల్పోయిన వారి
గగ్గోలుకు స్పందించి దయార్ద్ర హృదయురాలయిన స్టానిక ఎస్ ఐ ఒక గుడ్డేలుగును తన సర్వీస్
రివాల్వర్ తో కాల్చి చంపి ప్రజల భయాలను పాటా పంచలు చేసింది. గుట్టల్లోని చెట్లలో స్వేచ్చగా
పురివిప్పి నాట్యమాడిన మయూరాలు భయం తో కాపాడుతారనుకొని గ్రామం లోకి వస్తే ఈకలు
పీకి తినగా మిగిలినవాటిని అభయారన్యానికి అప్పగించారు. ఈ విషయాలన్నీ గమనిస్తున్న
పెద్దమనుషులు ఇంతటి తోనే ఏమయిందిరా కొడుకులాల? మనం ఇట్లానే నోరు మూసుకొని
ఊకుంటే ఈ జంతువుల పక్షుల్లాగే మనం కూడా ఈ పచ్చని పంట పొలాలను , మనలను
నిలబడనిచ్చిన నేలను , నీళ్ళు తాపిన చెర్లను , గుండెల నిండా గాలిని పీల్చుకొనిచ్చిన చెట్టు
చేమా పుట్టా బూసీని వదిలి పెట్టి పొట్ట చేత బట్టుకొని సెంచారం బోకటే ఉంటుందని చెప్పిండ్రు.
మిన్నిరిగి మీదబడే దాకా ఏదీ నమ్మని మన మేధోవంతులు అట్లేట్ల? అని ప్రశ్నించినారు .
సీతాఫలాలు సేకరించి అవసరార్థులకు ఇంతవరదాక అందజేసి పొట్టబోసుకున్న ముదిరాజ్
తెనుగు వాళ్లకు జీవనోపాధి పోతుంది. మేకలు,గొర్రెలు ,పశువులు, ఇకనుండి గుట్టల పయికి
పోయి మేయడానికి గడ్డి ఉండదు.మేత ఉండదు, పెండ , పిడుకలు ఉండవు, ఏరుకొని
తెచ్చుకోవడానికి గుట్టపైన కట్టెలు ఉండవు. ఇవన్నీ ఒక ఎత్తైతే వర్షపాతం తగ్గిపోయి చెరువులు
ఎండిపోయి బుగర్భజలం తగ్గిపోయి ఇంతవరదాక తేనెపట్టులాంటి పొలాలన్నీ బీడు భూములుగా
మారిపోనున్నాయని అందరికీ తెలిసేసరికి ప్రశాంతంగా ఉన్న సముద్రంలో ఉప్పెన లేచి నట్లయింది

Saturday, July 24, 2010

మా తల్లి భూదేవి

మా తల్లి భూదేవి మన్నిస్తావా మమ్ము!

మా తల్లి భూదేవి మన్నిస్తావా మమ్ము
లక్షల సంవస్తారాలు మంచు దుప్పటిల మగ్గి
బడబాగ్నిగ బద్దలయ్యి పురిటి నొప్పులెన్నోతీసి
గాలి నీరు గుట్ట చెట్టు ప్రజలను ప్రసవిస్తివమ్మ

మహిమగల్లా నీదు మన్నులానుంచెల్లి
నీళ్ళు నిప్పులే గాదు అన్న పానాదులను
అడుగకుంటిచ్చినవు ఆదికాలము నుండి

నీ ఎద పైన కాలూని ఎదిగినవి వృక్షాలు
పూలు పండులే గాదు కొమ్మరెమ్మలే గాదు
ఔషధీ యుక్తమగు ఆకులలములు ఇచ్చి
సల్లంగా సాదినవు ఎల్ల జనులను తల్లి

పుడమి తల్లలనాడు పుక్కిలుంచుమిసిన
గండుశిల కొండలు బండ రాళ్లన్నియు
మేఘాల పిండినవి నీ కడుపు నింపినవి
వడగాలి సుడిగాలి అధిక ఉష్ణోగ్రతల
అడ్డు నిలిచాపినవి అందరూ బతుకుటకు.

కానీ........... తల్లీ............

తల్లి వీపును చీల్చి తల్లినే చంపేటి
తేలు పిల్లల తీరు తేలినము మేమంత
అడవులను నరికినము బోడులను చేసినము
సంద్రాల నిండుగా విషమునూ నింపినము

ఐరనూ ఓరనీ సున్నాపురాయని
గ్రానైటు క్వారియని ఓపనూ కాస్టుయని
తల్లి నీ కడుపునూ పెళ్లగించితిమమ్మ
అయిలూ లాగేసి బొగ్గునూ తవ్వేసి
అడ్డగోలుగ నిన్ను అమ్ముకుంటున్నాము

రేడియము థోరియము ఆటమూ బాంబులతో
మా బొందలను మేమే తవ్వుకుంటున్నాము
కూర్చున్న కొమ్మనే నరుకుకుంటున్నాము
అడ్డగోలుగ నిన్ను అమ్ముకుంటున్నాము

Tuesday, July 6, 2010

ఎవరి సంపదను ఎవరు అనుభవిస్తున్నారు? ఎవరు ఎవరికి సొమ్ములు ఇస్తున్నారు?

ధా రాజా తథా ప్రజా అనేది పాత సామెత ఇప్పుడు యథాప్రజా తథా రాజా అంటూ ఒక ఎలక్ట్రానిక్ ఛానెల్ చర్చ నిర్వహిస్తున్నది.
ఆ చర్చలో మాట్లాడుతున్న నాయకులు ఎన్నికలల్లో ప్రజలు ఓట్లు వేయడానికి డబ్బులు తీసుకుంటున్నారు కనుక అధికారం
లోనికి వచ్చిన తర్వాత మాకూ తీసుకోక తప్పడం లేదు అంటూ అది అంతా ప్రజల తప్పే అని అంటున్నారు. ఈ చర్చ ను గమనిస్తూ
ఉంటే రాజకీయ నాయకుల అవినీతికి ఈ చానల్ ఒక లెజిట్మెసి కల్పించినట్లు గా ఉన్నది. అవినీతిని సార్వజనీ కరణ చేస్తూ
అక్రమ సంపాదన తప్పు కాదు,అవకాశం దొరికినపుడు ఎవరైనా సంపాదించుకుంటారు,అలా సంపాదిస్తేనే కదా ఎవరైనా మళ్ళీ
అధికారం లోకి వచ్చేది అని ఒక నూతన కాకపోయినా ఆదర్షాలకు భిన్నంగా ఇదే ఈ కాలపు ఆదర్శం అని చెప్తున్నారు.
చిన్నా చితకా అధికారులు ఏమో కానీ ఒక మోస్తరు అధికారం అంటే తన అధికారం వలన ప్రజలకు చీమ కాలంత మేలు జరిగినా
ఆయనకు అదనపు సంపాదన వచ్చి తీరుతున్నది.చిన్న గుమాస్తా నుండి ఐ ఏ ఎస్ అధికారి వరకు,హోమ్ గార్డ్ నుండి డి జి పి
వరకు,గ్రామ సర్పంచి నుండి ముఖ్య మంత్రుల వరకు లక్షల కోట్ల సంపాదన కూడ బెట్టుకుంటున్నట్లు వాటిని విదేశీ బ్యాంకులల్లో
దాచుకుంటున్నట్లు ఆయా వ్యక్తుల ప్రత్యర్తుల విమర్శలల్లో వింటున్నాము. వాళ్ళే మన పాలకులు. వాల్లనే ఆరాధిస్తూ మళ్ళీ మళ్ళీ
వాళ్ళే కావాలని ఓట్లు వేసి ఎన్నుకుంటున్నాము. వాళ్ళ ఆస్తులను అధికారాలను కాపాడదానికి మనకున్న రక్షణ వ్యవస్తాను
అడ్డం పెడుతున్నాము. చట్టాలను రూపొందించే అధికారాలను కట్టబెడుతున్నాము. కనుక తమకు సంక్రమిస్తున్న అధికారాలను
సుస్తిరం చేసుకోవడానికి రాజకీయ నాయకులు,వారి తర్వాత వారి వారసులు అధికారం కోసం ఏమయినా చేస్తున్నారు.
ఆ మద్యన ఒక పాంప్లెట్ చూసాను. వై యస్ రాజా రెడ్డి మంచి ఒడ్డు పొడుగు ఉన్న పహిల్వాన్ అనీ,కడప జిల్లాలోని ఒక ముగ్గు
రాళ్ల క్వారీ యజమాని వద్ద కులీలను అజమాయిషీ చేయడానికి నియమించబడి కొంత కాలానికి అక్కడ లభిస్తున్న లాభాలను
చూసి క్వారి యజమానిని భౌతికంగా తొలగించి తానే క్వారిలను ఆక్రమించుకున్నాడని రాశారు. ఆ తర్వాత ఆయన కుమారులు
అప్పటికే క్వారీల ద్వారా లభించిన లాభాల పెట్టుబడితో శాసన సభకు గెలిచిన రాజశేఖర్ రెడ్డి పైన అసెంబ్లీ వద్దనే హత్యా
ప్రయత్నం కూడా చేసినట్లు ఆ పాంప్లెట్ లో రాశారు. దాని పైన ఎవరు కూడా కౌంటర్ చేయలేదు కూడా. అంటే రాజ్యాధికారం
ద్వారా ఒక కుటుంబానికి కేవలం ఒక్క తరం లోనే రెండో తరానికి ముఖ్య పదవిని కొనుక్కోగలిగినంతటి సంపద సంపాదించుకునే
అవకాశం లభించింది.ఆ ముఖ్యమంత్రి పదవి దక్కక పోయే సరికి ఆ యువ రాజు ఊరూ వాడా ఎలా ఏకం చేస్తున్నాడో
చూస్తున్నాము.
మన రాజ్యాంగం ప్రకారం ,లభించిన రాజ్యాధికారం తోటి దేశం లో ఉన్న సహజ వనరులు,ఉత్పత్తి అవుతున్న సంపద అంతా
ప్రజలందరికి సమానంగా పంచవలసిన బాధ్యతను విస్మరించి సహజ వనరులను,సంపదలను వాళ్ళే వ్యక్తిగత ఆస్తులుగా
మార్చుకుంటున్నారు. ఆ అధికారం తోటే ప్రజల డబ్బులతోటే పోషించ బడుతున్న రక్షణ యంత్రంగాన్ని తమకు,తమ ఆస్తులకు
రక్షణగా వాడుకుంటున్నారు. ఇది రాజ్యాంగ విరుద్దం అని ఎవరయినా గొంతెత్తిటే ఆ గొంతుకలను ఉత్తరిస్తున్నారు.
మహాత్మా గాంధీ వాళ్ళు నిత్యం జపించే వ్యక్తి. ఆయనే ఒక సారి ఏమన్నాడంటే నీ కనీస అవసరాలకు మించి నీ వద్ద ఒక్క
రూపాయి ఉన్నా అది నీ పక్కవానికి చెందవలసినదే. అంటే నీ జేబులో ఉన్న రూపాయి వాని జేబులోనుండి నీవు దొంగిలించినదే అని అన్నాడు
అక్రమంగా సంపాదించిన ఈ అవినీతి సొమ్ము అంతా ఎవరికి చెందాలి? ఎవరు అనుభవిస్తున్నారు? ప్రజలు త్యాగమూర్తులా? లేక
సకల సౌఖ్యాలు ప్రజల సొమ్ముతో అనుభవిస్తున్న ప్రజా ప్రతినిధుల?

పెట్రోల్ ధరల పెంపు బందులు.

పెట్రోల్ ఉత్పత్తుల పెంపు పైన దేశవ్యాప్తంగా బంధు జరిగింది.ప్రజల మద్దతు సంపూర్ణంగా ఉన్నది అనడానికి అనేక ఉదాహరణలు
ఉన్నాయి. ప్రభుత్వాలు ప్రజల ఇస్టమ్ మేరకే పరిపాలించాలి మరి. ఒకవైపు ప్రజలంతా పెట్రోల్ ధరల పెంపును వ్యతిరేకిస్తుంటే
ప్రభుత్వం మాత్రంససేమిరా అంటున్నది. అంతేగాకుండా భరత్ ఝన్ ఝన్వాలా లాంటి ప్రజా వ్యతిరేక మేధావులు ప్రభుత్వ
పాలసీలను సమర్థిస్తూ పత్రికల్లో వ్యాసాలు రాస్తుంటారు. మరో పాలక మేధావి ఇందర్ మల్హోత్రా రాజీవ్ గాంధీ చేసిన ఏకైక మంచి
పని భోపాల్ లో ఎం ఐ సి గాస్ లీక్ కు కారణమైన అందర్శన్ ను విడిచి పెట్టదమేనని కితాబు ఇస్తాడు. ఇంతటి ప్రజా వ్యతిరేకమైన
వ్యాసాలను మన పత్రికలు ప్రచురిస్తాయి.
బందు వలన 13 వేల కోట్లు నస్టమ్ జరిగిందట.ఇది జాతికి నస్టమట.కనుక బంధు జరుపవలసింది కాదని కొందరి వాదన.సరే వాదన
కొరకు ఒప్పుకుందాం. కానీ ప్రజల అభీస్టానికి వ్యతిరేకంగా పెంచబడిన ధరల వలన ఎన్ని లక్షల కోట్ల నస్టమ్ వాటిల్లనుందో ఈ
మేధావులు చెప్పరు. పైన చెప్పిన 13 వేలు ప్రజల నస్టమ్ కాదు అవి వాస్తవానికి ప్రజలకు మిగిలినాయి. కానీ ధరవరల పెరుగు
దలతో నస్టమ్ వాటిల్లేది ప్రజలకు. లాభాలు వచ్చేది పెట్టుబడి దార్లకు.
భరత్ ఝన్ ఝన్వాలా మాటల్లోనే మనం ఉపయోగిస్తున్నపెట్రోల్ లో దిగుమతి చేసుకుంటున్నది 80% మన దేశం లోనే లభిస్తున్నది
20%.మరి మన దేశం లోనే లభిస్తున్న 20% పెట్రోల్ పైన గూడ ఈ పెరిగిన ధరలు వర్తిస్తాయి. అది వివక్షత గాదా? ఈ డబ్బులు
ఎవరి ఖతాలోనికి పోతున్నాయో ఎందుకు లెక్కలు చెప్పరు? దరలు పెంచకుంటేనట ప్రభుత్వాలు ఆ ధరలు భరించడానికి
అదనంగా కరెన్సీ ముద్రించ వలసి ఉంటుందట? ఎంత అడ్డగోలు లెక్కలు చెప్తున్నారు ఈ మేధావులు? కరెన్సీ ఎలా ముద్రుస్తారు?
దేశం లో ఉత్పత్తి కానున్న సకల వస్తువులు సరుకులుగా మారి మార్కెట్ లోనికి వస్తే వాటిని మారకం చేసుకోవడానికి అవసరమైన
మేరకు కరెన్సీ ఉత్పత్తి చేస్తుంది ఏ దేశమైనా. ప్రభుత్వ నిర్వాహణ కొరకు సరుకుల పైన పన్నులు వేస్తాయి ప్రభుత్వాలు. అలా
కాకుండా ఇస్టమ్ వచ్చిన విధంగా కరెన్సీ ముద్రించుకుంటూ పోతే ఆ కరెన్సీ కి విలువే ఉండదు. ఇంతటి నగ్న సత్యాలను
సైతం అబద్దాలతో దేశ ఆర్థిక విధానాలను కూడా వక్రీకరించి రాస్తుంటే పత్రికలు ప్రచురిస్తాయి . ఈ పద్దతికి భిన్నంగా కరెన్సీ
ముద్రించరా అని అంటే ముద్రిస్తారు కానీ ఈలాంటి పరిస్తీతుల్లో కాదు. అట్లా ఇస్టమ్ వచ్చిన విధంగా ముద్రించుకుంటే ఇక
ఇన్ని దేశాలనుండి ఇంతేసి అప్పులు ఎందుకు మనకు?
సరే ఇక ఈ పెట్రోల్ ధరల ను ఎవరు ఎలా నిర్ణయిస్తారు? వాస్తవానికి గాలి,నీరు ఎలా సహజ సిద్దంగా లభిస్తున్నాయో పెట్రోల్
కూడా అంటే సహజసిడ్డంగా లభిస్తున్నది. నీళ్ళు బాటిల్లాలో,గాలి పంఖా బిగించిన తర్వాత సరుకులు అయినట్లుగా పెట్రోల్ కు
మానవ శ్రమ జోడించిన తర్వాత సరుకు అయింది. ఆ సరుకుకు అంతర్జాతీయ మార్కెట్లో వచ్చిన డిమాండ్ మేరకు రేట్లను
పెంచుతూ పోతున్నారు.అసలు ఏదైనా ఒక సరుకుకు రేటు ఎలా నిర్ణయించాలి?
ఉదాహరణకు ఒక కుండ రేటును ఎట్లా నింర్ణయించాలి? ఒక పది బండ్ల మట్టి ని తేవడానికి అయిన బండి కిరాయి, ఒక ఇద్దరు
మనుషులతో మట్టిని మెత్తగా నలుగ కొట్టేడానికి.మరో నలుగురు మనుషులతో నీళ్ళు పోయించి మెత్తగా తొక్కించడానికి,
రెండు రోజులు కుమ్మరి కుండాలను ఆనడానికి,ఒక రోజు వాటి అడుగులు మూయడానికి. ఒక నాలుగు బండ్ల కట్టేలా ఖరీదు,
ఈవెగాక ఇంకా ఏమయినా ఖర్చులు అయి ఉంటే మార్కెట్ రేటు ప్రకారం లెక్క వేసి ఆ కుమ్మరి వాము నుండి తీసిన కుండల్లో
నుండి పలిగి పోగా మిగిలిన ఒ ముప్పయి కుండలు ఉన్నాయి అనుకుంటే అయిన ఖర్చు ఒ 600 రూపాయలు అనుకుంటే ఒక్కక్క
కుండకు 20 రూపాయల ధర నిర్ణయించాలి. కానీ జరుగుతునది ఏమిటి? పరిశ్రమాధిపతి వస్తువు ఎంతకూ తయారు అయింది అన్నది
కాకుండా తనకు ఎంత లాభం కావాలో అంతకు ధర నిర్ణయిస్తున్నాడు.దీన్ని నియంత్రించ వలసిన ప్రభుత్వాలు విదిల్చ బడుతున్న
ఎంగిల్లి మెతుకులకు ఆశపడుతూ ఎవరు ఏ తీరుగా రేట్లు నిర్ణయించుకున్నా మాట్లాడకుండా పైగా వాటి పైన మరింత పన్నులు
వేసి ప్రజల కొనుగోలు శక్తి తో పరాచికాలు ఆడుతున్నాయి.
ప్రజాస్వామ్య వ్యవస్తాలో ప్రజల అభిస్టమ్ మేరకు ప్రభుత్వాలు నడుచుకోకుంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లను ప్రజలు చూసుకుంటారు.
ఇవ్వాళ బంధులతో ప్రభుత్వాలల్లో చలనం రాకుంటే ఇంతకంటే మెరుగైన పోరాట రూపాలను ప్రజలు తమ ఆచరణాలద్వారా
ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పోరాట రూపలల్లోనుండి వెతుక్కుంటారు,పోల్చి చూసుకుంటారు.

Wednesday, June 30, 2010

ఉపాధి హామీ ఒక పెద్ద మాయ

ఊపాధి హామీ పథకం అమలు తీరులో అనేక అవినీతి జరుగుతున్నట్లుగా సోసియల్ ఆడిట్ లో తేలడంతో బాటుగా మీడియా లో కూడా ఎన్నో నిజాలు
బయటకు వస్తున్న కూడా అది ఎందుకు కొనసాగుతున్నదో కొంచం లోతుగా ఆలోచిస్తే చాలా విషయాలు అర్థం అవుతున్నాయి

ప్రత్యక్షంగా గమనించిన ఒక సంఘటన చెపుతాను.
ఒక రోజు కూలి మరో సహచరునితో అంటున్న విషయం ఇది.

ఆరేయ్ మనం తీసుకుంటున్న డానికంటే సర్పంచ్ తీసుకుంటున్నది ఎన్నో రెట్లు ఎక్కువ తెలుసా?
అట్లా ఎట్లా?
మనం పొద్దటి నుండి పొయ్యే దాకా ఎంతపని చేసినమో టెక్నికల్ అసిస్టెంట్ అనే అతడు లెక్క తీస్తాడు.
తీస్తే?
మనకు 100 రూపాయలు ఇవ్వాలంటే మనం చేసినంత పనికే లెక్క తీస్తీ సరిపోదు.
మరి?
మనం ఉదయం 7 నుండి 11 గంటలదాకా పనిజేస్తే ఇన్ని కూబిక్ మీటర్ల మట్టి తీస్తేనే మనకు 100 రూపాయాలు ఇవ్వాల్సి ఉంటుంది.కానీ ఇక్కడ
జరుగుతున్నది ఏమంటే మనం 8 గంటల్కు వచ్చి 11 గంటలకు వెళ్ళి పోతున్నాము.ఈ రెండు గంటలు కూడా సరిగ్గా వంగి పనిచేసింది లేదు.
ఆడుతుపాడుతూ మనం చేస్తున్న పనికి వాళ్ళు 100 రూపాయలు ఇస్తే మనం సంతోష పడుతున్నాము.కానీ మనం తీయవలిసినంత మట్టి
తీసినట్టు ఆ మట్టిని వాళ్ళు ట్రాక్టర్ల తోటి చేరవేసినట్టు రాసుకొని వెయిల రూపాయలు అప్పనంగా తీసుకుంటున్నారు.
అక్కడే ఉన్న మరో మిత్రుడు అవునురా మనం ఏమిచేయకుండానే 100 రూపాయలు తీసుకుంటున్నప్పుడు వాళ్ళు మాత్రం చేతులు మూసుకొనే
ఉండరు కదా? అంటూ అది గట్లనే నడుస్తాధి గాని మనకెందుకురా.ఎట్లా బతికేటోడు గట్లనే బతుకుతడు అన్నడు.
ఇది దేనికి సంకేతం?
కూలీలతోటి చిన్న తప్పు చేయించి పడ్డ పెద్ద తప్పులను ప్రశ్నించకుండా ప్రజల నోరుమూయించడమే.
మరో కుట్ర ఏమిటంటే ఈ ఉపాధి హామీ పథకం తో వ్యవసాయ పనులకు కూలీలు దొరుకాక చిన్న చిన్న రైతులు వ్యవసాయాన్ని వదలి పట్టణాలకు
వలసలు వస్తున్నారు. క్రమంగా ఇక్కడి వ్యవసాయాన్ని దెబ్బ తీసి ఈ భూముల్లో ఉన్న ఖనిజ వనరులను అన్నింటిని సంపన్న దేశాలు దోచుకుని పోయే
కుట్రలో ఒక భాగమే ఈ పథకాల వెనుక ఉన్న సదుద్దేశం.అమెరికా ప్లానింగ్ సలహా దారు జాన్ డెజ్ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకాన్ని పకడ్బందీగా
అమలు పర్చాలని తద్వారా పేదరికం పోతుంది అంటున్నాడు.భారత పాలకులు సైతం వీలయినత వేగంగా దేశం లో ఉన్న ఖనిజ సంపదను సంపన్నులకు
దోచిపెట్టేదానికి పోటీ పడుతున్నారు.
మేధావులు,విజ్ఞులు అయిన దేశభక్తులు భావి తరాలకోసం మన వనరులను తరలిపోకుండా కాపాడుకోవాలని గుర్తుంచ వలసిన ఆవశ్యకత ఎంతగానో ఉంది

Monday, June 28, 2010

విలువల తో కూడిన విద్యా

ఈ రోజు ఒక సదస్సు కు హాజరైతే విలువలతో కూడిన విద్యా ఆవశ్యకత అనే అంశం పైన చర్చ జారింగింది.అయితే విలువల కు నిర్వచనం ఏమిటి?
ఒక్కొక్క సమాజంలో ఒకో విలువ ను జనం ఆమోదించారు.ఆదిమ సమాజం లో ,గణా లల్లో ,రాచరిక .గణతంత్ర,ప్రజాస్వామ్య,పెట్టుబడి దారి,
ఇలా ఒక్కో సమాజం లో విలువలకు నిర్వచనం వేరు వేరు గా ఉంటూ వచ్చాయి. కానీ అంతిమంగా మనిషిని మనిషిగా గుర్తించి,అందరికీ ఉన్న
వనరులు సమానంగా దక్కలనేది ప్రధానం.
అయితే సడసూ లో పాల్గొన్న వాళ్ళు వివిధవృత్తుల్లో ఉన్నవాళ్ల అవినీతి గురించి వాళ్ళు తమ తమ బాధ్యతలను ఎలా విస్మటిస్తున్నారో చెప్పుకొచ్చారు.ఒక రోజుకులి పనికి ఆహార పతాకం లో ఎలా పని ఎగ్గొడుతున్నాడో,సూపర్విసార్లు ,ఇంజనీర్లు,ప్రజాప్రతినిధులు ఇలా ప్రతిస్తాయిలో ఎలా అవినీతి జరుగుతున్నదో ఉదాహరణల్తో బాటుగా ఉపన్యసించారు.
దానికి పరిష్కారంగా భారత రామాయణాలను చదువుకొని అలా ప్రవర్తించాలని సలహాలను ఇచ్చారూ.భారత రామాయణాల కాలం ఈ కాల్మ్ ఒక్కటి కాకపోయినా అంతకంటే వారికి వేరే ప్రత్యమ్న్యాయమ్ ఏమీ కనిపించలేదు.
ప్రస్తుత సమాజం లో మానవ శ్రమ,వస్తు ఉత్పత్తి,వస్తు వినిమయం సమాజాల అవసరాలకు అనుగుణంగా కాకుండా మార్కెట్టులో డిమాండ్ ను బట్టి వచ్చే లాభాలను దృస్తీలో పెట్టుకొని జరుగుతున్నది.వస్తువు తయారీ అమ్మకం కొనడం అనేవి లాభాలతో కూడుకున్న వ్యవహారం.లాభాలు అంటే అక్కడ ఇక లాభ్ నీటే ఉంటుంది తప్ప మరోటి ఉండదు, అలాంటప్పుడు ఏమీ నీటి.ఏమీ విలువలు అమలులో ఉంటాయో పెద్దగా ఆశించ లెము.గొంగట్లో తింటూ వెంట్రుకలను ఏరివేసి నట్లు.
మన ఆర్థిక వేత్తలు రాజకీయ నాయకులు చెప్పుతున్నట్టుగా పెట్టుబడులు భాతీగ వస్తీనే ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయంటున్నారు ణఋ. పెట్టుబడులు అంటేనే లాభాలు,లాభాలు అంటేనే అవినీతి,మరి అలంతాప్పుడు ఏమీ విలువలుయను మనం ఆశించ వచ్చునో చూడాల్సి ఉంది.
ఏ సమాజాని కయినా ఆర్థిక వ్యవస్తా పునాది అనుకుంటే ఆ పునదిని కాపాడదానికి పైకప్పు అంటే ఉపరితల అంశాలయిన విద్యా సంస్కృతి కళలు అన్నీ కలిసి పునదిని కపాదుతాయి.పైకప్పు పునాదిని కాపాడుతుంటే పునాది ఉపరితలాన్ని పడిపోకుండా కాపాడినట్లే ప్రస్తుత వ్యవస్తాలౌ ఉన్న చట్ట సభలు ,న్యాయస్తానలు,రాజ్యాంగం ,మీడియా అన్నీ ఒక దానితో ఒకటి సహకరించుకొని ఈ వ్యవస్తాను ఇలాగే కొనసాగడానికి పరస్పరం సహకరించుకొంటు ఉంటాయి.
మరి పరిష్కార మార్గాలు లేనే లేవా?

ఈ దోపిడీ పునాదులను కూల్చకుండా ఏవిలువలను ఆశించలేము.

Saturday, April 10, 2010

తరలిపోతున్న వనరులను కాపాడుకుందాం కదలి రండి.

శిలలు ఈ భూమి మీద ఎప్పుడి ఏర్పడినయో ఆలోచిస్తే ఈ పుడమి తల్లి పురిటి నొప్పుల సమయంలో ఎగజిమ్మిన లావా చల్లబడి ఘనీభవించి ఏర్పడిన

గండశిలలు ఇప్పుడు గుత్తేదార్లకు కొంగు బంగారం అవుతున్నది.మాది కరీంనగర్ జిల్లాలో తూర్పున ఉన్న పాత మహాదేవపూర్ తాలూకా.అక్కడ అడవికి

గుట్టలకు అవినాభావ సంభందం. గుట్టలు ఉన్నాయి అంటే అడవి ఉంటుంది అన్నమాటే. మా చిన్నతనం లో వేములవాడకు ఎడ్ల బండ్లు కట్టుకొని వచ్చే

వాళ్ళం. రామగిరి ఖిల్లా గుట్టలు దాటిన తర్వాత సుల్తానాబాద్ నుండి వచ్చే గుట్టలను మేము బోడ గుట్టలు అని పిలిచే వాళ్ళం ఎందుకంటే ఆ గుట్టల పైన

చెట్లు ఉండేటివి కాదు. అప్పుడు మాకు ఆ గుట్టల పట్ల చిన్న చూపు ఉండేటిది.ఎందుకంటే మా అనుభవం లో గుట్టలు అంటే చెట్లు ఉండాల్సిందే. సుల్తానాబాద్

గర్రెపల్లి.ఎలగందల.నుండి వేములవాడ దాకా అన్నీ గుట్టలే.ఈ గుట్టల వయస్సు 2,500 మిలియన్ సంవస్తారాలు అంటున్నారు తెలిసినవారు.

అయితే ఇప్పుడు తెలుసుకుంటే ఈ గుత్తలు సామాన్యమైనవి కాదు అని తెలుస్తున్నది. వర్షాలు పడినప్పుడు ఈ గుట్టలు ఒంటెలవలే కడుపు

నీళ్ళు త్రాగి మెల్ల మెల్లగా ఆ నీటిని భూమిలోనికి ఇంజెక్ట్ చేస్తాయట. అందుకనే గుట్ట కింద ఉండే ఊళ్లకు నీటి కొరత ఉండదు అని తెలిసినపుడు ఆవురా

ఈ గుట్టలు మానవుల క్షేమం కోసం స్పాంజ్ ముద్దలు అయి నీళ్ళను నింపుకొని మానవుల పాలిటి మరో కాసారం అవుతున్నది కదా? అన్నట్టు రామగిరి

ఖిల్లా గుట్ట కింద ఒక గ్రామం ఉంది దాని పేరు కాసారం. అంటే సముద్రం అన్న మాట. అలాగే ఈ గుట్టలనుడి భూమిలోనికి వచ్కిన నీళ్ళు మనం పైకి

తోడుకున్నపుడు చాలా తీయగా ఉంటున్నాయి.ఎందుకంటే ఆ నీటిలో సల్ఫెట్ లు,ఫాస్ఫెట్ లు ఉండవు.ఎందుకంటే బండరాళ్ల గుండా వచ్చే ఆ నీరు చాలా

ఫిల్టర్ అవుగుండి కనుక. అలాగే గొడుగుకు పైన నల్లగుడ్డ ఎందుకు పెట్టికుంటాం అంటే అది ఉత్తమ ఉష్ణవాహకం కనుక. అలాగే ఈ గండ శిలాలు కూడా

వాతావరణం లోని వేడిని గ్రహించి మనకు చల్లదనాన్ని ఆందిస్తున్నది. ఆకాశం లోని మేఘాలను అడ్డుకొని వర్షాలు పడేటట్లు చేస్తున్నాయి.వేసవి కాలంలో

వీస్తున్న వేడి వడ గాలులను అడ్డుకోని ప్రజలను అగ్నిగుండాల వడ గాలుల నుండి కాపాడుతున్నాయి. సుడి గాలుల నిండి ఎగసిపడిన దుమ్ము,ధూళిల

నుండి మానవ జాతిని కాపాడుతున్నవి ఈ బండ రాళ్ళు అని తెలిసి నపుడు గుండెలే లేని ఈ నల్ల రాతి బండలకు మనుషులంటే ఇంత ప్రేమ,

మనుషుల పట్ల ఇంత దయ జాలి ఎలా వచ్చాయో కదా అని ఆశ్చర్యం కాలుగాక మానదు.
1) మేఘాలను అడ్డుకోని వర్షాలు కురిపిస్తున్నాయి.
2)వర్షించిన నీటిని పుడమి తల్లి కడుపార తాగే విధంగా సరా సరి దాని కడుపులోకే పంపు చేస్తున్నది.
3)ఆ నీటిని కూడా పూర్తి స్థాయిలో ఫిల్టర్ చేసి మనుషులు తాగడానికి అనువుగా చేసి పెడుతున్నాయి.
4)వేడి తాపాన్ని అపుతున్నాయి.
5)దుమ్ము ధూళి నుండి రక్షణ ఇస్తున్నాయి.
6)తనపైనా చెట్లను పెరుగనిచ్చి సీత ఫంలాలు.మామిడి,రేగు, లాంటి ఫలాలను ఇస్తూ మానవుల క్షుద్బాధ ను తీరుస్తున్నాయి.
7) గడ్డి గాదం తనపైనా పెరుగనిచ్చి పశు,పక్షాదులకు ఆకలిని తీరుస్తున్నాయి,
8) తమ దేహలను ముక్కలు ముక్కలుగా చేసుకొని మనకు ఇండ్ల పునాదులు అవుతున్నాయి,గోడలు,పైకప్పులు,చలువ రాతి గచులు అవుతున్నాయి.
9) నెమళ్లకు,గుడ్డేలుగులకు నిలువ నీడై ఇండ్ల యి వాటికి రక్షణ ఇస్తున్నాయి.
10) ఆస్తికులకు దేవత శిల్పాలయి సాంత్వన ఇస్తున్నాయి.

ఇలా ఒక్కటేమిటి మానవ మనుగడకు మానవులకంటే ఎక్కువ దోహద పడుతున్నవి ఈ గుండెలు లేని బండ రాల్లే.హృదయం ఉన్నదని చెప్పుకుంటున్న

మనుషులు ఏమీ చేస్తున్నారు అంటే......

ఈ బండ రాళ్లను కూకటి వేళ్ళతో పెకిలించి వేస్తూ వానలు కురువకుండా అడ్డుపడుతున్నారు

తామే విపరీతమయిన వేడి సెగలు సృస్టిస్తూ చల్ల బరిచే గుట్టలను నిర్మూలిస్తున్నారు.

దుమ్ము ధూళి నుండి కాపాడే రక్షణ వలయాన్ని ధ్వంసం చేస్తున్నారు.

ఉన్న చెట్లను నరికి వేస్తూ ఇకనుండి చెట్లు పెరిగే వ్యవస్థ లేకుండా చేస్తున్నారు.

పశుపక్షాదులకు నిలువ నీడ లేకుండా చేసి అవి గ్రామాలల్లోకి వస్తే కాల్చి చంపి ఎకలాజికల్ సమతుల్యతను నాశనం చేస్తున్నారు.

నిజానికి ఈ విధ్వంసం అంతా చేస్తున్నది సామాన్య ప్రజానీకమేనా? ఎంత మాత్రం కాదు.డబ్బు,రాజకీయ అధికారం ఉండి, రాజ్యాంగం

మీద ప్రమాణం చేసి ఈ ప్రజల జీవన విధానాన్ని మెరుగు పరుస్తామని ప్రజలకు,పర్యావరణానికి రక్షణ కల్పిస్తామని మాయ మాటలు చెప్పి మన ఓట్ల

తోనే అధికారం లోకి వచ్చి ఆ అధికారం ద్వారా సంక్రమించిన అధికారంతో అడిగిన వాళ్ళ నోర్లు మూయిస్తున్నారు. అలనాడు హిరణ్యాక్షుడు సంపద

అంతా తన సొంతమే కావాలనుకొని భూమిని చాప తీరుగా చుట్టుకొని పోయి సముద్రం లోని దాక్కోన్టే తినడానికి కందమూలాలు లభించని వరాహ

సమూహం హిరణ్యాక్షుని వధించి భూమిని కాపడి నట్లు అధర్వులు కోల్పోతున్న బక్క జనులంట సంఘటిత పది పోరాటలకు దిగి ఈ భూమిని

కాపాడకుంటే ఈ రాక్షస సమూహం సామాన్య ప్రజలకు ఈ భూమి పైన ఏమీ మిగులకుండా బొక్కెస్తారు.

సహజ వనరులు ఎక్కడ ఉన్నా అక్కడి స్థానిక ప్రజలకు వాటి ఫలాలు దక్కాలి.కానీ ఎక్కడి వాల్లో వచ్చి ఇక్కడిది అంతా ఎప్పటికీ

లేకుండా ,ఇక్కడి సామాన్యులకు ఏమాత్రం దక్కకుండా దోచుకొని పోతుంటే చూస్తూ ఉంటూ మేము ప్రజలకోసమే ఉన్నము అని మాయ మాటలు

చెపుతున్న రాజకీయ నాయకుల మాటలు ప్రజలు ఇక నమ్మే పరిస్తీతిలో లేరు. స్టానికులకు దక్కకుండా తరలి పోతున్న వనరులను

కాపాడుకుందాం కదలి రండి.ఉద్యమం లో భాగస్వాములు కండి.

Wednesday, April 7, 2010

దేవాదుల-నీళ్ళు-నిధులు-దాని మతలబు.

గోదావరి నదికి ప్రాణహిత,ఇంద్రావతి రెండు పెద్ద నదులు కలిసిన తర్వాత ఆనాడు ఇచ్చంపల్లి వద్ద ప్రాజెక్ట్ కడుదాం అనుకుంటే అది ఇప్పుడుకాస్తా

వరంగల్ జిల్లా ఏటూరు నాగారం మండలం తుపాకుల గూడెం గ్రామపంచాయతి లోని గంగారామ్ గ్రామం వద్ద జువ్వాడి చొక్కరావు దేవాదుల ఎత్తిపోతల

పథకం పేరుతో సోనియమ్మ మార్చి 14,2008 నాడు ఈ ప్రాజెక్ట్ ను ప్రారంభించారు.మొదటి విడతలో ఒక్కొక్క మోటార్ సామర్థ్యం 8.5 మేఘావాట్ట్

విద్యుత్ శక్తి అవసరముతో రెండు మోటర్లు నడుస్తున్నాయి.రెండవ ఫేస్ లో 12.5 మేఘావాట్ట్ సామర్థ్యం తో రెండు మోటార్లు నడుస్తాయత.ఇక్కడ నీటి

మట్టం సముద్రమట్టం నుండి 70 మీటర్ల ఎత్తున ఉంది.అయితే ఇక్కడి నుండి 287 మీటర్ల ఎత్తుకు నీటిని లిఫ్ట్ చేస్తారట.ఇప్పటి లెక్కల ప్రకారం పైప్ లైన్

పొడవు 138.9 కిలోమీటర్లు.ఆయకట్టు 78 లక్షల ఎకరాలు.(సరే ఇప్పటికీ ఒక్క ఎకరం భూమికి కూడా నీరు ఇవ్వలేదు అదివేరే సంగతి)ఈ ప్రాజెక్ట్ అంచనా

వ్యయం 1844 కోట్లు.ఇది లిఫ్ట్ చేసే నీళ్ళు కేవలం 5.18 టి ఎం సి లు మాత్రమే.అవసరమైన విద్యుత్తు ప్రస్తుతం రెండు ఫేస్ లకు కలిసి 42 మేఘవాట్ట్స్

శక్తిగల మోటార్లను నడిపెటంతటి విద్యుత్తు కావాలి.

ప్రాజెక్ట్ ఇంటెక్ నుండి దాదాపుగా 20 కిలోమీటర్ల దూరం లో ఉన్న రెడ్డిపల్లి అనే గ్రామం వాళ్ళు ఇప్పటికీ 4 కిలోమీటర్ల దూరం లో ఉన్న

కనుకునూరు నుండి నీళ్ళు మోసుకొని తెచ్చుకుంటారు. ఈ దేవాదుల ప్రాజెక్ట్ వాళ్ళకు నీళ్ళు తగడానికి కూడా ఇవ్వదు కానీ 140 కిలోమీటర్ల దూరం

లోని పట్టణానికి మాత్రం నీళ్ళు ఇస్తుంది.మేము కొందరం అడ్వకేట్లము దేవాదులను చూద్దాం అని అక్కడికి 4 మార్చ్ నాడు వెళ్ళినము.ప్రాజెక్ట్ కు నీళ్ళు

గోదావరి నది నుండి అందడం లేదు.ఇక్కడ నది ఉత్తరం నుండి దక్షణం ప్రవహిస్తూ దేవాదుల సైట్ వద్ద మలుపు తిరిగి తూర్పు వైపు ప్రవహిస్తున్నది

ఎత్తిపోతల కొరకు మోటార్లు బిగించిన వద్ద కు నీళ్ళు రావడానికి ఒక కాలువ తీశారు.ప్రస్తుతం ఆ కాలువలోనికి నది నీళ్ళు రావడం లేదు ఇక్కడ నదికి

అడ్డుకట్ట లాంటిది ఏమీ లేదు.నది నిండుగా నీళ్ళు వస్తేనే మోటర్లకు అందేవిధంగా నీళ్ళు వస్తాయి.అంటే వర్షాలు పుష్కలంగా పడ్డ సమయం లో నే

ప్రాజెక్ట్ లో నీళ్ళు ఉంటాయన్న మాట.వార్హాభావ పరిస్థితి ఉంటే నీళ్లు మోటర్లకు అండవు.వర్షాలు సక్రమంగా పది చాలినంత విద్యుత్తు ఇవ్వగలిగేతే

1844 కోట్ల రూపాయలతో జువ్వాది చొక్కరావు ప్రాజెక్ట్ అందించే నీళ్ళు 5.18 టి ఎం సి లు.జల యజ్ఞం పేరుతో తెలంగాణకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న

నిధులు నీళ్ళు దాని మతలబు.

Tuesday, March 23, 2010

దొంగే,దొంగా దొంగా అని అరిచినట్లు.

ఈరోజు పత్రికలల్లో నీటిని పొదుపుగా వాడుకోవాలి అని పెద్ద పెద్ద వాళ్ళు అంతా గొప్పగా ప్రకటనలు ఇచ్చారు .అది చూసిన తర్వాత ఒక ఆవేదనతో లోతట్టు ప్రాంతాలల్లో ప్రజలు నీళ్ళు మాత్రమే గాదు ప్రతిది ఎంత పొదుపుగా వాడుకుంటారో ఈ పెద్దమనుషులకు తెలుసునా అని అనిపించింది.
ఉన్న ఊరిపక్కనుండే ఒక నాటి జీవనదులు పారుతున్నా.ఊరిలో మాత్రం బావుల్లో,బోరు బావుల్లో చుక్కనీరు దొరుకదు .అరమైలు ,మైలు దూరం నడిచి కున్డెడు నీళ్ళు నెత్తి మీద చుట్ట బట్ట పెట్టుకోని కింద కాళ్ళు చుర్రు చుర్రు మని కాలుతుంటే పైన కుండ బరువుతో బాటు ఎండ వేడి కొర్రాయి తీరు కాలుస్తుంటే అపురూపంగా తెచ్చుకున్న నీళ్ళు ఎంత భద్రంగా దాచుకొని వాడుకుంటారో చూసిన వాళ్ళకు తెలుస్తుంది.అవసరం అయితేనే గిలాసేడు నీళ్ళు తాగుతారు.ఆరోగ్యానికి మంచిది మంతెన సత్యనారాయ న రాజు చెప్పినాడు అని లీటర్ల కొద్ది నీళ్ళు తాగరు,
ఇక స్నానం అంటారా ఇంత ఉడుకపోతలో గూడ రోజూ స్నానం చేయడానికి వాళ్ళు సాహసించరు.నాగరికులు ఆనుకొనే వాళ్ళు రెండు పుటల స్నానం చేయందే వారికి నిద్ర పట్టదు ,వాళ్ళకు ఉండే బట్టలు మహా అయితే రెండు జతలు.వాటిని నీళ్ళల్లో పిండుకొని ఆరేసుకుంటారు.సబ్బు పెట్టి ఆ సబ్బు అంతా పోయే దాకా నీళ్ళల్లో పిండడం ఉండదు.నాగరికుల స్నానాలకు టబ్బులు నిండాలి వాటి నిండా సబ్బు నురగ ,ఆ నురగ పోయేదాక శుబ్రమయిన నీళ్ళతో స్నానం చేస్తే వాళ్ళకు స్నానం చేసినట్లు.వాల్ల బట్టలు ఉతికి చలువ చేసేవరకు ఎన్ని నీళ్ళయిన ఖర్చు చేస్తారు ఎందుకంటే వాళ్ళకు అవి కొనుక్కునే కొనుగోలు శక్తి ఉంది. ఆలాంటి వాళ్ళకు మన రాజ్యాంగం అన్నీ అందుబాటులో ఉంచుతుంది.అది ఎట్లా?సహజ వనరులు కేవలం వాళ్ళ స్వోంతమా అని అన్నవా?నీవు మావోయిస్టువు అంటారు.వాస్తవానికి ఈ నాగరికులు ఇట్లాగే ఈ వనరులను విచ్చలవిడిగా వాడుతూ పోతూ ఉంటే వాళ్లకుయ మరియు రానున్న తరాలకు సహజవనరులు అనేవి మన దగ్గర మిగిలి ఉండవు.నాగరికులు ఆదర్శంగా చెప్పుకుంటున్న అమెరికా తన సహజ వనరులను తన వాటిని అలస్కా లాంటి చోట అట్టీ నిలువ చేసుకుంటున్నది.సరే మనలాంటి వారికి అమెరికా ఆదర్శం కాదు గాని,ఎవరయితే వనరులను విచ్చలవిడిగా వాడుకుంటున్నారో వాళ్ళే పొదు పు గురించి చెప్పడమే హాస్యాస్పదంగా ఉంది.

Monday, March 22, 2010

ఆలస్యం చేస్తే అంతా అయిపోతుంది.

కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాలను వేరు చేస్తూ ప్రవహించే నది గోదావరి.మహారాస్ట్రా లోని నా సిక్ వద్దపుట్టిన ఈ నది అదిలాబాద్,నిజామాబాద్,కరీంనగర్,వరంగల్,ఖమ్మం,ఉభయ గోదావరి జిల్లాలగుండ ప్రవహించి సముద్రంలో కలుస్తున్నది .జీవధారము నీరము అన్నట్లుగా ఈనది ప్రవహిస్తున్నమేరపాడిపంటలతో నేల పరవశించింది .ప్రజలు ఆనందంగా జీవించేవాళ్లు .నదిని ఆనుకొని ఉన్నగ్రామాలకు ఈ నీరు పెద్ద వనరు .పశువులకు పంటలకు పక్షులకు ఇట్లా మనుషుల మనుగడకు మానవెతిహాస నిర్మాణానికి ఈ నదినీళ్లకు అవినాభావ సంభందము ఉన్నది.
నా అనుభవంలోని ఒక సన్నివేశం ఇక్కడ ప్రస్తావిస్తాను. ఆదిలాబాద్ జిల్లా జైపురం మండలం ను అనుకోని ప్రవహిస్తున్న నది ఒడ్డు పల్లెల్లో ఎట్లా ఉండేదో నేను ప్రత్యక్షంగా చూసిన సంగతులు ఏమిటంటే ఈ నది వాళ్ళ తాత ముత్తాతల నుండి జీవ నదిగా చూస్తున్నారు.వర్షాకాలం లో నే కాకుండా అన్నీకాలాలో నదినిండా నీళ్ళు ఆనీళ్ళల్లో స్నానాలు ఈతలు ఆటలు చేపలు రొయ్యలు అన్నీ ఆనందగా అనుభవించిన జ్ఞాపకాలు. ఎండాకాలం లో నదిలోనీళ్ళు కొంతా తక్కువగా ఉంటున్నాందున ఎండకు నీళ్ళు వేడిగా అయ్యేటివి అయితే రొయ్యలు నీళ్లమడుగుల్లో లోతుకు వెళ్ళి బండల వెంట చల్లగా విశ్రాంతి తీసుకొనేటివి.ఈతగాళ్లు నీళ్ళల్లోకి మునిగి బండల వెంట ఉన్న రొయ్యలను పట్టుకొని తెచ్చేవాళ్లు.ఎండాకాలం చేపలు,రొయ్యలు తిన్నన్ని దొరికేటివి .
మరి ఇపుడు ఏమయ్యింది?అసలు గోదావరిలో నీళ్లే లేవు మొత్తం ఎండిపోయింది.అంతకు ముందు ఎప్పుడన్న ప్రవాహం ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి కానీ ఇప్పటిలాగా మొత్తానికి మడుగులు కూడా ఎండిపోయిన సందర్భాలు అసలు లేవు.గోదావారిలో చెక్ బాల్ తో 20 ఫీట్ల లోతు బొర్లు వేస్తే నీళ్ళు వస్తున్నాయి. గోదావరి ఒద్దెంబడి గ్రామాలల్లో కరంటూ ఉంటేనే నీళ్ళు కనిపిస్తాయి.ఒక వైపు వర్షాలు లేవు మరోవైపు గోదావరిలోని ఇసుక తోడుకొని పోతున్నారు మరో వైపు ఆదిలాబాద్.కరీంనగర్,వరంగల్.ఖమ్మం జిల్లాలల్లో ఓపన్ కాస్ట్ ఘనులపేరుతో 500 మీటర్ల లోతుల్లోనుండి బొగ్గుతీసే పేరుతో భూమి పొరలను పెల్లగిస్తున్నారు.భూగర్భ జలాలు మొత్తానికే అడుగంటి పోయినాయి.తా గడానికి గుక్కెడు నీళ్ళు దొరుకని పరిస్థితి.ఇది ఏమీ అభివృధి ఎవరి అభివృధి ఆవిరికోసం ఈ అభివృధో అసలు అర్థం కావడం లేదు.అభివృధి పేరుతో ఇసుక,బొగ్గు తరలించుక పోతున్నారు,ప్రజలను వాళ్ళ భూములల్లోనుండి తరిమి వేస్తున్నారు తాగడానికి కూడా నీళ్ళు దొరుకని పరిస్థితి.మానవ మనుగడకే ప్రమాదం ముంచుకొని వస్తున్నది .ఇది పాలకులు సృస్టిస్తున్న విపరీత పరిస్థితి .దీన్ని విజ్ఞులయిన వాళ్లు అంతా ఎదిరించాలి

Wednesday, March 3, 2010

చట్టాలు ఎవరికి రక్షణగా నిలుస్తున్నాయి?

చాలా రోజుల తర్వాత మళ్ళీ కోర్ట్ కు వెళ్ళడం జరిగింది,3వ అదనపు సెస్సియన్ కోర్ట్ లో కూచున్నాను.జడ్జ్ ఆదేశం మేరకు ఐదుగురు ముద్దాయిలను ప్రవేశ పెట్టారు.అభియోగం ఏమిటంటే ఎలక్ట్రిసిటీ ట్రాన్స్ ఫారం లోని కాపర్ వైర్ దొంగిలించారు.ఎలక్ట్రి సిటీ అధికారులు,పోలీస్ అధికారులు కోర్ట్ కు వచ్చినారు.వాంగ్మూలం ఇచ్చారు.బహుశా శిక్ష కూడా పదే అవకాశం ఉన్నట్లే అనిపించింది.ఆ ఆరుగురు కలిసి దొంగలించిన సొత్తు మహా అయితే ఐదు వేల రూపాయల విలువ చేస్తుంది కావచ్చు.భారత శిక్షా స్మృతిలో ఎవరు తప్పు చేసిన శిక్ష పడవలసినదే.
బార్ అసోసియేషన్ లో స్క్రోలింగ్ లో హైద్రాబాద్ సెంట్రల్ షాప్ 2.80 కోట్ల పన్ను కట్టనందున షాప్ మూసివేశారు.అంతే.ఉద్దేశ పూర్వకంగా అన్నీ కోట్ల రూపాయలు సంవస్తారాల తరబడి కట్టక పోతే సింపుల్ గా దుకాణానికి తాళం వేశారు.రెండు సంధార్భాలలో న్యాయం సమంగా పాటించబడినట్లు అనిపించ లేదు.
అలాగే మరో సంఘటన కూడా నాకు చాలా బాధ కలిగించింది.కరీంనగర్ పక్కన్నే బద్దిపల్లి అని ఒక గ్రామం ఉంది.కరీంనగర్ చుట్టుపక్కల అన్నీ గుట్టలు ఉన్నాయి. చాలావరకు ఆ భూములన్నీ కూడా ప్రభుత్వ భూములే.ఇంతవరదక ఆ భూముల్లో గ్రామస్తులు పశువులను గడ్డి మేపుకునే వారు.శీతకాలం లో గుట్టలపైనా కాసె సీతాఫలం పండ్లను కోసుకొని తినేవారు.ఇండ్ల నిర్మాణానికి అవసరమైన బండ రాళ్లను పగుల గొట్టి తెచ్చుకునే వాళ్ళు.ఆ గుత్తలు ఆ గ్రామస్తుల సమిస్టీ ఆస్తి గా పరిగ నించే వాళ్ళు.కానీ ఆ బండ రాళ్ళు మామూలు రాళ్ళు కాదు గ్రానైట్ రాళ్ళు అని తేలడం ప్రస్తుతం ఆ ఊరికి శాపం అయింది.అధికార,ప్రతిపక్ష నాయకమన్యుల అనుచరగణలు తమకున్న పరపతిని ఉపయోగించుకొని గ్రానైట్ తవ్వకాలకు అనుమతి పొంది చుట్టూ కంచే వేశారు.పెద్ద పెద్ద పోక్లైన్ లతో తవ్విస్తూ గ్రానైట్ ను తరలించుక పోతున్నారు.ఇంతవరదాక ఆ ఊరి సమిస్టి సంపద గా ఉన్న ఆ గుట్టలు కొద్ది మందికి సంపదగా మారిపోయింది.సరే అది కూడా అభివృద్ది యే గదా అంటారేమో.కానీ ఆ ఊరి పశువులకు తిరిగేదానికి జాగా లేకుండా పోయింది.రేప్ రేపు ఇండ్లూ కట్టుకోవడానికి బండ రాళ్ళు కరువై పొనున్నాయి.అన్నిటికంటే ఆ గ్రామం లో ఈ గుట్టలను పెకిలించి తవ్వి తీయడం మూలాన భూగర్భ జలాలు అడుగంటి తగు నీరు సాగు నీరుకు కరువు వచ్చే పరిస్థితి దాపురించింది.అవి గ్రానైట్ రాళ్ళు కావడం ఆ ఊరి ప్రజలు చేసుకున్న పాపమా?సరే ప్రకృతి వనరులను వాడుకోవడం వల్లనే కదా అభివృధి అనియంటే మరి ఆ గ్రామ ప్రజ్లకు దక్కుతున్నది ఏమీలేదుకదా?ఇది ఎవరి అభివృధి అవుతున్నది అబు ఆ గ్రామస్తులు అడుగుతున్నారు కానీ వారికి జవాబు చెప్పేవాళ్లే ఎవరు కనినిపించడం లేదని ఆ గ్రామస్తులు వాపోతున్నారు.
ఎవరి సంపద ఎవరి జేబుల్లోకి వెల్లుతున్నది,ఎవరు దొంగలు ఎవరు దోపిడీలు చేస్తున్నారు ఎవరు జైళ్ళలోకి వెళ్లాలి.మన చట్టాలు ఎవరిని జైళ్ళలోకి పెంపుతున్నాయి.మన అధికారులు మన పోలీస్ లు ఎవరికి రక్షణగా నిలుస్తున్నాయి ఆలోచిస్తే రాజ్యం స్వభావం ఇంతేకదా అనిపిస్తున్నది.

Wednesday, February 17, 2010

నేదునూరు పవర్ ప్రాజెక్ట్ తెలంగాణ అభివృధికేనా?

కరీంనగర్ జిల్లాలోని తిమ్మాపూర్ మండలం లోని నేదునూరు గ్రామమలో 14 ఫిబ్రవరి నాడు ముఖ్యమంత్రి రోశయ్య విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్ట్ కు శంకు స్థాపన చేశారు.గోదావరి బేసిన్ లో నుండి సరఫరా అయ్యే గ్యాస్ ఆధారంగా ఈ ప్రాజెక్టు నడుస్తుందని చెప్పుతున్నారు.కానీ శంకు స్టాపన రోజుననే ప్రజారాజ్యం నేత హరిరామ జోగయ్య తెలంగానీయులకు భయపడి మన గ్యాస్ తో తెలంగాణలో ప్రాజెక్ట్ పెడుతున్నారని పత్రికలకు ఎక్కినాడు.మన బొగ్గుతో విజయవాడలో నడుస్తున్న థర్మల్ కేంద్రం మాట చెప్పడు,ఎన్ టి పి సి నుండి తెలంగాణ నీల్లతో,బొగ్గుతో ఉత్పత్తి అవుతున్న విద్యుత్తు కడపకు,విజయవాడకు,హైద్రాబాదుకు 440 కే వి లైనలు వెళ్తుంటేసరే మంచిదే అనుకుంటాడు.
కానీ నిజంగానే నేదునూరు ప్రాజెక్ట్ తెలంగాణ ప్రయోజనాలకెన?నీటిని నిలువ జేయడానికి,ప్రాజెక్ట్ నిర్మించడానికి ప్రస్తుతం 440 ఎకరాల భూమిని స్వదీన పర్చుకున్నారు.మా 440 ఎకరాల పంట భూమి నీటి పాలు అయ్యింది.తర్వాత ఇక గ్యాస్ విషయానికి వద్దామ్ .గోదావరి బేసిన్ నుండి గ్యాస్ పైప్ వేసి గ్యాస్ సరఫరా చేయడం చాలా ఖర్చు తో కూడుకున్నది,సమీపానగల సింగరేణి నుండి బొగ్గుతో నడుపుకోవడం చవుక అనే వాదన ఇప్పటికే మొదలయ్యింది.అంటే అక్కడనుండి గ్యాస్ రాదు.మన నీళ్ళు మన బొగ్గుతో తయారయ్యే విద్యుత్తుతో మన ప్రాణహిత నడినుండి నీళ్ళు లిఫ్ట్ చేసుకొనిపోవడానికి ఉపయోగిస్తారు.ఒకవైపు తెలంగాణ పోరాటం ఉదృతంగా ఉంది ఇప్పుడు వద్దు అని అన్నా కూడా రోశయ్య ఎందుకు వేగిరంగా వచ్చి శంకు స్టాపించాడో మనం అర్థం చేసుకోవాలి.
ఈ ప్రాజెక్టులో బొగ్గులేదా ,వాళ్ళు అంటున్నట్లుగా గ్యాసే మండించినా మన కరీంనగర్ పరిసరాలల్లో ఉష్ణోగ్రత సాధారణ ఉష్ణోగ్రతలకంటే రెట్టింపు చేస్తారు.రోగాలతో చచ్చేది మనం.పర్యావరణం మనది నాశనం అవుతుంది ఫలితం మాత్రం వాల్లకు .మన బొగ్గు,మన నీల్లతో విద్యుత్తు ఉత్పత్తి చేస్తాడు మన ప్రానహిత నీళ్లే ఎత్తుకపోతాడు.ఇది మన అభివృద్దే అంటాడు.ఎలా నమ్మమంటారో చెప్పండి?

త్రాగు నీళ్ళకొరకు తెలంగాణలో గిరిజనుల వలసలు

అది ఆదిలాబాద్ జిల్లాలోని కెరమెరి మండలం నుండి 25 కిలోమేటర్ల దూరంలో బాబే ఝరి దాటిన తర్వాత ఉన్న జోడేఘాట్.ఆ పేరు వింటేనే ఒక

జలదరింపు,ఆ పేరు వింటేనే ఒక పూనకం,ఆ పేరు వింటేనే ఒక త్యాగం ఒక బలిదానం.రోడ్ సౌకర్యం లేదు.బస్ గాని ఆటో గాని లేదు.సెప్టెంబర్ ఒకటి

కొమురమ్ భీమ్ అమరుడైన రోజు గుర్తుగా అక్కడ ఒక సభ జరుపుతారు,ఆ రోజు అధికారులకు నాయకులకు జోడే ఘాట్ జ్ఞ్యాపకం వస్తుంది.ఆ రోజు అక్కడి

ప్రజల విజ్ఞప్తి ఏమిటంటే మాకు గొంతు తడుపుకోవడాని ఇన్ని నీళ్ళు,మాఉరికి మీరు రావడానికి ఒక తొవ్వ ఇది వాళ్ళు గత యాభై సంవస్తారాల నుండి

కోరుతూనే ఉన్నారు నాయకులు అధికారులు హామీలు ఇస్తూనే ఉన్నారు కానీ ఇప్పటికీ అది అమలుకు నోచుకోలేదు.
ఒక ఆటో కిరాయికి తీసుకొనే ఆ గుట్టల మీదుగా బండల మీదుగా పెద్ద దుమ్ములో కొమురమ్ భీము నేలకొరిగిన ఆ స్థలాన్ని చూడాలన్న తలంపుతో

వెలుతున్నాం. నెత్తిపైనమూటలతో కాలినడకన వస్తున్న జనం మా పరిస్థితి ఇప్పటి కి కూడా ఇలా ఉంది చూడండి అన్నట్లుగా మా వైపు అమాయకంగా

చూస్తున్నారు.ఆ చూపులు మేము పొందుతున్న సౌకర్యాలను నిలదీస్తున్నట్లుగా అనిపించాయి.ఎత్తయిన రాతి గుట్టలు,కిందికి చూస్తే ఒళ్ళు జలదరించే విధంగా

ఉన్న లోయలు కలపకు ఏమాత్రం పనికి రానందున వదలి వేయబడ్డ అందుగు,తపిశి,దుంపిడి,కొడిష.విషముస్టీ,కారెంగా ,తునికి ఇప్ప చెట్లు మాత్రం

పలుచగా ఉన్నాయి,జోడేఘాటులో ఆ గ్రామ పెద్దమనిషి కొమురమ్ భీమ్ మేనల్లుడు అయిన పెందురి సోము మమ్ములను చూసి ఎదురుగా వచ్చి రామ్

రామ్ అంటూ విష్ చేసినాడు.అన్నము లేదు కొన్ని మధురంబములున్నవి త్రావుమన్న అని అలనాడు రంతి దేవుడు అన్నట్లుగా సోము మాకు తాము

ఎంతో ప్రియంగా దాచుకున్న మంచినీళ్లు ఇచ్చాడు.మంచం మీద కూచున్న తర్వాత తమ సమస్యలు ఏకరువు పెట్టినాడు.
ఆ గ్రామం లో గొండు ,కోలామ్ లు కలిసి 40 కుటుంబాలలో 260 జనాభా ఉన్నారు.గుట్టల పైన అక్కడక్కడ సమానంగా ఉన్న భూమిలో జొన్నలు,కందులు,మక్కలు,పెసలు
పత్తి పండించుకొని పొట్టపోసుకుంటున్నారు.మేకలు కోళ్ళు సాదుతారు.గుట్ట కింద ఆడదస్నాపూర్ అని ఒక గ్రామం ఉంది.మోవాడ్ ఆడదస్నాపూర్ గ్రామాల

మధ్యగా పారుతున్న వాగు మట్టం నుండి జోడేఘాట్ 200 మీటర్ల ఎత్తులో ఉంది.వీళ్లకు రక్షిత మంచినీరు ఆ వాగు నుండి కాకుండా ఆ గుట్టపైన్ బోరు వేసి

8 లక్షలఖర్చుతో రక్షిత మంచినీరుకు టాంక్ అయితే నిర్మించారు .కానీ వాటర్ సోర్స్ లేనందున వాళ్ళకు తాగడానికి నీళ్ళు లేవు.జియాలోజికల్ సర్వే

వాళ్ళు బొర్లు వేస్తే నీళ్ళు పదే అవకాశం లేదు అన్నారట.అప్పటికే వేసి ఉన్న బోర్లా ను ఇప్పటికీ మూసివేయనే లేదు.అయితే తమ నీటిసమస్యను ఎప్పటిలాగానే

అందరికీ విన్నవించినారు.రెస్పాన్స్ రానందున రోడ్ పైకి వచ్చి ధర్నా చేశారు. ఐ టి డి ఏ ప్రాజెక్ట్ అధికారి గాని స్థానిక రాజకీయ నాయకులు గాని

స్పందించ లేదు.గత్యంతరం లేని ఆ గిరిజనులు గుట్ట కింద గల ఆడదస్నాపూర్ మోవాడ్ గ్రామాల మధ్య ప్రవహిస్తున్న వాగు ఒడ్డున అన్నీ గుడారాలు

వేసుకొనే పిల్లా పాప గొడ్డు గోదా కోళ్ళు కుక్కలు తీసుకొనే ఇండ్లకు తాడుకలు పెట్టి గ్రామానికి గ్రామం వలుస పోయింది.
స్థానిక పత్రికలు వార్తలు రాసినాయి.వార్తలు చూసి వెళ్లిన మానవ హక్కుల వేదిక తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ బా
ధ్యులకు గిరిజనులు చెప్పిన బాధలు

విన్న తర్వాత నాగరికుల అవసరం కోసం ప్రాణహిత నుండి 400 మెటర్ల ఎత్తుకు 400 కిలో మీటర్ల దురానికైన తరలిస్తారు నీటిని కానీ నోరులేని ఈ

గిరిజనులకు కేవలం 2కిలోమేటర్ల నుండి 20 లక్షల ఖర్చుతో నీళ్ళు తరలించ లేక వాళ్ళు వలసలు వెళ్ళే పరిస్థితి కలిపించడం సరియయింది కాదు

అనిపించింది..
ఈ రెండు ప్రజా సంఘాల పక్షాన అధికారులకు ప్రాతినిధ్యం చేసి వెంటనే తాగు నీటి సౌకర్యం కలిగించకపోతే మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు

చేస్తామని హెచ్చరించినాము.మానవ హక్కుల కమిషన్ కు భయ పడిన అధికారులు జియలాజిస్టులు సాధ్యపడదు అని చెప్పిన ఆ గుట్ట పైననే మరో బోరు

వేశారు.ఆ గిరిజనుల అదృష్టం ఏమో కానీ నీళ్ళు వచ్చినయి.తాత్కాలికంగా సమస్య తీరింది కానీ శాశ్వత ప్రరిష్కారం మాత్రం ఆడదస్నాపూర్ వాగు నుండే

అని అధికారులు గమనించాల్సిన అవసరం ఉంది.
అడవులు అంతరించిపోవడం వలన సంవస్తారానికి సంవస్తారానికి వర్షపాతం తగ్గి పోతున్నది.ఆదిల బాద్ జిల్లా లో ఈ సంవస్తారమ్ 50 శాతం వార్హాపాతం

తగ్గిపోయింది అని ఆధికారిక గణాంకాలే చెబుతున్నాయి.ఇప్పుడే ఈ పరిస్థితి ఉంటే ఏప్రిల్ మే మాసాలల్లో నీటి ఎద్దడి ఎంత అధ్వాన్నంగా ఉందనున్నదో

అధికారులు గమనించి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.ప్రతి సంవస్తారామ్ కేవలం శుభ్రమయిన మంచినీళ్లు లభించకనే వందలాదీ

అమయక గిరిజనులు ప్రాణాలు కోల్పోతున్నా విషయం ప్రభుత్వానికి తెలిసి కూడా ఇంత నిర్లక్షం వహిస్తున్నదంటే ఈ ప్రభుత్వాలు ప్రజల చేత,ప్రజల వలన

ప్రజల కొరకు ఉన్న ప్రభుత్వాలేనా అని ప్రజలు నిలదీసే రోజులు ఇంక ఎంతో దూరము లో లేవు.

Sunday, February 7, 2010

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం న్యాయమైన హక్కు.

మాయ మాటలు చెప్పుతూ తాము అక్రమంగా కూడబెట్టుకున్న ఆస్తుల విలువలు తగ్గి పోకుండా వీరిని కావచాలుగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఇప్పటికే కొందరు ఆంధ్ర ప్రాంతపు దళిత మేధావులు ,రచయితలు, కవులు ఆ తప్పుడు వాదనలను కొట్టిపారేసినారు.అయినప్పటికిని సమస్యల లోతుల్లోకి వెళ్ళి తరిచి చూస్తే వాళ్ళ వాదనలోని దొల్లా తనం ఇట్టే అర్థం అయిపోతుంది .
1)హైద్రాబాద్ లో ని తమ తమ ఆస్తులకు రక్షణ ఉండదనేది ఒక భయం.ప్రాథమిక హక్కుల్లోనే ఆస్తి హక్కు ఉంది.ఎవరైనా మన దేశంలో ఎక్కడైనా ఆస్తి కలిగి ఉండవచ్చు.బెంగుళూరులో తమకు ఆస్తులు ఉన్నవారు ఉన్నారు.హైద్రాబాద్ లో ఉన్నవారు ఉంటారు.వారి ఆస్తులను ఎవరుకూడ గుంజుకోని పోజాలరు.ఇది అనవసరమైన భయమే దప్ప ఇందులో ఏమాత్రం సత్యం లేదు.
2)రానున్న రోజుల్లో ఆంధ్ర పిల్లలకు విద్యా,ఉపాదీ అవకాశాలు ఉండవు అని.తెలంగాణలో పుట్టి ఇక్కడే చదువుకున్న పిల్లలకు అది వాళ్ళ హక్కు అవుతుంది.అందుకే గదా ఈ పోరాటాలు అన్నీ కూడా.కనుక అటువంటి భయాలు అవసరం లేదు.
3)ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే కృష్ణ,గోదావరి నీళ్ళను ఆంధ్రకు రానివ్వరు అప్పుడు ఆంధ్ర భూములు అన్నీ కూడా బీడు భూములు అవుతాయి అని.ఇది కూడా సామాన్య రైతులను మభ్య పెట్టడానికే.నదీ జలాల పంపిణీ ఒక శాస్త్రీయ పద్దతిలో ఎవరు ఎన్ని నీళ్లు ఉపయోగించు కోవాలో మన దగ్గర ఇదివరకే చాలా స్పష్టమయిన రాత కోతలతో ఒప్పందాలు ఉన్నాయి. అవి ఎవరు ఉల్లంఘించినా చట్ట సమ్మతం కాదు.నీళ్ళను గదిలో వేసుకొని తాళం వేసుకునేటివి గాదు .కనుక ఆంధ్ర ప్రాంతానికి ఎన్ని నీళ్ళు పోవాలో అన్ని పోతాయి. ఎవరు వాటిని ఆపలేరు.
అన్ని ఇలాగ న్యాయంగా జరిగే అవకాశం ఉంటే మా నేతలు అబద్దలు ఎందుకు చెబుతారు అనే ఆలోచన కొందరికి రావచ్చు.అదే మా బాధ కూడా. ఇంత వరదాక మాకు దక్క వలసిన వనరులను, అవకాశాలను కొందరు స్వార్థపరులు వాళ్ళ వ్యక్తిగత ఆస్తులుగా మర్చుకున్నారు .అలాంటి వాళ్ళ కోసమే సమయిక్య ఆంధ్ర ఉద్యమం నడిపిస్తున్నారు.సామాన్య ఆంధ్ర సోదరులతో మాకు ఎలాంటి తగాదా లేదు.మేము దౌర్జన్యం చేసే వాళ్ళం గాదు.మా అన్ని జిల్లాల్లో ఎన్నో గుంటూరు పల్లెలు,శ్రీరామ్ నగర్ లు ఉన్నాయి.ఇంత ఉద్యమం జరుగుతున్నా కూడా ఎక్కడ ఒక్క సమస్య లేకుండా వాళ్ళు మేము సమయిక్యంగా జీవిస్తున్నాము.వాళ్ళు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోరుతూ మాతో పాటు ఉద్యమిస్తున్నారు.
కనుక ఆంధ్రా సోదరులరా మా న్యాయమయిన హక్కుకు మీరు అడ్డు తగులకండి.ప్రజాస్వామిక వాదులు ఎవరైనా ఎప్పుడైనా lusers వైపే నిలిచిన ఉదంతాలు ఉన్నాయి .మేము కోల్పోయిన వాళ్ళం మాకు ఉద్యమం చేయాల్సిన అవసరం, నైతికత ఉన్నాయి.కాదు మీరు మతోనే ఉండాలని శాశించడం అనాయితికం.మాది రాజ్యాంగ బద్దమయిన హక్కు.సమయిక్యత అని చెప్పేవాళ్లది ఇంకా మా నోటి కాడి బుక్క మాకు దక్కకుండా గుంజుకొనే కుటిల యుక్తి
మాయ మాటలు చెప్పుతూ తాము అక్రమంగా కూడబెట్టుకున్న ఆస్తుల విలువలు తగ్గి పోకుండా వీరిని కావచాలుగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఇప్పటికే కొందరు ఆంధ్ర ప్రాంతపు దళిత మేధావులు ,రచయితలు, కవులు ఆ తప్పుడు వాదనలను కొట్టిపారేసినారు.అయినప్పటికిని సమస్యల లోతుల్లోకి వెళ్ళి తరిచి చూస్తే వాళ్ళ వాదనలోని దొల్లా తనం ఇట్టే అర్థం అయిపోతుంది .
1)హైద్రాబాద్ లో ని తమ తమ ఆస్తులకు రక్షణ ఉండదనేది ఒక భయం.ప్రాథమిక హక్కుల్లోనే ఆస్తి హక్కు ఉంది.ఎవరైనా మన దేశంలో ఎక్కడైనా ఆస్తి కలిగి ఉండవచ్చు.బెంగుళూరులో తమకు ఆస్తులు ఉన్నవారు ఉన్నారు.హైద్రాబాద్ లో ఉన్నవారు ఉంటారు.వారి ఆస్తులను ఎవరుకూడ గుంజుకోని పోజాలరు.ఇది అనవసరమైన భయమే దప్ప ఇందులో ఏమాత్రం సత్యం లేదు.
2)రానున్న రోజుల్లో ఆంధ్ర పిల్లలకు విద్యా,ఉపాదీ అవకాశాలు ఉండవు అని.తెలంగాణలో పుట్టి ఇక్కడే చదువుకున్న పిల్లలకు అది వాళ్ళ హక్కు అవుతుంది.అందుకే గదా ఈ పోరాటాలు అన్నీ కూడా.కనుక అటువంటి భయాలు అవసరం లేదు.
3)ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే కృష్ణ,గోదావరి నీళ్ళను ఆంధ్రకు రానివ్వరు అప్పుడు ఆంధ్ర భూములు అన్నీ కూడా బీడు భూములు అవుతాయి అని.ఇది కూడా సామాన్య రైతులను మభ్య పెట్టడానికే.నదీ జలాల పంపిణీ ఒక శాస్త్రీయ పద్దతిలో ఎవరు ఎన్ని నీళ్లు ఉపయోగించు కోవాలో మన దగ్గర ఇదివరకే చాలా స్పష్టమయిన రాత కోతలతో ఒప్పందాలు ఉన్నాయి. అవి ఎవరు ఉల్లంఘించినా చట్ట సమ్మతం కాదు.నీళ్ళను గదిలో వేసుకొని తాళం వేసుకునేటివి గాదు .కనుక ఆంధ్ర ప్రాంతానికి ఎన్ని నీళ్ళు పోవాలో అన్ని పోతాయి. ఎవరు వాటిని ఆపలేరు.
అన్ని ఇలాగ న్యాయంగా జరిగే అవకాశం ఉంటే మా నేతలు అబద్దలు ఎందుకు చెబుతారు అనే ఆలోచన కొందరికి రావచ్చు.అదే మా బాధ కూడా. ఇంత వరదాక మాకు దక్క వలసిన వనరులను, అవకాశాలను కొందరు స్వార్థపరులు వాళ్ళ వ్యక్తిగత ఆస్తులుగా మర్చుకున్నారు .అలాంటి వాళ్ళ కోసమే సమయిక్య ఆంధ్ర ఉద్యమం నడిపిస్తున్నారు.సామాన్య ఆంధ్ర సోదరులతో మాకు ఎలాంటి తగాదా లేదు.మేము దౌర్జన్యం చేసే వాళ్ళం గాదు.మా అన్ని జిల్లాల్లో ఎన్నో గుంటూరు పల్లెలు,శ్రీరామ్ నగర్ లు ఉన్నాయి.ఇంత ఉద్యమం జరుగుతున్నా కూడా ఎక్కడ ఒక్క సమస్య లేకుండా వాళ్ళు మేము సమయిక్యంగా జీవిస్తున్నాము.వాళ్ళు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోరుతూ మాతో పాటు ఉద్యమిస్తున్నారు.
కనుక ఆంధ్రా సోదరులరా మా న్యాయమయిన హక్కుకు మీరు అడ్డు తగులకండి.ప్రజాస్వామిక వాదులు ఎవరైనా ఎప్పుడైనా lusers వైపే నిలిచిన ఉదంతాలు ఉన్నాయి .మేము కోల్పోయిన వాళ్ళం మాకు ఉద్యమం చేయాల్సిన అవసరం, నైతికత ఉన్నాయి.కాదు మీరు మతోనే ఉండాలని శాశించడం అనాయితికం.మాది రాజ్యాంగ బద్దమయిన హక్కు.సమయిక్యత అని చెప్పేవాళ్లది ఇంకా మా నోటి కాడి బుక్క మాకు దక్కకుండా గుంజుకొనే కుటిల యుక్తి
ప్రత్యేక రాష్ట్రం గా తెలంగాణ ఏర్పడితే ఆంధ్ర ప్రాంతపు సామాన్య ప్రజానీకానికి కస్టాలు నస్టాలు ఎనలేనివిగా ఉంటాయని కొందరు సీమంధ్ర నేతలు అబద్దపు మాయ మాటలు చెప్పుతూ తాము అక్రమంగా కూడబెట్టుకున్న ఆస్తుల విలువలు తగ్గి పోకుండా వీరిని కావచాలుగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఇప్పటికే కొందరు ఆంధ్ర ప్రాంతపు దళిత మేధావులు ,రచయితలు, కవులు ఆ తప్పుడు వాదనలను కొట్టిపారేసినారు.అయినప్పటికిని సమస్యల లోతుల్లోకి వెళ్ళి తరిచి చూస్తే వాళ్ళ వాదనలోని దొల్లా తనం ఇట్టే అర్థం అయిపోతుంది .
1)హైద్రాబాద్ లో ని తమ తమ ఆస్తులకు రక్షణ ఉండదనేది ఒక భయం.ప్రాథమిక హక్కుల్లోనే ఆస్తి హక్కు ఉంది.ఎవరైనా మన దేశంలో ఎక్కడైనా ఆస్తి కలిగి ఉండవచ్చు.బెంగుళూరులో తమకు ఆస్తులు ఉన్నవారు ఉన్నారు.హైద్రాబాద్ లో ఉన్నవారు ఉంటారు.వారి ఆస్తులను ఎవరుకూడ గుంజుకోని పోజాలరు.ఇది అనవసరమైన భయమే దప్ప ఇందులో ఏమాత్రం సత్యం లేదు.
2)రానున్న రోజుల్లో ఆంధ్ర పిల్లలకు విద్యా,ఉపాదీ అవకాశాలు ఉండవు అని.తెలంగాణలో పుట్టి ఇక్కడే చదువుకున్న పిల్లలకు అది వాళ్ళ హక్కు అవుతుంది.అందుకే గదా ఈ పోరాటాలు అన్నీ కూడా.కనుక అటువంటి భయాలు అవసరం లేదు.
3)ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే కృష్ణ,గోదావరి నీళ్ళను ఆంధ్రకు రానివ్వరు అప్పుడు ఆంధ్ర భూములు అన్నీ కూడా బీడు భూములు అవుతాయి అని.ఇది కూడా సామాన్య రైతులను మభ్య పెట్టడానికే.నదీ జలాల పంపిణీ ఒక శాస్త్రీయ పద్దతిలో ఎవరు ఎన్ని నీళ్లు ఉపయోగించు కోవాలో మన దగ్గర ఇదివరకే చాలా స్పష్టమయిన రాత కోతలతో ఒప్పందాలు ఉన్నాయి. అవి ఎవరు ఉల్లంఘించినా చట్ట సమ్మతం కాదు.నీళ్ళను గదిలో వేసుకొని తాళం వేసుకునేటివి గాదు .కనుక ఆంధ్ర ప్రాంతానికి ఎన్ని నీళ్ళు పోవాలో అన్ని పోతాయి. ఎవరు వాటిని ఆపలేరు.
అన్ని ఇలాగ న్యాయంగా జరిగే అవకాశం ఉంటే మా నేతలు అబద్దలు ఎందుకు చెబుతారు అనే ఆలోచన కొందరికి రావచ్చు.అదే మా బాధ కూడా. ఇంత వరదాక మాకు దక్క వలసిన వనరులను, అవకాశాలను కొందరు స్వార్థపరులు వాళ్ళ వ్యక్తిగత ఆస్తులుగా మర్చుకున్నారు .అలాంటి వాళ్ళ కోసమే సమయిక్య ఆంధ్ర ఉద్యమం నడిపిస్తున్నారు.సామాన్య ఆంధ్ర సోదరులతో మాకు ఎలాంటి తగాదా లేదు.మేము దౌర్జన్యం చేసే వాళ్ళం గాదు.మా అన్ని జిల్లాల్లో ఎన్నో గుంటూరు పల్లెలు,శ్రీరామ్ నగర్ లు ఉన్నాయి.ఇంత ఉద్యమం జరుగుతున్నా కూడా ఎక్కడ ఒక్క సమస్య లేకుండా వాళ్ళు మేము సమయిక్యంగా జీవిస్తున్నాము.వాళ్ళు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోరుతూ మాతో పాటు ఉద్యమిస్తున్నారు.
కనుక ఆంధ్రా సోదరులరా మా న్యాయమయిన హక్కుకు మీరు అడ్డు తగులకండి.ప్రజాస్వామిక వాదులు ఎవరైనా ఎప్పుడైనా lusers వైపే నిలిచిన ఉదంతాలు ఉన్నాయి .మేము కోల్పోయిన వాళ్ళం మాకు ఉద్యమం చేయాల్సిన అవసరం, నైతికత ఉన్నాయి.కాదు మీరు మతోనే ఉండాలని శాశించడం అనాయితికం.మామాది రాజ్యాంగ బద్దమయిన హక్కు.సమయిక్యత అని చెప్పేవాళ్లది ఇంకా మా నోటి కాడి బుక్క మాకు దక్కకుండా గుంజుకొనే కుటిల యుక్తి .

Tuesday, January 19, 2010

తాడిచెర్ల ఓపెన్ కాస్ట్ ఘనుల తవ్వకాన్నే నిలిపివేయాలి

తడిచర్ల బొగ్గు ఘనులను సింగరేణి కి కాకుండా రాయలసీమ బాడ కాంట్రాక్టర్లకు ప్రభుత్వం కట్టబెట్టే కుట్ర చేస్తున్నది.ఒ సి పి 3 ,extensian ,తడిచర్ల ఓపెన్ కాస్ట్ ఘనులను వ్యతిరేకిస్తూ మానవ హక్కుల వేదిక, తెలంగాణ అయిక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యం లో స్థానిక ప్రజలు ఉద్యమించారు.ఈ ఓపెన్ కాస్ట్ మైన్స్ దాదాపు 500 మీటర్ల లోతు తవ్వడం వలన భూగర్భ జలాలు అడుగంటి పొయి ఈ భూగోళం ఉన్నంతా వరకు తెలంగాణలోని ఈ భూమి దేనికి పనికి రాని మరుభూమి గా మారిపోనున్నదని ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది.
undar ground mines అయితే లోపల బొగ్గు తవ్వి తీసుకున్నా గూడ పయిన వ్యవసాయం చేసుకోవచ్చు ఇండ్లు కట్టుకోవచ్చు.ఉపరితలం లోని భూమిని మానవ మనుగడకు ఉపయోగించుకొనవచ్చు.కానీ ఓపెన్ కాస్ట్ మైన్స్ ల వలన ఏర్పడిన ఆ పెద్ద పెద్ద బావి బొండలు మంషులకు ఎప్పటికీ పనికి రాకుండా పోతాయి.500 మీటర్ల లోతున ఉండేతటువంటి మట్టి పొరలు రాతి పొరలు అన్నీ పెకిలించ బాదుతాయి కనుక పయిన పదే వర్షం నీరు అంతా 500 మీటర్ల లోతులోకివెళ్ళి పోతుంది అప్పుడు ఇక భూమి పయిన గడ్డి పోచ గూడా మొలువని దయనీయమయిన పరిస్థితి ఉంటుంది .అలాగే ఈ బావుల పక్కలనుండి ప్రవహిస్తున్న గోదావరి, మనేరు నదుల ప్రవాహ గతి మారిపోతుంది .వెయిల సంవస్తారాల మానవ చరిత్ర కు ఆనవాళ్లు లేకుండా పోయే పరిస్థితి.తడిచర్ల పక్కన కాపురం అనే పల్లెను ఆనుకొని కాకతీయుల కాలం నాటి కోట ఒకటి ఉంది అది ఇపుడు మాయం అవుతునది.మానేరు నది సమీపంగా ఉన్నందున బోరు బావులు వేసుకొని ప్రజలు వ్యవసాయం చేసుకొంటు అతి మెలయిన ఎర్ర మిరుప కాయలు పండిస్తున్నారు.ఇక ఆ పంట ఉండదు.మానేరు ను అణు కొని జయిన గుళ్ళు ఉన్నాయి.ఆ గుడుల్లో ఉన్న లింగం పయిన పూసిన విభూతి,కుంకుమ ఇప్పటికీ ఈ రోజే అలంకరించినట్లుగా ఉంది అజంతా చిత్రాల్లో వాడిన రంగులవలే ఉన్నాయి .అదంతా కంటికి కనారాణిదయి పోతుంది.ఆంధ్ర లో చిన్న్ చిన్న జ్ఞాపకాలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు.ఇక్కడ మాత్రం మానవేతిహాసం లోనే మహాద్భుతం అయిన సంఘటనలను మాయం చేస్తూ అదంతా అభివృద్దే నమ్మన్డీ అంటున్నారు.
తాడిచర్ల ఓపెన్ కాస్ట్ ఘనుల్లో ప్రస్తుత1400 హెక్టార్ల భూమిని తవ్విపోస్తామ్ అని ప్రణాళికలు రూపొందించారు.ఈ 1400 హెక్టార్లలో 700 లు ప్రభుత్వ భూమి తక్కినది ప్రజలది.ఈ ప్రజల్లో కూడా కొందరు భూస్వాములు ఇప్పటికే పట్టానాలల్లో ఆస్తులు కలిగి సుఖవంతమయిన జీవితం గడుపుతున్నవారు ఈ పరిణామాన్ని సరే ప్రభుత్వం కోరుతున్నది కనుక మా భూములు ఇస్తాం అంటున్నారు.కానీ తడిచర్ల,కాపురం,చిన్న తూండ్ల ,పెద్దతూండ్ల,నాయకం పల్లె రేగడియపల్లే,హరిజన వాడ,తెనుగుపల్లే లో నివసిస్తున్న వేలాది మంది ప్రజలు ఈ బావులను వ్యతిరేకిస్తున్నారు.అక్కడ మేము ఏర్పాటు చేసిన ఒక బహిరంగ సభలో రాయ పోశమ్ అనే ఒక సామాన్య చిన్న రైతు ఆ సభలో మాట్లాడుతూ,అయ్యా,మా భూములను సర్కారు గుంజుకుంటదట కదా?అందుకు ప్రతిఫలంగా మాకు డబ్బులు ఇస్తాదట కదా .కానీ ఈ భూముల ఆధారం తోనే మా తాతలు బతికిండ్రు,మా అయ్యలు బతికిండ్రు,మేమూ బతుకుతున్నాం,మా కొడుకులు,బిడ్డలను సాడుకుంటున్నం .మా తాతలనాటినుండి మా కొడుకుల దాకా పెండ్లిల్లు పెరంటాళ్లు,చదువులు,ఛావులు,బతుకులు అన్నీ అయితున్నాయి .మా భూములకు,జరాలు రాలేదు,రోగాలు రాలేదు,కాన్సరు రాలేదు ఎయిడ్స్ రాలేదు.కానీ ఇప్పుడేమో మా భూముల బొగ్గు ఉన్నదని దానికి కాన్సరూ అంటగట్టి మమ్ములను ఖాళీ చేసి పొమ్మంటే మీరిచ్చే డబ్బులు ఎన్ని రోజులౌ వస్తాయి,మేము ఎన్ని రోజులు బతుకుతాము, ఆతర్వాత మా బతుకులు ఏమీ గావాలే మాములను ఎవరు చూస్తారు?అని ప్రశ్నిస్తున్నాడు .
మరొక సామాన్య కులీ బిడ్డ మాట్లాడుతూ,అయ్యా ,భూములున్నోళ్లయితే వాళ్ళకు ఎన్నో కొన్ని డబ్బులు వస్తాయి గావచ్చు,ఎన్నో కొన్ని రోజులు బతుకుతారు గావచ్చు కానీ ఏ భూములు లేక పోయినా ఇన్నాళ్లు ఈ భూముల పయిన కులో నాలో చేసుకొని బతికినమ్.ఏమీ దొరుకని నాడు అడివిలకుబోయి కాయో గడ్డో తెచ్చుకొని తిని బతికినమ్.మమ్ములను ఇప్పుడు ఎల్లి పొమ్మంటే మేము ఎక్కడ బతుకాలే ఇది ఎవ్వల కోసం చేస్తిన్నది ఈ సర్కార్ అని నీల దీసి అడిగిండు.
వీళ్లంతా చెప్పినట్లు గానే ఇవ్వాళ ఎక్కడో రాయల సీమలో ఉన్న బాడ కాంట్రాక్టరు మరింతగా బలిసేతందూకు తెలంగంలో బంగారం పండే భూములను వాళ్ళ కోసం పందెరమ్ పెదుతామని అంటూంటే తెలంగాణ ప్రజలు ఎత్తి పరిస్థితుల్లో కూడా ఊరుకోరు.
ఒక వైపు ఇంత కొట్లాట జరుగుతుంటే మొన్నటికి మొన్న పంచాయతీ రాజు బద్జట్ లో తెలంగాణకు మొండి చేయి చూపిన సంగతి చూసాము.ఇప్పటికిప్పుడు మరోసారి పంటల భీమాలో 805 కోట్లకు గాను అనంత పూర్ కు 600 కోట్లు,కడపకు 120 కోట్లు ఖర్చు పెట్టుకున్నారంటే మామూలు రోజులల్లో తెలంగాణకు దక్కింది ఎంతో అవతలి వాళ్ళు బొక్కింది ఎంతో అర్థం చేసుకోవచ్చు.
మరో విషయం,ఈ ఓపన్ కాస్ట్ గణుల్లో ఒక్కొక్క సారి 100 టన్నుల పేలుడు పదార్థామోకేయ సారి బ్లాస్ట్ చేస్తారు.దానితో 8 నుండి 12 కిలో మీటర్ల దూరం వరకు భూమి గజ గజ వణికి పోయి ఇండ్ల గోడలు పగిలి పోతాయి పయిన పెట్టుకున్న వస్తువులు ఆహార పదార్థాలు కింద పడుతాయి .ఇంటి గోడలు కూలి పోతాయి.15 నుండి 20 కి.మీ.వ్యాసార్థం లోని బావులల్లో నీళ్ళు ఉండక ప్రజలకు తాగు నీరు సాగు నీరుకు ఇబ్బంది అవుతుంది.
పవర్ జనరేషన్ కు మన దగ్గర లభించే సూర్య రశ్మి,గాలి(విండ్)వాడుకుంటే పర్యావరణం బాగా ఉంటుంది.ప్రజలకు పునరావాసం బాధ తప్పుతుంది.స్టానికంగా లభించే వనరులతో స్థానిక ప్రజలు లబ్ధి పొందలే గాని స్టానికంగా వనరులు కలిగి ఉండడం స్థానిక ప్రజలకు శాపం కాగూడదు గదా?ఆంధ్ర ,రాయలసీమ,పెట్టుబడి దార్ల కోసం తెలంగాణ ప్రజలు ఎంతగా తమ సర్వస్టమ్ కోల్పోతున్నారో,భవిష్యత్ తరాలకోసం తెలంగాణలో ఏమీ లేకుండా అంటే కనీసం నిలువడానికి భూమి కూడా లేకుండా చేస్తుంటే ఎలా సహించగలరు.
అందుకే తాడిచర్ల గానులను సింగరేణికి లీజుకు ఇవ్వడం గాదు,ఓపన్ కాస్ట్ గనుల తవ్వకాన్నే నిలిపివేయాలి.

Sunday, January 17, 2010

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆగేది కాదు

నా సైటు రివ్యూ చేయండి

జనవరి 5 నాడు చిదంబరం గారు అఖిలపక్ష సమావేశం లో తెలంగాణ రాష్ట్ర చరిత్ర,పెద్దమనుషుల ఒప్పందం ఆరుసూత్రాల పథకం,ఆరువందల పది జి ఒ నుండి తెలంగాణలో ముల్కీ నిబందనలు,వాటి అమలుకొసం తెలంగాణ ప్రజలు జరౌపుతున్న పోరాటం దారబోసిన రక్తపు ఏరుల గురించి వివరిస్తూనే డిసెంబర్ 7 నాడు అన్నీ పార్టీలు తెలంగాణకు తాము అనుకూలం అని ఆమోదం తెలిపి నందున్నే తాము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును రంభిస్తున్నామని తెలిపినారు .అలాగే పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని అందరం కలిసి కాపాడకుంటే అవతలి పక్షం ఉ పయోగించుకుంటుంది అనికూడా హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశాహ్ ఏర్పడ్డానాటినుండే చేసుకున్న ఒప్పందాలను ఎలా ఉల్లంఘించారో తెలుపుతూ టన్నులకొద్ది వ్యాసాలు వచ్చాయి.తెలంగాణ ప్రజలు తెలంగాణ ఎందుకు కోరుకుంటున్నారో స్పస్టంగా చెప్పుకున్నాం.మరి సమయిక్య ఆంధ్ర అనేవాళ్లూ ఎందుకు కలిసే ఉండాలని అంటున్నారో స్పస్టంగా చెప్పండి.అన్నీ వివరించను గాని ఒక్క ఉదాహరణ చెప్తాను.ఆదిలాబాద్,కరీంనగర్ ,వరంగల్ ,ఖమ్మం ఈ నాలుగు జిల్లాల్లో లక్షలాది హెక్టారులల్లో ఓపెన్ కాస్ట్ గనులు తవ్వి ఆ బొగ్గు ఆంధ్ర ప్రాంతపు థర్మల్ పవర్ ప్రాజెక్ట్ లల్లో ఉపయోగిస్తున్నారు.తెలంగాణలోనే భూములు ఇక ఎన్నటికి అక్కరకు రాకుండా చేస్తున్నారు.కరీంనగర్ లోని నూస్తులపూర్గ్యాస్ ఆధారిత పవర్ ప్రాజెక్టు కు గాస్ ఇవ్వబడదు అని చె ప్పినారు.కనుక మేం ఇక ఎంతమాత్రం ఆంధ్ర ప్రాంత ఆధిపత్య ధోరణి పాలనలో అణిగి మణిగి ఉండలేమని ఉద్యమిస్తున్నారు.ప్రజల అభిస్తాన్ని గౌరవించ వాల్సిన బాధ్యత ప్రభుత్వాలదని పార్లమెంటరీ ప్రజాస్వామ్య రాజ్యాంగం లో రా సుకోబడింది.కానీపార్లమెంటరీ ప్రజాస్వామ్అన్నీ పాటిస్తున్నామని పైకి చెప్పుకుంటున్న పార్టీలన్నీ ఏమీ చేసింది చిదంబరం గారె స్వయంగా తెలియజేసి మనం ఈ విధంగా వ్యవహరిస్తే ఏమీ జరుగుతుందోగూడ తెలిపినా రు.
అయితే ఆయన పార్టీ తో సహా అన్నిపార్టీలు ఎక్కడికక్కడ అధికారం హస్తగతం చేసుకోవడానికి చదరంగం ఆడుతున్నాయి.ఏ ప్రభుత్వమయిన తాను నస్తపోవడానికి ఎందుకూపూనుకుంటుంది అని ఒకరు అమాయకంగా అడుగు తున్నారు.ప్రభుత్వాలు వ్యాపారం చేసున్నాయా ?అధికారం కలిగి ఉండడం లాభం,అధికారం కోల్పోవడం నస్టమా?అధికారాన్ని కలిగి ఉన్దిప్రజలను పాలించడమే ప్రజాస్వామిక వ్యవస్థ ప్రధాన ధ్యేయం కాదని ఎన్నోసార్లు నిర్వచించు కొనిఅశేష ప్రజానీకం సంక్షేమం,వారి అభిస్టమ్ మేరకేనడుచు కోవడం ప్రజాస్వామిక వ్యవస్థ ప్రథమ కర్తవ్యమని చెప్పబడింది.ప్రభుత్వాలు,మంత్రులు,ఎంపీలు,ఎమ్మెల్యేలు,తమ తమ అధికారం కోసం మాత్రమే ఆలోచిస్తూ ప్రజల కాస్త నస్టాల గురించి వారి భావావేశాల గురుంచి గాని అలోచించడం లేదు.కానీ తెలంగాణ రాష్ట్రం గురించి తపించే యువకులు ఇప్పటికే వందకు పైగా తమ ప్రాణాలను తృణప్రాయంగా భావిస్తే తెలంగాణ రాజకీయ నాయకులు మాత్రం ప్రజలే ఇచ్చిన పదవులను గూడా వదలదానికి సిద్దంగా లేని పరిస్థితి.
ఈ రోజు తెలంగాణ పల్లె పల్లెన గడప గడపన అబాల గోపాలం పసి పాపల నుండి పండు ముదుసలి వరకు ప్రత్యేక రాష్ట్రం కావాలని నినదిస్తున్నారు.అది ప్రజాస్వామిక వ్యవస్థలో వారు కలిగి ఉన్న హక్కు.మా నిధులన్నీ మాకు ఖర్చు చేసి ఉంటే మాకూ చాలినన్ని పాఠశాలలు,కాలేజీలు,ఆసుపత్రులు ఉండేవి కదా అని ప్రశ్నిస్తున్నారు.మా నీళ్ళు మాకూ ఇచ్చి ఉంటే ఎన్ని లక్షల ఎకరాలు సస్యశ్యామలం అయ్యేవి ఎంత సంపద ప్రోగు పడేది అని ప్రశ్నిశ్నిస్తున్నారు .మా ఉద్యోగాలు మావి మాకూ లభించి ఉంటే ఇప్పటికీ ఎన్ని తరాలు సంపద్వంతం అయ్యేవో లెక్కలు తేల్చండి అంటూ కోల్పోయిన జనం నిలదీస్తున్నారు.కొందరు పెదమనుషులు తలకిందుల లెక్కలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు 610 జి ఒ పై గీర్ గ్లాని కమిస్సియన్ అడిగిన లెక్కలకు మసిబూసి మారేడుకాయ చేసి నట్లే చేస్తాం అనుకుంటున్నారేమో కానీ మేము అలా కుడురానివ్వం.మా లెక్కలు మా వద్ద ఉన్నాయి.
అధికారం లోకి వస్తున్న ప్రభుత్వాలు ఇన్ని సంవస్తారాలనుండి భూమి సమస్యను గాని పేదరిక నిర్మూలన గాని నిరుద్యోగ సమస్యను గాని నిత్యావసర ధరల నియంత్రణ గాని కడకు ప్రజలందరికి రక్షిత మంచినీరు కూడా ఇవ్వలేని స్వార్థ చింతనలో సంపద పోగేసుకోవడం లో తల మునుకలై ఉంటున్నారు.అవన్నీ చాలా పెద్ద సమస్యలని అంటారేమో .మరి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు రాజ్యాంగం లో అవకాశం ఉండి ,పెద్దమనుషుల ఒప్పందంలో ఉండి,అన్నీ పార్టీలు తమకు అభ్యంతరం లేదని చెప్పి,నెహ్రూ నుండి సోనియమ్మ దాకా అంతా తెలంగాకు న్యాయం చేస్తామని చెప్పి ఇంతకు ముందేన్నాడు లేని విధంగా ప్రజలందరూ చిన్నాపెద్దా ముక్తకంఠం తో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కదం తొక్కి కదలుతుంటే గూడ ప్రభుత్వాలు,పార్టీలు అధికార రాజకీయ క్రీడలు ఆడుతున్నాయేగని ప్రజావామ్యయుతంగా ఆలోచించడం లేదు .ఇలా అయితే ప్రజాస్వామ్య వ్యవస్తాపై ప్రజలకు నమ్మకం కోల్పోతే ఏమీ జరుగనున్నదో చిదంబరం గారె చాలా స్పస్తంగా చెప్పినారు .
ఇక హైద్రాబాద్ లో పెట్టుబడులు పెట్టినకొందరు ఆంధ్ర పెద్దమనుషులు తమ ఆస్తుల విలువలు తగ్గిపోతాయన్న ఆరాటంలోసామాన్య ప్రజలకు లేనిపోని భయాలు కలుగా జేస్తున్నారు.నది జలాల ఒప్పందాల మేరకు ఆంధ్ర,రాయల సీమలకు ఎన్ని నీళ్ళు పోవలో అన్నీ నీళ్ళు పోతాయి .ఎవరూ అడ్డుకోజాలరు.అలాగే హైద్రాబాద్లో నివసిస్తున్న వార్కి ఎలాంటి అభద్రతా భావం ఉండవల్సిన అవసరం లేదు .మరాఠీలు ,కన్నడిగులు ,మలయలీలు,తమిళులు,సిక్కులు,ఇలా ఎందరో హైద్రాబాద్ లో నిశ్చింతగా ఆస్తులు కలిగి ప్రశాంతంగా 1948కి ముందు1956 తర్వాత జీవిస్తున్నారు.రాజ్యాంగ విహితంగా లభించిన ఆస్తి హక్కు మేరకు హాయ్ఈగా జీవించవచ్చు.
కానీ కొందరు ఆంధ్ర మిత్రులు అతిగా స్పందిస్తున్నారు.3జనవరి నాటి విద్యార్థి గర్జనకు స్పందనగా వీరగోని’ఎస్ అనే బ్లాగ్ లో నిజాయితీగా ఆలోచించండి అని రాసినడానికి విరజాజి అనే ఒక సోదరిచాలా ఘాటుగా స్పందించారు.తెలంగాణను అడ్డుకునే వారు సంక్రాంతికి వారి ఇండ్లకు వెళ్లితే వచ్చేటపుడు మేమూ అడ్డుకుంటామ్ రానివ్వము అని ఆవేశం తో ఒక విద్యార్థి అన్నదానికి అమెగారు ఒ యు లో జమ అయ్యింది విద్యార్థులే కాదని అంటూ,తనకు ఇంతవరదాక తెలంగాణ అంటే కాస్తో కూస్తో ఉన్న సానుభూతి ఇలా వదురుతున్నందున లేకుండా పోయిందట.తెలంగాణలో చాలా మంది సమయిక్య రాష్ట్రన్నే కోరుకుంటున్నారట,వేర్పాటువాదం తో పిచ్చిగా మాట్లాడే మూర్ఖులకు భయపడి వారు బయట పడటం లేదట.(తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును స్వాగతిస్తు ఆంధ్ర ప్రాంత కవులు ,రచయితలు,మేధావులు చెప్పిన అభిప్రాయాలు ఆంధ్ర జ్యోతి దినా పత్రికలో చూడవచ్చు),తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడుతున్న నాయకులను కుక్కలని తిడుతూ ఆ కుక్కలను తరిమి కొట్టండి అని పిలుపునిచ్చారు.(veeragoni’sబ్లాగ్ లో నిజాయితీగా ఆలోచించండి అన్న దానికి విరజాజి గారి రెస్పోంస్ చదువండి)
మేము ఇంతకాలం సహించినవి ఇక ఎంత మాత్రం సహించలేనివి ఇలాంటి వ్యవహారాలనే.తెలంగాణ ప్రజల పోరాటాలను,వారి భావోద్వేగాలను ఒక ఆడ కూతురు సైతం ఇంతగా అవమాన పర్చగలిగినంతటి స్వాతిశయం,అహంకారం కలిగి ఉంటూ ఇంకా మేము కలిసి ఉంటాము,సమైక్య రాష్ట్రాన్ని కోరుకుంటున్నామని అంటే తెలంగాణ ప్రజలు ఎలా నమ్ముతారు.అందుకే ఇక మేం ఎంతమాత్రం ఆంధ్ర తో కలిసి ఉందా జాల లేమని తెలంగాణ ప్రజలు తెగించి పోరాటలకు సిద్దమయినారు .పొగరు తలకెక్కిన తలబిరుసు తనం తో కొందరు,అధికార,ధన అహంభావంకే తో కొందరు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోగలమని భావిస్తున్నారు.అందులో భాగంగానే లాబీయింగ్ చేస్తున్న కొందరు ఇప్పటికే 1200 కోట్లు ఇవ్వవలసిన వారికి ఇచ్చామని ఇక తెలంగాణ రాష్ట్రం వచ్చే ప్రశ్నేలేదని.వారి అంతరంగిక చర్చలో అనుకున్టున్నట్లు తెలుస్తున్నది.
కానీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను వారికి ఉన్న ధనబలం తో కొద్దికాలం ఆపగలిగితే ఆపగలుగుతారోమో కావచ్చు గాని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును శాశ్వతంగా ఎవరు అడ్డుకోజాలలేరు.తెలంగాణ పల్లెల్లో కదులుతున్న జనం, వారంతా రోడ్డు పైకి వచ్చి మా తెలంగాణ రాష్ట్రం మాది మాకు కావాలే,ఎవరెన్ని మాటలు చెప్పినా మేం ఊరుకోమ్ .మమ్ములను మోసం చేయాలని అనుకుంటున్న వారిని ఇక మేము సహించం అని అంటూ కొమురమ్ భీములై,సమ్మక్క సారలమ్మలై కదులుతున్నారు.

Sunday, January 3, 2010

నిజాయితీగా ఆలోచించండి!

ఉస్మానియా లో విధ్యార్తులు అంతా పెద్ద సంఖ్యలో ఉరద్యమించి తెలంగాణ అనేది ప్రజల ఆకాంక్ష.అది ఏ ఒక్కరో అనుకుంటున్నది కాదు అని తెలియ చెప్పినా కూడా కొంతమంది ఆంధ్ర మిత్రులు అసలు తెలంగాణకు అన్యాయమే జరుగలేదని సమయిక్యంగా ఉందాం ,సమయిక్యగా ఉంటే ఉండండి లేదంటే మీ సంగతి చూస్తాం అని తుపాకీ చూపిస్తున్నారు.ప్రతి ఆంధ్ర మిత్రున్ని మీకు మీరే ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోండి మీరు ఎప్పుడూ కూడా ఏ ఒక్క తెలంగాణ వాని గురించి తక్కువ చేసి మాట్లాడ లేదా అసలు మా బాధల గురించి మా అవమానాల గురించి ఎపుడైన ఆలోచించారా .మాకు ఏ అన్యాయం జరుగలేదని అంటున్నారంటేనే మమ్ములను అవమాన పరిచినట్లే.మీరు చరిత్రను చూడ ఇస్టమ్ లేకనే ఇలా మాట్లాడు తున్నారు.మేము అంటున్నాం ఇక మేము ఎంత మాత్రం మీతో ఇమడలెము .మా బ్రతుకు మేము బ్రతుకుటము అంటే లేదు మీరు మాతోనే ఉండాలనడం ఏ ప్రజాస్వామిక సూత్రల కు అనుగునమో ఆంధ్ర మేధావులు చెప్పాలి.