Tuesday, January 19, 2010

తాడిచెర్ల ఓపెన్ కాస్ట్ ఘనుల తవ్వకాన్నే నిలిపివేయాలి

తడిచర్ల బొగ్గు ఘనులను సింగరేణి కి కాకుండా రాయలసీమ బాడ కాంట్రాక్టర్లకు ప్రభుత్వం కట్టబెట్టే కుట్ర చేస్తున్నది.ఒ సి పి 3 ,extensian ,తడిచర్ల ఓపెన్ కాస్ట్ ఘనులను వ్యతిరేకిస్తూ మానవ హక్కుల వేదిక, తెలంగాణ అయిక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యం లో స్థానిక ప్రజలు ఉద్యమించారు.ఈ ఓపెన్ కాస్ట్ మైన్స్ దాదాపు 500 మీటర్ల లోతు తవ్వడం వలన భూగర్భ జలాలు అడుగంటి పొయి ఈ భూగోళం ఉన్నంతా వరకు తెలంగాణలోని ఈ భూమి దేనికి పనికి రాని మరుభూమి గా మారిపోనున్నదని ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది.
undar ground mines అయితే లోపల బొగ్గు తవ్వి తీసుకున్నా గూడ పయిన వ్యవసాయం చేసుకోవచ్చు ఇండ్లు కట్టుకోవచ్చు.ఉపరితలం లోని భూమిని మానవ మనుగడకు ఉపయోగించుకొనవచ్చు.కానీ ఓపెన్ కాస్ట్ మైన్స్ ల వలన ఏర్పడిన ఆ పెద్ద పెద్ద బావి బొండలు మంషులకు ఎప్పటికీ పనికి రాకుండా పోతాయి.500 మీటర్ల లోతున ఉండేతటువంటి మట్టి పొరలు రాతి పొరలు అన్నీ పెకిలించ బాదుతాయి కనుక పయిన పదే వర్షం నీరు అంతా 500 మీటర్ల లోతులోకివెళ్ళి పోతుంది అప్పుడు ఇక భూమి పయిన గడ్డి పోచ గూడా మొలువని దయనీయమయిన పరిస్థితి ఉంటుంది .అలాగే ఈ బావుల పక్కలనుండి ప్రవహిస్తున్న గోదావరి, మనేరు నదుల ప్రవాహ గతి మారిపోతుంది .వెయిల సంవస్తారాల మానవ చరిత్ర కు ఆనవాళ్లు లేకుండా పోయే పరిస్థితి.తడిచర్ల పక్కన కాపురం అనే పల్లెను ఆనుకొని కాకతీయుల కాలం నాటి కోట ఒకటి ఉంది అది ఇపుడు మాయం అవుతునది.మానేరు నది సమీపంగా ఉన్నందున బోరు బావులు వేసుకొని ప్రజలు వ్యవసాయం చేసుకొంటు అతి మెలయిన ఎర్ర మిరుప కాయలు పండిస్తున్నారు.ఇక ఆ పంట ఉండదు.మానేరు ను అణు కొని జయిన గుళ్ళు ఉన్నాయి.ఆ గుడుల్లో ఉన్న లింగం పయిన పూసిన విభూతి,కుంకుమ ఇప్పటికీ ఈ రోజే అలంకరించినట్లుగా ఉంది అజంతా చిత్రాల్లో వాడిన రంగులవలే ఉన్నాయి .అదంతా కంటికి కనారాణిదయి పోతుంది.ఆంధ్ర లో చిన్న్ చిన్న జ్ఞాపకాలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు.ఇక్కడ మాత్రం మానవేతిహాసం లోనే మహాద్భుతం అయిన సంఘటనలను మాయం చేస్తూ అదంతా అభివృద్దే నమ్మన్డీ అంటున్నారు.
తాడిచర్ల ఓపెన్ కాస్ట్ ఘనుల్లో ప్రస్తుత1400 హెక్టార్ల భూమిని తవ్విపోస్తామ్ అని ప్రణాళికలు రూపొందించారు.ఈ 1400 హెక్టార్లలో 700 లు ప్రభుత్వ భూమి తక్కినది ప్రజలది.ఈ ప్రజల్లో కూడా కొందరు భూస్వాములు ఇప్పటికే పట్టానాలల్లో ఆస్తులు కలిగి సుఖవంతమయిన జీవితం గడుపుతున్నవారు ఈ పరిణామాన్ని సరే ప్రభుత్వం కోరుతున్నది కనుక మా భూములు ఇస్తాం అంటున్నారు.కానీ తడిచర్ల,కాపురం,చిన్న తూండ్ల ,పెద్దతూండ్ల,నాయకం పల్లె రేగడియపల్లే,హరిజన వాడ,తెనుగుపల్లే లో నివసిస్తున్న వేలాది మంది ప్రజలు ఈ బావులను వ్యతిరేకిస్తున్నారు.అక్కడ మేము ఏర్పాటు చేసిన ఒక బహిరంగ సభలో రాయ పోశమ్ అనే ఒక సామాన్య చిన్న రైతు ఆ సభలో మాట్లాడుతూ,అయ్యా,మా భూములను సర్కారు గుంజుకుంటదట కదా?అందుకు ప్రతిఫలంగా మాకు డబ్బులు ఇస్తాదట కదా .కానీ ఈ భూముల ఆధారం తోనే మా తాతలు బతికిండ్రు,మా అయ్యలు బతికిండ్రు,మేమూ బతుకుతున్నాం,మా కొడుకులు,బిడ్డలను సాడుకుంటున్నం .మా తాతలనాటినుండి మా కొడుకుల దాకా పెండ్లిల్లు పెరంటాళ్లు,చదువులు,ఛావులు,బతుకులు అన్నీ అయితున్నాయి .మా భూములకు,జరాలు రాలేదు,రోగాలు రాలేదు,కాన్సరు రాలేదు ఎయిడ్స్ రాలేదు.కానీ ఇప్పుడేమో మా భూముల బొగ్గు ఉన్నదని దానికి కాన్సరూ అంటగట్టి మమ్ములను ఖాళీ చేసి పొమ్మంటే మీరిచ్చే డబ్బులు ఎన్ని రోజులౌ వస్తాయి,మేము ఎన్ని రోజులు బతుకుతాము, ఆతర్వాత మా బతుకులు ఏమీ గావాలే మాములను ఎవరు చూస్తారు?అని ప్రశ్నిస్తున్నాడు .
మరొక సామాన్య కులీ బిడ్డ మాట్లాడుతూ,అయ్యా ,భూములున్నోళ్లయితే వాళ్ళకు ఎన్నో కొన్ని డబ్బులు వస్తాయి గావచ్చు,ఎన్నో కొన్ని రోజులు బతుకుతారు గావచ్చు కానీ ఏ భూములు లేక పోయినా ఇన్నాళ్లు ఈ భూముల పయిన కులో నాలో చేసుకొని బతికినమ్.ఏమీ దొరుకని నాడు అడివిలకుబోయి కాయో గడ్డో తెచ్చుకొని తిని బతికినమ్.మమ్ములను ఇప్పుడు ఎల్లి పొమ్మంటే మేము ఎక్కడ బతుకాలే ఇది ఎవ్వల కోసం చేస్తిన్నది ఈ సర్కార్ అని నీల దీసి అడిగిండు.
వీళ్లంతా చెప్పినట్లు గానే ఇవ్వాళ ఎక్కడో రాయల సీమలో ఉన్న బాడ కాంట్రాక్టరు మరింతగా బలిసేతందూకు తెలంగంలో బంగారం పండే భూములను వాళ్ళ కోసం పందెరమ్ పెదుతామని అంటూంటే తెలంగాణ ప్రజలు ఎత్తి పరిస్థితుల్లో కూడా ఊరుకోరు.
ఒక వైపు ఇంత కొట్లాట జరుగుతుంటే మొన్నటికి మొన్న పంచాయతీ రాజు బద్జట్ లో తెలంగాణకు మొండి చేయి చూపిన సంగతి చూసాము.ఇప్పటికిప్పుడు మరోసారి పంటల భీమాలో 805 కోట్లకు గాను అనంత పూర్ కు 600 కోట్లు,కడపకు 120 కోట్లు ఖర్చు పెట్టుకున్నారంటే మామూలు రోజులల్లో తెలంగాణకు దక్కింది ఎంతో అవతలి వాళ్ళు బొక్కింది ఎంతో అర్థం చేసుకోవచ్చు.
మరో విషయం,ఈ ఓపన్ కాస్ట్ గణుల్లో ఒక్కొక్క సారి 100 టన్నుల పేలుడు పదార్థామోకేయ సారి బ్లాస్ట్ చేస్తారు.దానితో 8 నుండి 12 కిలో మీటర్ల దూరం వరకు భూమి గజ గజ వణికి పోయి ఇండ్ల గోడలు పగిలి పోతాయి పయిన పెట్టుకున్న వస్తువులు ఆహార పదార్థాలు కింద పడుతాయి .ఇంటి గోడలు కూలి పోతాయి.15 నుండి 20 కి.మీ.వ్యాసార్థం లోని బావులల్లో నీళ్ళు ఉండక ప్రజలకు తాగు నీరు సాగు నీరుకు ఇబ్బంది అవుతుంది.
పవర్ జనరేషన్ కు మన దగ్గర లభించే సూర్య రశ్మి,గాలి(విండ్)వాడుకుంటే పర్యావరణం బాగా ఉంటుంది.ప్రజలకు పునరావాసం బాధ తప్పుతుంది.స్టానికంగా లభించే వనరులతో స్థానిక ప్రజలు లబ్ధి పొందలే గాని స్టానికంగా వనరులు కలిగి ఉండడం స్థానిక ప్రజలకు శాపం కాగూడదు గదా?ఆంధ్ర ,రాయలసీమ,పెట్టుబడి దార్ల కోసం తెలంగాణ ప్రజలు ఎంతగా తమ సర్వస్టమ్ కోల్పోతున్నారో,భవిష్యత్ తరాలకోసం తెలంగాణలో ఏమీ లేకుండా అంటే కనీసం నిలువడానికి భూమి కూడా లేకుండా చేస్తుంటే ఎలా సహించగలరు.
అందుకే తాడిచర్ల గానులను సింగరేణికి లీజుకు ఇవ్వడం గాదు,ఓపన్ కాస్ట్ గనుల తవ్వకాన్నే నిలిపివేయాలి.

Sunday, January 17, 2010

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆగేది కాదు

నా సైటు రివ్యూ చేయండి

జనవరి 5 నాడు చిదంబరం గారు అఖిలపక్ష సమావేశం లో తెలంగాణ రాష్ట్ర చరిత్ర,పెద్దమనుషుల ఒప్పందం ఆరుసూత్రాల పథకం,ఆరువందల పది జి ఒ నుండి తెలంగాణలో ముల్కీ నిబందనలు,వాటి అమలుకొసం తెలంగాణ ప్రజలు జరౌపుతున్న పోరాటం దారబోసిన రక్తపు ఏరుల గురించి వివరిస్తూనే డిసెంబర్ 7 నాడు అన్నీ పార్టీలు తెలంగాణకు తాము అనుకూలం అని ఆమోదం తెలిపి నందున్నే తాము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును రంభిస్తున్నామని తెలిపినారు .అలాగే పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని అందరం కలిసి కాపాడకుంటే అవతలి పక్షం ఉ పయోగించుకుంటుంది అనికూడా హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశాహ్ ఏర్పడ్డానాటినుండే చేసుకున్న ఒప్పందాలను ఎలా ఉల్లంఘించారో తెలుపుతూ టన్నులకొద్ది వ్యాసాలు వచ్చాయి.తెలంగాణ ప్రజలు తెలంగాణ ఎందుకు కోరుకుంటున్నారో స్పస్టంగా చెప్పుకున్నాం.మరి సమయిక్య ఆంధ్ర అనేవాళ్లూ ఎందుకు కలిసే ఉండాలని అంటున్నారో స్పస్టంగా చెప్పండి.అన్నీ వివరించను గాని ఒక్క ఉదాహరణ చెప్తాను.ఆదిలాబాద్,కరీంనగర్ ,వరంగల్ ,ఖమ్మం ఈ నాలుగు జిల్లాల్లో లక్షలాది హెక్టారులల్లో ఓపెన్ కాస్ట్ గనులు తవ్వి ఆ బొగ్గు ఆంధ్ర ప్రాంతపు థర్మల్ పవర్ ప్రాజెక్ట్ లల్లో ఉపయోగిస్తున్నారు.తెలంగాణలోనే భూములు ఇక ఎన్నటికి అక్కరకు రాకుండా చేస్తున్నారు.కరీంనగర్ లోని నూస్తులపూర్గ్యాస్ ఆధారిత పవర్ ప్రాజెక్టు కు గాస్ ఇవ్వబడదు అని చె ప్పినారు.కనుక మేం ఇక ఎంతమాత్రం ఆంధ్ర ప్రాంత ఆధిపత్య ధోరణి పాలనలో అణిగి మణిగి ఉండలేమని ఉద్యమిస్తున్నారు.ప్రజల అభిస్తాన్ని గౌరవించ వాల్సిన బాధ్యత ప్రభుత్వాలదని పార్లమెంటరీ ప్రజాస్వామ్య రాజ్యాంగం లో రా సుకోబడింది.కానీపార్లమెంటరీ ప్రజాస్వామ్అన్నీ పాటిస్తున్నామని పైకి చెప్పుకుంటున్న పార్టీలన్నీ ఏమీ చేసింది చిదంబరం గారె స్వయంగా తెలియజేసి మనం ఈ విధంగా వ్యవహరిస్తే ఏమీ జరుగుతుందోగూడ తెలిపినా రు.
అయితే ఆయన పార్టీ తో సహా అన్నిపార్టీలు ఎక్కడికక్కడ అధికారం హస్తగతం చేసుకోవడానికి చదరంగం ఆడుతున్నాయి.ఏ ప్రభుత్వమయిన తాను నస్తపోవడానికి ఎందుకూపూనుకుంటుంది అని ఒకరు అమాయకంగా అడుగు తున్నారు.ప్రభుత్వాలు వ్యాపారం చేసున్నాయా ?అధికారం కలిగి ఉండడం లాభం,అధికారం కోల్పోవడం నస్టమా?అధికారాన్ని కలిగి ఉన్దిప్రజలను పాలించడమే ప్రజాస్వామిక వ్యవస్థ ప్రధాన ధ్యేయం కాదని ఎన్నోసార్లు నిర్వచించు కొనిఅశేష ప్రజానీకం సంక్షేమం,వారి అభిస్టమ్ మేరకేనడుచు కోవడం ప్రజాస్వామిక వ్యవస్థ ప్రథమ కర్తవ్యమని చెప్పబడింది.ప్రభుత్వాలు,మంత్రులు,ఎంపీలు,ఎమ్మెల్యేలు,తమ తమ అధికారం కోసం మాత్రమే ఆలోచిస్తూ ప్రజల కాస్త నస్టాల గురించి వారి భావావేశాల గురుంచి గాని అలోచించడం లేదు.కానీ తెలంగాణ రాష్ట్రం గురించి తపించే యువకులు ఇప్పటికే వందకు పైగా తమ ప్రాణాలను తృణప్రాయంగా భావిస్తే తెలంగాణ రాజకీయ నాయకులు మాత్రం ప్రజలే ఇచ్చిన పదవులను గూడా వదలదానికి సిద్దంగా లేని పరిస్థితి.
ఈ రోజు తెలంగాణ పల్లె పల్లెన గడప గడపన అబాల గోపాలం పసి పాపల నుండి పండు ముదుసలి వరకు ప్రత్యేక రాష్ట్రం కావాలని నినదిస్తున్నారు.అది ప్రజాస్వామిక వ్యవస్థలో వారు కలిగి ఉన్న హక్కు.మా నిధులన్నీ మాకు ఖర్చు చేసి ఉంటే మాకూ చాలినన్ని పాఠశాలలు,కాలేజీలు,ఆసుపత్రులు ఉండేవి కదా అని ప్రశ్నిస్తున్నారు.మా నీళ్ళు మాకూ ఇచ్చి ఉంటే ఎన్ని లక్షల ఎకరాలు సస్యశ్యామలం అయ్యేవి ఎంత సంపద ప్రోగు పడేది అని ప్రశ్నిశ్నిస్తున్నారు .మా ఉద్యోగాలు మావి మాకూ లభించి ఉంటే ఇప్పటికీ ఎన్ని తరాలు సంపద్వంతం అయ్యేవో లెక్కలు తేల్చండి అంటూ కోల్పోయిన జనం నిలదీస్తున్నారు.కొందరు పెదమనుషులు తలకిందుల లెక్కలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు 610 జి ఒ పై గీర్ గ్లాని కమిస్సియన్ అడిగిన లెక్కలకు మసిబూసి మారేడుకాయ చేసి నట్లే చేస్తాం అనుకుంటున్నారేమో కానీ మేము అలా కుడురానివ్వం.మా లెక్కలు మా వద్ద ఉన్నాయి.
అధికారం లోకి వస్తున్న ప్రభుత్వాలు ఇన్ని సంవస్తారాలనుండి భూమి సమస్యను గాని పేదరిక నిర్మూలన గాని నిరుద్యోగ సమస్యను గాని నిత్యావసర ధరల నియంత్రణ గాని కడకు ప్రజలందరికి రక్షిత మంచినీరు కూడా ఇవ్వలేని స్వార్థ చింతనలో సంపద పోగేసుకోవడం లో తల మునుకలై ఉంటున్నారు.అవన్నీ చాలా పెద్ద సమస్యలని అంటారేమో .మరి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు రాజ్యాంగం లో అవకాశం ఉండి ,పెద్దమనుషుల ఒప్పందంలో ఉండి,అన్నీ పార్టీలు తమకు అభ్యంతరం లేదని చెప్పి,నెహ్రూ నుండి సోనియమ్మ దాకా అంతా తెలంగాకు న్యాయం చేస్తామని చెప్పి ఇంతకు ముందేన్నాడు లేని విధంగా ప్రజలందరూ చిన్నాపెద్దా ముక్తకంఠం తో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కదం తొక్కి కదలుతుంటే గూడ ప్రభుత్వాలు,పార్టీలు అధికార రాజకీయ క్రీడలు ఆడుతున్నాయేగని ప్రజావామ్యయుతంగా ఆలోచించడం లేదు .ఇలా అయితే ప్రజాస్వామ్య వ్యవస్తాపై ప్రజలకు నమ్మకం కోల్పోతే ఏమీ జరుగనున్నదో చిదంబరం గారె చాలా స్పస్తంగా చెప్పినారు .
ఇక హైద్రాబాద్ లో పెట్టుబడులు పెట్టినకొందరు ఆంధ్ర పెద్దమనుషులు తమ ఆస్తుల విలువలు తగ్గిపోతాయన్న ఆరాటంలోసామాన్య ప్రజలకు లేనిపోని భయాలు కలుగా జేస్తున్నారు.నది జలాల ఒప్పందాల మేరకు ఆంధ్ర,రాయల సీమలకు ఎన్ని నీళ్ళు పోవలో అన్నీ నీళ్ళు పోతాయి .ఎవరూ అడ్డుకోజాలరు.అలాగే హైద్రాబాద్లో నివసిస్తున్న వార్కి ఎలాంటి అభద్రతా భావం ఉండవల్సిన అవసరం లేదు .మరాఠీలు ,కన్నడిగులు ,మలయలీలు,తమిళులు,సిక్కులు,ఇలా ఎందరో హైద్రాబాద్ లో నిశ్చింతగా ఆస్తులు కలిగి ప్రశాంతంగా 1948కి ముందు1956 తర్వాత జీవిస్తున్నారు.రాజ్యాంగ విహితంగా లభించిన ఆస్తి హక్కు మేరకు హాయ్ఈగా జీవించవచ్చు.
కానీ కొందరు ఆంధ్ర మిత్రులు అతిగా స్పందిస్తున్నారు.3జనవరి నాటి విద్యార్థి గర్జనకు స్పందనగా వీరగోని’ఎస్ అనే బ్లాగ్ లో నిజాయితీగా ఆలోచించండి అని రాసినడానికి విరజాజి అనే ఒక సోదరిచాలా ఘాటుగా స్పందించారు.తెలంగాణను అడ్డుకునే వారు సంక్రాంతికి వారి ఇండ్లకు వెళ్లితే వచ్చేటపుడు మేమూ అడ్డుకుంటామ్ రానివ్వము అని ఆవేశం తో ఒక విద్యార్థి అన్నదానికి అమెగారు ఒ యు లో జమ అయ్యింది విద్యార్థులే కాదని అంటూ,తనకు ఇంతవరదాక తెలంగాణ అంటే కాస్తో కూస్తో ఉన్న సానుభూతి ఇలా వదురుతున్నందున లేకుండా పోయిందట.తెలంగాణలో చాలా మంది సమయిక్య రాష్ట్రన్నే కోరుకుంటున్నారట,వేర్పాటువాదం తో పిచ్చిగా మాట్లాడే మూర్ఖులకు భయపడి వారు బయట పడటం లేదట.(తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును స్వాగతిస్తు ఆంధ్ర ప్రాంత కవులు ,రచయితలు,మేధావులు చెప్పిన అభిప్రాయాలు ఆంధ్ర జ్యోతి దినా పత్రికలో చూడవచ్చు),తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడుతున్న నాయకులను కుక్కలని తిడుతూ ఆ కుక్కలను తరిమి కొట్టండి అని పిలుపునిచ్చారు.(veeragoni’sబ్లాగ్ లో నిజాయితీగా ఆలోచించండి అన్న దానికి విరజాజి గారి రెస్పోంస్ చదువండి)
మేము ఇంతకాలం సహించినవి ఇక ఎంత మాత్రం సహించలేనివి ఇలాంటి వ్యవహారాలనే.తెలంగాణ ప్రజల పోరాటాలను,వారి భావోద్వేగాలను ఒక ఆడ కూతురు సైతం ఇంతగా అవమాన పర్చగలిగినంతటి స్వాతిశయం,అహంకారం కలిగి ఉంటూ ఇంకా మేము కలిసి ఉంటాము,సమైక్య రాష్ట్రాన్ని కోరుకుంటున్నామని అంటే తెలంగాణ ప్రజలు ఎలా నమ్ముతారు.అందుకే ఇక మేం ఎంతమాత్రం ఆంధ్ర తో కలిసి ఉందా జాల లేమని తెలంగాణ ప్రజలు తెగించి పోరాటలకు సిద్దమయినారు .పొగరు తలకెక్కిన తలబిరుసు తనం తో కొందరు,అధికార,ధన అహంభావంకే తో కొందరు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోగలమని భావిస్తున్నారు.అందులో భాగంగానే లాబీయింగ్ చేస్తున్న కొందరు ఇప్పటికే 1200 కోట్లు ఇవ్వవలసిన వారికి ఇచ్చామని ఇక తెలంగాణ రాష్ట్రం వచ్చే ప్రశ్నేలేదని.వారి అంతరంగిక చర్చలో అనుకున్టున్నట్లు తెలుస్తున్నది.
కానీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను వారికి ఉన్న ధనబలం తో కొద్దికాలం ఆపగలిగితే ఆపగలుగుతారోమో కావచ్చు గాని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును శాశ్వతంగా ఎవరు అడ్డుకోజాలలేరు.తెలంగాణ పల్లెల్లో కదులుతున్న జనం, వారంతా రోడ్డు పైకి వచ్చి మా తెలంగాణ రాష్ట్రం మాది మాకు కావాలే,ఎవరెన్ని మాటలు చెప్పినా మేం ఊరుకోమ్ .మమ్ములను మోసం చేయాలని అనుకుంటున్న వారిని ఇక మేము సహించం అని అంటూ కొమురమ్ భీములై,సమ్మక్క సారలమ్మలై కదులుతున్నారు.

Sunday, January 3, 2010

నిజాయితీగా ఆలోచించండి!

ఉస్మానియా లో విధ్యార్తులు అంతా పెద్ద సంఖ్యలో ఉరద్యమించి తెలంగాణ అనేది ప్రజల ఆకాంక్ష.అది ఏ ఒక్కరో అనుకుంటున్నది కాదు అని తెలియ చెప్పినా కూడా కొంతమంది ఆంధ్ర మిత్రులు అసలు తెలంగాణకు అన్యాయమే జరుగలేదని సమయిక్యంగా ఉందాం ,సమయిక్యగా ఉంటే ఉండండి లేదంటే మీ సంగతి చూస్తాం అని తుపాకీ చూపిస్తున్నారు.ప్రతి ఆంధ్ర మిత్రున్ని మీకు మీరే ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోండి మీరు ఎప్పుడూ కూడా ఏ ఒక్క తెలంగాణ వాని గురించి తక్కువ చేసి మాట్లాడ లేదా అసలు మా బాధల గురించి మా అవమానాల గురించి ఎపుడైన ఆలోచించారా .మాకు ఏ అన్యాయం జరుగలేదని అంటున్నారంటేనే మమ్ములను అవమాన పరిచినట్లే.మీరు చరిత్రను చూడ ఇస్టమ్ లేకనే ఇలా మాట్లాడు తున్నారు.మేము అంటున్నాం ఇక మేము ఎంత మాత్రం మీతో ఇమడలెము .మా బ్రతుకు మేము బ్రతుకుటము అంటే లేదు మీరు మాతోనే ఉండాలనడం ఏ ప్రజాస్వామిక సూత్రల కు అనుగునమో ఆంధ్ర మేధావులు చెప్పాలి.