Wednesday, February 17, 2010

నేదునూరు పవర్ ప్రాజెక్ట్ తెలంగాణ అభివృధికేనా?

కరీంనగర్ జిల్లాలోని తిమ్మాపూర్ మండలం లోని నేదునూరు గ్రామమలో 14 ఫిబ్రవరి నాడు ముఖ్యమంత్రి రోశయ్య విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్ట్ కు శంకు స్థాపన చేశారు.గోదావరి బేసిన్ లో నుండి సరఫరా అయ్యే గ్యాస్ ఆధారంగా ఈ ప్రాజెక్టు నడుస్తుందని చెప్పుతున్నారు.కానీ శంకు స్టాపన రోజుననే ప్రజారాజ్యం నేత హరిరామ జోగయ్య తెలంగానీయులకు భయపడి మన గ్యాస్ తో తెలంగాణలో ప్రాజెక్ట్ పెడుతున్నారని పత్రికలకు ఎక్కినాడు.మన బొగ్గుతో విజయవాడలో నడుస్తున్న థర్మల్ కేంద్రం మాట చెప్పడు,ఎన్ టి పి సి నుండి తెలంగాణ నీల్లతో,బొగ్గుతో ఉత్పత్తి అవుతున్న విద్యుత్తు కడపకు,విజయవాడకు,హైద్రాబాదుకు 440 కే వి లైనలు వెళ్తుంటేసరే మంచిదే అనుకుంటాడు.
కానీ నిజంగానే నేదునూరు ప్రాజెక్ట్ తెలంగాణ ప్రయోజనాలకెన?నీటిని నిలువ జేయడానికి,ప్రాజెక్ట్ నిర్మించడానికి ప్రస్తుతం 440 ఎకరాల భూమిని స్వదీన పర్చుకున్నారు.మా 440 ఎకరాల పంట భూమి నీటి పాలు అయ్యింది.తర్వాత ఇక గ్యాస్ విషయానికి వద్దామ్ .గోదావరి బేసిన్ నుండి గ్యాస్ పైప్ వేసి గ్యాస్ సరఫరా చేయడం చాలా ఖర్చు తో కూడుకున్నది,సమీపానగల సింగరేణి నుండి బొగ్గుతో నడుపుకోవడం చవుక అనే వాదన ఇప్పటికే మొదలయ్యింది.అంటే అక్కడనుండి గ్యాస్ రాదు.మన నీళ్ళు మన బొగ్గుతో తయారయ్యే విద్యుత్తుతో మన ప్రాణహిత నడినుండి నీళ్ళు లిఫ్ట్ చేసుకొనిపోవడానికి ఉపయోగిస్తారు.ఒకవైపు తెలంగాణ పోరాటం ఉదృతంగా ఉంది ఇప్పుడు వద్దు అని అన్నా కూడా రోశయ్య ఎందుకు వేగిరంగా వచ్చి శంకు స్టాపించాడో మనం అర్థం చేసుకోవాలి.
ఈ ప్రాజెక్టులో బొగ్గులేదా ,వాళ్ళు అంటున్నట్లుగా గ్యాసే మండించినా మన కరీంనగర్ పరిసరాలల్లో ఉష్ణోగ్రత సాధారణ ఉష్ణోగ్రతలకంటే రెట్టింపు చేస్తారు.రోగాలతో చచ్చేది మనం.పర్యావరణం మనది నాశనం అవుతుంది ఫలితం మాత్రం వాల్లకు .మన బొగ్గు,మన నీల్లతో విద్యుత్తు ఉత్పత్తి చేస్తాడు మన ప్రానహిత నీళ్లే ఎత్తుకపోతాడు.ఇది మన అభివృద్దే అంటాడు.ఎలా నమ్మమంటారో చెప్పండి?

త్రాగు నీళ్ళకొరకు తెలంగాణలో గిరిజనుల వలసలు

అది ఆదిలాబాద్ జిల్లాలోని కెరమెరి మండలం నుండి 25 కిలోమేటర్ల దూరంలో బాబే ఝరి దాటిన తర్వాత ఉన్న జోడేఘాట్.ఆ పేరు వింటేనే ఒక

జలదరింపు,ఆ పేరు వింటేనే ఒక పూనకం,ఆ పేరు వింటేనే ఒక త్యాగం ఒక బలిదానం.రోడ్ సౌకర్యం లేదు.బస్ గాని ఆటో గాని లేదు.సెప్టెంబర్ ఒకటి

కొమురమ్ భీమ్ అమరుడైన రోజు గుర్తుగా అక్కడ ఒక సభ జరుపుతారు,ఆ రోజు అధికారులకు నాయకులకు జోడే ఘాట్ జ్ఞ్యాపకం వస్తుంది.ఆ రోజు అక్కడి

ప్రజల విజ్ఞప్తి ఏమిటంటే మాకు గొంతు తడుపుకోవడాని ఇన్ని నీళ్ళు,మాఉరికి మీరు రావడానికి ఒక తొవ్వ ఇది వాళ్ళు గత యాభై సంవస్తారాల నుండి

కోరుతూనే ఉన్నారు నాయకులు అధికారులు హామీలు ఇస్తూనే ఉన్నారు కానీ ఇప్పటికీ అది అమలుకు నోచుకోలేదు.
ఒక ఆటో కిరాయికి తీసుకొనే ఆ గుట్టల మీదుగా బండల మీదుగా పెద్ద దుమ్ములో కొమురమ్ భీము నేలకొరిగిన ఆ స్థలాన్ని చూడాలన్న తలంపుతో

వెలుతున్నాం. నెత్తిపైనమూటలతో కాలినడకన వస్తున్న జనం మా పరిస్థితి ఇప్పటి కి కూడా ఇలా ఉంది చూడండి అన్నట్లుగా మా వైపు అమాయకంగా

చూస్తున్నారు.ఆ చూపులు మేము పొందుతున్న సౌకర్యాలను నిలదీస్తున్నట్లుగా అనిపించాయి.ఎత్తయిన రాతి గుట్టలు,కిందికి చూస్తే ఒళ్ళు జలదరించే విధంగా

ఉన్న లోయలు కలపకు ఏమాత్రం పనికి రానందున వదలి వేయబడ్డ అందుగు,తపిశి,దుంపిడి,కొడిష.విషముస్టీ,కారెంగా ,తునికి ఇప్ప చెట్లు మాత్రం

పలుచగా ఉన్నాయి,జోడేఘాటులో ఆ గ్రామ పెద్దమనిషి కొమురమ్ భీమ్ మేనల్లుడు అయిన పెందురి సోము మమ్ములను చూసి ఎదురుగా వచ్చి రామ్

రామ్ అంటూ విష్ చేసినాడు.అన్నము లేదు కొన్ని మధురంబములున్నవి త్రావుమన్న అని అలనాడు రంతి దేవుడు అన్నట్లుగా సోము మాకు తాము

ఎంతో ప్రియంగా దాచుకున్న మంచినీళ్లు ఇచ్చాడు.మంచం మీద కూచున్న తర్వాత తమ సమస్యలు ఏకరువు పెట్టినాడు.
ఆ గ్రామం లో గొండు ,కోలామ్ లు కలిసి 40 కుటుంబాలలో 260 జనాభా ఉన్నారు.గుట్టల పైన అక్కడక్కడ సమానంగా ఉన్న భూమిలో జొన్నలు,కందులు,మక్కలు,పెసలు
పత్తి పండించుకొని పొట్టపోసుకుంటున్నారు.మేకలు కోళ్ళు సాదుతారు.గుట్ట కింద ఆడదస్నాపూర్ అని ఒక గ్రామం ఉంది.మోవాడ్ ఆడదస్నాపూర్ గ్రామాల

మధ్యగా పారుతున్న వాగు మట్టం నుండి జోడేఘాట్ 200 మీటర్ల ఎత్తులో ఉంది.వీళ్లకు రక్షిత మంచినీరు ఆ వాగు నుండి కాకుండా ఆ గుట్టపైన్ బోరు వేసి

8 లక్షలఖర్చుతో రక్షిత మంచినీరుకు టాంక్ అయితే నిర్మించారు .కానీ వాటర్ సోర్స్ లేనందున వాళ్ళకు తాగడానికి నీళ్ళు లేవు.జియాలోజికల్ సర్వే

వాళ్ళు బొర్లు వేస్తే నీళ్ళు పదే అవకాశం లేదు అన్నారట.అప్పటికే వేసి ఉన్న బోర్లా ను ఇప్పటికీ మూసివేయనే లేదు.అయితే తమ నీటిసమస్యను ఎప్పటిలాగానే

అందరికీ విన్నవించినారు.రెస్పాన్స్ రానందున రోడ్ పైకి వచ్చి ధర్నా చేశారు. ఐ టి డి ఏ ప్రాజెక్ట్ అధికారి గాని స్థానిక రాజకీయ నాయకులు గాని

స్పందించ లేదు.గత్యంతరం లేని ఆ గిరిజనులు గుట్ట కింద గల ఆడదస్నాపూర్ మోవాడ్ గ్రామాల మధ్య ప్రవహిస్తున్న వాగు ఒడ్డున అన్నీ గుడారాలు

వేసుకొనే పిల్లా పాప గొడ్డు గోదా కోళ్ళు కుక్కలు తీసుకొనే ఇండ్లకు తాడుకలు పెట్టి గ్రామానికి గ్రామం వలుస పోయింది.
స్థానిక పత్రికలు వార్తలు రాసినాయి.వార్తలు చూసి వెళ్లిన మానవ హక్కుల వేదిక తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ బా
ధ్యులకు గిరిజనులు చెప్పిన బాధలు

విన్న తర్వాత నాగరికుల అవసరం కోసం ప్రాణహిత నుండి 400 మెటర్ల ఎత్తుకు 400 కిలో మీటర్ల దురానికైన తరలిస్తారు నీటిని కానీ నోరులేని ఈ

గిరిజనులకు కేవలం 2కిలోమేటర్ల నుండి 20 లక్షల ఖర్చుతో నీళ్ళు తరలించ లేక వాళ్ళు వలసలు వెళ్ళే పరిస్థితి కలిపించడం సరియయింది కాదు

అనిపించింది..
ఈ రెండు ప్రజా సంఘాల పక్షాన అధికారులకు ప్రాతినిధ్యం చేసి వెంటనే తాగు నీటి సౌకర్యం కలిగించకపోతే మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు

చేస్తామని హెచ్చరించినాము.మానవ హక్కుల కమిషన్ కు భయ పడిన అధికారులు జియలాజిస్టులు సాధ్యపడదు అని చెప్పిన ఆ గుట్ట పైననే మరో బోరు

వేశారు.ఆ గిరిజనుల అదృష్టం ఏమో కానీ నీళ్ళు వచ్చినయి.తాత్కాలికంగా సమస్య తీరింది కానీ శాశ్వత ప్రరిష్కారం మాత్రం ఆడదస్నాపూర్ వాగు నుండే

అని అధికారులు గమనించాల్సిన అవసరం ఉంది.
అడవులు అంతరించిపోవడం వలన సంవస్తారానికి సంవస్తారానికి వర్షపాతం తగ్గి పోతున్నది.ఆదిల బాద్ జిల్లా లో ఈ సంవస్తారమ్ 50 శాతం వార్హాపాతం

తగ్గిపోయింది అని ఆధికారిక గణాంకాలే చెబుతున్నాయి.ఇప్పుడే ఈ పరిస్థితి ఉంటే ఏప్రిల్ మే మాసాలల్లో నీటి ఎద్దడి ఎంత అధ్వాన్నంగా ఉందనున్నదో

అధికారులు గమనించి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.ప్రతి సంవస్తారామ్ కేవలం శుభ్రమయిన మంచినీళ్లు లభించకనే వందలాదీ

అమయక గిరిజనులు ప్రాణాలు కోల్పోతున్నా విషయం ప్రభుత్వానికి తెలిసి కూడా ఇంత నిర్లక్షం వహిస్తున్నదంటే ఈ ప్రభుత్వాలు ప్రజల చేత,ప్రజల వలన

ప్రజల కొరకు ఉన్న ప్రభుత్వాలేనా అని ప్రజలు నిలదీసే రోజులు ఇంక ఎంతో దూరము లో లేవు.

Sunday, February 7, 2010

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం న్యాయమైన హక్కు.

మాయ మాటలు చెప్పుతూ తాము అక్రమంగా కూడబెట్టుకున్న ఆస్తుల విలువలు తగ్గి పోకుండా వీరిని కావచాలుగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఇప్పటికే కొందరు ఆంధ్ర ప్రాంతపు దళిత మేధావులు ,రచయితలు, కవులు ఆ తప్పుడు వాదనలను కొట్టిపారేసినారు.అయినప్పటికిని సమస్యల లోతుల్లోకి వెళ్ళి తరిచి చూస్తే వాళ్ళ వాదనలోని దొల్లా తనం ఇట్టే అర్థం అయిపోతుంది .
1)హైద్రాబాద్ లో ని తమ తమ ఆస్తులకు రక్షణ ఉండదనేది ఒక భయం.ప్రాథమిక హక్కుల్లోనే ఆస్తి హక్కు ఉంది.ఎవరైనా మన దేశంలో ఎక్కడైనా ఆస్తి కలిగి ఉండవచ్చు.బెంగుళూరులో తమకు ఆస్తులు ఉన్నవారు ఉన్నారు.హైద్రాబాద్ లో ఉన్నవారు ఉంటారు.వారి ఆస్తులను ఎవరుకూడ గుంజుకోని పోజాలరు.ఇది అనవసరమైన భయమే దప్ప ఇందులో ఏమాత్రం సత్యం లేదు.
2)రానున్న రోజుల్లో ఆంధ్ర పిల్లలకు విద్యా,ఉపాదీ అవకాశాలు ఉండవు అని.తెలంగాణలో పుట్టి ఇక్కడే చదువుకున్న పిల్లలకు అది వాళ్ళ హక్కు అవుతుంది.అందుకే గదా ఈ పోరాటాలు అన్నీ కూడా.కనుక అటువంటి భయాలు అవసరం లేదు.
3)ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే కృష్ణ,గోదావరి నీళ్ళను ఆంధ్రకు రానివ్వరు అప్పుడు ఆంధ్ర భూములు అన్నీ కూడా బీడు భూములు అవుతాయి అని.ఇది కూడా సామాన్య రైతులను మభ్య పెట్టడానికే.నదీ జలాల పంపిణీ ఒక శాస్త్రీయ పద్దతిలో ఎవరు ఎన్ని నీళ్లు ఉపయోగించు కోవాలో మన దగ్గర ఇదివరకే చాలా స్పష్టమయిన రాత కోతలతో ఒప్పందాలు ఉన్నాయి. అవి ఎవరు ఉల్లంఘించినా చట్ట సమ్మతం కాదు.నీళ్ళను గదిలో వేసుకొని తాళం వేసుకునేటివి గాదు .కనుక ఆంధ్ర ప్రాంతానికి ఎన్ని నీళ్ళు పోవాలో అన్ని పోతాయి. ఎవరు వాటిని ఆపలేరు.
అన్ని ఇలాగ న్యాయంగా జరిగే అవకాశం ఉంటే మా నేతలు అబద్దలు ఎందుకు చెబుతారు అనే ఆలోచన కొందరికి రావచ్చు.అదే మా బాధ కూడా. ఇంత వరదాక మాకు దక్క వలసిన వనరులను, అవకాశాలను కొందరు స్వార్థపరులు వాళ్ళ వ్యక్తిగత ఆస్తులుగా మర్చుకున్నారు .అలాంటి వాళ్ళ కోసమే సమయిక్య ఆంధ్ర ఉద్యమం నడిపిస్తున్నారు.సామాన్య ఆంధ్ర సోదరులతో మాకు ఎలాంటి తగాదా లేదు.మేము దౌర్జన్యం చేసే వాళ్ళం గాదు.మా అన్ని జిల్లాల్లో ఎన్నో గుంటూరు పల్లెలు,శ్రీరామ్ నగర్ లు ఉన్నాయి.ఇంత ఉద్యమం జరుగుతున్నా కూడా ఎక్కడ ఒక్క సమస్య లేకుండా వాళ్ళు మేము సమయిక్యంగా జీవిస్తున్నాము.వాళ్ళు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోరుతూ మాతో పాటు ఉద్యమిస్తున్నారు.
కనుక ఆంధ్రా సోదరులరా మా న్యాయమయిన హక్కుకు మీరు అడ్డు తగులకండి.ప్రజాస్వామిక వాదులు ఎవరైనా ఎప్పుడైనా lusers వైపే నిలిచిన ఉదంతాలు ఉన్నాయి .మేము కోల్పోయిన వాళ్ళం మాకు ఉద్యమం చేయాల్సిన అవసరం, నైతికత ఉన్నాయి.కాదు మీరు మతోనే ఉండాలని శాశించడం అనాయితికం.మాది రాజ్యాంగ బద్దమయిన హక్కు.సమయిక్యత అని చెప్పేవాళ్లది ఇంకా మా నోటి కాడి బుక్క మాకు దక్కకుండా గుంజుకొనే కుటిల యుక్తి
మాయ మాటలు చెప్పుతూ తాము అక్రమంగా కూడబెట్టుకున్న ఆస్తుల విలువలు తగ్గి పోకుండా వీరిని కావచాలుగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఇప్పటికే కొందరు ఆంధ్ర ప్రాంతపు దళిత మేధావులు ,రచయితలు, కవులు ఆ తప్పుడు వాదనలను కొట్టిపారేసినారు.అయినప్పటికిని సమస్యల లోతుల్లోకి వెళ్ళి తరిచి చూస్తే వాళ్ళ వాదనలోని దొల్లా తనం ఇట్టే అర్థం అయిపోతుంది .
1)హైద్రాబాద్ లో ని తమ తమ ఆస్తులకు రక్షణ ఉండదనేది ఒక భయం.ప్రాథమిక హక్కుల్లోనే ఆస్తి హక్కు ఉంది.ఎవరైనా మన దేశంలో ఎక్కడైనా ఆస్తి కలిగి ఉండవచ్చు.బెంగుళూరులో తమకు ఆస్తులు ఉన్నవారు ఉన్నారు.హైద్రాబాద్ లో ఉన్నవారు ఉంటారు.వారి ఆస్తులను ఎవరుకూడ గుంజుకోని పోజాలరు.ఇది అనవసరమైన భయమే దప్ప ఇందులో ఏమాత్రం సత్యం లేదు.
2)రానున్న రోజుల్లో ఆంధ్ర పిల్లలకు విద్యా,ఉపాదీ అవకాశాలు ఉండవు అని.తెలంగాణలో పుట్టి ఇక్కడే చదువుకున్న పిల్లలకు అది వాళ్ళ హక్కు అవుతుంది.అందుకే గదా ఈ పోరాటాలు అన్నీ కూడా.కనుక అటువంటి భయాలు అవసరం లేదు.
3)ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే కృష్ణ,గోదావరి నీళ్ళను ఆంధ్రకు రానివ్వరు అప్పుడు ఆంధ్ర భూములు అన్నీ కూడా బీడు భూములు అవుతాయి అని.ఇది కూడా సామాన్య రైతులను మభ్య పెట్టడానికే.నదీ జలాల పంపిణీ ఒక శాస్త్రీయ పద్దతిలో ఎవరు ఎన్ని నీళ్లు ఉపయోగించు కోవాలో మన దగ్గర ఇదివరకే చాలా స్పష్టమయిన రాత కోతలతో ఒప్పందాలు ఉన్నాయి. అవి ఎవరు ఉల్లంఘించినా చట్ట సమ్మతం కాదు.నీళ్ళను గదిలో వేసుకొని తాళం వేసుకునేటివి గాదు .కనుక ఆంధ్ర ప్రాంతానికి ఎన్ని నీళ్ళు పోవాలో అన్ని పోతాయి. ఎవరు వాటిని ఆపలేరు.
అన్ని ఇలాగ న్యాయంగా జరిగే అవకాశం ఉంటే మా నేతలు అబద్దలు ఎందుకు చెబుతారు అనే ఆలోచన కొందరికి రావచ్చు.అదే మా బాధ కూడా. ఇంత వరదాక మాకు దక్క వలసిన వనరులను, అవకాశాలను కొందరు స్వార్థపరులు వాళ్ళ వ్యక్తిగత ఆస్తులుగా మర్చుకున్నారు .అలాంటి వాళ్ళ కోసమే సమయిక్య ఆంధ్ర ఉద్యమం నడిపిస్తున్నారు.సామాన్య ఆంధ్ర సోదరులతో మాకు ఎలాంటి తగాదా లేదు.మేము దౌర్జన్యం చేసే వాళ్ళం గాదు.మా అన్ని జిల్లాల్లో ఎన్నో గుంటూరు పల్లెలు,శ్రీరామ్ నగర్ లు ఉన్నాయి.ఇంత ఉద్యమం జరుగుతున్నా కూడా ఎక్కడ ఒక్క సమస్య లేకుండా వాళ్ళు మేము సమయిక్యంగా జీవిస్తున్నాము.వాళ్ళు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోరుతూ మాతో పాటు ఉద్యమిస్తున్నారు.
కనుక ఆంధ్రా సోదరులరా మా న్యాయమయిన హక్కుకు మీరు అడ్డు తగులకండి.ప్రజాస్వామిక వాదులు ఎవరైనా ఎప్పుడైనా lusers వైపే నిలిచిన ఉదంతాలు ఉన్నాయి .మేము కోల్పోయిన వాళ్ళం మాకు ఉద్యమం చేయాల్సిన అవసరం, నైతికత ఉన్నాయి.కాదు మీరు మతోనే ఉండాలని శాశించడం అనాయితికం.మాది రాజ్యాంగ బద్దమయిన హక్కు.సమయిక్యత అని చెప్పేవాళ్లది ఇంకా మా నోటి కాడి బుక్క మాకు దక్కకుండా గుంజుకొనే కుటిల యుక్తి
ప్రత్యేక రాష్ట్రం గా తెలంగాణ ఏర్పడితే ఆంధ్ర ప్రాంతపు సామాన్య ప్రజానీకానికి కస్టాలు నస్టాలు ఎనలేనివిగా ఉంటాయని కొందరు సీమంధ్ర నేతలు అబద్దపు మాయ మాటలు చెప్పుతూ తాము అక్రమంగా కూడబెట్టుకున్న ఆస్తుల విలువలు తగ్గి పోకుండా వీరిని కావచాలుగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఇప్పటికే కొందరు ఆంధ్ర ప్రాంతపు దళిత మేధావులు ,రచయితలు, కవులు ఆ తప్పుడు వాదనలను కొట్టిపారేసినారు.అయినప్పటికిని సమస్యల లోతుల్లోకి వెళ్ళి తరిచి చూస్తే వాళ్ళ వాదనలోని దొల్లా తనం ఇట్టే అర్థం అయిపోతుంది .
1)హైద్రాబాద్ లో ని తమ తమ ఆస్తులకు రక్షణ ఉండదనేది ఒక భయం.ప్రాథమిక హక్కుల్లోనే ఆస్తి హక్కు ఉంది.ఎవరైనా మన దేశంలో ఎక్కడైనా ఆస్తి కలిగి ఉండవచ్చు.బెంగుళూరులో తమకు ఆస్తులు ఉన్నవారు ఉన్నారు.హైద్రాబాద్ లో ఉన్నవారు ఉంటారు.వారి ఆస్తులను ఎవరుకూడ గుంజుకోని పోజాలరు.ఇది అనవసరమైన భయమే దప్ప ఇందులో ఏమాత్రం సత్యం లేదు.
2)రానున్న రోజుల్లో ఆంధ్ర పిల్లలకు విద్యా,ఉపాదీ అవకాశాలు ఉండవు అని.తెలంగాణలో పుట్టి ఇక్కడే చదువుకున్న పిల్లలకు అది వాళ్ళ హక్కు అవుతుంది.అందుకే గదా ఈ పోరాటాలు అన్నీ కూడా.కనుక అటువంటి భయాలు అవసరం లేదు.
3)ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే కృష్ణ,గోదావరి నీళ్ళను ఆంధ్రకు రానివ్వరు అప్పుడు ఆంధ్ర భూములు అన్నీ కూడా బీడు భూములు అవుతాయి అని.ఇది కూడా సామాన్య రైతులను మభ్య పెట్టడానికే.నదీ జలాల పంపిణీ ఒక శాస్త్రీయ పద్దతిలో ఎవరు ఎన్ని నీళ్లు ఉపయోగించు కోవాలో మన దగ్గర ఇదివరకే చాలా స్పష్టమయిన రాత కోతలతో ఒప్పందాలు ఉన్నాయి. అవి ఎవరు ఉల్లంఘించినా చట్ట సమ్మతం కాదు.నీళ్ళను గదిలో వేసుకొని తాళం వేసుకునేటివి గాదు .కనుక ఆంధ్ర ప్రాంతానికి ఎన్ని నీళ్ళు పోవాలో అన్ని పోతాయి. ఎవరు వాటిని ఆపలేరు.
అన్ని ఇలాగ న్యాయంగా జరిగే అవకాశం ఉంటే మా నేతలు అబద్దలు ఎందుకు చెబుతారు అనే ఆలోచన కొందరికి రావచ్చు.అదే మా బాధ కూడా. ఇంత వరదాక మాకు దక్క వలసిన వనరులను, అవకాశాలను కొందరు స్వార్థపరులు వాళ్ళ వ్యక్తిగత ఆస్తులుగా మర్చుకున్నారు .అలాంటి వాళ్ళ కోసమే సమయిక్య ఆంధ్ర ఉద్యమం నడిపిస్తున్నారు.సామాన్య ఆంధ్ర సోదరులతో మాకు ఎలాంటి తగాదా లేదు.మేము దౌర్జన్యం చేసే వాళ్ళం గాదు.మా అన్ని జిల్లాల్లో ఎన్నో గుంటూరు పల్లెలు,శ్రీరామ్ నగర్ లు ఉన్నాయి.ఇంత ఉద్యమం జరుగుతున్నా కూడా ఎక్కడ ఒక్క సమస్య లేకుండా వాళ్ళు మేము సమయిక్యంగా జీవిస్తున్నాము.వాళ్ళు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోరుతూ మాతో పాటు ఉద్యమిస్తున్నారు.
కనుక ఆంధ్రా సోదరులరా మా న్యాయమయిన హక్కుకు మీరు అడ్డు తగులకండి.ప్రజాస్వామిక వాదులు ఎవరైనా ఎప్పుడైనా lusers వైపే నిలిచిన ఉదంతాలు ఉన్నాయి .మేము కోల్పోయిన వాళ్ళం మాకు ఉద్యమం చేయాల్సిన అవసరం, నైతికత ఉన్నాయి.కాదు మీరు మతోనే ఉండాలని శాశించడం అనాయితికం.మామాది రాజ్యాంగ బద్దమయిన హక్కు.సమయిక్యత అని చెప్పేవాళ్లది ఇంకా మా నోటి కాడి బుక్క మాకు దక్కకుండా గుంజుకొనే కుటిల యుక్తి .