Wednesday, June 30, 2010

ఉపాధి హామీ ఒక పెద్ద మాయ

ఊపాధి హామీ పథకం అమలు తీరులో అనేక అవినీతి జరుగుతున్నట్లుగా సోసియల్ ఆడిట్ లో తేలడంతో బాటుగా మీడియా లో కూడా ఎన్నో నిజాలు
బయటకు వస్తున్న కూడా అది ఎందుకు కొనసాగుతున్నదో కొంచం లోతుగా ఆలోచిస్తే చాలా విషయాలు అర్థం అవుతున్నాయి

ప్రత్యక్షంగా గమనించిన ఒక సంఘటన చెపుతాను.
ఒక రోజు కూలి మరో సహచరునితో అంటున్న విషయం ఇది.

ఆరేయ్ మనం తీసుకుంటున్న డానికంటే సర్పంచ్ తీసుకుంటున్నది ఎన్నో రెట్లు ఎక్కువ తెలుసా?
అట్లా ఎట్లా?
మనం పొద్దటి నుండి పొయ్యే దాకా ఎంతపని చేసినమో టెక్నికల్ అసిస్టెంట్ అనే అతడు లెక్క తీస్తాడు.
తీస్తే?
మనకు 100 రూపాయలు ఇవ్వాలంటే మనం చేసినంత పనికే లెక్క తీస్తీ సరిపోదు.
మరి?
మనం ఉదయం 7 నుండి 11 గంటలదాకా పనిజేస్తే ఇన్ని కూబిక్ మీటర్ల మట్టి తీస్తేనే మనకు 100 రూపాయాలు ఇవ్వాల్సి ఉంటుంది.కానీ ఇక్కడ
జరుగుతున్నది ఏమంటే మనం 8 గంటల్కు వచ్చి 11 గంటలకు వెళ్ళి పోతున్నాము.ఈ రెండు గంటలు కూడా సరిగ్గా వంగి పనిచేసింది లేదు.
ఆడుతుపాడుతూ మనం చేస్తున్న పనికి వాళ్ళు 100 రూపాయలు ఇస్తే మనం సంతోష పడుతున్నాము.కానీ మనం తీయవలిసినంత మట్టి
తీసినట్టు ఆ మట్టిని వాళ్ళు ట్రాక్టర్ల తోటి చేరవేసినట్టు రాసుకొని వెయిల రూపాయలు అప్పనంగా తీసుకుంటున్నారు.
అక్కడే ఉన్న మరో మిత్రుడు అవునురా మనం ఏమిచేయకుండానే 100 రూపాయలు తీసుకుంటున్నప్పుడు వాళ్ళు మాత్రం చేతులు మూసుకొనే
ఉండరు కదా? అంటూ అది గట్లనే నడుస్తాధి గాని మనకెందుకురా.ఎట్లా బతికేటోడు గట్లనే బతుకుతడు అన్నడు.
ఇది దేనికి సంకేతం?
కూలీలతోటి చిన్న తప్పు చేయించి పడ్డ పెద్ద తప్పులను ప్రశ్నించకుండా ప్రజల నోరుమూయించడమే.
మరో కుట్ర ఏమిటంటే ఈ ఉపాధి హామీ పథకం తో వ్యవసాయ పనులకు కూలీలు దొరుకాక చిన్న చిన్న రైతులు వ్యవసాయాన్ని వదలి పట్టణాలకు
వలసలు వస్తున్నారు. క్రమంగా ఇక్కడి వ్యవసాయాన్ని దెబ్బ తీసి ఈ భూముల్లో ఉన్న ఖనిజ వనరులను అన్నింటిని సంపన్న దేశాలు దోచుకుని పోయే
కుట్రలో ఒక భాగమే ఈ పథకాల వెనుక ఉన్న సదుద్దేశం.అమెరికా ప్లానింగ్ సలహా దారు జాన్ డెజ్ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకాన్ని పకడ్బందీగా
అమలు పర్చాలని తద్వారా పేదరికం పోతుంది అంటున్నాడు.భారత పాలకులు సైతం వీలయినత వేగంగా దేశం లో ఉన్న ఖనిజ సంపదను సంపన్నులకు
దోచిపెట్టేదానికి పోటీ పడుతున్నారు.
మేధావులు,విజ్ఞులు అయిన దేశభక్తులు భావి తరాలకోసం మన వనరులను తరలిపోకుండా కాపాడుకోవాలని గుర్తుంచ వలసిన ఆవశ్యకత ఎంతగానో ఉంది

Monday, June 28, 2010

విలువల తో కూడిన విద్యా

ఈ రోజు ఒక సదస్సు కు హాజరైతే విలువలతో కూడిన విద్యా ఆవశ్యకత అనే అంశం పైన చర్చ జారింగింది.అయితే విలువల కు నిర్వచనం ఏమిటి?
ఒక్కొక్క సమాజంలో ఒకో విలువ ను జనం ఆమోదించారు.ఆదిమ సమాజం లో ,గణా లల్లో ,రాచరిక .గణతంత్ర,ప్రజాస్వామ్య,పెట్టుబడి దారి,
ఇలా ఒక్కో సమాజం లో విలువలకు నిర్వచనం వేరు వేరు గా ఉంటూ వచ్చాయి. కానీ అంతిమంగా మనిషిని మనిషిగా గుర్తించి,అందరికీ ఉన్న
వనరులు సమానంగా దక్కలనేది ప్రధానం.
అయితే సడసూ లో పాల్గొన్న వాళ్ళు వివిధవృత్తుల్లో ఉన్నవాళ్ల అవినీతి గురించి వాళ్ళు తమ తమ బాధ్యతలను ఎలా విస్మటిస్తున్నారో చెప్పుకొచ్చారు.ఒక రోజుకులి పనికి ఆహార పతాకం లో ఎలా పని ఎగ్గొడుతున్నాడో,సూపర్విసార్లు ,ఇంజనీర్లు,ప్రజాప్రతినిధులు ఇలా ప్రతిస్తాయిలో ఎలా అవినీతి జరుగుతున్నదో ఉదాహరణల్తో బాటుగా ఉపన్యసించారు.
దానికి పరిష్కారంగా భారత రామాయణాలను చదువుకొని అలా ప్రవర్తించాలని సలహాలను ఇచ్చారూ.భారత రామాయణాల కాలం ఈ కాల్మ్ ఒక్కటి కాకపోయినా అంతకంటే వారికి వేరే ప్రత్యమ్న్యాయమ్ ఏమీ కనిపించలేదు.
ప్రస్తుత సమాజం లో మానవ శ్రమ,వస్తు ఉత్పత్తి,వస్తు వినిమయం సమాజాల అవసరాలకు అనుగుణంగా కాకుండా మార్కెట్టులో డిమాండ్ ను బట్టి వచ్చే లాభాలను దృస్తీలో పెట్టుకొని జరుగుతున్నది.వస్తువు తయారీ అమ్మకం కొనడం అనేవి లాభాలతో కూడుకున్న వ్యవహారం.లాభాలు అంటే అక్కడ ఇక లాభ్ నీటే ఉంటుంది తప్ప మరోటి ఉండదు, అలాంటప్పుడు ఏమీ నీటి.ఏమీ విలువలు అమలులో ఉంటాయో పెద్దగా ఆశించ లెము.గొంగట్లో తింటూ వెంట్రుకలను ఏరివేసి నట్లు.
మన ఆర్థిక వేత్తలు రాజకీయ నాయకులు చెప్పుతున్నట్టుగా పెట్టుబడులు భాతీగ వస్తీనే ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయంటున్నారు ణఋ. పెట్టుబడులు అంటేనే లాభాలు,లాభాలు అంటేనే అవినీతి,మరి అలంతాప్పుడు ఏమీ విలువలుయను మనం ఆశించ వచ్చునో చూడాల్సి ఉంది.
ఏ సమాజాని కయినా ఆర్థిక వ్యవస్తా పునాది అనుకుంటే ఆ పునదిని కాపాడదానికి పైకప్పు అంటే ఉపరితల అంశాలయిన విద్యా సంస్కృతి కళలు అన్నీ కలిసి పునదిని కపాదుతాయి.పైకప్పు పునాదిని కాపాడుతుంటే పునాది ఉపరితలాన్ని పడిపోకుండా కాపాడినట్లే ప్రస్తుత వ్యవస్తాలౌ ఉన్న చట్ట సభలు ,న్యాయస్తానలు,రాజ్యాంగం ,మీడియా అన్నీ ఒక దానితో ఒకటి సహకరించుకొని ఈ వ్యవస్తాను ఇలాగే కొనసాగడానికి పరస్పరం సహకరించుకొంటు ఉంటాయి.
మరి పరిష్కార మార్గాలు లేనే లేవా?

ఈ దోపిడీ పునాదులను కూల్చకుండా ఏవిలువలను ఆశించలేము.