Tuesday, March 23, 2010

దొంగే,దొంగా దొంగా అని అరిచినట్లు.

ఈరోజు పత్రికలల్లో నీటిని పొదుపుగా వాడుకోవాలి అని పెద్ద పెద్ద వాళ్ళు అంతా గొప్పగా ప్రకటనలు ఇచ్చారు .అది చూసిన తర్వాత ఒక ఆవేదనతో లోతట్టు ప్రాంతాలల్లో ప్రజలు నీళ్ళు మాత్రమే గాదు ప్రతిది ఎంత పొదుపుగా వాడుకుంటారో ఈ పెద్దమనుషులకు తెలుసునా అని అనిపించింది.
ఉన్న ఊరిపక్కనుండే ఒక నాటి జీవనదులు పారుతున్నా.ఊరిలో మాత్రం బావుల్లో,బోరు బావుల్లో చుక్కనీరు దొరుకదు .అరమైలు ,మైలు దూరం నడిచి కున్డెడు నీళ్ళు నెత్తి మీద చుట్ట బట్ట పెట్టుకోని కింద కాళ్ళు చుర్రు చుర్రు మని కాలుతుంటే పైన కుండ బరువుతో బాటు ఎండ వేడి కొర్రాయి తీరు కాలుస్తుంటే అపురూపంగా తెచ్చుకున్న నీళ్ళు ఎంత భద్రంగా దాచుకొని వాడుకుంటారో చూసిన వాళ్ళకు తెలుస్తుంది.అవసరం అయితేనే గిలాసేడు నీళ్ళు తాగుతారు.ఆరోగ్యానికి మంచిది మంతెన సత్యనారాయ న రాజు చెప్పినాడు అని లీటర్ల కొద్ది నీళ్ళు తాగరు,
ఇక స్నానం అంటారా ఇంత ఉడుకపోతలో గూడ రోజూ స్నానం చేయడానికి వాళ్ళు సాహసించరు.నాగరికులు ఆనుకొనే వాళ్ళు రెండు పుటల స్నానం చేయందే వారికి నిద్ర పట్టదు ,వాళ్ళకు ఉండే బట్టలు మహా అయితే రెండు జతలు.వాటిని నీళ్ళల్లో పిండుకొని ఆరేసుకుంటారు.సబ్బు పెట్టి ఆ సబ్బు అంతా పోయే దాకా నీళ్ళల్లో పిండడం ఉండదు.నాగరికుల స్నానాలకు టబ్బులు నిండాలి వాటి నిండా సబ్బు నురగ ,ఆ నురగ పోయేదాక శుబ్రమయిన నీళ్ళతో స్నానం చేస్తే వాళ్ళకు స్నానం చేసినట్లు.వాల్ల బట్టలు ఉతికి చలువ చేసేవరకు ఎన్ని నీళ్ళయిన ఖర్చు చేస్తారు ఎందుకంటే వాళ్ళకు అవి కొనుక్కునే కొనుగోలు శక్తి ఉంది. ఆలాంటి వాళ్ళకు మన రాజ్యాంగం అన్నీ అందుబాటులో ఉంచుతుంది.అది ఎట్లా?సహజ వనరులు కేవలం వాళ్ళ స్వోంతమా అని అన్నవా?నీవు మావోయిస్టువు అంటారు.వాస్తవానికి ఈ నాగరికులు ఇట్లాగే ఈ వనరులను విచ్చలవిడిగా వాడుతూ పోతూ ఉంటే వాళ్లకుయ మరియు రానున్న తరాలకు సహజవనరులు అనేవి మన దగ్గర మిగిలి ఉండవు.నాగరికులు ఆదర్శంగా చెప్పుకుంటున్న అమెరికా తన సహజ వనరులను తన వాటిని అలస్కా లాంటి చోట అట్టీ నిలువ చేసుకుంటున్నది.సరే మనలాంటి వారికి అమెరికా ఆదర్శం కాదు గాని,ఎవరయితే వనరులను విచ్చలవిడిగా వాడుకుంటున్నారో వాళ్ళే పొదు పు గురించి చెప్పడమే హాస్యాస్పదంగా ఉంది.

Monday, March 22, 2010

ఆలస్యం చేస్తే అంతా అయిపోతుంది.

కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాలను వేరు చేస్తూ ప్రవహించే నది గోదావరి.మహారాస్ట్రా లోని నా సిక్ వద్దపుట్టిన ఈ నది అదిలాబాద్,నిజామాబాద్,కరీంనగర్,వరంగల్,ఖమ్మం,ఉభయ గోదావరి జిల్లాలగుండ ప్రవహించి సముద్రంలో కలుస్తున్నది .జీవధారము నీరము అన్నట్లుగా ఈనది ప్రవహిస్తున్నమేరపాడిపంటలతో నేల పరవశించింది .ప్రజలు ఆనందంగా జీవించేవాళ్లు .నదిని ఆనుకొని ఉన్నగ్రామాలకు ఈ నీరు పెద్ద వనరు .పశువులకు పంటలకు పక్షులకు ఇట్లా మనుషుల మనుగడకు మానవెతిహాస నిర్మాణానికి ఈ నదినీళ్లకు అవినాభావ సంభందము ఉన్నది.
నా అనుభవంలోని ఒక సన్నివేశం ఇక్కడ ప్రస్తావిస్తాను. ఆదిలాబాద్ జిల్లా జైపురం మండలం ను అనుకోని ప్రవహిస్తున్న నది ఒడ్డు పల్లెల్లో ఎట్లా ఉండేదో నేను ప్రత్యక్షంగా చూసిన సంగతులు ఏమిటంటే ఈ నది వాళ్ళ తాత ముత్తాతల నుండి జీవ నదిగా చూస్తున్నారు.వర్షాకాలం లో నే కాకుండా అన్నీకాలాలో నదినిండా నీళ్ళు ఆనీళ్ళల్లో స్నానాలు ఈతలు ఆటలు చేపలు రొయ్యలు అన్నీ ఆనందగా అనుభవించిన జ్ఞాపకాలు. ఎండాకాలం లో నదిలోనీళ్ళు కొంతా తక్కువగా ఉంటున్నాందున ఎండకు నీళ్ళు వేడిగా అయ్యేటివి అయితే రొయ్యలు నీళ్లమడుగుల్లో లోతుకు వెళ్ళి బండల వెంట చల్లగా విశ్రాంతి తీసుకొనేటివి.ఈతగాళ్లు నీళ్ళల్లోకి మునిగి బండల వెంట ఉన్న రొయ్యలను పట్టుకొని తెచ్చేవాళ్లు.ఎండాకాలం చేపలు,రొయ్యలు తిన్నన్ని దొరికేటివి .
మరి ఇపుడు ఏమయ్యింది?అసలు గోదావరిలో నీళ్లే లేవు మొత్తం ఎండిపోయింది.అంతకు ముందు ఎప్పుడన్న ప్రవాహం ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి కానీ ఇప్పటిలాగా మొత్తానికి మడుగులు కూడా ఎండిపోయిన సందర్భాలు అసలు లేవు.గోదావారిలో చెక్ బాల్ తో 20 ఫీట్ల లోతు బొర్లు వేస్తే నీళ్ళు వస్తున్నాయి. గోదావరి ఒద్దెంబడి గ్రామాలల్లో కరంటూ ఉంటేనే నీళ్ళు కనిపిస్తాయి.ఒక వైపు వర్షాలు లేవు మరోవైపు గోదావరిలోని ఇసుక తోడుకొని పోతున్నారు మరో వైపు ఆదిలాబాద్.కరీంనగర్,వరంగల్.ఖమ్మం జిల్లాలల్లో ఓపన్ కాస్ట్ ఘనులపేరుతో 500 మీటర్ల లోతుల్లోనుండి బొగ్గుతీసే పేరుతో భూమి పొరలను పెల్లగిస్తున్నారు.భూగర్భ జలాలు మొత్తానికే అడుగంటి పోయినాయి.తా గడానికి గుక్కెడు నీళ్ళు దొరుకని పరిస్థితి.ఇది ఏమీ అభివృధి ఎవరి అభివృధి ఆవిరికోసం ఈ అభివృధో అసలు అర్థం కావడం లేదు.అభివృధి పేరుతో ఇసుక,బొగ్గు తరలించుక పోతున్నారు,ప్రజలను వాళ్ళ భూములల్లోనుండి తరిమి వేస్తున్నారు తాగడానికి కూడా నీళ్ళు దొరుకని పరిస్థితి.మానవ మనుగడకే ప్రమాదం ముంచుకొని వస్తున్నది .ఇది పాలకులు సృస్టిస్తున్న విపరీత పరిస్థితి .దీన్ని విజ్ఞులయిన వాళ్లు అంతా ఎదిరించాలి

Wednesday, March 3, 2010

చట్టాలు ఎవరికి రక్షణగా నిలుస్తున్నాయి?

చాలా రోజుల తర్వాత మళ్ళీ కోర్ట్ కు వెళ్ళడం జరిగింది,3వ అదనపు సెస్సియన్ కోర్ట్ లో కూచున్నాను.జడ్జ్ ఆదేశం మేరకు ఐదుగురు ముద్దాయిలను ప్రవేశ పెట్టారు.అభియోగం ఏమిటంటే ఎలక్ట్రిసిటీ ట్రాన్స్ ఫారం లోని కాపర్ వైర్ దొంగిలించారు.ఎలక్ట్రి సిటీ అధికారులు,పోలీస్ అధికారులు కోర్ట్ కు వచ్చినారు.వాంగ్మూలం ఇచ్చారు.బహుశా శిక్ష కూడా పదే అవకాశం ఉన్నట్లే అనిపించింది.ఆ ఆరుగురు కలిసి దొంగలించిన సొత్తు మహా అయితే ఐదు వేల రూపాయల విలువ చేస్తుంది కావచ్చు.భారత శిక్షా స్మృతిలో ఎవరు తప్పు చేసిన శిక్ష పడవలసినదే.
బార్ అసోసియేషన్ లో స్క్రోలింగ్ లో హైద్రాబాద్ సెంట్రల్ షాప్ 2.80 కోట్ల పన్ను కట్టనందున షాప్ మూసివేశారు.అంతే.ఉద్దేశ పూర్వకంగా అన్నీ కోట్ల రూపాయలు సంవస్తారాల తరబడి కట్టక పోతే సింపుల్ గా దుకాణానికి తాళం వేశారు.రెండు సంధార్భాలలో న్యాయం సమంగా పాటించబడినట్లు అనిపించ లేదు.
అలాగే మరో సంఘటన కూడా నాకు చాలా బాధ కలిగించింది.కరీంనగర్ పక్కన్నే బద్దిపల్లి అని ఒక గ్రామం ఉంది.కరీంనగర్ చుట్టుపక్కల అన్నీ గుట్టలు ఉన్నాయి. చాలావరకు ఆ భూములన్నీ కూడా ప్రభుత్వ భూములే.ఇంతవరదక ఆ భూముల్లో గ్రామస్తులు పశువులను గడ్డి మేపుకునే వారు.శీతకాలం లో గుట్టలపైనా కాసె సీతాఫలం పండ్లను కోసుకొని తినేవారు.ఇండ్ల నిర్మాణానికి అవసరమైన బండ రాళ్లను పగుల గొట్టి తెచ్చుకునే వాళ్ళు.ఆ గుత్తలు ఆ గ్రామస్తుల సమిస్టీ ఆస్తి గా పరిగ నించే వాళ్ళు.కానీ ఆ బండ రాళ్ళు మామూలు రాళ్ళు కాదు గ్రానైట్ రాళ్ళు అని తేలడం ప్రస్తుతం ఆ ఊరికి శాపం అయింది.అధికార,ప్రతిపక్ష నాయకమన్యుల అనుచరగణలు తమకున్న పరపతిని ఉపయోగించుకొని గ్రానైట్ తవ్వకాలకు అనుమతి పొంది చుట్టూ కంచే వేశారు.పెద్ద పెద్ద పోక్లైన్ లతో తవ్విస్తూ గ్రానైట్ ను తరలించుక పోతున్నారు.ఇంతవరదాక ఆ ఊరి సమిస్టి సంపద గా ఉన్న ఆ గుట్టలు కొద్ది మందికి సంపదగా మారిపోయింది.సరే అది కూడా అభివృద్ది యే గదా అంటారేమో.కానీ ఆ ఊరి పశువులకు తిరిగేదానికి జాగా లేకుండా పోయింది.రేప్ రేపు ఇండ్లూ కట్టుకోవడానికి బండ రాళ్ళు కరువై పొనున్నాయి.అన్నిటికంటే ఆ గ్రామం లో ఈ గుట్టలను పెకిలించి తవ్వి తీయడం మూలాన భూగర్భ జలాలు అడుగంటి తగు నీరు సాగు నీరుకు కరువు వచ్చే పరిస్థితి దాపురించింది.అవి గ్రానైట్ రాళ్ళు కావడం ఆ ఊరి ప్రజలు చేసుకున్న పాపమా?సరే ప్రకృతి వనరులను వాడుకోవడం వల్లనే కదా అభివృధి అనియంటే మరి ఆ గ్రామ ప్రజ్లకు దక్కుతున్నది ఏమీలేదుకదా?ఇది ఎవరి అభివృధి అవుతున్నది అబు ఆ గ్రామస్తులు అడుగుతున్నారు కానీ వారికి జవాబు చెప్పేవాళ్లే ఎవరు కనినిపించడం లేదని ఆ గ్రామస్తులు వాపోతున్నారు.
ఎవరి సంపద ఎవరి జేబుల్లోకి వెల్లుతున్నది,ఎవరు దొంగలు ఎవరు దోపిడీలు చేస్తున్నారు ఎవరు జైళ్ళలోకి వెళ్లాలి.మన చట్టాలు ఎవరిని జైళ్ళలోకి పెంపుతున్నాయి.మన అధికారులు మన పోలీస్ లు ఎవరికి రక్షణగా నిలుస్తున్నాయి ఆలోచిస్తే రాజ్యం స్వభావం ఇంతేకదా అనిపిస్తున్నది.