Thursday, January 6, 2011

తెలంగాణ వచ్చేదాక తెగించి పోరాడుదే!

తెలంగాణ ప్రజల ఆకాంక్షాకు వ్యతిరేకంగా శ్రీకృష్ణ కమిటీ నివేదిక మనమంతా భయపడినట్లుగా వ్యతిరేకంగానే వచ్చింది. సంవాస్తర

కాలంగా వాళ్ళు తిరిగి కొత్తగా చెప్పింది ఏమీ లేదు. సామాన్య జనాలు ఏదయితే తమ తమ సంభాషణలల్లో ఏవయితే పరిష్కారాలు

చూపినారో అవే పరిష్కారాలు ఈ మేతావులు చెప్పినాయి.

1).ఆంధ్ర ప్రదేశ్ రాస్త్రాన్ని యధాతథంగా కొనసాగించడం.

2).తెలంగాణ, సీమాంధ్ర రాష్ట్రాలుగా విభజించడం.హైద్యాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంచడం.

3)హైద్రాబాద్ రాజధానిగా రాయల తెలంగాణ.కోస్తాంధ్ర రాష్ట్రాల ఏర్పాటు.

4) హైద్రాబాద్,రంగారెడ్డి,మేదక్,మహబూబ్నగర్,నల్గొండ జిల్లాలతో హైద్రాబాద్ కేంద్రపాలిత ప్రాంతంగా చేసి,సీమాంధ్ర,తెలంగాణ రాష్ట్రాల

ఏర్పాటు.

5) హైద్రాబాద్ రాజధానిగా తెలంగాణ రాష్ట్రం,సీమాంధ్ర రాష్ట్రనికి కొత్త రాజధాని నిర్మించడం,

6)మూడు ప్రాంతాలల్లో వెనుక బడిన ప్రాంతాల అభివృద్ధికి రాజ్యాంగ బద్ధ బోర్డులు ఏర్పాటు జెసి రాష్ట్రాన్ని యధావిధిగా కొనసాగించడం.

మొదటి మూడు పరిష్కారాలు ఆచరణ సాధ్యం కాదు అని కమిటీయే అభిప్రాయం చెప్పింది.4వ పరిష్కారం కూడా ప్రజలు

ఆమోదించక పోవచ్చు అని కమిటీ అబిప్రాయ పడింది.5వ పరిష్కారం లో మావోయిస్టుల ప్రాబల్యం పెరుగుతుంది అని మరియు రాష్ట్ర

పాలనకు సరిపోయినంత రెవెన్యూ రాదు అని చెప్పింది.ది బెస్ట్ పరిష్కారం 6వ ది అని చెప్పింది.ఇది ఎంత అన్యాయం.నక్సలైట్లు

పుట్టుక వచ్చింది సమయిక్య రాష్ట్రం లోనే. ప్రజా సమస్యలు సరిగా పరిష్కరించని కారణంగా రాజ్యాంగం లోని ఆర్టికల్ 39 ప్రకారం

సంపద,అధికారం ఒక్క చోటనే కెంద్రీకృతం కాకుండా చూడాలన్న సూత్రానికి వ్యతిరేకంగా ఒక చంద్ర బాబు, ఒక రాజశేకర్ రెడ్డి సంపద

అంతా ఒక్క చోట కొద్ది మందికి చెందే విధంగా చట్టాలను చేసి అధికారం తో ప్రజలకు,రాజ్యాంగానికి వ్యతిరేకంగా పాలించిన దాని

ఫలితంగా నక్సలిసమ్ వచ్చిందే గాని వాళ్ళకు వాళ్ళుగా పుట్టుకొని రాలేదు.పుట్టుకతో ఎవరు కూడా నక్సలైట్లు కాదు. నక్సలైట్లు

గా మారిపోదాం అని అవరుకూడా కోరుకోరు అందరికీ అన్నీ సమానంగా దొరికినపుడు.అంటే ఆ బూచి చూపి తెలంగాణాను అడ్డుకోవాలని

చూస్తున్నారు తెలంగాణ వనరులను కొల్లగొట్టాలని కాచుక కూచున్న వాళ్ళు.చివరి పరిష్కారం 1956 నుండే పెద్దమనుషుల ఒప్పందం,

ఆరుసూత్రాల పథకం,గిర్గ్లాని కమిటీ,ఆరువందల పది జీవో,అన్నీ ఎలా విఫలమైనవో చూసిన తర్వాతకూడా తెలంగాణ ప్రజలు ఈ

పరిష్కారాన్ని ఎంతమాత్రం ఒప్పుకోరు. ఇక అంతిమంగా నాలుగు కోట్లమంది తెలంగాణ ప్రజలు కోరుకొంటున్నది ప్రత్యేక తెలంగాణ

స్వపరిపాలన,స్వాభిమాన రక్షణ, అందుకు మార్గం ఒకటే అది సమైక్యంగా ఉద్యమించదమే.రాజకీయ పార్టీలు ఇంకా మీన మేశాలు

లెక్కబెడుతూ కూచున్టే ప్రజలు తరిమే కోడుతరో లేక వాళ్ళకు అవకాశం వచ్చినపుడే చూసుకుంటారో వాళ్ళే తేల్చుకుంటారు.