Wednesday, May 18, 2011

మాయమై పోతున్న మనిషి

మనిషి మాయమైతుంటే ఎవరి బాధ్యత ఎంత?

గల్లీ నుంచి డిల్లీ దాకా అందరూ ఒకేమాట అంటున్నారు.మానవత్వపు విలువలు మంటగలిసి పోతున్నాయని, మణిశన్న వాడు మాయమైపోతున్నాడని తరతమ భేదం లేకుండా

అంతా ఒకటే విమర్శ చేస్తున్నారు.ఇది నిప్పంతా నిజం.ఇట్లా ఎందుకు జరుగుతున్నది మరి.ఇప్పుడున్న మానవ ఇతిహాస చరిత్ర కు దాదాపు ఐదు వేల సంవస్తారాల వయసున్నదని

అంటున్నారు .ప్రకృతి మానవ నాగరికత అనేక మార్పులకు గురి అయింది.కానీ అది అంతా కూడా అభివృద్ధి వైపు సాగింది.అసలు అభివృద్ధి అంటే ఏమిటి అనేది కూడా ఒక ప్రశ్న.

తత్వ శాస్త్రం లో ఒక ఉదాహరణ ఉంది. ఒక వడ్ల గింజో,లేదా ఒక మక్కా గింజో మట్టి లో నాటితే ఒక మొలక వస్తుంది. అది గింజ కంటే గూడా ఉన్నతమయింది ఎందుకంటే రేపు

అది ఇలంటే ఎన్నో గింజలకు తొలి రూపం కనుక. ఆమోలుక పెద్దవెరిగి దాని కడుపులో నుండి ఒక కంకిని ఇస్తుంది. ఆ మొక్క కూడా నశించి చారెడు ధాన్యానికి జన్మనిస్తుంది.

గింజ, మొక్క నాశిస్తున్నా గూడా అంతకంటే ఉన్నతమయిన అంటే ఒక్క గింజ నుండి చారెడు ధాన్యం వస్తుంది కనుక అది అభివృధ్కి నిదర్శనం అయ్యింది.భూమికి గాని ప్రకృతికి గాని

ఎక్కడ నస్టమ్ జరుగలేదు. ఇదే చర్యను అక్కడే పదే పదే చేసినా జరిగేది అభివృద్ధియే గాని అంతకంటే ఏమీ గాదు .ఇన్ని వేల సంవస్తారాల నుండి జరుగుతున్నది అదే అయినా

సాంకేతిక పరిజ్ఞానం పెంచుకున్న మనిషి అత్యాశకు లోనై ఎక్కువ సౌఖ్యాలు తక్కువ కాలం లో అనుభవించాలన్న దురాశతో ప్రకృతి విధ్వంసానికి పూనుకుంటున్నాడు.అడవులు పోతే సరే

మళ్ళీ చెట్లు నాటుకుందామ్ గుట్టలు,పర్వతాలు, భూగర్భ నిక్షేపాలన్నీ విచక్షణా రహితంగా వినియోగించుకోవడం ద్వారా మనుషుల అవసరాలకంటే సంపద అధికంగా సృస్టించ బడుతున్నది

అది గూడా కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతమై ఉండడం మూలాన ప్రస్తుత అభివృద్ధి నమూనా ఫలితాలు విచ్చల విడిగా వారు అనుభవిస్తున్నారు. తక్కిన జనాలకు కూడా అదే ఆదర్శం అని

సిద్ధాంతీకరిస్తున్నారు. ఆ వెంపర్లాటలో ఆ పెనుగు లాటలో నీవు సాటి మనిషిని వెనక్కి నెత్తితే తప్ప లేదా సాటి మనిషికంటే ముందు పరిగెడితే తప్ప నీవు సక్సెస్ కాలేవు అని వ్యక్తుత్వ

వికాసపు పాఠాలు చెప్పుతున్నా మేధావులే మణిశన్న వాడు మాయమై పోతున్నాడని వాపోతున్నాడు.

ఇప్పటికీ మనిషి విషపు వీక్షణాల బారిన పడని మనుషుల జీవన విధానం గమనిస్తే వాళ్ళ పిల్లలు మేక పిల్లలతోనో, ఆవుదూడలతోనో ,కుక్క,పిల్లి పిల్లలతోనో,అడవుల్లో ని సాధుజంతువుల

కూనలతోనో,ఆడుకుంటారు.అవ్వే వాళ్ళ ఆటబొమ్మలు.ప్రాణమున్న జీవులతో ఆడుకుంటారు కనుక ప్రాణుల పట్ల,ప్రత్యేకించి మనుషుల పట్ల మానవ్త్వం తో వ్యవహ రించాలని వాళ్ళకు

ప్రత్యేకించి చెప్పవలసిన పని లేకుండానే పోతున్నది.అట్లాగే తోటి వారి పట్ల కన్నా తలిదండ్రుల పట్ల కరుణతో ఉంటున్నారు.చెట్టు,పుట్ట భూమే వాళ్ళ జీవనాధారమైనా ఆగర్భ శ్రీమంతులైన

అంబానీ సోదరుల్లా కాట్లాడుకున్న సంఘటన మచ్చుకైనా కనిపించదు.ప్రాణులతో, మనుషులతో వాళ్ళకు ఉన్న దైహిక సంబంధమే వాళ్లలోని మనిషి మాయమై పోకుండా కాపాడుత్న్నది.

ఇక్కడ నాగరికులం అనుకుంటున్న సమాజం లో చూస్తే ఆట బొమ్మలు రైఫోల్లు,పిస్టల్లు, ఫైరింగులు,దొంగల వేటా,శత్రుసైన్యాల పేరుతో అమ్మా,నాన్నల్నో,అక్కా చెల్లెల్లనో,అన్నదమ్ములనో

ఫైర్ చేస్తారు ఇక్కడి బాలలు, పసితనం ఇంకా వీడకముందే నర్సరీ,ఎల్‌కే‌జి లకు పంమ్పించదమ్,అటునుండి అతే రెసిడెన్సీయల్ స్కూళ్ళు,కాలేజీలు అటుతర్వాత అమెరికా .

పిల్లల పెంపకం, ఆస్తుల సంపాదన,సౌఖ్యాలు అనుభవించాలన్న తపనతో మనిషి సృస్టించ అలివిగాని సృస్తిని విధ్వంసం చేయడం లో పోటీ పడి ఉత్పత్తియ అయిన సంపదను

తామే అనుభవించాలనే అత్యాశతో మానవ సమూహాలన్నీ పోటీ పడుతుంటే సమాజలకు మార్గదర్శకత్వం వహించ వలిసిన ఆలోచనా పరులు క్రియ శూన్యంగా ఉంటే ఇంకా మనిషితనం

ఎక్కడ బతికి బట్టగడుతుంది?

అభివృద్ధి వద్దా? ఇంకా ఆది మానవుల్లాగే జీవించాలని నీ ఉద్ధేషమా అని ప్రశించే వాళ్ళు కూడా ఉంటారు.అభివృద్ధికి నిర్వచనం ఆరంభం లోనే చెప్పినాను.అయినా మరో సారి నా చుట్టుపక్కల

జరుగుతున్న నా అనుభవాలను ఇక్కడ మీ ముందు ఉంచుతాను.నా నివాసం కరీంనగర్ జిల్లా కేంద్రం.ప్రతి దినం వందలాది పొడవైన పెద్ద భారీ వాహనాలల్లో ఇక్కడ నుండి గ్రానైట్ రాయి

సింగపూర్, చైనా,రష్యాలకు ఎగుమతి అవుతుంది,పోనీ అక్కడ వాళ్ళకు ఇదేమయినా ఆహార పదార్థమా అంటే కాదుగదా? కేవలం తమ ఆడంబరం కోసం చేస్తున్నారు, దానితో ఇక్కడి గుట్టలు

పర్వతాలు విధ్వంసం అయి జలవనరులు ఇంకి పోయి సుసంపన్నమయిన భూములన్నీ ఏడార్లుగా మారుతున్నాయి.ప్రతిదినం పత్రికల్లో చూస్తుంటాం గుట్టలల్లోని గుడ్డెలుగులు ఉర్లళ్ళకు

వస్తున్నాయి,బావులల్లో పడి చనిపోతున్నాయి, చెట్లు ఎక్కి కిందపడి చనిపోతున్నాయి.నెమల్లు ,కుందేళ్ళు,అడవిపందులు,కోతులు, ఉళ్లమీదబడి మనుషులతో మరణిస్తున్నాయి,

రోడ్లన్ని నాశనం అవుతున్నాయి పంటలతో బాటుగా మనుషుల ఆరోగ్యాలన్నీ నాశనమయి పోతున్నాయి, స్టానిక ప్రజలకు కట్టే,పుల్ల,ఆకు, నీరు,నిప్పు పంట ఫలము ఇచ్చిన ఆ వనరు

ద్వంసమ్ అయ్యి స్తనికులకు కాస్తాలు కడగండ్లు మిగులిస్తుంటే కొద్ది మంది పెట్టుబడుదార్లు కోటీశ్వర్లు అవుతుంటే మరెక్కడో ఉన్న సంపన్న వర్గాల ఆడంబారాల ఇగో సంతృప్తి పడుతుంటే

స్టానిక ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ రక్షక దళాలౌ అభివృధ్హ్ధి అదే నంటూ కాదన్న వారిని కటకటాల పాలు జేస్తే ఇక్క మంత్రులు,ఎమ్మేల్యేలు,ఎంపీలు,అందులో భాగస్వాములయితే

మనుషుల్లోని మణిశన్న వాణ్ని ఎవరు మాయం జేస్తున్నట్టు. మాయం చేసేది వాళ్ళే మళ్ళీ మొత్తుకొనేది వాళ్ళే కనుక చైతన్య వంతమయిన ప్రజా తమ బాధ్యత ఏమిటో వాళ్ళే నిర్ణయించుకోవాలి.

Saturday, May 14, 2011

ఓట్ల రాజకీయాలు ఎట్లున్నాయో చూస్తున్నారా?

ఒకచోట రెండు లక్షల కోట్ల కుంభకోణం 2స్పెక్ట్రమ్ విషయాన్ని అసహ్యించుకున్న తమిళ ప్రజలు కరుణానిధిని గద్దెనుండి తొలగించారు.అవినీతికి మారుపేరే అయినా జయలలితా చిన్న గీత పక్కన 2g పెద్దగీతే గాదా అని జయాని కరుణించారు.
అట్లాగే పశ్చిమ బంగాల లో మార్క్సిస్ట్ పేరు తో కప్తాలిస్టేక్ పనే జేస్తున్న దొంగ మార్క్సిస్టులకు బాలెగానే బుద్ధి చెప్పారు.
కానీ ఇక్కడ ఆంధ్ర లో మాత్రం అటు అయ్యా రాజశేకారుడు కొడుకి రాజా వారు లక్ష కోట్ల అక్రమ సంపాదనకు పాల్పడ్డా
జనం పట్టిచ్చుకోలేదు.
ఇట్లా ఎందుకు జరుగుతున్నది.ప్రజలు ఎక్కడయిన సహజంగా అవినీతి పరులను నిరంకుశులను సహించరు అది మానవ
స్వభావం కూడా! కానీ ఇక్కడ మానవ స్వభ్వానికి బిన్నమయిన చర్య ఎందుకు జరిగినట్టో విశ్లేషకులు ఆలోచించాలి.ఒకటి
కాంగ్రెస్స్ వాళ్ళు జగన్ కంటే గూడా అవినీతి పరులు అనో లేదా నిరంకుశులు అనో లేదా అప్రాజా స్వామిక వాదులు అనో
ప్రజలు భావించి ఉండాలి.అట్లా చూసి నప్పుడు రాజశేఖర రెడ్డి వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్పినట్టు తాను లక్షల కోట్లు అక్రమంగా
సంపాదిస్తే అందులో తన వాటా తీసుకోకొండానే సోనియామ్మో లేదా వాళ్ళ అధిస్తానమో ఎందుకు ఉరుకుంటుంది.కనుక ఆ
అవినీతిలో సింహా భాగం కాంగ్రెస్స్ పెద్దలకు దక్కింక్ది కాదా?కనుక తమిళ నాద్కులో వలె చిన్న గీతను మరిపిస్తూ పెద్ద గీతా
గీయబడి నప్పుడు సహజంగానే ప్రజలు చిన్న గీతను మన్నిస్తా ఉన్నారు మరి. అందరూ అవినీతి పరులే అయినప్పుడు
అందులో చిన్న అవినీతి పరుల వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ఇది మంచి పరిణామమేనా? మొత్తంగా అవినీతిని
కుటుంబ పాలనను వ్యతిరేకించ కుండా ఇలా చిన్న చిన్న దొంగలకు అధికారం అప్పగిస్తూ పోతే స్వాతంత్ర ఫలాలు అందిరికి
ఈ ప్రజస్వామ్యం లో అందు తాయా?అల అందువు అని ప్రజా రాసులంతా అనుకోని ప్రత్యామ్నాయ రాజకీయాలను
వెదుక్కొంటే తద్వారా సంభవించే సామాజిక కుడుపులకు బాధ్యత ఈ సమ్మంజానిది కాక అందులో భాగస్వాములవబోతున్న
ప్రజారసులదేనా?
ఆలోచనా పరులు అందరూ మిన్న కుంటె రానున్న పరిణామాలకు మా బాధ్యత కేదూ అని తప్పుకోవడానికి కుదురాదు .