Monday, October 10, 2011

అలిసి పోకుండా ఆఖరుదాక పోరాటం చేద్ధామ్!

బస్సులు నడుస్తాయని ఒకడు, సింగరేణిలో కార్మికులు డ్యూటీలో జాఇన్ అవుతున్నారని ఒక చానెల్ పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నాయి. కానీ సకల జనులారా సమయిక్యాంధ్ర ప్రచారాలను నమ్మకండి.అలిసి పోకుండా కదా దాకా ఉద్యమిద్దామ్.
ఇక్కడ మనం ఒక విషయాన్ని జాగ్రత్తగా అర్థం జేసుకోవలే.ఓట్ల ఉద్యమం ప్రారంభమయిన 2001 నుండి జూసీనా ఆ తర్వాత 2004 నుండి జూసీనా ఇగ వచె తెలంగాణ ఆగా వచె అంటున్నారే గాని తెలంగాణ తెచ్చే తండుకు ఏ రాజకీయ పార్టీ చేసింది పెద్దగా ఏమీ లేదు.ఎన్నికల్లో పోటీ జెసి ప్రజల్లో పరువు నిలుపుకొనే పని ఒకరు జేస్తే మా అధిస్తానమ్ తో చెప్పి మేమే తలంగాణ టెస్టమ్ అని పబ్బం గడుపుకున్న వాళ్ళే గాని కేంద్రాన్ని గట్టిగా నీలేసింది నీలేయ గలిగిన పరిస్తితి తెచ్చిన వాళ్ళు ఎవరూ లేరు.లేకుంటే 9 డిసెంబర్ ప్రకటన ఎట్లా వఛ్చిందని ప్రశ్నించే మిత్రులు చాలా మండే ఉన్నారు.కడుపుజింపుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్నట్టు గాని,మరి వచ్చి నట్టే వచ్చి వెనక్కుపోతే 9 దేసెంబర్ ప్రకటన ఓన్ జేసుకున్న మిత్రులు దాన్ని కాపాడే పోరాటం లో ఎందుకు వెనుక బడ్డట్టో? అయితే ఇక్కడ నా వాదన ఎవరిని తక్కువ జేయడానికి కాదు. కానీ ఎప్పుడయితే ఎక్కడ కూడా చరిత్రలో తమ తమ జీతాలకో నాటాలకో కాకుండా అశేష ప్రజాజీకమ్ ఆకాంక్షల మేరకు ఉద్యోగులు,ఉపాధ్యాయులు,విద్యార్థులు,సింగరేణి కార్మికులు,ఆర్ టి సి కార్మికులు,సమస్త ఉద్యోగ వర్గాలతో బాటుగా వివిధ వృత్తుల, కుల సంగాల జే ఏ సి లు ఎవరికి వాళ్ళే వాళ్లడయిన పోరాట రూపాలతో రోడ్డు మీదికి వచ్చిన తర్వాత మేము ఎక్కడ వెనుక బడి పోతామో అని కొన్ని రాజకీయ పార్టీలు పోటీలు బడి ప్రజల ముందుకు వచ్చిఫోటోలకు ఫోజులు ఇస్తున్న విషయాన్ని చూస్తున్నామనుకో కానీ ప్రభుత్వాలు కదిలింది ఇప్పుడే కదా?
కనుక సకల జనుల సమ్మె ఎంత ప్రభావ వంతమైనదో మనం అర్థం జేసుకోవాల్సిన అవసరం ఉంది.సకల జనుల సమ్మె ద్వారానే దాని వినూత్నమయిన రాజీ లేని పోరాట రూపాల ద్వారానే తెలంగాణ సాధించుకో గలుగుతాము. రాజకీయ నాయకులు ఇప్పుడు వస్తున్నట్టుగానే ప్తజల వెనుక బడి రాక తప్పదు.వాళ్ళకు మనం గావాలే.
పెంటయ్య. వీరగొని.