Thursday, November 10, 2011

సామాజిక తెలంగాణ అవసరమా ఇప్పుడు?

మొదటి SRC రిపోర్ట్ హైద్రాబాద్ ప్రావిన్స్ ను యథాతథంగా కొనసాగించాలని చెప్పినా గూడా సీమాంధ్ర వాళ్ళ రాజధాని సమస్య తేలనందున కర్నూలు డేరాలల్లా

రాష్ట్ర రాజధాని కొనసాగించడం కష్టతరమై ఆనాటి నుండే లాబీయింగ్ లో ఆరితేరిన సీమాంధ్రులు అమ్ముడుపోయే నాయకత్వం తెలంగాణ లో ఉన్న ఖర్మానికి గోరేటి వెంకన్న

పాటలో చెప్పినట్టు సల్లంగా వచ్చి పట్నం లో పరుచుకొనే కుసున్న నాటి నుండే మేం వీళ్లతో కలిసి ఉండలేమన్న వాళ్ళు ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. ఆలాంటి ఉద్యమాలను

కాష్ చేసుకొనే వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు. అయినా పోరాటాలు చేస్తున్న వాళ్ళు మొక్కవోని ధైర్యం తో పోరాటాలు చేస్తున్నారు అమాయకులైన కొందరు యువకులు

ద్రోహులను దొరుకబట్టి చంపే ధైర్యం లేక వాళ్ళను వాళ్ళే అంతం జేసుకుంటున్నారు . ఆ శవాల మీద ప్రమాణం జేసిన నీతి లేని నేతలు వాళ్ళ చావుల పునాదిగా పదవులను

పదిలం జేసుకొనే వాళ్ళు కొందరయితే కొత్తగా పదవులను పొందే వాళ్ళు మరికొందరు దళారీలు బొందకాడి నక్కల లెక్క నక్కి నక్కి జూస్తున్నారు . నంగి నంగి మాట్లాడు

తున్నారు. ప్రజలు అందరినీ గమనిస్తూనే ఉన్నారు. తెలంగాణకు వ్యతిరేకులేవ్వరో, తెలంగాణ రాకుండా అడ్డుపడుతున్న వాళ్ళకు అమ్ముడు పోతున్న

దెవ్వరో , ఉద్యమాన్నీ కుదువబెట్టుకొని నెత్తుటి కూడు తెంతున్నదేవ్వరో ఎవరు ఏందో ప్రజలు చాలా జాగ్రత్తగానే గమనిస్తున్నారు.

1956 నుండి అసమ్మతి గళం వినిపిస్తున్న తెలంగాణ ప్రజలు 1969 లో చెన్నారెడ్డి ద్రోహం నాటికి 370 మందిని కాంగ్రెస్స్ ప్రభుత్వం కాల్పుల్లో చంపి వేస్తే అలా అణిచి

వేయబడ్డ ఉద్యమం లో చురుకైన పాత్ర పోషించిన యువత కేవలం ప్రాంతీయ అసమానతలు మార్చడం మాత్రమే గాకుండా ప్రజల మధ్యనున్న మొత్తంగా అసమానతలను

తోలింగించాలన్న లక్షమ్ తో ఇవ్వాళ దేశ వ్యాప్తంగా ఉద్యామిస్తున్న సంగతి చూస్తూనే ఉన్నాము. 1969 లో పడిలేచిన ఉద్యమం వరంగల్ డిక్లరేషన్ పేరుతో తెలంగాణ

జనసభ నేతృత్వం లో చంద్రబాబు ప్రభుత్వం లో మరో సారి కండ్లురిమి లేచింది, కానీ బాబు ప్రభుత్వం ఆ ఉద్యమాన్ని ఎంతక్రూరంగా అణిచి వేసిందో బెల్లి లలిత దేహం

ముక్కలు ముక్కలు గా నరుక బడిన తీరు చెప్తుంది( ఇప్పుడు మేము సైతం తెలంగాణ అంటూ పాటబాడుతున్న రెండుకండ్ల తెలుగు లీడర్లు ఏమి జవాబు చెప్తారో మరి)

2000 నుండి 2009 వరకు చుక్క రక్తం చింద కుండ ఏ ఒక్కరూ రోడ్డు పైకి రాకుండా తెలంగాణ తెస్తామన్న ఎన్నికల ఉద్యమ కారులు కడకు సకల జనులను రోడ్డు

మీదికి పిలువక తప్పలేదు. పసి పిల్లల నుండి పండు ముసలి వరకూ, గెజిటెడ్ ఆఫీసర్ల నుండీ రోజుకూలి జీతగాళ్ల వరకూ, వివిధ కులసంఘాలు, వృత్తి సంగాలు ,

విద్యార్థి ,కార్మిక, కర్షక సకల జనులు చారిత్రాత్మకంగా 43 రోజులు సమ్మె జేసినా అటు కేంద్ర ప్రభుత్వం గాని ఇటు రాష్ట్ర ప్రభుత్వం గాని స్పందించ లేదు. సరిగదా

ఆ పార్టీ గూడా తప్పించుకునే మాయమాటలే చేక్ప్పింది గాని ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్ష ను మన్నించిన పాపాన పోలేదు. పైగా రెండవ SRC అని మరో మోసానికి

తెరలేపే ప్రయత్నం చేస్తుంటే మరికొంత మంది సామాజిక తెలంగాణ అంటూ కొత్త రాగం ఎత్తుకున్నారు.సామాజిక అంశం తేలేదాకా భౌగోళిక తెలంగాన గురించిన ఆలోచన

వద్ధనీ అడ్డు వస్తున్నారు.

సామాజిక తెలంగాణ వస్తే ఎవరికి ఏమి లాభం? కొందరు SC, ST , BC లకు రాజకీయంగా పోటీలు జెసి గెలిసే అవకాశం ఉంటుంది గావచ్చు.ఈ రోజు ఎన్నికల్లో

గెలువాలంటే డబ్బులు లేన్దే గెలవడం సాధ్యపడదు.ఏ సామాజిక వర్గం అయినా గూడా ఆర్థికంగా ఎంతో కొంత బలంగా ఉంటే తప్ప ఎన్నికల్లో గెలువలేడు. అతడు ఆర్థికంగా

మరింత సంపన్నుడు అయ్యే కొరకు సంపన్న వర్గాలకు చాలా నిజాయితీ తో సేవజేస్తాడు డప్ప తన వర్గం వాళ్ళకు అసలు అక్కరకు రాదు సరిగదా తమ సామాజిక వర్గాన్నే

నిందిస్తాడు కూడా. కరీంనగర్ జిల్లాలో ఇల్లంతకుంట మండలం అనంత సాగర్ అనే వూళ్ళో ప్రాణహిత చేవెళ్ళ ఎత్తిపోతల ప్రాజెక్ట్ కాలువ పోయే తోవలో ఎత్తయిన కొండలు

అడ్డువస్తున్నాయని ఆ కొండల కిందుగా ఒక సొరంగా మార్గం తవ్వాలట. అసలు ఆ ప్రాజెక్ట్ కు ఇంత వరకు ఏ అనుమతులు కూడా లేవు అయినా YSR పుణ్యమా అని

1200 కోట్లతో ఒక ఆంధ్ర బినామీ కాంట్రాక్టర్కు పని అప్పగించి నారు. ఆయన రైతులకు మాయమాటలు జెప్పి సొరంగం కొంత మేరకు తవ్వి ఆ వెళ్ళిన మట్టి అంతా పక్కన

ఉన్న దళిత రైతుల పంటభూములల్లో పోసి బిల్లు ఎత్తుకొని జెండా ఎత్తేసినాడు. అమ్బ్గెడ్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం వచ్చిన రిజర్వేషన్ ద్వారా ఎన్నికయిన ఒక ప్రజా

ప్రతినిధి తనకు ఒత్లేసి గెలిపిచ్చిన ప్రజల పక్షాన మాట్లాడాల్సింది పోయి కాంట్రాక్టర్ పక్షాన నిలిచి దళితుల పక్షాన మాట్లాడిన వాళ్ళను ఘోరంగా అవమాన పర్చిన విషయం

వ్యాసకర్త ప్రత్యక్షానుభవం.

కళ్యాణ్ సింగ్ లోడీ వంశం , కర్పూర్ ఠాకూర్ మంగలి,కరుణా నిధి, లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, ఉమాభారతి వీళ్ళంతా బి‌సి ముఖ్య మంత్రులు

అజిత్ జోగి, బాబు లాల్ మరాన్దీ, అర్జున్ ముండా , శిబూసోరెన్, వీలు ఎస్టీ ముఖ్యమంత్రులు, మాయావతి ఎస్సీ ముఖ్యమంత్రి, అయితే ఏమి జరిగింది? BC,ST ,SC

సామాన్య పేదల బ్రతుకుల్లో ఏమయినా మార్పులు వచ్చినాయ? ఆయా సామాజిక వార్గాల ప్రజల సమస్యల్లో మౌలిక మయిన మార్పులు ఏమయినా జరిగినయా?

ఇప్పటి ఈ రాజులే కాదు, అప్పటి శాతవాహనులు కుమ్మరి వాళ్ళు, చాళుక్యులు గొల్లకుర్మలు, రాష్ట్రకూటులు ఎర్రగొల్లలు,కాకతీయులు కుర్మ, మౌర్యులు దాసి,

గూర్జరులు లంబాడ, పాలిస్తున్నది ఎవరయితే ఏమిటి వాళ్ళు ఏ వర్గ ప్రయోజనాల కొరకు పాటుబడుతున్నారనేదే ప్రధానం. పెంటయ్య్ వీరగొని.

Sunday, November 6, 2011

కరీంనగర్ జిల్లా [ప్రజా ఫ్రంట్ !

కరీంనగర్ జిల్లా లో తెలంగాణ ప్రజా ఫ్రంట్

9 వ అక్టోబర్ 2010 నాడు తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఆవిర్భావ సభ హైద్రాబాద్ లో జరిగిన రోజున ఉద్యమాల పురిటి గడ్డ కరీంనగర్ జిల్లా నుండి వేల సంఖ్యలో కార్యకర్తలు హాజరైనారు..
ప్రజా ఉద్యమాల ద్వారానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధ్యపడుతుంది అన్న ఒక స్పష్టమైన అవగాహనతో జిల్లాకు రావడం జరిగింది. జిల్లా నుండి రాష్ట్రానికి ప్రతినిధులుగా డా||సూరేపల్లి

సుజాత.మేకల వీరన్న యాదవ్. తిరుపతి రెడ్డి మరియు వీరగొని పెంటయ్య లను రాష్ట్ర మహా సభలో ఎన్నుకోవడం జరిగింది. జిల్లా కు వచ్చిన వెంటనే సంస్త నిర్మాణ బాధ్యతలు చేపట్టే

కొరకు జిల్లా లో ఉన్న కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, మంథని, హుజూరాబాద్, సిరిసిల్ల డివిజన్లల్లో ఎలా నిర్మాణ కార్యక్రమాలు చేపట్టాలో ఎవరెవరు ఏ డివిజనుకు బాధ్యత వహించాలో

నిర్ణయం చేసుకొని కార్య క్రమాలకు పూనుకున్నారు. సంఘటిత రంగం మాత్రమే గాకుండా చైతన్యానికి మారు పెరయిన సింగరేణి ప్రాంతం నుండే కార్య క్రమాలు ప్రారంభిస్తే ఊపు వస్తుందన్న

ఉద్దేశం తో ముందుగా గోదావరిఖని కి వెళ్ళడం జరిగింది.ఒక 300 మంది హాజరైన ఆ సభ t p f కార్యక్రమాలతో తమ సంఘీభావం వ్యక్త పరుస్తూ నవెంబర్ 1, 2010 విద్రోహ దినం పాటించ

దానికి ముందుకు వచిండ్రు. కానీ కార్య కర్తల పైన వచ్చిన నిర్భందం వలన ఎంత వేగం తో ముందుకు వచ్చిండ్రో అంటే వేగం తో మనం పిలిస్తే మళ్ళీ రాకుండా వెళ్ళిపోయినారు.

అణగారిన హక్కుల పోరాట సంఘం tpf కు మద్దతుగా కరీంనగర్ పట్టణం లో ఒక సభ జరుపుతున్నాం అని ఆ సభకు tpf చేర్మన్ ను ఆహ్వానించారు. కానీ ఆ సభలో హాజరైన

మేకల వీరన్న యాదవ్ ను వేదిక పైకి పిలువక పోవడం మాత్రమే గాకుండా సంస్థ చేర్మన్ అధ్య్క్షతన జరిగిన సభలో సంస్థ జండా కూడా వద్దని తీసివేయడం తో tpf బాధ్యులు బాధపడినారు.

ఆ తర్వాత తెలంగాణ పోలిటికల్ jac నిర్వహించిన సభలకు సంస్థ చేర్మన్ వచ్చిగూడా అక్కడి స్టానిక బాధ్యులకు సమాచారం ఇవ్వకపోవడం తో సంస్త నిర్మాణం పైన దాని ప్రభావం పడ్డది

దాని కారనంగా చాలా కాలం పాటు సంస్త కార్యక్రమాలు ఏవీ గూడా సాగా లేదు. రాస్త్ర కమిటీ సమావేశాలకు హాజరు గావడము డప్ప జిల్లా లో ఏ కార్యక్రమాలు జరుగలేదు.

రాస్థ్త్ర కమిటీ సభ్యులు రత్నమాల, వెదకుమార్ జిల్లా కేంద్రానికి వచ్చిన సందర్భంగా విస్తృత స్తాయి కార్య కర్తల సమావేశం ఏర్పాటు జేసుకొనే జిల్లా అఢక్ కమిటీ వేసుకోవడం జరిగింది.

వి సుధాకర కన్వీనర్ గా మరో 12 మంది కోకన్వీనర్లతో కమిటీ వేసుకున్న తర్వాత కొంత చలనం ప్రారంభమయింది. చొప్పదండి నియోజక వర్గం బాధ్యుడు వీరన్న, కరీంనగర్ టౌన్ బాధ్యుడు

మొగురం రమేశ్ అణగారిన హక్కుల పోరాట కమిటీ బాధ్యుల్డు రమేశ్, మొదలగు వారు తీవ్రంగా కృషి చేసి జగిత్యాల, చొప్పదండి, హుస్నాబాద్, కరీంనగర్ నియోజక వర్గాలల్లో మండల కమిటీలు

మరియు గ్రామ కమిటీలు వేసుకోవడం జరిగింది. 9 అక్టోబర్ 2011 నాడు సంస్త ఆవిర్భావం రోజున అమరవీరుల స్తూపం వధ్ధ ఘనంగా శ్రద్ధాంజలి ఘటించి రేకుర్తి వరకు ఊరేగింపు గా వెళ్ళి అక్కడ

స్టానిక కార్యకర్తల సహకారం ప్రధానగా గాయకుడు పరుషరమ్ నేతృత్వం లో tpf జండాను ఆవిష్కరించుకోవడం జరిగింది.

అక్టోబర్ 13 నుండి సకల జనుల సమ్మేలో భాగంగా సింగరేణి కార్మికులు చేస్తున్న సమ్మెకు సన్హీభావం తెలుపడానికి సంస్థ ఉపాధ్యక్షులు ఆకుల భూమయ్య, వీరగొని పెంటయ్య గోదావరిఖనికి వెళ్ళి

కార్మికులు ఏర్పాటు జేసిన సమ్మేలో పాల్గొని వారికి మద్దతు ప్రకటించి వారి త్యాగాలని కొనియాడి తెలంగాణ సాధించ బడే దాకా తెగించి పోరాడాలని కోరడం జరిగింది. సకల జనుల సమ్మె విరమించ బడ్డ

తర్వాత tpf పేర సమ్మె విద్రోహులెవరూ అని వెలువద్ద కరపత్రం చదివి కొందరు కార్మికులు బాధను వ్యక్తీకరించినారు. సమ్మె ప్రారంభానికి సన్నధ్ధం జేయడానికి ఏ ఒక్క ఉద్యమ సంస్థ గాని, tpf బలపర్చిన

aituc గానీ ఏ కార్మిక సంఘం గాని ముందుకు రాకపోయినా కార్మికులే స్వచ్ఛందంగా పాల్గొని ఇన్ని రోజులు సమ్మేజేస్తే ఖమ్మం లాంటి చోట ప్రధానంగా aituc ముందుబడి సమ్మె నీరుగారిస్తే పిలిచినా

కూడా రాలేమని చెప్పిన ఉద్యమ సంస్తలు ఇవ్వాళ కార్మికుల పోరాటాన్ని , చైతన్యాన్ని కించ పర్చే విధంగా అంటే గాకుండా తెలంగాణకు ప్రధాన అద్దంకి అయిన కాంగ్రెస్స్ ను శకుని పాత్ర పోషిస్తున్న tdp

ని ఒక్క మాటకూడ అనకుండా ఒక వైపు rtc సమ్మె విరమించ బడ్డ తర్వాత నిరాశ నిస్పృహలకు లోనయినా కార్మికులకు ఆత్మ స్టయిర్యాన్ని ఇచ్చి మరో పోరాటానికి సంసిద్ధులను చేయాల్సింది పోయి

ఇలా కరపత్రాలు తీయడం పట్ల ఉద్యమం లో చురుకుగా పోల్గొన్న కార్యకర్తలు తాము నొచ్చుకున్నామని వ్యాసకర్తతో చెప్పినారు.

జిల్లాలో ప్రధాన వనరులు అయిన బొగ్గు, నీళ్ళు, గ్రానైటే, ఇసుక యధేచ్చగా సీమాంధ్ర గుత్తేదార్లతో బాటుగా, తెలంగాణ దొరలు కూడా దోచుకు తింటున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే లోగానే

ఈ వనరులు తరిలీ పోకుండా ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. సింగరేణి లో రోజు ఒక లక్ష తొంబై వేల తన్నుల బొగ్గు, అలాగే రెజు వేల క్యూబిక్ మీటర్ల గ్రానైట్ అదే విధంగా వేల క్యూబిక్ మీటర్ల ఇసుక

ఈ భూమి నుండి తరలిపోతుంటే ఇక్కడి నెల తరిగి పోవడం మాత్రమే గాకుండా స్టానిక ప్రజలకు జీవానాధారాలు అడుగంటి పోతున్నాయి.గుద్దెలుగులు, నెమళ్లు అంతరించి పోతున్నాయి తద్వారా పర్యావరణ

సమతుల్యత చెడిపోయి రేపు రేపు ఈ గడ్డ పైన జన్మించిన బిడ్డలకు పీల్చడానికి పరిశుభ్రమైన గాలి, తాగాదానికి నీళ్ళు, తినడానికి తిండిగుడా దొరుకని దుర్భర స్థితి దాపురించ బోతున్నది. ఈ సమాజం లో

ఆలోచించ గలిగిన ప్రతి మనిషి స్పందించ వల్సిన అత్యవసర పరిస్తితి కరీంనగర్ జిల్లాలో ఉంది.