Thursday, December 15, 2011

bhajan--poraataalu.

పొట్టి శ్రీరాములు మరణించింది 16,డిసెంబర్ 1952. మద్రాస్ రాష్ట్రం నుండి ఆంధ్ర ప్రాంతాన్ని విడదీసి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలన్న డిమాండ్ తో ఆయన దీక్ష చేసిండు.
ఆయన చనిపోయే నాటికి హైద్రాబాద్ ఒక రాష్ట్రామ్గా నాలుగు సంవస్తారాల నుండి ఉంటున్నది. హైద్రాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్రాలో కలుపాలి అన్నదే ఆయన డిమాండ్ కాదు.
మద్రాసీలు ఆంధ్రుల ప్రయోజనాలను కొల్లగుడుతున్నారు కనుక మేము మదరాసీలతో కలసి ఉండలేము మాకు మేము విడిగా ఉంటాము అంతే గాకుండా మద్రాస్ ను
ఆంధ్రులకే రాజధానిగా ఉంచాలన్నది ఆయన డిమాండ్. తెలంగాణ వాదులు నెత్తి నోరూ కొట్టుకొని చెబుతున్నా సమైక్య వాదులు పాపం ఆయనను తమ వాదానికి, మరియు
సమైక్యాంధ్ర ప్రదేశ్ కు నవంబర్,1 1956 తో ఆయన త్యాగాన్ని ముడిబేడుతున్నారు కనుకనే తెలంగాణ వాదులు పొట్టి శ్రీరాములు మరాన్ని, ఆయన త్యాగాన్ని మాతో ఎందుకు
పారాయణం చేపిస్తున్నారని అభ్యంతర పెడుతున్నారే తప్ప ఆయన త్యాగాన్ని తక్కువ చేయడం లేదు, సరి గదా ఆయన ఆశయం మేరకు పీడకులనుండి పీడితులను
విడిపించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని కోరుకుంటున్నారు.
అయితే తెలంగాణ ప్రాంతం లోని ఆయన సామాజిక వర్గం వాళ్ళు ఏవాదన ఎట్లాఉన్నా అతడు మా వాడు కనుక మేము ఆయన్ని స్మరించుకుంటామ్ అని పూలమాలలు
వేస్తున్నారు. అది వాళ్ళ గొప్ప మనుసును, ఎవరు త్యాగం జేసినా వారిని మేము గౌరవిస్తాము అనే తెలంగాణ ప్రజల సంస్కారాన్ని తెలియజేస్తున్నది. కానీ సమైక్య
వాదం పేరుతో దోపిడి చేయాలని చూస్తున్న వర్గాలు మాత్రం ఆడిగదిగో చూడండి తెలంగాణలో ఎంతమంది సమైక్య వాదాన్ని సమర్తిస్తున్నారో అంటూ తోకతెగిన నక్కల్లా
అరుస్తున్నారు.
ఇదే సందర్భం లో రైతుల సమస్యలు అంటూ చంరబాబు త్లంగాణలో పర్యటిస్తున్నాడు. 2004 ఎన్నికల్లో ప్రేత్యేక తెలంగాణ వాదాన్ని వ్యతిరేకింస్తూ ఎన్నికల్లో పోటీ చేసి
ఘోరంగా ఓడిపోయిన సంగతి గుణపాఠంగా తీసుకొని 2009 ఎన్నికల్లో ప్రత్యేక తెలంగాణ వాదాన్ని నెత్తికి ఎత్తుకొని అధికారం కైవసం చేసికోవడానికి మరో ప్రయత్నం
చేసిండు. కానీ అతని పాలన లో జరిగిన ప్రజా వ్యతిరేక చర్యలను అప్పటికి ఇంకా మరిచిపోని ప్రజలు మరో సారి ఆయన్ను తిరస్కరించినారు. 7 డిసంబర్ 2009 లో
అసెంబ్లీలో తెలంగాణ బిల్లు మీరు పెడుతార మమ్ముల పెట్టుమంటారా అని బీరాలు పలికి తీరా 9 డిసంబర్ ప్రకటన రాగానే తానే ముందుండి కాంగ్రెస్, ప్రజారాజ్యమ ,
తెలుగుదేశం పార్టీలు అన్నిటితో ఆంధ్ర ప్రాంతం లో అంధోలన చేసి తెలంగాణకు అడ్డుపడిన వ్యక్తి ఇవ్వాళ నేను తెలంగాణకు వ్యతిరేకం కాను అంటూ తెలంగాణ ఓట్లను
తనవైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తుంటే తెలంగాణ లోని తెలుగు దేశం నాయకులు ఆయన భజన చేస్తూ ఆయన ఫోటోల ఫ్లెక్షీలు కడుతూ తెలంగాణకు అడ్డుతగిలిన
బాబుకు నిస్సిగ్గుగా రక్షణ కావచ్చాలుగా నిలిచి తెలంగాణ ప్రజల గుండెలు ఆవిసేలా ప్రవర్తిస్తున్నారు.
అలాగే జగన్ భజన పరులు జగన్ ఫ్లెక్షీలు పెడుతూ జగన్ ను కూడా తెలంగాణ లోకి ఆహ్వానించే దానికి ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు అయితే కిరణ్ కుమార్ ను
రచ్చబండ పేరుతో ఇప్పటికే రెడ్ కార్పెట్ పర్చి ఆహ్వానం పలికిన సంగతి తెలంగాణ ప్రజలు చూసియే ఉన్నారు.
అసలు తెలంగాణ రాజకీయ నాయకులు ఇట్లా వెన్నెముక లేకుండా ఎందుకు ప్రవర్తిస్తున్నట్లో చూడాల్సి ఉంది. ఇటు తెలంగాణ ప్రజలు అన్నివిధాల నస్టపోతున్నా స్వయంగా
రాజకీయంగా తాముకూడా ప్రజల్లో ఘోరంగా అపఖ్యాతి పాలవుతున్నా కూడా తెలంగాణ రాజ్కీయ నాయకులు ఆంధ్ర పాలక వర్గాలకు ఎందుకు దాసోహం అంటున్నారు?
కేవలం తాము , తమ పూర్వీకులు ఏండ్లతరబడి ఫూడల్ ఏలుబడిలో ఇన్నందుకేనా లేక అంతా కంటే మిక్కిలి అయిన ప్రయోజనం ఏదైనా ఉందా అనుకుంటే తాము
సాధికారత సాధించే అవకాశం ఉంది కూడా బానిస మనస్తత్వం తో కేవలం సులభ పద్దతిన డబ్బు అధికారం సాధించుకోవాలన్న అత్యాశతో మాత్రమే తెలంగాణ రాజకీయ
నాయకులు దాబ్బులకు అధికారానికి అమ్ముడు పోతున్నారు, కానీ తెలంగాణ ప్రజలకు ఒక మహోన్నతమైన లక్షణం ఉంది, ఎన్ని సార్లు పడిపోయినా పీయూష పక్షుల
వలె పైకి లేచి పోరాటం చేస్తూనే ఉంటారు. అది తెలిసే పీడకులకు భయం, అది ఉన్నది కనుకనే దాని పెరుచెప్పుకొని సొమ్ముచేసుకుంటున్నవాళ్ల భరోసా!
కనుక తెలంగాణ ప్రజలు తమ బలాన్ని, బలహీనతలనూ గమనిస్తూ పీడకులని ఓడించే పోరాటాలు చేస్తూనే ఉంటారు. అదే చరిత్ర చెప్తున్నా సత్యం.
వీరగొని పెంటయ్య