Saturday, December 15, 2012


కాంగ్రెస్గ్రె వాళ్ళ అఖిల పక్షం అసలు రంగు సామాన్య జనులందరికి ఇప్పటికే తెలిసి పోయింది. కాని కాంగ్రెస్ ఎంపి లకు,ఏమ్మేల్లెలకు,ముఖ్యంగా తెలంగాణా ఉద్యమాన్ని పూర్వ పక్షం చేయడానికి కాంగ్రెస్ కుటిలత్వానికి పుట్టిన రంకు బిడ్డ లాంటి మంత్రి పదవులు చేపట్టిన పచ్చి స్వార్థ పరులకు మాత్రం ఇంకా జ్ఞానోదయం కావడం లేదు.2014 దాకా ఏమీ తేలదన్న భరోసా కలిగిన బాబు, జగన్ పార్టీల నేతలు మాత్రం మేము తెలంగాణాకు వ్యతిరేకం కాదనే ఒక దొంగ నాటకం ఆడుతున్నారు. అరే మీరు తెలంగాణా కు వ్యతిరేకం గాకుంటే మా తెలంగాణా మాకు వస్తది కదా? అప్పుడు ఇక మీరు దేనికి ముఖ్య మంత్రి అవుతారు. ఇక్కడి ప్రజల రాజకీయాలతో మీకు సంభంధం ఏమిటి? మీ కాళ్ళకు పుండ్లు బడుతుంటే,కీళ్ళు సడులుతుంటే, మేం ఎంత వద్దని ఛీ కొట్టినా ,ఎందుకు మా వెంట బడి తిరుగుతుండ్రొ అర్థం చేసుకో లేనంతటి అమాయకులం కాదుకదా? ఎన్నికల ఒక్క రోజు నా వెనుక ఉండండి ఆ తర్వాత 5 ఏండ్లు మీ వెనుక బడుత అని చెప్పుతనే ఉంటె ఇంకా 6 ఏండ్ల దాకా తెలంగాణా ఆశ వదులు కొండని చెప్పుతుంటే మీ మోచేతి నీళ్ళకు ఆశ పడి బతుకుతున్న మా తెలంగాణా నాయకులను మరియు ఆంధ్ర పార్టీల నాయకత్వాన్ని మా తెలంగాణా మేలు కోరే వారని ఎట్లా నమ్ము మంటారు? ఇక తెలంగాణా కోసమే మా తన్. మన్. ధన్ అని చెప్పుకుంటున్న వాళ్ళు కూడా, చెంద్ర బాబు విసుర్తున్న సవాలు " తెలంగాణా వస్తే మీ దుకాణం బంద్ ".అన్న దానికి సమర్థవంతంగా జవాబు ఇవ్వడం లేదు. 2000 సంవస్తరం లో స్తానిక సంస్తల ఎన్నికల్లో అంచనాలకు మించి మండలాధ్యక్షులను,జిల్లా పరిషద్ చేర్మన్ లను ప్రజలు గెలిపించినారు,2004 జన్రల్ ఎన్నికల్లో కాంగ్రెస్ చరిత్ర తెలిసి కుడా పొత్తు పెట్టుకొంటే వాళ్ళను, మిమ్ములను కలిపి అధికారం లోకి తీసుక వచ్చినారు ప్రజలు, మీ రాజకీయ పరపతి పలుచ బడ్డప్పుడల్లా ఓట్లేసి ఓట్లేసి అలసి పోయినారు గాని నీ సంగతేందని అడుగలేదు. ప్రజలు ఉద్యమాన్ని తీవ్రం చేయడానికి మిలియన్ మార్చ్ తలబెడితే వద్దంటిరి, మహత్తర పోరాట రూపం సకల జనుల సమ్మె ఒక వైపు తీవ్రాతి తీవ్రంగా జరుగుతుంటే నాయకత్వం అంతా కట్టగాట్టుకొని డిల్లీ కి వెళ్ళిపోయి శత్రువు వ్యూహానికి మన కోట ద్వారాలన్ని అప్పగించిపోతిరి. అధినాయకుడు హైదరాబాద్ రాలి కి హాజరు కాడు, వచ్చిన వాళ్ళు సైతం మమ్ములను సంప్రదించకుండానే నెక్లెస్ రోడ్ లో భైఠాయిమ్పు కొనసాగిస్తారా అంటూ అలిగి పోతిరి. ఇప్పుడేమో ఎన్నికల జ్వరం పట్టుకొని 100 అసెంబ్లీ,17 పార్లమెంటు సీట్లు గెలువాలని పిలుపు యివ్వబడితిరి. అంటే సీమాంధ్ర పార్టీలు అంటున్నట్లు గానే అందరూ 2014 ఎన్నికల దాకా తెలంగాణా అంశం తేలదని స్పష్టం జేస్తున్నారు గదా?2014 తర్వాత మల్లి 2019. ఇదేనా ఉద్యమ పార్టీల ముందు చూపు? వాటి వ్యూహం? ఇప్పట్కి రాజకీయ పార్టీలు తక్కువ ఉన్నయట ఇక ఉస్మానియా విద్యార్థులు ఒక రాజకీయ పార్టి బెడుతారట. సరే వాళ్ళను వద్దనే టందుకు మనం ఎవరం గని. ఎన్నికలపార్టీల తోటి సంబంధం లేదని చెప్పుకొంటున్న ప్రజసంగాల తీరు మరొతీరుగ ఉన్నది. దొరల తెలంగాణా కాదు సామాజిక తెలంగాణా అనేది ఒకరు.ఈ సామాజిక తెలంగాణా అనే విశేషణం పాపం సినిమా నటుడు చిరంజీవి వచ్చిన తర్వాత ఒక రూఢ్యర్థమ్ తో పిలువ బడుతున్నది. ఉత్తర ప్రదేశ లో దళిత బహుజన పార్టీ మాయావతి పుణ్యాన బాగా బదునాం అయిన తర్వాత ఇక్కడ మన తెలంగాణా లో సామాజిక తెలంగాణా అన్న మాట ప్రజాస్వామిక తెలంగాణను పక్కకు జరిపింది. వర్గ స్పృహ లేకుండా వెనుక బడిన కులాల ప్రాతిపదికన అధికారం సాధించుకున్నా ఆ అధికారం అగ్ర కులాలకు అగ్ర వర్గాలకు ఊడిగమ్ చేయడానికి దప్ప మరి దేనికి పనికి రాదన్న విషయం మాయావతి నుండి మౌర్య సామ్రాజ్యాధిపతి చెంద్ర గుప్తుని దాక, ఆ తర్వాత శాతవాహనులదాక చరిత్ర సమస్తం యురేషియా ఆర్యులైన బ్రాహ్మణ సేవలో తరించిన నగ్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. గొల్ల కులానికి చెందిన ముర కుమారుడు చంద్రగుప్త మౌర్య చక్రవర్తి క్రీ||పూ|| 317 నుండి 298 దాక ప్రపంచ విజేత గ్రీకు వీరుడైన అల్లెగ్జండర్ చక్రవర్తి అంతే వాసుల నుండి రాజ్యాన్ని హస్తగతం చేసుకొని చాణిక్యుని శిష్యుడు గా బ్రాహ్మణ వాదానికే సేవజేసిండు. కుమ్మరి కులానికి చెందిన శాత వాహనులు కరీంనగర్ జిల్లా కోటిలింగాల రాజదానిగాజేసుకొని క్రీ|| పూ|| 230 నుండి క్రీ|| శ|| 220 వరకు 500 ఏండ్లు పాలించినా కూడా ఇప్పుడు ఎక్కడ కుమ్మరులు పాలక వర్గాలుగా ఉన్న దాఖలా లేదు. పల్లవులు , చాళుక్యులు కుడా శూద్ర కులాలకు చెందిన వారే.క్రీ|| శ|| 200 నుండి 900 వరకు 700 ఏండ్లు పాలించినా కుడా ఇప్పుడు శూద్రులు రాజ్యాధికారం కోసం పోరాడాక తప్పడం లేదు.భారత దేశపు స్వర్ణయుగం అయిన గుప్తులు శుద్రులే.అయిన వీరి కాలం లో బ్రహ్మనిజానికి వ్యతిరేకంగా 4 వ శతాబ్దంలో భక్తీ ఉద్యమాలు వచ్చినాయి.చేర,చోర రాజులు కుడా సత్ శుద్ర కులానికి చెందిన రాజులే. కాకతీయులు కుర్మ కులం వాళ్ళు,క్రీ||శ|| 1083 నుండి 1323 వరకు దాదాపు 250 సంవస్తరాలు పాలించి నా కూడా ఇప్పుడు కుర్మ కులం ఎంత వెనుకబడి ఉన్నదో చూస్తున్నాము. మొన్న మొన్నటి శివాజీ మాలి కులం.అంటే శూద్రుడు. మరాఠ బ్రాహ్మలు శుద్రునికి రాజ్యాధికారం అర్హత లేదు అని అడ్డు తగిలితే కాశీకి వెళ్లి బ్రహ్మలను తీసుకొని వచ్చి అడిగిన దక్షిణ ఇచ్చి క్షత్రియ జంధ్యం వేయిన్చుకున్నట్లు చదువుకున్నాము.ముఖ్య మంత్రులు అయిన లాలూ ప్రసాద్ యాదవ్,ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్ ,యాదవులు,అజిత్ జోగి ఎస్టి. మాయావతి ఎస్సి,కర్పురి ఠాకూర్ సింగ్ మంగలి, కరుణానిధి బిసి , ఇందరు రాజులు, ముఖ్య మంత్రులు వందల సంవస్తారాలులుగా రాజ్యాధికారం పొంది దళిత బహుజనుల కోసం ప్రత్యేకంగా చేసింది ఏమీ లేదన్నది చరిత్ర సత్యమేనాయే . మన రాజ్యాంగం ప్రసాదించిన బిక్షతో ఏమ్మేల్లెలుగా, ఎంపీలు గా గెలిచిన మన దళిత ప్రతినిధులు అమెరిక సామ్రాజ్య పెట్టుబడికి ఎలా కోరలు తోముతున్నారో అది ఎఫ్ డి ఐ ల అనుమతా, అను ఒప్పందమా, అది బొగ్గు కుంభ కొనమా, అది 3జి కుంభ కొనమా, అది స్విస్ బ్యాంకుల నల్ల ధనమా , అన్ని విషయాల్లో సంపన్నుల వైపు నిలిచి పోరాడే శక్తులను అతి కిరాతకంగా అనిచివేస్తూ వాళ్ళ కాళ్ళ కింది నేలను,తల పైన నీడను లాక్కోవడానికి యధా శక్తిగా దోచుకొనే వాళ్లతో దోస్తీ కలిపి తమ తమ ఆస్తులు పెంచుకుంటున్నారు. అంటే ఇప్పుడేదో సామాజిక తెలంగాణా వస్తే దళిత బహుజనులకు ఒరిగేది ఏమీ ఉండదన్నది చరిత్ర చెబుతున్నది.వర్తమానం మన కళ్ళముందు కనబడుతున్నది.వర్గ స్పృహ కలిగిన కార్మిక వర్గ చైతన్యం కలిగిన పార్టీల నాయకత్వం లో మాత్రమే సంపద సమానంగా పంచె వ్యవస్థ ఏర్పడుతుంది. కనుక ప్రస్తుతం, కనీసం భౌగోళిక తెలంగాణా కోసం అయినా ఓట్ల సీట్ల పార్టీల తో బాటు గా అన్ని ఉద్యమ ప్రజా సంగాలు తమ తమ స్వార్థ రాజకీయాలను,ఇగొలను,పక్కన బెట్టి ఈజిప్ట్ తరహా లో ఒక దీర్ఘ కాలికమైన బ్రహ్మాండమైన ఒక సమిష్టి పోరాట రూపాన్ని ప్రజల ముందుకు తీసుకొని పోవాల్సిన అవసరం తక్షణం ఉన్నది. త్వమేవ శుంఠ, అంటే త్వమేవ శుంఠ అనుకుంటూ శిగ పట్ల తో ఇంకా కాలం వెల్ల దీస్తే భవిష్యత్ తరాలు ప్రస్తుత తెలంగాణా నాయకత్వాన్ని అసహ్యించు కుంటాయి . పెంటయ్య.వీరగొని. విశ్రాంత విద్యా పర్యవేక్షనాదికారి, సర్వాయి పాపన్న తెలంగాణ వనరుల రక్షణ సంఘం.

Friday, December 14, 2012


లాభం దోపిడీ మోసం నుండి మాత్రమె రాదు , మంచి వ్యాపారం నుంచి వస్తుంది, సమర్థవంతమైన ప్రణాళిక ఉంటె లాభాలు పోగేయ వచ్చు.___ సజ్జన్ జిందాల్ , చేర్మన్ & ఎండి , జిందాల్ కంపని. అసలు లాభం అంటే ఏమిటి?అది ఎట్లా వస్తుందో చూద్దాం . ఒకరి వద్ద వడ్లు ఉన్నాయి మరొకరి వద్ద కొన్ని కుండలు ఉన్నాయి. ఒక దాని అవసరం మరొకరికి ఉంది. వస్తు మార్పిడి నుండి డబ్బు మారకం ప్రారంభం అయిన తర్వాత ఎ వస్తువుకు ఎంత ధర నిర్నయించాలనే మీమాంస వచ్చింది. అపుడు ఏ వస్తువుకు అయినా ధర ఎలా నిర్నయించాలె అనే ఒక ఆలోచన చేయాల్సి వచ్చింది. కుండలు, చూద్దాం, ఒక మనిషి ఒక బండి తీసుకొని చెరువుకు పోయి రోజంతా మట్టి చేరవేసి మరునాడు ఆ మట్టిని రాళ్ళు రప్పలు లేకుండా నలుగ కొట్టి నీళ్ళు పోసి మెత్తగా తోక్కుకొని ఆ మరుసటి రోజు సారే పైన కుండలు అనుతాడు.వాటిని నీడలో ఎండపెట్టి కుమ్మరి వాములో పేర్చి నాలుగు బండ్ల ఊక నో కట్టెలో బొగ్గో వేసి కాల్చి అట్లా తయారైన ఒక 100కుండలను ఏ రేటుకు అమ్మాలనుకొన్నప్పుడు. ఒక రోజుకు ఎడ్లబండి మనిషి కూలి 400 రూ . రెండు రోజులు తయారు చేయడానికి రోజుకు 200 చొప్పున 400రూ.కుండలు పేర్చి కాల్చే దానికి ఒక రోజు 200రూ 4 బండ్ల ఇంధనానికి 1600రూ.మొత్తం 2600రూ.అంటే ఒక్కొక్క కుండను రూ .26 చొప్పున అమ్మవలసి ఉంటుంది. అలాగే ఒక్క ఎకరం పొలం మూడు సార్లు దున్ని నాటుకు అనుకూలంగా కైలు జేసి 10 బండ్ల ఎరువు పోసి,ఒక 20 kg ల విత్తనాలను నారుపోసి 10 మంది కూలీలతో నాటు వేసి రెండు సార్లు కలుపు తీసి పై ఎరువులుగా ఒక బస్తా డి ఎ పి ఒక బస్తా ఉరియా వేసి 100 రోజులకు కోత కు వచ్చేదాకా నీళ్ళు పెట్టి వరి కోసి, వడ్లు తాయారు జేసి అట్లా తయారైన 20 క్వింటాళ్ళ వడ్లను ఎ ధరకు మార్కెట్ లో రైతు విక్రయించుకొవాలి అన్నప్పుడు,దున్నడానికి ఒక 1500రూ,విత్తనాలు 500రూ,నాటు మరియు కలుపు కలిసి రూ.2500, వారి కోత వడ్లు తయారు చేయడానికి ఒక 1500రూ. అనుకొంటే 10 బండ్ల ఎరువు ఒక 2500రూ, రెండు బస్తాల రసాయనిక ఎరువకు ఒక 1000రూ. అనుకొంటే మొత్తం 9500రూ. అవుతున్నాయి.ఒక ఎకరానికి కౌలు 5000రూ. మరియు అతడు ఈ 100 రోజులు పొలాన్ని చూసుకుంటూ నీళ్ళు పెట్టడానికి గాను అతని కుటుంభం అంతా పనిజేస్తుంది వాళ్ళ కూలి ఒక 6500రూ. అనుకొంటే మొత్తం కలిసి రూ.21,000/ పండిన పంట 20 క్వింటల్లు. అంటే ఒక్కో క్వింటాల్ రూ.1050 చొప్పున అమ్మాల్సి ఉంటుంది. అట్లా గాకుండా కుండకు రూ.30 చొప్పున అమ్మితే తయారు దారుకు రూ. 4 లాభం ఉంటుంది. నేను ఇంత రిస్క్ తీసుకొని కుండలు తయారు జేస్తున్న కనుక నాకు ఒక్క 4 రూ. లాభం తీసుకొంటే తప్పా? అనేది తయారు దారు వాదన,అవును తప్పే అనేది సత్యం. ఎందు కంటే అక్కడ ప్రతి ముడి సరుకుకు మానవ శ్రమకు విలువ కట్టిన తర్వాత అదనంగా ఇంకా ధర కలుపుకొని అమ్ముతాననడం అనైతికత కాదా? అయితే యిక్కడే తయారి దారు ఒక కొత్త జిమ్మిక్కు చేసి విషయం సామాన్యులకు అర్థం గాకుండా చేసున్నాడు. ఏమిటంటే? ఆ కుండకు ఆకర్షనీయమైన రంగు,అందమైన డిసైన్ చేయడానికి,అందులో నీళ్ళు చల్లగా ఉండడానికి నా పరిశోధకుడు ఎంతోకాలం శోధించి సంపాదించిన జ్ఞానం నేను కొనుగోలు చేసి ఇవి రూపొందించిన కనుక ధరను నేను 30 కాదు 40 చేసి అమ్మితే తప్ప నాకు గిట్టుబాటు కాదు అని ఒప్పిస్తాడు. ఈ ఇంటెలెచ్త్చువల్ ప్రాపర్టీ అనేది ఒక మోసం అని ఎందుకు అంటున్నామంటే జ్ఞానం అనేది సమాజానుగతం అయినది. నీళ్ళలో పడితే మునిగి పోతం,అగ్గిలో చేయిబెడితే కాలుతది అనేది మనకు ఎవరో పనిగట్టుకొని చెప్పిన సైన్స్ కాదు.సమాజం నుండి నేర్చుకోన్నదే.అయితే నీళ్ళు.నిప్పు నుండి విద్యుత్తూ,సంకర విత్తనాల నుండి అధిక దిగుబడి,అభివృద్ది చెందినా టెక్నాలజీ ద్వారా శ్రమ తగ్గడం, కంపూటర్ ద్వార పనే వేగా వంతం , ఇవన్ని పరిశోధనలే కదా? అవును ఆనాడు శాశ్త్రగ్నులు ఇప్పటే వాలే తమ ఆవిష్కరణలకు డబ్బులు అడుగలేదు కాని ఇప్పటి పరిస్తితి వేరు కనుక లాభాలు సంపాదించే అవకాశం ఇవ్వకుంటే అభివృద్ధికి పరిశోధనలు జరుగవు అంటున్నారు, కాని పరిశోధనలు ప్రభుత్వాల బాధ్యత అయి ఉండాలే.అయితే ఇక్కడ లాభం ఎట్లా వస్తున్నదంటే ధరలు అధికంగా నిర్ణయించడం వల్లనే అనేది స్పష్టం అయ్యింది కదా? పరిశ్రమలల్లో తయారైన ఉత్పత్తులకు ధరలు పరిశ్రమాదిపతులే ధరలు నిర్ణయించుకుంటారు. దానికి ప్రభుత్వాలు అడ్డుచేప్పావు.వాళ్ళు ఎంత ఎక్కువ ధరకు నిర్ణయించుకుంటారు అంటే ప్రతి వస్తువుకు ప్రకటన రేటు ఒకటి ఉంటె దాని పైన కమిషన్ పోను అమ్మకపు రేటు ఇంత అని ధరల పట్టిక డీలర్ వద్ద ఉంటుంది. ఇదంతా మోసం కాదా? మోసం లేకుంటే లాభం అనేదే ఉండదు.తక్కువ మోసం ఎక్కువ మోసం తప్పితే. ఇక వడ్ల ధరకు వద్దాం. వడ్లు పండించేది రైతు కాని అతని ఉత్పత్తికి ధర నిర్ణయించేది సర్కారు.రైతుకు గిట్టుబాటు ధర రాకుంటే అతడు నష్టపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నాడు. వీలయితే కూలీలకు తక్కువ కూలి ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది. కాని ఇప్పుడు పనికి ఆహార పథకం వచ్చిన తర్వాత రైతుకు ఆ అవకాశం కుడా లేకుండా పోయింది.ఆయనకు నష్టం వస్తే అప్పుల పాలై ఉన్నకాడికి అమ్ముకోవడం లేదంటే ఆత్మహత్యలకు పాల్పడడం.అదే పార్సిశ్రామిక వేత్తలకైతే బ్యాంకులు ప్రభుత్వాలు అండగా నిలుస్తున్నాయి. పెట్టుబడి దార్లు పారిశ్రామిక వేత్తలు ఈ సర్కారు మాది అనుకుంటున్నారు.కాని రైతులు,కూలీలు మాత్రం అలా అనుకొనే విధంగా ప్రభుత్వాల చర్యలు ఉండడం లేదు. pentaih.veeragoni

Monday, October 8, 2012

bio diversity meeting in hydrabad is a joke!


తెలంగానీయులను అపహాస్యం జేస్తున్న హైదరాబాద్ జీవ వైవిధ్య సదస్సు ! ఈ రోజు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ సదస్సులో మాట్లాడుతూ సేవ్ ఎర్త్, సేవ్ బయో దైవేర్సిటి అని ప్రజలకు పులుపునిచ్చినాడు.అసలు భూమిని కాని, జీవవైవిధ్యాన్ని కాని ధ్వంసం చేస్తున్నదెవరు? నిస్సందేహంగా ఆ పని చేస్తున్నది ప్రభుత్వాలే. ఎలాగో ఒక సారి పరిశీలిద్దాం.కరీంనగర్ జిల్లాలో కొన్ని కోట్ల సంవస్తరాల క్రితం భూమి ఏర్పడ్డనాడు పుడమి తల్లి పుక్కిలించి ఉమిసిన లావా గట్టి పడి గండు శిలలు గా మారిన క్రమం, ఆ గండు శిలలు మరికొన్నికోట్ల సంవస్తరాలు మంచుచే కప్పబడి ఉండడం, ఆ తర్వాత వాతావరణ ప్రభావం వలన క్రమంగా మంచుకరిగి నున్నని రాళ్ళు ఏర్పడడం అనేది అద్భుతము అయిన ఒక ప్రక్రుతి ప్రక్రియ.అనంతమయిన మంచు కరిగి బండ రాళ్ళను ఒరుసుకొని ప్రవహించిన ఫలితంగా పగిలిన రాళ్ళు దుమ్ము దుమ్ము అయి ఇసుక, మట్టిగా ఈ బండ రాళ్ళు రూపాంతరం చెందినాయి.కరిగిన మంచులో కొట్టుకొని పోకుండా మొండిగా నిలిచిన బండ రాళ్ళకు ఇన్ని కోట్ల సంవస్తరాల తర్వాత తాము గ్రానైటు సరుకై అటు ప్రభుత్వాలకు ఇటు క్వారీ యజమానులకు కరెన్సీ నోట్లము అయి సామాన్య ప్రజల బ్రతుకుల్లో బండలై పడుతామని పాపం మా సినారే అన్నట్లుగా మునులవోలె కారడవుల మూలలందు పడి ఉన్నఆ రాళ్ళ కు అప్పుడు తెలియదు. అలాగే ఇప్పుడుకరీంనగర్ లో మొత్తం 750 గుట్టలకు గ్రానైట్ క్వారీలు నడుస్తున్నందున ఆయా గుట్టల పైన నివసిస్తున్న గుడ్డేలుగులు,కోతులు, కొన్దేంగాలు,కొండచిలువలు,రామ చిలుకలు, నెమళ్ళు,గబ్బిలాలు,ఉడుతలు,తేనెటీగలు తమ ఆవాసాలు కొల్లగొట్టబడి నందున ఊళ్ళ పైన పడి మనుషుల చేతుల్లో చచ్చిపోతున్నాయి.సీతా ఫలాలు,దొరుకుత లేవు.పశువులకు మేతదొరుకక గొడ్డు,గొర్రె అంతరించి పాలు ,మాంసం దొరకటం గగనమే అయింది.వర్షాన్ని కురుపింప జేసే పర్వతాలు లేనందున వర్షాలు పడక వాగులు ఒంకలు పొర్లి పొంగక చెర్లు నిండక చేపలు దొరుకక పోవడం మాత్రమె గాదు వ్యవసాయాలు కూడా సాగడం లేదు. భుగర్భ జలాలు అడుగంటే పోయి తాగడానికి నీళ్ళు దొరుకని పరిస్తితి.ఇదంతా అభివ్రుద్దియే అంటున్నది ప్రభుత్వం, దాని ఘనులఅభివృద్ధి శాఖ....పైన జెప్పిన జీవులన్నీ అంతరించి పోవడానికి ప్రభుత్వ విధానాలే కారణం. ఇక మరో విషయం,ఇదే జిల్లాలో తిమ్మాపూర్ అనే మండలం లో పర్ల పెళ్లి అని ఒక మేజర్ గ్రామం ఉన్నది.అక్కడ చుట్టూ పక్కల వరి, మొక్క జొన్న విస్తారంగా పండించడానికి కారణం లోయర్ మానేరు డ్యాం సమీపాననే ఈ ఉరు ఉండడం.పచ్చని పంటపొలాలతో అలరారుతున్న ఈ గ్రామానికి ఇప్పుడు ప్రభుత్వం ఒక చీడ పట్టించింది. అది హరిత బయో ప్రోడక్ట్ కంపని.ప్రభుత్వం తన విధానాల్లో భాగంగా పెట్రోల్ కొనుగోలుకు విదేశీ మారకం ఆదా చేయాలనే కారణం తో బాటుగా వాతావరణ కాలుష్యాన్ని తగ్గించాలనే కారణం చూపుతూ పెట్రోల్ లో20% ఇథనాల్ కలిపి ఇందనం వాడాలని నిశ్చయించింది.అందులో భాగంగా అభివృద్ధి చెందిన దేశాలల్లో పర్యావరణ రక్షణ ఉద్యమాల వలన మూతబడిన పాత అవుట్ డేటెడ్ టెక్నాలజీ మిషనరీలను అతి తక్కువ ధరలకు ఇక్కడి పెట్టుబడి దారులకు సాంకేతిక సహాయం పేరుతొ అక్కడి ప్రభ్య్త్వాలు సప్లై చేసినాయి.అట్లా హరిత బయో కంపని యజమాని పర్లపల్లికి రావడానికి, కిరణ్కుమార్ సామాజిక వర్గానికి ఆ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్సి సైలెంట్ వర్కింగ్ పార్టనర్ కావడం కారణమయింది.అప్పటి సర్పంచ్ కూడా అదే సామాజిక వార్గానికి చెందిన వాడు అయినందున తనను వాళ్ళు మోసం చేయరన్న నమ్మకం తో వాళ్ళు చెప్పిన చోటనల్ల సంతకాలు చేసిండు. గత సంవస్తరం కంపని స్టార్ట్ అయింది.ఈ కంపని మొక్క జొన్న్, బియ్యం నూక తో ఇతోనాల్ తయారు చేస్తుంది.ఈ బియ్యం నూక లో కూడా ఒక మోసమే. బ్లాక్ మార్కెట్ అయిన ఉచిత రెండు రూపాయల కిలో బియ్యం లారీల కొద్ది ఇక్కడికే చేరిన కూడా అధికార పార్టి వాళ్ళది కనుక ఎవరు అడ్డగించఋ. సరే ఆ బియ్యాన్ని మరియు మక్కలను పెద్ద పెద్ద నీటి తోట్లల్లో పులియ బెడుతారు.అలా పులియ బెట్టడానికి ఒక లీటర్ ఇతోనాల్ తయారీకి 25 లీటర్ల నీరు కావాలి.అంటే దీని కెపాసిటీ రోజుకు 60 ,౦౦౦ లీటర్ల ఎతోనల్ తాయారు చేస్తుంది కనుక రోజుకు దీని నీళ్ళ వాడకం 15 లక్షల లీటర్ల నీరు. అట్లా మురిగిన 15 లక్షల లీటర్ల నీటిని రోజు బయటికి వదలడం వలన వాయు కాలుష్యం జరిగి గబ్బు కంపు వాసన దానితో ఆ చుట్టూ పక్కల పర్లపెల్లి,మొగిలిపాలెం,పీసుపల్లె,ములకనూరు,కొత్తపల్లి,నల్లగొండ,నాతకానిపల్లె,పోలంపల్లి,ఇప్పలపల్లె,నుస్తులాపూర్,మల్లాపూర్ ,మన్నేమ్పల్లి 12 గ్రామాల కు చెందిన దాదాపు యాబయ్ వేల మంది జనాబాకు వాంతులు, శరీరాల పైన దద్దులు, గర్బిణీ స్తీలకు గర్భ స్రావాలు అయిన సందర్భం కూడా ఉన్నది.అలాగే ఈ 15 లక్షల లీటర్ల నీరు భూమిలోకి ఇంకి పోయి జల కాలుష్యం ఏర్పడి త్రాగునీరు కలుషితం అయిపోయి వాంతులు విరోచనాలు,కరీంనగర్ నుండి వైద్య బృందం వెళ్లి ప్రజల అభియోగాలు వాస్తవమే నని చెప్పినాయి,ఈ 12 గ్రామాల కు చెందిన 50 వేల జనాభా,వారికి అన్నపానీయాలు అందిస్తున్న 45 వేల ఎకరాల సాగు భూమి,30 చెరువులు,100 కుంటల అస్తిత్వం ప్రశ్నార్థకం అయిన సందర్భం లో ప్రజలు ప్రతినిద్యాలు చేయడం మొదలుకొని ధర్నాలు రాస్త్త రోకో లు చేసి విసిగి పోయి ఆకరుకు ప్రజలంతా కలిసి కంపనిని ఆపి వేసిన తర్వాత పర్యావరణ శాఖ స్పందించి ప్రజల అభ్యంతరాలు వాస్తవమేనని తాత్కాలికంగా కంపనీని మూసి వేసింది. కాని హైదరాబాద్ లెవల్లో యజమానులకు ఉన్న పరపతిని ఉపయోగించుకొని మళ్ళీ కంపని తెరువడానికి అనుమతి తెచ్చుకున్నారు. ఎంతగానో పోరాడి కేసులు జైళ్ళ పాలు అయి మురుగును మూసివేయించుకుంటే ప్రభుత్వ పెద్దలు మల్లి ఈ పాకి ని తమ పైన రుద్దినారు గదా అని ఆందోళన చెందిన ప్రజలు ఈ రోజు దాదాపు ఒక 500 మంది మహిళలు సాయంత్రం రెండున్నర గంటల ప్రాంతం లో కలెక్టరేట్ ముట్టడించినారు.ఈ బయో ప్రాడక్ట్ విషాల వలన ఉర పిచ్చుకలు, బల్లులు చనిపోతున్నాయి.ఎలుకలు పిల్లులు కూడా ఆ నీళ్ళు ద్రాగి చనిపోతున్నాయి. రాష్ట్ర రాజధానిలో జీవ వైవిధ్య సదస్సు గురించి అంతంత గొప్పగొప్ప మాటలు చెబుతున్నా ఓ ప్రభుత్వమా 193 దేశాలల్లో పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిస్తున్నారే! మరి ఇక్కడ మా 12 గ్రామాల 50 వేల మంది ప్రజల ప్రాథమిక హక్కు అయిన జీవించే హక్కును కోల్పోతున్నాము,మా ఉర పిచ్చుకలు మా బల్లులు మా పిల్లలు అన్యాయమై పోతుంటే మేము ఐదు గంటల నుండి ఓ ప్రభుత్వమా మా కస్టాలు వినరండి అని మండుటెండలో మహిళలం పిల్ల పాపాలను వదిలి మీ కార్యాలయం ముందు పడిగాపులు పడి ఉన్నాము అని గొంతు ఎండిపోయేదాకా నినాదాలు చేసినారు.ఓ నాగరికమయిన ,ఆధునికమైన కరీంనగర్ ప్రజలారా!వినండి , ఈ సమస్య మా ఒక్కరిదే కాదు,రోజుకు 15 లక్షల లీటర్ల నీటిని ప్రస్తుతం మా భూగర్భం నుండే ఇస్తున్నా,,ఇప్పుడు కంపని మానేరు డ్యాం నుండి ఆ నీటిని తీసుకోవడానికి అనుమతి పొందింది,ఇప్పుడే మీకు రోజు విడిచి రోజు నీళ్ళు వస్తున్నాయి, మరి 15 లక్షల లీటర్లనీల్ల్లు రోజు బయో కంపనీకి పొతే కరీంనగర్, హనుమకొండ పట్టణవాసులకు విపరీతమయిన త్రాగు నీటి సమస్య వస్తుంది అని ఆ అమాయక పల్లె జనం నగరవాసులకు జ్ఞానోదయం కలుగ జేసినారు ఓ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమా! నీ పాలనా లోని 12 గ్రామాల కు చెందిన 50 వేల మంది కే స్వచ్చ మైన గాలి, స్వచ్చమైన నీరు, ఆరోగ్యంగా బ్రతికే ప్రాథమిక హక్కుకే భద్రత కల్పించ లేని నువ్వు 193 దేశాలకు చెందిన 200 కోట్ల పై చిలుకు ప్రజలకు ఏమి జీవ వైవిధ్యాన్ని ఉద్భోదిస్తావని పర్ల పల్లి బయో ప్రాడక్ట్ ను వ్యతిరేకించే ప్రజలంతా ఇవ్వాళ నిలదీస్తున్నారు. పెంటయ్య. వీరగొని విశ్రాంత విద్యా పర్యవేక్షనాదికారి, పర్యావరణ కార్యకర్త,

Friday, October 5, 2012


అది కరీంనగర్ జిల్లా కేంద్రానికి ఆగ్నేయంగా ఉన్న చిన్న గ్రామం, సర్వాయి పేట.. అక్కడ ఎప్పుడో 1675 లో సర్వాయి పాపన్న నిర్మించిన ఒక కోట శితిలావస్తలో ఉంది. అలనాడు సర్వాయి పాపన్న దాచిపెట్టిన సంపద దొరుకుతుంది అన్న అత్యాశ తో గుప్త ధనం కోసం కోటలోని చాల భాగాన్ని తవ్వి పోసినారు. తెలంగాణా కు చరిత్రే లేదని బుకాయించే సీమాంధ్ర పాలకవర్గాలు చారిత్రిక ఆధారాలను కాపాడడం లో విఫలం అయినారు. కోటకు కొద్ది దూరం లోనే సర్వాయి పాపన్న నిర్మించిన సర్వాయి చెరువు ఇంకా చెక్కు చెదరకుండా ఉంది. ఊరికి మధ్యలో ఉన్న కోట ముఖ ద్వారం, దానిని అనుకోని ఉన్న బురుజు అలనాటి దర్పానికి గుర్తుగా ఇంకా అలాగే ఠీవిగా నిలబడి ఉన్నాయి. ఆ బురుజు పైన ఫిరంగులు పెట్టి శత్రువులను నిలువరించే వారట. అక్కడినుండి భూమిలో గుండా కొమ్ముగుట్ట పైన ఉన్న కోటకు దారి ఉండేదంటారు. బురుజు పక్కన్నే పెద్ద బావి ఉన్నది.కోట ముఖద్వారం ఈ బురుజు ను ఆనుకొని ఎత్తయిన ప్రాకారం చాల వరకు శిథిలమై ఉన్నది. ఆ కోట ముఖద్వారం వద్దా కూర్చొని ఆనాటి పాపన్న గుర్రపు డెక్కల చప్పుడు ఏమైనా వినిపిస్తుందో ఏమో నని భూమికి చెవు ఆనించి విన్న గూడా 350 ఏండ్ల కింద గాలిలో కలిసిన ఆ శబ్ద తరంగాలను వినలేక పోయాము. కాని ఆ బండ రాళ్ళ పైన ఆయన హస్త ముద్రికలను , ఎత్తయిన ఆ బురుజుల పైన ఆయన నడయాడిన కాలి ముద్రల ఆనవాళ్ళను పోల్చుకొనే ప్రయత్నం లో అక్కడ నుండి కదిలినాము., అలనాడు దొరల భూస్వాముల ఆగడాలను అరికట్టడం లో అయన కూడ గట్టిన ఆ దళిత బహుజన సైన్యాలు ఎంతటి నిర్భీతి తో ఎంతటి ధైర్య సాహసాలతో ఆ నేల పైన నడయాడినాయో కదా అన్న తన్మయత్నం అక్కడనుండి కదుల లేక కదుల లేక మెల్లగా కొమ్ముగుట్ట వైపు బయలు దేరి పోయినాము. గొల్ల పల్లి, ఉమ్మాపురం గ్రామాల గుండా సాగిన మా ప్రయాణం కొమ్ముగుట్ట, బయ్యన్న గుట్ట, మూడురోకండ్ల గుట్ట, ఇట్లా ముప్పై యారు గుట్టల శ్రేణి లో తలమానికంగా ఉన్న కొమ్ముగుట్ట పాదాల నుండి ప్రయాణం సాగుతుంటే నెమలి పక్షుల కూతలు మనుషులు పిలిచినట్టుగా వినిపిస్తున్నాయి. శత్రువులు ఎవరో వస్తున్నారు జాగ్రత్త అని అలనాడు సర్వాయి పాపన్న్నకు కూడా ఇట్లాగే ఈ ప్రక్రుతి సహకరించింది కావచ్చు అనిపించింది. ఆ చిట్టడివి చెట్ల సందుల నుండి పోతుంటే చిన్న కాలి దారి వొకటి కనిపించింది.ఆ కాలి దారెంట పొతూ ఉంటె సీతాకోకలు గుంపులు గుంపులు గ బండ రాళ్ళ పైన ఉన్న, మట్టి పైన ఉన్న మాధుర్యాన్ని గ్రోలటానికి కాబోలు కింద వాలుతూ పైకి లేస్తూ వాటి ఆకలి పోరాటం సాగిస్తున్నాయి, అలాగే దాదాపు ఒక అరగంట నడిచిన తర్వాత బండ రాళ్ళ సందుల గుండా వస్తున్న సెలయేళ్ల ధారలు, అక్కడక్కడ చిన్న చిన్న మడుగులు. అబ్బ నీళ్ళు ఎంత స్వచ్చంగా ఉన్నాయి కదా ఇక్కడ అనిపించింది. అప్పటికే మిట్ట మధ్యాహ్నం అయి నందున మేము తెచ్చుకున్న నీళ్ళ బాటిల్స్ అయిపోయినందున ఆ బండల పైనుండి జల జలా వస్తున్న సెలయేటి నీటిని దోసిటి నిండా పట్టుకొని తాగినాము. అసలు మినరల్ వాటర్ అంటే అవి. . ఎంత చల్లగా ఎంత కమ్మగా ఉన్నాయో కదా ఆ నీళ్ళు. ప్రకృతిని ఆస్వాదిస్తూ వెళ్ళిన మేము సరిగా గమనించ లేదు కాని అప్పటికే మేము పోతున్న దారి అన్ని చిన్న చిన్న దారులు గా విడి పోయింది . ఏ దారి గుండా వెళ్ళాలో అర్థం కావడం లేదు. సరే ఏదో ఒక దారి అనుకోని ఒక దారి గుండా వెల్లినాము. అయితే అ దారి మమ్ములను సర్వై పాపన్న నిర్మించుకున్న కోట వైపు కాకుండా మరో వైపు కు తీసుకొని పోతున్నది. అయితే అప్పటికే బాగా అలిసి పోయిన మేము ఏమి చేద్దాం తిరిగి వాపసు పోదామా , ఇంతకష్ట పడివచ్చి అయన నివసించిన స్తావరం చూడకుండా నే వెళ్ళిపోవడం ఎట్లా అని మీమాంస లో ఉండగా మా టీం సభ్యుల్లో ఒకరు అగాగో కోట గోడ అంటూ చుపెడుతున్నారు.ఉత్సాహం తో అందరం అటువైపు చూసినాము. దూరంగా చాల ఎత్తులో ఒక పాకురుబట్టిన పాత బండ రాళ్ళ గోడ ఒకటి కనిపించింది.ఏదో గొప్ప నిధి దొరికినట్టుగా అందరం బిరా బిరా అటువైపు అడుగులు వేసినం. కంటికైతే కనిపిస్తున్నది కాని దాని లోనికి పోవడానికి ద్వారం దొరుకుత లేదు.ఎటు వైపు పోయినా ఎక్కి దాట వీలు గాని కోట గోడనే అడ్డం వస్తున్నది. అరె ఆ కాలం ల ఇక్కడ ఇంతటి శత్రు దుర్భేద్యమైన కోట కట్టుకోవచ్చునని అతి సామాన్యుడు, ఒక కళ్ళు గీత వృత్తి దారునికి ఇంతటి ఇంజనీరింగ్ పరిజ్ఞానం ఎట్లా కలిగిందోకదా అని అబ్బురపడ్డాము. అయితే మాకు తెలిసింది ఏమిటంటే ఆ కోట లోపలికి పోవడానికి ఒకే ద్వారం ఉన్నదట.చివరికి మా టీం సభ్యులు చెట్లు ఆకుల తో ముసి ఉన్న ఒక ద్వారం కనుగొన్నారు. ఆ ద్వారం గుండా లోపలి పోయినాము. విశాలమయిన బండ రాళ్ళు. అక్కడ ఒక ఎత్తయిన రాయి పైన పాపన్న కూర్చునేవాడు అని ఒక రాతి సింహాసనం వంటి పెద్ద బండ రాయినే చూపినారు. అక్కడ నుండి శత్రువుల ఆచూకీని చూడడానికి రెండు వైపులా ఎత్తయిన బురుజులు ఉన్నాయి అయితే అవి చాల వరకు శిథిల మై పునాదులు, కొన్ని కొన్ని నిర్మాణాలు ఉన్నాయి. అక్కడ నుండి కొంత దూరం వెళ్ళిన తర్వాత కాలక్షేపానికి ఆడుకొనే పులి జూదం పటం బండ పైన చెక్కి ఉన్నది. దాని కి కొంచం ఎడమ వైపు ఒక హనుమంతుని విగ్రహం చెక్కి ఉన్నది. కాని అది పాపన్న కాలం లో చెక్కినది కాకపోవచ్చుననుకొనే వారు ఉన్నారు. ఎందుకంటే పాపన్న బ్రాహ్మనీయ సంస్కృతిని పెద్దగ అభిమానించిన ఆధారాలు ఎక్కడ కనిపించడం లేదు.ఎందుకంటే ఆసియా ఖండం లోని అత్యంత ఉన్నతమైన స్తూపం నిర్మించబడి రాజ్యం చే ధ్వంసం చేయబడిన హుస్నా బాద్ పట్టణం లో సర్వాయిపాపన్న చేత మట్టి తో నిర్మించ బడ్డ పోచమ్మ గుడి ఉన్నది.దాని పూజారి గా కూడా ఒక దళిత మహిలనే నియమించి నట్లు గా ఆధారాలు ఉన్నాయి. అంతే గాకుండా ఆయనకు సమయం చిక్కినపుడల్లా రక్షణ స్తావరాలు నిర్మించుకోవడం,ప్రజల కష్టసుఖాలు తెల్సుకోవడం, శత్రువులు వసూలు చేస్తున్న పన్నులు చెల్లించ వద్దని ప్రజలను చైతన్య పరచడం. లాంటి పనులతోని తీరిక లేకుండా ఉన్న వాస్తవ వాది. ఛత్రపతి శివాజీ సమకాలికుడు అయిన పాపన్న శివాజీ వలె గుళ్ళు, గోపురాలు కట్టి ఉంటె బ్రాహ్మణా సమాజం పాపన్న చరిత్రను కుడా గ్రంధస్తం చేసి ఉండేది.మొఘల్ చక్రవర్తులను ఎదిరిస్తున్నాడు కనుక మహ్మదీయ చరిత్ర కారులు, మొఘల్ చక్రవర్తులకు తాబెదార్లు గా, పన్నులు వసూలు జేసి ఇస్తూ వారికంటే క్రూరంగా ప్రజలను హింసిస్తున్న స్తానిక హైందవ దొరలను చీల్చి చండాడుతున్నాడు కనుక హైందవ చరిత్ర కారులు పాపన్న చేరిత్రను ఎక్కడ గ్రంధస్తం చేయలేదు. అయిన ప్రజా నాలుకల పైన ఆశువు గా వచ్చిన పాపన్న చరిత్రను జానపదులు తమదయిన వీరోచిత , తమదైన సంస్కృతితో ఈ తరం దాక తమ నాలుకల పైన మోసుకొని తెచ్చినారు. ఆ కొండ పైన రెండు పెద్ద బండ రాళ్ళ మధ్యన ఉన్న చిన్న చిన్న రాళ్ళు, మట్టిని తొలిగించి అక్కడ ఆ గుట్ట పైన రెండు కోనేరులను నిర్మించినాడు.ఆ కోనేరులోనికి దిగడానికి మెట్లు సైతం చెక్కించి నాడు.సముద్ర మట్టం నుండి దాదాపు 300 మీటర్ల ఎత్తున ఉన్న ఇతని కోటపైన సహజ సిద్ధమైన కోనేరులు నిర్మించుకొని ప్రకృతిని సైతం అక్కడ తన అధీనం లో ఉంచుకో గలిగినంతటి ఇంజనీరింగ్ నైపుణ్యం కలిగిన అసాధరణమైన ఒక సామాన్య మనిషి పాపన్న.కొండ పై భాగాన ఉన్న శిల్పాలు కొన్ని చూసి కిందకి ప్రయాణం అయినాము. అయితే పాపన్న ఆరాధించే ఒక ప్రక్రుతి శిల్పం, దాని పేరు.బయ్యన్న, అది మాకు ఎక్కడా కనిపించలేదు. అది చూడ లేక పోయామే అన్న అసంతృప్తి మాకుఉన్నది. . కాని అప్పటేకే బాగా అలిసి పోయి ఉన్నాము .పైగా సూర్యుడు మాకంటే ముందుగానే తిరుగు ప్రయాణం లో ఉండీ మమ్ములను వేగిర పెడుతున్నాడు.అలనాడు గుర్రాలు సైతం ఎక్కినా గుట్టల పైనకు మాకు పోవడానికే గాదు రావడానికి కూడా చాల కష్టం అవుతున్నది. బండల పైనుండి జారుతూ చెట్ల ఉడలు పట్టుకొని , మెల్ల మెల్లగా కిందికి వస్తున్నాము ఒక్కసారిగా దాదాపు ఏడు ఫీట్ల ఎత్తుగా ఉన్న బయ్యన్న విగ్రహం మాకు అడ్డంగా వచ్చింది నన్ను దర్శించుకోకుండానే మిమ్ములను పోనిస్తానా అన్నట్లు గ మాకు అయన తారస పడేసరికి చాల ఆనంద ఆశ్చర్యాలు కలిగినాయి. కోర మీసాలు, ఏడు చేతులు,ప్రతి చేతిలో ఒక ఆయుధం, ఆ ఆయుధాలన్నీ కూడా ప్రకృతియే.ఇనుప శూలం,విల్లంబులు,పడగ విప్పిన నాగుపాము,అర్ధ చంద్రుడు,డమరుకం,కమలం, యమపాశం,ఉన్నాయ్. ఒక కుక్క,బుద్దుడు,నరుకబడిన శత్రువు తల ఉన్నాయి.దిగంబరంగా చెక్కిన్చుకోబడ్డ ఈ విగ్రహానికి పాపన్న కోట లోనికి వచ్చేటప్పుడు,కోటలోనుండిబయటికి పోయేటప్పుడు పూజున్చుకొని పోయే వాడట. ఆ విగ్రహం కింద నిధి ఉండవచునో ఏమో అనుకోని దుండగులు.తవ్వినారు.విగ్రహం పక్కనుండి తెల్లని సెలయేరు పారుతున్నది.బయ్యన్నను దర్శించుకున్నామన్న సంతోషం మా అలసటను తొలగించింది.చల్లని తెల్లని సెలయేటి నీరు కడుపునిండా తాగి మనుసు నిండా పాపన్న చరిత్రను తలుచుకొంటూ తిరుగు ప్రయాణం అయినాము. గుట్ట దిగువన మరో చారిత్రిక మైదానం . అదే దండు దుబ్బ. తన సైన్యానికి పాపన్న అక్కడే శిక్షణ ఇచ్చేవాడట. సామాన్యులకు, సంపద సృస్తికర్తలకు సరైన వాటా లభించాలంటే సాయుధ పోరు చేయక తప్పదని 375 సంవస్తరాల కింద నే మార్క్స్ మాటే లేని రోజుల్లో మన సర్వాయి పాపన్న మహ్మదీయులైన మొఘల్ లను, హైన్దవులయిన స్తానిక దొరలను ఎదిరించడానికి ఒక చాకలి సర్వాన్న, ఒక మంగలి మాదన్న, ఒక జక్కుల పెరుమండ్లు,ఒక దూదేకుల పీర్ సాహెబ్,లాంటి దళిత బహుజనులతో దండు గట్టి సాయుధ పోరు జేసి దళిత బహుజనుల రాజ్యం సాధించుకున్నాడు.ఇంతటి మహత్తర దార్శనికుడు., ఇంతటి గొప్ప యుద్ద్దవీరుడు,ఇంతటి ప్రజాపక్షపాతి,సంపద సృష్టికర్తలకు సంపద దక్కాలన్న సమ సమాజ వాది యొక్క చరిత్ర గాని, ఒక విగ్రహం గాని తెలంగాణా లో అందునా ఆయన పుట్టిన వరంగల్ జిల్లలో గాని,అయన సమరం జేసిన పొలాస జగిత్యాల, కరీంనగర్ లో గాని లేదా గోల్కొండానే జయించిన ఈ విప్లవ యోధుని విగ్రహం హైదరాబాద్ ట్యాంక్ బండ్ పైన గాని పెట్టుమని అడుగడానికి కారణం చరిత్ర తెలియక పోవడం ఒక కారణమయితే దళిత బహుజనులలో తమ ఆత్మ గౌరవ ఉనికి కై తమ అస్తిత్వాలను నిలుపుకోవడానికి తెగించి పోరాడాలన్న సీరియెస్ నేస లేక పోవడం మరో కారణం. సంపద సృస్తికర్తలకు సమ న్యాయం జరుగాలని అనోకొనే వారు,అగ్రకుల ఆధిపత్యాన్ని ధిక్కరించే వాళ్ళు,ఇప్పటికయినా ఒక్కటయ్యి ,375 ఏండ్ల కిందనే మొఘల్ సామ్రాజ్య వాదాన్ని ఎదిరించి, అగ్రకుల హైందవ పాలనను ఓడించి, ప్రకృతినే ఆరాధించి ,దళిత బహుజలతోదండు గట్టి సాయుధ పోరుజేసిన తెలంగాణా దేశీ దార్శనికుని మార్గం లో ఆలోచించి రాజ్యాధికారం దిశలో ఆలోచించాల్సిన అవసరాన్ని గుర్తించవలసి ఉన్నది. పెంటయ్య.వీరగొని. విశ్రాంత విద్యపర్యవేక్షనాదికారి. న్యాయవాది.

Monday, September 24, 2012


సకల జనుల సమ్మె విరమించ బడిన తర్వాత తెలంగాణా ఉద్యమం పని అయిపోయిందని సమైక్య వాదులు సంబరపడి పొతే తెలంగాణా ప్రజలు కూడా కొందరు ఇంత పెద్ద ఉద్యమం ఆబాలగోపాలం అందరు పాల్గొని ఇన్ని రోజులు ఇంత త్యాగం తో ఇంత ప్రశాంతంగా ఇంత ఉత్తేజంగా ఇంత ప్రజాస్వామ్య యుతంగా పోరాటం జేస్తే గూడా ప్రత్యేక రాష్ట్రం సాధ్య పడలేదు గనుక ఇక మనం ఎంత కొట్లాడినా ఏమీ లాభం అనుకోని నిరాశ పడ్డారు. ఇప్పుడు తలపెట్టిన సెప్టెంబర్ 30 లాంటి ర్యాలి సమ్మె సందర్భం లో జేస్తే ప్రజల ప్రతిస్పందన భాగస్వామ్యం బాగా ఉండేది, ప్రభుత్వం దిగివచ్చేదని, చేయ వలసిన సమయం లో చేయకుండా తెలంగాణా రాష్ట్ర సిద్ధిని వాయిదా వేయడం లో అన్ని రాజకీయ పార్టీల తోబాటుగా జాకులు గూడా తమ బాధ్యత ఏమీ లేదని అంటే ప్రజలు నమ్మే పరిస్తితి లేదు. 1948 కి ముందే ప్రారంభ మైన గయిర్ ముల్కి గో బ్యాక్ నినాదం 1969 నాటికి రక్తం చిందించ గలిగినంతటి తీవ్ర స్తాయికి వెళ్ళిపోయింది.369 మంది అస్తిపంజరాలతో ముఖ్యమంత్రి సింహాసనాన్ని చేక్కిన్చుకున్న మర్రిచేన్న రెడ్డి ఒక్కడే తెలంగాణా ద్రోహి కాదు, ఆయనతో బాటుగా రాజ్యాధికారం పచుకున్న రాజకీయ నాయకులు అందరితో బాటుగా ఎమ్మెల్సి పదవులు పొందిన ఉద్యోగ సంగాల నాయకులూ కూడా భాగస్వాములే. 1970 నుండి 1997 లో తెలంగాణా జనసభ ఆవిర్భావం దాక ఈ 27 ఏండ్ల సుదీర్ఘ కాలం తెలంగాణా వాదం తెలంగాణా ప్రజల గుండెల్లో గూడు కట్టుకొని పదిలంగా అలాగే ఉంది. వరంగల్ డిక్లరేషన్ నాటి ఊరేగింపు లో ckm కాలేజి నుండి బస్సు స్టాండ్ ముందున్న స్పోర్ట్స్ గ్రౌండ్ దాక సాగిన ప్రజల కవాతు లో పెల్లుభికిన ఉత్సాహం చూసిన తర్వాతనే సీమాంధ్ర పాలకుల పాలన పట్ల ప్రజలు ఎంతగా ఏవగించు కుంటున్నారో అర్థం అయ్యింది . 1997 నుండి 2004 వరకు ఈ ఏడేండ్ల కాలం లో తెలంగాణా ప్రజలను, తెలంగాణా వాదాన్ని, తెలంగాణా రైతులను, యువకులను , విద్యార్థులను అత్యంత కిరాతకంగా అణిచి వేసి వ్యక్తులను నిర్మూలించడం ద్వారా ఉద్యమాలను లేకుండా చేయచ్చునన్న ఒక తప్పుడు అవగాహనతో ఒక బెల్లి లలితను, ఒక కనక చారి లాంటి ఎందరోతెలంగాణా ఉద్యమ కారులను హత్యలు గావించి న చంద్రబాబు నాయుడు సర్కారు తెలంగాణా వాదాన్ని ప్రజల్లో లేకుండా చేయ లేక పోయింది.2004 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఏకంగా , తెలంగాణా వాదానికి వ్యతితెకంగా , బహుళ జాతి కంపనీల వ్యాపారాలకు అనుకూలంగా tips , trims intellectual property rights ఎజెండాగా, తన మానిఫెస్టో తో ఎన్నికలకు దిగింది. ఆంధ్ర , తెలంగాణా తేడ లేకుండా అన్ని ప్రాంతాల్లో చెంద్రబాబు పాలసీని ప్రజలు తిరస్కరించినారు.చెంద్రబాబు నాయుడు క్రూర నిర్బంధ పాలన వలన రెక్కలు తెగిన పక్షి వలె గాయ పడి ఉన్న తెలంగాణా వాదాన్ని 2000 సం. లో కెసిఆర్ చేతిలోకి తీసుకున్నాడు.అణిచివేత నుండి కొంత వెసులు బాటు దొరికిన తెలంగాణా ప్రజలు కేసీఆర్ చెంతన సేద దీరి ఆయనకు బంగారు బాతుగుడ్లనే బహుకరించారు. కాని అక్కడనే అయన ప్రజల వైపు నుండి గాక ప్రభుత్వం లో చేరిపోయి కాంట్రాక్టులు కమిషన్లు గురించి మంతనాలు సాగిస్తుంటే ఒక వైపు ప్రజలు దూరం గావడం మరో వైపు ఉన్న ఏమ్మేల్లెలు ఊసి పోవడం తో రాజశేకర్ రెడ్డి తన సర్కారు నుండి బయటకు వెళ్లి పోయే పరిస్తితి కల్పించిండు. బై ఎలెక్షన్ల తో చావుదప్పి కన్ను లొట్ట బోయినట్టు అయింది.మొదటి నుండి కేసీఆర్ ఉద్యమాలు వద్దు లాబీయింగ్ ద్వారానే తెలంగాణా నేను సాధించి పెడుతానంటే , తేరగా వస్తుంటే ఎందుకు తిప్పల బడాలె అనుకొనే కొందరు అరె అయన పద్దతిలో అయన పోతుండు, మీరు కావాలంటే కొట్లాడుకోండి అన్నారు. అందుకే మిలియన్ మార్చ్ వద్దన్నాడు, సకల జనుల సమ్మె అనే సంకుల సమరం ఒక వైపు ముమ్మరంగా సాగుతుంటే ప్రధాన నాయకత్వం యుద్ధ రంగాన్ని వదిలేసి రాయబారానికి హస్తినాపురికి వెళ్ళింది. ఇందులో ఏదో మతులబు ఉండే ఉంటుంది అనుకొన్నారు అమాయకమ్మన్యులు కొందరు. పర్కాల ఉప ఎన్నికల తర్వాత సెప్టెంబర్ 29 నాటికి తెలంగాణా ఇవ్వకుంటే 30 నాడు తెలంగాణా ప్రజలంతా పెద్ద ఎత్తున హైదరాబాద్ కు మార్చ్ చేస్తామని పొలిటికల్ జే ఎసి ప్రకటించింది. రేపో మాపో ఒకవైపు తెలంగాణా వస్తా ఉంటె ఇంకా ఈ ఉద్యమాలతో ఏమి పని అని నాకు సిగ్నల్స్ వస్తున్న్నాయి అని అన్నవాళ్లు ఉన్నారు.. ఇట్లా ఎన్నో సార్లు వచ్చే దసరా, వచ్చే దీపావళి, వచ్చే ఉగాది, వచ్చే రంజాన్, వచ్చే బక్రీద్, వచ్చే స్వతంత్ర దినోత్సవం ఇక మన తెలంగాణా రాష్ట్రం లోనే అనంగా వినీ, వినీ విసుగుజెందిన ప్రజలు తమ మానాన తాము 30 నాటి మార్చ్ కోసం తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు. మీరు చేసుకుంటే ఉద్యమాలు చేసుకోండి నేను మాత్రం ఇగో చుడుండి లాబీయింగ్ తోనే తెలంగాణా తెస్తానని గత 20 రోజులనుండి డిల్లీ లో దిగే గడపా ,ఎక్కే గడప తో ఫుల్ బిజీ. ఆఖరుకు వాళ్ళు తెలంగాణా ప్రకటించక ముందే TRS ను ఆఫర్ జేసిండు. ప్రణబ్ కుఖర్జీ కమిటీ వలె, రోశయ్య కమిటి వలె,శ్రీకృష్ణ కమిటి వలె ఒక కమిటి వచ్చినా , లేదా సిక్స్ పాయింట్ ఫార్ముల వలెనో, 610 జివో వలెనో ప్రాంతీయ మండల్ వలెనో ఒక ప్యాకేజి వచ్చినా ఇంకేంది ఇగ తెలంగాణా వచ్చినట్లే సంబురాలు జేసుకుందాం రండని పిలుపు ఇచ్చేటట్లు ఉన్నారు. కాని తెలంగాణా ప్రజలు ఇప్పటికే లెక్క లేనన్ని సార్లు, కమిటీల పేరుతొ ప్యాకేజీల పేరుతొ మోసపోయి ఉన్నారు.తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు దప్ప మరే విషయాన్ని గూడా తెలంగాణా ప్రజలు అంగీకరించరు. కనుక రాజకీయ నాయకుల మాయోపాయ ఉచ్చులలో ప్రజలు చిక్కుకొని 30 సెప్టెంబర్ మార్చ్ ను ఎట్టి పరిస్తితిలో గూడా వాయిదా వేసుకోవద్దు. అలాంటిది ఏదయినా జరిగితే మాత్రం ఇక చాల కాలం దాక ఏ నాయకత్వాన్ని గూడా తెలంగాణా ప్రజలు నమ్మని ఒక నిస్సహాయ స్తితికి తెలంగాణా ఉద్యమాలు నేట్టివేయబడుతాయి. అందుకని నాయకత్వం బహుపరాక్! వీరగొని పెంటయ్య. విశ్రాంత విద్యా పర్యవేక్షనాదికారి తెలంగాణా ప్రజా ఫ్రంట్, కరీంనగర్.

Tuesday, April 17, 2012

ఈ ఏప్రిల్ 20 తో ఇంద్రవెల్లి మారణకాండకు 31 సంవస్తరాలు. 1981 ఏప్రిల్ 2o న గిరిజన రైతు కూలి సభ ఆధ్వర్యం లో గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములు వారికే చెందేవిధంగా పట్టాలు ఇవ్వాలని, ఎందుకంటే అప్పటికే గిరిజనుల భూములను మైదాన ప్రాంతం నుండి వచ్చిన గిరిజనేతరులు ఆక్రమిన్చుకుంటున్నారు. అలాగే తమ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించాలని, తప్పుడు కొలతలతో తప్పుడు తూకాలతో తమను మోసం జేస్తున్న వారినుండి రక్షణ కల్పించాలనే డిమాండ్ తో ఇంద్రవెల్లి లో గిరిజనులు సభ జరుపుకుంటున్నారు. వారి డిమాండ్స్ ఏమి రాజ్యాన్గెతరమైనవొ లేక రాజ్యాధికారాన్ని లాక్కునేవో కాదు. కాని రాజ్యం నిర్దాక్షిణ్యంగా దాదాపు 60 మంది గిరిజనులను కాల్చి చంపింది. అమరులైన వారి రక్తం ఏరులై గోదావరి, మానేరు , ప్రాణహిత, ఇంద్రావతి, శబరీ నదుల గుండా ప్రవహించి చత్తీస్ గడ్, అభూజ్ మాడ్ లో జల్, జంగల్, జమీన్ ల పైన హక్కులకు ఉద్యమించాలన్నశక్తులకు ఊపిరులూదిన్ది.
ఇదే సందర్భం లో డిల్లీ లో మన్మోహన్ సింగ్, చిదంబరం లు దేశ ముఖ్యమంత్రుల సమావేశం లో తమ ఆర్ధిక మూలాలకు తమ భద్రతకు రక్షణ లేదు కనుక ఎన్సిటిసి ఏర్పాటుకు అందరు సహకరించాలని ముఖ్య మంత్రులతో అభ్యర్థించారు. ఇక్కడ ఎవరి ఆర్ధిక మూలాలకు భద్రత లేకుండా పోయిందో ఎవరి భద్రతకు భంగం కలిగిందో చర్చించాల్సిన అవసరం ఉంది. దేశ వ్యాప్తంగా సెజ్ ల పేరుతొ, అనువిద్యుత్ కర్మాగారాల పేరుతొ , నీటి ప్రాజెక్టుల పేరుతొ, ఖనిజ సంపద తవ్వకాల పేరుతొ కోట్లాది పేద ప్రజల భూములను బలవంతంగా లాగుకొని ఒక వేదాంత , ఒక బ్రహ్మని, ఒక రహేజ , ఒక రిలయెన్స్ ఇట్లా బడా బాబులకు అప్పనంగా అప్పగించి వాళ్ళ ప్రయోజనాలకు రక్షణ కల్పించి వాళ్ళు సమర్పించే సుట్కేసులతో రాజకీయ నాయకుల వ్యక్తిగత ఆస్తులు పెంచుకుంటున్నారు. ఒక మధుకోడా , ఒక లాలు ప్రసాద్ యాదవ్, ఒక రాజశేకర రెడ్డి, ఒక రాజీవుగాంది , ఒక మాయావతి, ఒక జయలలిత, ఇలా వందల సంఖ్యలో నాయకుల పైన కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు వచ్చినాయి. అదంతా ప్రజలకు చెందవలసిన సొమ్మే. కాని ప్రజలు పాపం ఎప్పుడు కూడా తమ ఆర్ధిక మూలాలకు ఈ రాజకీయ నాయకుల చీడ పట్టిందని వీళ్ళను అంతమొందించాలని అనుకోలేదు. సమస్యల మూలాలను వెదికి శాస్త్రీయ పరిశ్కారాలకోరకు కోల్పోతున్న ప్రజా సమూహాలను సమీకరించే ప్రయత్నం జేస్తున్నారు. కాని మన్మోహనుడు, చిదంబరం లు మాత్రం వాళ్ళ సమూహాల దోపిడీ ని ప్రశ్నిస్తున్న ప్రజా రాశులను అది ఇంద్రవెల్లి గాని, అది కాకరాల పల్లి కాని, అంది నందిగ్రామ్ కాని ఎక్కడైనా ప్రజలను కాల్చి చంపుతున్నారు. అంతే భవిష్యత్ లో అట్లా కాల్చి చంపడానికి మనమంతా ఏకం కావాలని పిలుపు ఇస్తున్నారు.
మరొక్క విషయం విధ్వంసం. అసలు ఎవరు విధ్వంసం చేస్తున్నారు. అది ఇసుక, అది మట్టి. అది ముడి ఖనిజం, అది గ్రానైట్, గ్రాఫైట్, అల్యూమిన, నీరు ఇట్లా అన్ని వనరులను ఒక లెక్క పక్క లేకుండా భావి తరాలకు మిగులకుండా తవ్వి విధ్వంసం చేస్తున్నది రాజ్యం అండ దండలతో పెట్టుబడి దారలా లేక ప్రజలా? ఈ విధ్వంసం వలన ఎంతటి కాలుష్యం వస్తున్నకూడా వాళ్ళ ఆరోగ్యాలను ఫణంగా పెడుతిన్నారే కాని మా ఆరోగ్యాలకు హాని కలిగిస్తూ మా జీవించే ప్రాథమిక హక్కుకు భంగం కలిగిస్తున్నారని ఇప్పటికి ఇంకా ప్రజలు తిరుగ బడటం లేదు. ఎక్కడో చదివినట్లు వేటాడే తోడేళ్ళు వేటకు ఐక్యం అవుతున్నాయి కాని వేటకు గురయ్యే గొర్రెలు ఐక్యం కావడం లేదుఅన్నట్లుగా ఎక్కడో కాదు మన రాష్ట్రం లో మన హైద్ర బాద్ చుట్టూ పక్కలనే 34 వేల ఎకరాల అత్యంత విలువైన భూములను పేదలైన హక్కు దారుల నుండి బలవంతంగా లాగుకొని నామ మాత్రపు ధరలకు ఆ భూమిని బడా బాబులకు ధారాదత్తం జేశారు. వారు ఏ ప్రాజెక్టులు కట్టక పోయినా ఏ ఒక్కరికి ఉద్యోగం ఇవ్వక పోయినా పైగా అదే భూములను బ్యాంకులకు తాకట్టు పెట్టి కోట్ల కొద్ది బ్యాంకు రుణాలు పొందినా, ఉద్దేశించిన ప్రాజెక్టు కట్టక పోగా ప్లాట్స్పెట్టి అమ్ముకుంటున్నా కూడా ఏ ఒక్కరిని ఏమి అనరు. ఎందుకంటే అందులో వాటాలు మీకు అదివరకే అంది ఉన్నాయి కనుక. మీవి , మీ చందాదారుల అక్రమ సంపాదన 5oo లక్షల కోట్ల రూపాయలు విదెశీ బ్యాంకులల్లో దాచుకుంటారు. అవి తెప్పెంచే ప్రయత్నం అధికార, ప్రతిపక్షాలు ఏవీ కాని చేయవు, కాని ఇక్కడ పేద ప్రజల అవసరాలైన ఉప్పుల పై, పప్పుల పై చెప్పుల పై, గ్యాస్, పెట్రోల్, డీసెల్ పైన అలివి గాని పన్నులు వేస్తారు. ప్రజలు స్వేచ్చ ,స్వాతంత్రాలతో, బ్రతుకు భద్రతతో జేవించే పాలన అందించుమని అధికారాన్ని పాలకులకు అప్పగిస్తే పాలకులు చేస్తున్నది ఏమిటి, ప్రజలు నిలబడ్డ నీడను అడుగిడిన ఆధారాన్ని విదేశాలకు మల్టీ నేషనల్ కంపనీలకు గంపగుత్తాగా అమ్మివేస్తూ ప్రశ్నించే ప్రజలను ఖబర్దార్ మా అంతర్గత భద్రతకు మీరు ముప్పుగా ఉన్న్నారని, తమ ఆర్ధిక మూలాలకు నీళ్ళు అందకుండా జేస్తున్నారని హెచ్చరిస్తా ఉంటె ప్రజలు ఇంకా ఎంతో కాలం సహించరు.
పెంటయ్య,వీరగొని.
కరీంనగర్.

Thursday, April 12, 2012

రపంచ వ్యాప్తంగా  కోట్లాదిమంది అవకాశాలను కేవలం వేలాది మంది అత్యంత దురాశా పరులైన వ్యక్తులు ప్రజలందరికి చెందవలసిన సంపదను అలనాడు హిరణ్యాక్షుడు భూమిని చాప చుట్టినట్లు చుట్టి చంకలో పెట్టుకొని పోయినట్లుగా వీళ్ళు సంపదనంతా పోగుజేసుకొని తిరుగుబాటుకు కారనమౌతున్నారు. పైగా తిరుగుబాటు దారులనే దోపిడీ దొంగలుగా  తీవ్రవాదులుగా సృష్టిస్తున్నారు. 11 వ శతాబ్దానికి  పూర్వం ప్రజలనుండి గోల్లుడ గొట్టి  వసూలు జేసిన సంపద అంతా మతాధి పతులు ప్రార్థనా మందిరాలలో దాచి పెట్టినపుడు ఆకలి బాధితులు అది దోచుకొని పొతే వాళ్ళను దగ్గులు, పిండారీలు , బందిపోట్లు దొంగలు అన్నారు. 12 వ శతాబ్దం తర్వాత నుండి ఆంగ్లేయులు  రాజ్యాధికారానికి వచ్చేదాకా దొరల గడీల పైన, మొగల్ చక్రవర్తుల కోటల పైన, వాళ్ళ సామంతుల దేవిడీల  పైన  ఒక సర్వాయి పాపన్న గౌడ్, ఒక ఛత్రపతి శివాజీ లాంటి బహుజన యోధులు చేసిన తిరుగుబాట్లను  పాలక వర్గాల కు వందిమాగదులైన చరిత్రకారులు దొంగ తనాలుగా దొంగ దాడులు గా, అభివ్రుద్దినిరోధకులుగా విచ్చిన్న కారులుగా  చిత్రీక రించారు. అలాగే ఇప్పుడు సెజ్జులల్లో, అభాయారన్యాలల్లో, పోలవరం లో, శ్రీపాద సాగర్ లో,  నెల్లూరు జిల్లా ముత్త్కూరు మండలం చిల్లకూరు, వెంకటచలంలో, సింగూరు, నందిగ్రామ్ , పోస్కో, నియమగిరి,సోంపేట,కాకరాలపల్లి, ప్రాజేక్టులల్లో భూములు కోల్పోయిన , తమ ఉపాధి కోల్పోయిన లక్షలాది మంది నిర్వాసితులు తిరుగుబాటు జేస్తే వారిని  అభివృద్ది నిరోధకులు అంటున్నది రాజ్యం.
      రాజ్యం దాని స్వభావం ఎలా ఉండాలో ప్లేటో,అరిస్టాటిల్ నుండి చానుక్యుని  దాక రాజగురువులే ఏమని ప్రస్తావించారు? రాచరిక వ్యవస్థ లో గాని  శ్రేయో రాజ్యం లో గాని సంక్షేమ రాజ్యాలల్లో గాని ప్రజలనుండి తిరుగుబాటు రాకుండా రాజు ప్రజలను పాలించాలని చెప్పబడింది. అంతే గాని ప్రజలకు చెందవలసిన సమస్త సంపదలను తమ సైనిక బలం తో తమ తమ వ్యక్తిగత ఆస్తులు పెంచుకోవడం తో బాటుగా తమ తమ అనుచర బందుగానాలకు అందిన కాడికి దోచి పెట్టడం, రాజ రాజ వైభోగాలు  ప్రజల కన్ను కుట్టే ల అనుభ వించడం  ఉత్తమ పాలకులకు తగదు అని చెప్పినారు.కాని . ఇక్కడ భూ ప్రపంచం మీద ఎంత విధ్వంసం జరిగినా ఎంత కాలుష్యం విరజిమ్మినా సకల భద్రతల నడుమ బతుకుతున్న తమ జీవితాలకు ధోకా లేదన్న భరోసా తో గాలి, నీరు, రాయి, ఇసుక, మన్ను, ఖనిజ సంపద లను విచ్చల విడిగా భావి తరాలకు దక్కకుండా బొక్కేస్తున్నారు. ఇలా  కన్ను మిన్ను గానక బొక్కేస్తున్న దానికి అజీర్ణ రోగాలే ఈ ప్రజా ఉద్యమాలు అని వాళ్ళు అర్థం జేసుకోకుండా పోలీసు సైనిక బలగాలను ఉపయోగించి తమ రోగ నివారణ జేసుకోవచ్చు అని భ్రమ పడుతున్నారు. కాని పెట్టుబడి అనే లాభాపేక్ష కాన్సర్ తమ అన్నవాహికలకు సోకింది అన్న సోయి వాళ్లకు కలుగడం లేదు.
   ప్రైవేట్ విద్యుత్ సంస్తలకు ఇందన సరఫరా ఒప్పందానికి ప్రభుత్వ రంగ సంస్థ కోల్ ఇండియా మేడలు వంచి మార్కెట్ రేటు కంటే తక్కువకు బొగ్గు సరఫరా చేయండని సాక్షాత్ భారత రాష్ట్ర పతే స్వయంగా ఉత్తర్వులు ఇచ్చిన ఫలితంగా కోల్ ఇండియా సంస్థ 95 వేల కోట్లు నష్టపోయి అంతర్జాతీయ ఇన్వెస్ట్ మెంట్ సంస్థలు లాభ పడుతున్నాయి. ఒక టన్ను బొగ్గు బయటికి తీయడానికి ఎంత మానవ శ్రమ అవసరం అవుతుంది అనే దానితో బాటుగా ఆ ఫాజిళ్ ఇందనం మండించడం ద్వారా ఎంత క్షయ , కాన్సర్ కారకాలు వ్యాపిస్తాయో ఆయా వ్యాధుల రేట్ ఆఫ్ ఇంక్రీసేస్ ను చూస్తే అర్థం  అవుతూనె ఉంది. అంతే గాకుండా స్తానికుల అవసరాలు వారి ఆరోగ్యాలను పరిగణన లోకి తీసుకోకుండా విదేశీ అవసరాలకోసం పెట్టుబడి దారుల లాభాల కోసం అపురూపమైన, మల్లి పునరుత్పత్తికి అవకాశం లేనట్టి సహజ వనరులను దోచి పెట్టె వాళ్ళు దొంగలు అవుతార లేక భావి తరాల కోసం కొంచమైన మిగుల్చుదాం, ఇంతగా మానవ హననానికి మేము అవకాశం ఇవ్వం  అని అడ్డుకొనే వాళ్ళు దొంగలు అవుతారా ఆలోచించ వలసిన విషయం.
     ఖతార్ రాజు షేక్ హమదబిన్ ఖలీఫా అల థాని ఏకంగా 747 -8 ఇంటర్ కంటినేన్తల్ అతి పెద్దవిమానం 480 మంది పయనించే విమానాన్ని 25o కోట్లకు కొనుక్కొని అందులో తాను తన పరివారం తో విహార యాత్ర చేస్తాడట. అందులో గుర్రాలు, ఒంటెలు,పెంపుడు  గద్దలు.రెండు రోల్స్ రాయిస్ కార్లు కూడా పెట్టుకొని ఆకాశం లో విహరిస్తాడు. నేనేమి తక్కువ వాన్నా అనీ తన రాజసం చూపుకొవదానికి సౌదీ రాజు ఆల్వా బీద్ బిన్  తలాల్ ఏర్బస్ ఎ 380 డబుల్ డెక్కర్ విమానాన్ని కొనుక్కున్నాడు. ఈ భూమి లో ఇంతటి ఖనిజ సంపద ఇందన సంపద నింపింది వీళ్ళు గాని వీళ్ళ తాత ముత్తాతలు గాని కాదు.ఈ బొగ్గు, ఈ పెట్రోలు ఆ బావులల్లో నింపింది వీళ్ళు గాదు,తవ్వి తీస్తున్నది కూడా వీళ్ళు గాదు. కాని సంపద మాత్రం వీళ్ళదే ఎలా అవుతుందో వాళ్ళ ఆస్తి హక్కు కే తెలుసు..  మన దేశం లో అనిల్ అంభాని కట్టిన భవనాన్ని చూసి తోటి పెట్టుబడి దారు అయిన టాటా నే మనమే సంపదను ఇలా అనుత్పాదక రంగం లో విలాసాలకు ఖర్చు చేస్తే ఇక నక్షలైట్లు పుట్టుకు రమ్మంటే రారా అని కామెంట్ చేసినట్లు ఒక పత్రికలో చదివినం.మన రాజశేకర్ రెడ్డి పుత్రుడు జగన్ లోటస్ పాండ్ ఎన్ని కోట్లు మింగిందో ఎంత రాజసం వెలగబెడుతున్నదో పత్రికల్లో చదివినం, నిన్నటికి నిన్న పోలీస్ డైరెక్టర్ జెనరల్ దినేష్ రెడ్డి, ఐ పి ఎస్ ఆఫీసర్ ఉమేష్ కుమార్ ల ఒకరి పై ఒకరు అక్రమ సంపాదనల గురించి చేసుకున్న ఆరోపణల పైన నిగ్గు తేల్చండి అని  సాక్షాత్ ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ ఆదేశించిందంటే అక్రమ ఆస్తుల వ్యవహారం అతడు ఒక పెట్టుబడి దారుడా ? ఒక రాజకీయ వేత్తా ? ఒక ఐ ఎ ఎస్ ఆఫీసరా ? ఈ వ్యవస్థ లో అవినీతి అక్రమాలకూ అవకాశం లేకుండా అడ్డుగా నేను విధులు నిర్వహిస్తా నని చెప్పుకొంటున్న పోలీస్ అధికారా ? సర్పంచ్ నుండి ప్రధాన మంత్రి దాకా , గ్రామా పరిపాలనాధికారి నుండి కలెక్టర్ దాక , పోలీస్ కానిస్టేబుల్  నుండి సైన్యాధి పతుల దాకా స్వంత ఆస్తులు పెంచుకోవడానికి ఎలా తండ్లాడు తున్నారో రొజూ పత్రికలల్లో చూస్తున్నాము. కనుక స్వంత ఆస్తికి అవకాశం లేని రాజ్యం కోసం ఆనాడు చానిక్యుడు చెప్పక పోయినా ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న ఆలోచనలను స్వాగాతిన్చాకుండా అణిచి వేత పైననే ఆధార పడితే సమాజాలు మరింత సంక్షోభాలల్లో కూరుకు పోయి ఈ భూ గ్రహం మీద మానవ మనుగడే ప్రశ్నార్థకం కాగలదు.
పెంటయ్య. వీరగొని.

Friday, April 6, 2012

ఆత్మహత్యలు ఆపుదాం.

ఆత్మా హత్యలు ఆపుదాం!
ఎందరు ఎన్ని తీర్ల విజ్ఞప్తులు చేసినా ఆత్మా హత్యలు ఆగడం లేదు. అసలు మరి ఈ ఆత్మా హత్యలు ఎందులకు జరుగుతున్నాయి. ఆ
పిల్లల మానసిక స్తాయి అలా ఎందుకు నిరాశావాదం వైపు పోతున్నదో ఆలోచించాల్సిన విషయం. తెల్నగాన లో ఉన్న రాజకీయ నాయకుల
స్వార్థ పూరిత వైఖరి కారణంగానే తెలంగాణా రావడం లేదు అన్న విషయం నిర్వివాదం.
ఇక్కడ మనం ఒక్కొక్క రాజకీయ పార్టీల అప్రజాస్వామిక విధానాల గురించి చూస్తే , తెలంగాణాకు తోలి శత్రువు కాంగ్రెస్. 1956 లో ఆనాటి హైదరాబాద్ రాష్ట్రం తెలంగాణా ప్రజల అభీష్టానికి మరియు ఫసల్ అలీ కమిషన్ కు వ్యతిరేకంగా ఆంధ్ర లో విలీనం కావడానికి ఆనాటి కాంగ్రెస్ పార్టి ప్రభుత్వమే కదా కారణం. అలాగే 1969 ఉద్యమాన్ని అణిచి వేసిన బ్రహ్మానంద రెడ్డి ప్రభుత్వం గాని లేదా తెలంగాణా ప్రజలకు వెన్నుపోటు పొడిచిన తెలంగాణా గడ్డ పైన చెడబుట్టిన చెన్నారెడ్డి గాని కాంగ్రెస్ పార్టి గన్నేరు పలుకుల గంధాలే కదా? బూర్గుల రామకృష్ణ రావు, సంజీవరెడ్డి, బ్రహ్మానంద రెడ్డి, వెంగల రావు , నుండి మొదలుకొని నిన్నటి రాజశేకర్ రెడ్డి రోశయ్య, ఇప్పటి కిరణ్ కుమార్ దాక అందరు తెలంగాణా రాష్ట్రం రాకుండా అడ్డుపడిన వారే. ఆ పార్టీకే చెందినా కొందరు ఎంపి ఏమ్మేల్లె లు తెలంగాణా తెచ్చేది మేమే ఇచ్చేది మేమే అని నమ్మబలుకు తుంటే ఇంకా మనయువకులు నమ్ముతూ వాళ్లకు జై కొడుతున్నారు.
ఇక తెలుగు దేశం పార్టి, అది మొదటి నుండే అంటే ఎన్టి రామారావు నుండే తెలంగాణాకు వ్యతిరేకంగానే ఉన్నది. తెలంగాణా రీజినల్ కమిటి రద్దు, రాష్ట్రపతి ఉత్తర్వులు రద్దు, ఉద్యోగ నియామకాలల్లో వివక్షత, తెలుగు జాతిమనది చక్కగా వెలుగు జాతి మనది అంటూ పాటలు పాడి గోదావరి కృష్ణ డేవలోప్మెంట్ ఫోరం కు రామోజురావు ను నాయకునిగా పెట్టి తెలంగాణా నీళ్ళను మద్రాస్ దాక తరలించుకు పోవడానికి పతక రచన చేసిన తెలంగాణా వ్యతిరేకి. ఆ తాను ముక్క చెంద్రబాబు ఏకంగా 2004 ఎన్నికల్లో తెలంగాణా విడిపోవడానికి వీల్లేదు, సమైక్యాంధ్ర నా నినాదం అన్న మానిఫెస్టో తో ఎన్నికల బరిలో నిలిచిన చరిత్ర టిడిపిది. 9 డిసెంబెర్ 2009 నాడు వచ్చినట్టే వచ్చి పోయిన తెలంగాణా రాష్ట్రాన్ని అడ్డుకున్నది టిడిపి. మొదటి నుండి కూడా అది తెలంగాణాకు వ్యతిరేకమే కనుక ఇవ్వాళ కొత్తగా అది తెలంగాణాకు ద్రోహం చేసేది కూడా ఏమీ లేదు. వాళ్ళు ఏమి చెప్పిన తెలంగాణా ప్రజలు నమ్మే స్తితిలో లేరు. ఆ మేరకు ఈ రెండు పార్టీలు ప్రజల్లో తమ ప్రాభవాన్ని కోల్పోయిన విషయం అంతా గమనిస్తూనే ఉన్నారు.
ఇక తెలంగాణా కోసమే పుట్టినం అని చెప్పుకుంటున్న టి, ఆర్ ఎస్ కూడా తన ఓట్ల సంఖ్యా సీట్ల సంఖ్యా పెంచుకునే కార్యక్రమం దప్ప తనకు తానుగా పెద్దగా చేసింది ఏమి లేదు. 2004 ,2009 , జగిత్యాల్ ఉప ఎన్నికలల్లో మీరు మాకు ఒత్లువేసి గెలిపించండి చుక్క రక్తం చిందకుండా తెలంగాణా తెస్తానని చెప్పింది. అన్నిసార్లు ప్రజలు టి,ఆర్ ఎస్ ను ఆదరించారు.నిన్నటికి నిన్న ఒక్క మహాబుబు నగర్ దప్ప అన్ని చోట్ల టి, ఆర్ ,ఎస్ ను గెలిపించినారు.కాని తెలంగాణా రానే లేదు. పైగా 2014 లో అన్ని సీట్లు గెలిపిస్తే తెలంగాణా వచ్చితీరుతుంది
అనే మాయ మాటలు చెబుతున్నారు. వచ్చే ఉగాది, వచ్చే దసరా, వచ్చే దీపావళి, వచ్చే బక్రీద్ తెలంగాణలోనే అని అబద్దపు మాటలు జెప్పి బిడ్డలను ఆశ పెడుతున్నారు. ఒత్లంటే ఓట్లు వేస్తున్నారు, పండుగల వెనుక పండుగలు పోతున్నాయి. కాని తెల్నగా మాత్రం రావడం లేదు.
కాంగ్రెస్ నాయకులే తెలంగాణకు అడ్డంకి అని ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి అంటడు. కిరణ్ కుమార్ అది కేంద్రం చుసుకున్తున్నది అంటాడు.గండ్ర వెంకట్ రామనా రెడ్డికి దిమ్మ తిరిగి ఇప్పుడు తెల్నగాన ఇచ్చేది మేమే అంటాడు. మేము తెలంగాను వ్యతిరేకం కాదు అని బాబు సన్నాయి నొక్కులు నొక్కుతాడు. ఇంకా ఇక్కడి నర్సింహులు నానా బూతులు మాట్లాడు తాడు, 4 కోట్ల మంది నీ విధానం ఎండని నిలదీస్తే పట్టించుకోదతకాని ప్రధాన మంత్రి, హోం మంత్ర అడిగేతే లేఖ ఇస్తాం అంటడు ఎర్రబల్లి.
ఇక్కడ ఎవ్వరు తెలంగాణాకు వ్యతిరేకం కాదు అంటరు తెలంగాణా మరి ఎందుకు రావడం లేదో అర్థం గాక అమాయకులైన బిడ్డలు ఆత్మాహుతికి పాల్పడుతున్నారు. కాని ఇక్కడే యువత జాగ్రత్తగా ఆలోచించాలి. గ్లోబలైజేషన్ పుణ్యాన ఇవ్వాళ అంతా వ్యాపారమే. డబ్బు సంపాదనే! సంపద ఇచ్చే సౌఖ్యలకు మొహం వాచిపోయిన మొఖాలే! అందునా రాజకీయ పార్టీలు మరీ దారుణం.ఘర్షణ లేకుండా ఎక్కడ మార్పు జరిగిన దాఖలా లేదు. శాంతియుతంగా గాది మహాత్ముడు దేశానికి స్వాతంత్రం తెచ్చాడన్నది పచ్చి అబద్దం. ఒక భగత్ సింగ్, ఒక సుఖ దేవ్, ఒక ఆజాద్ చెంద్ర శేకర్, 1857 సిపాయిల తిరుగుబాటు నుండి చౌరా చౌరీ సంఘటనలు, జలియన్ వాళ బాఘ్ దురంతాల దాకా రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడిన తర్వాతనే ఆంగ్లేయులు భారత దేశాన్ని విడువలేక విడువలేక విడిచిపోయిన విషయాలను మనం చరిత్రలో చదువుకున్నాము. ఇక్కడ 4 కోట్ల తెలంగాణా ప్రజల విముక్తి పోరాటం జరుగుతున్నది. ఇంత కాలం మంది అవకాశాలను , మంది సొమ్మును తిన మరిగిన .శక్తులు అంత సులభంగా తెలంగాణను వదిలి పొవాడానికి అంగీకరించవు.
అందుకని ఇది చదువుతున్న విద్యార్తులార, మేధావులారా, ముందుగా మనమంతా తెలంగాణా వ్యతిరేక శక్తుల తో పోరాటానికి సిద్ధ పడుదాం. మన చైతన్యాన్ని మన చుట్టుపక్కల పంచుదాం, కుత్తుకలకు ఉరితాల్ల్లు బిగించుకోవడం కాదు శత్రువుల ఆర్ధిక మూలాలను కత్తరిద్దాం.
పెంటయ్య,వీరగిని.

Reply

Forward

Monday, March 26, 2012

ప్రభుత్వమా ఎంత దయలేని దానవే !
గోదావరి నది పైన కరీంనగర్ జిల్లాలో రామగుండము మండలం ఎల్లంపల్లి వద్ద శ్రీపాద ప్రాజెక్ట్ పేరుతొ ఒక ప్రాజెక్ట్ కడుతున్నారు. ఇది తెలంగాణా లో కట్టబడుతున్నది కనుక తెలంగాణా ప్రజలకు మేలు చేసేదని భ్రమ పడు తున్నారు కొందరు. ఈ ప్రాజెక్ట్ 20 టియంసి ల నీళ్ళ సామర్థ్యం తో నిర్మిస్తున్నారు.
7 . 5 టియంసి ల నీళ్ళు రామగుండం ఎన్టిపిసి కి పోతాయి. మన నీళ్ళు మన బొగ్గు తో ఇక్కడ తయారౌతున్న 2600 మేఘవాట్ల విద్యుత్తులో ఆంధ్రప్రదేశ్
వాటా 700 మేఘావాట్లు అయితే తెలంగాణాకు దక్కేది మాత్రం కేవలం 150 టిఎంసి లే. ఇక మంథని కి ఒక 2 .5 టిఎంసి లు ఇస్తుంటే మిగిలన 10 టిఎంసిల
నీల్లు మొత్తంగా హైదరాబాద్ కు తరలిస్తున్నారు. ఇప్పటికే గోదావరికి ఉపనది అయిన మంజీరా నుండి 30 టిఎంసిల నీళ్ళు హైదరాబాద్ కు ఎత్తుకేల్తూ మెదక్ , నిజామాబాద్ జిల్లాల రైతులను ఎండబెడుతున్నారు. అంతర్జాతీయ నది నీటి ఒప్పందం ప్రకారం ఒక నది పరీవాహక ప్రాంతానికి మరొక నది నీళ్ళు తరలించకూడదు.. కాని ఇక్కడ గొదావరినదీ జలాలను కృష్ణా పరీవాహక ప్రాంతానికి నిరాటంకంగా తీసుకొని పోతున్నారు. ప్రస్తుతం మనకు ఈ 10 టియంసిలే
కనిపిస్తున్నాయి కాని రేపు మొత్తంగా 20 టిఎంసి లకు 20 టిఎంసి లు ఎత్తుకొని పోతారు.
ఎల్లంపల్లి నుండి హైదరాబాదుకు 215 కిలోమీటర్ల దూరం చాలా పెద్దపెద్ద పైపుల ద్వారా లోయర్ మానేరు ద్యాములో ఉన్నన్ని తమకు ఒక నీటి చుక్క ఇవ్వకుండా తరలించుక పోతూ ఉంటె ఈ ప్రజలు చూస్తూ ఉండాల్సిందే. ఈ ప్రాజెక్ట్ వలన రామగుండం మండలానికి చెందిన ముర్మురు, ఎల్లం పల్లి, పోట్యాల,
మద్దిర్యాల, ఉండెడ, కొత్తపేట, వెమునూరు, చేగ్యాం, రామునూరు, ముత్తునూరు, మొక్కట్రావుపెట్ మరియు వెల్గతోఉకు కు చెందిన నాటి శాతవాహనుల
రాజధాని అయిన కోటిలింగాల ముంపుకు గురిఅవుతాయి.వీరికి చెందిన దాదాపు 10 వేల ఎకరాల భూమి మరో రెండు వేల నివాస గృహాలు లాగేసు కుంటున్నారు.అలాగే ఎలాంటి భూమి జాగా లేకపోయినా రెక్కల కష్టం జేసుఒని బతుకుతున్న వివిధ కుల వృత్తుల వారికి వారు ఎవరిపైనా అయితే ఆధార
పడి జీవేస్తున్నారో వాళ్ళను నిరాశ్రయులను చేయడం ద్వారా వీళ్ళూ జీవనోపాధి కోల్పోతున్నారు. తాటి, ఈత వనాలు, మామిడి, సీతాఫలాల, చెట్లను చంపెస్తున్నందున గౌడ, తెనుగు, ముదిరాజ్, గొల్ల కుర్మా కులాల వృత్తుల వాళ్ళు తమ జీవనోపాధి కోల్పోతున్నారు. అయితే వీరందరికీ పునారావాసం
కల్పించే సమయం లో ప్రభుత్వం ఎలా వ్యవహరించాలో జివో 68 లో చెప్పింది. ప్రాజెక్ట్ వలన ఆయా ప్రాంతాల ప్రజల సమస్త జీవనోపాధిని లాగేసు కుంటున్నాము
అనే సానుభూతి మాటలు చెబుతూనే ఆచరణలో తిరకాసు పెడుతున్నది.
ఈ గ్రామాలన్నీ సింగరేణి బొగ్గు గనులకు సమీపంగా ఉన్నాయి.బతుకు దెరువు కోసం కొందరు అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు.వాళ్లకు ఆయా గ్రామాలల్లో ఇండ్లు వ్యవసాయ భూములు ఉన్నాయ్. తాత్కాలికంగా పనిజేసే చోట ఉన్నప్పటికిని వాళ్ళ భూముల సేద్యం జేసుకోవడానికి తలిదండ్రులను చూసుకొవాదానికి వస్తుపొతూ ఉంటారు.అయితే పెద్దపల్లి రెవెన్యు అధికారులు మీరు పర్మనెంటు రెసిడెంట్స్ కాదని పునరావాస లబ్ది చెల్లించ నిరాకరిస్తున్నారు.
వాళ్ళ భూములు ,వాళ్ళ ఇండ్లు, వాళ్ళ సమస్త బతుకు దెరువు మరేవరికోసమో త్యాగం చేయండని బలవంతగా నిరాశ్రయులను చేస్తున్నారు. వాళ్ళ తాత
ముత్తాతల నుండి వాళ్లకు అన్నం బెడుతున్న భూమి, పెండ్లిళ్ళు పేరంటాలు చేస్తున్న భూమి, చస్తే వాళ్ళ శవాలను బొందబెట్టుకోవడానికి కడుపు తెరుస్తున్న
నేల తల్లి. ఇప్పటికి ఉద్యోగ రీత్యా ఎక్కడ ఉన్నా ఎక్కడ చనిపోయినా శవాలని తీసుక వచ్చి ఆయా గామాలల్లోనే ఖననం చేసుకుంటారు. అయినా మీరు శాశ్వత నివాసస్తులు కారు మీకు పునరావాస లబ్ది లభించదు అంటూ మిక్కిలి నిర్దయగా వ్యవహరిస్తున్నారు రెవెన్యు అధికారులు.
వాళ్ళ పేరుతొ రెవెన్యు రేకార్డులల్లో భూములు ఉంటాయి,పంచాయితీ రికార్డులల్లో ఇండ్లు ఉంటాయి, ఓటర్ల జాబితాలో పేర్లు ఉంటాయి, రేషన్ కార్డులు ఉంటాయి అయినా మీరు పర్మనెంటు రెసిడెంట్స్ కాదంటున్నారు. ఒక వ్యక్తీ ఆస్తి ఎక్కడైనా కలిగి ఉండడం ప్రాథమికమైన హక్కు, అలాగే జీవించి ఉండడం కూడా
ప్రాథమిక హక్కే! అయినపుడు ఈ అధికారులు ప్రజల ప్రాథమిక హక్కులు అయిన ఆస్తి హక్కు, జీవించే హక్కులను కాల రాయడం లేదా? ప్రజల ఉప్పుదిని
బ్రతుకుతున్న ఈ ప్రభుత్వానికి , అధికారులకు ప్రజల హక్కులను కాపాడాలన్న స్పృహ లేకుండా పోతున్నది.
వందల ఏండ్ల నుండి ఈ గ్రామాలు ఉన్నాయి, గ్రామాలను ఒరుసుకొని గోదావరి నది పారుతున్నది.అయిన ఈ గ్రామాలకు ఒక్కనాడు గోదావరి నీళ్ళ రుచిని
ప్రభుత్వాలు చూపించ లేదు. ప్రజలు వాళ్లకు వాళ్ళు కలుగ జేసుకున్న నీటి వనరులు దప్ప ప్రభుత్వాలు కల్పించిన సౌకర్యాల రాశి ఏమి లేదు. వందల సంవస్తరాల నుండి కలో గంజో దాగి కలిసి మెలిసి జీవేస్తున్న ప్రజలను ఒక్క కలం పోటుతో ఉళ్లు విడిచి వెళ్లి పోమ్మంటుంటే తుపాకి దెబ్బకు పక్షుల గుంపు చెదిరిపోయినట్టు ఆందోళన చెందుతున్నారు. అలాంటి ప్రజలకు సానిభుతితో సౌకర్యాలు కల్పించాల్సింది పోయి మీకు దిక్కున్న చోట చెప్పుకోండి అంటున్నారు.
ఈ గ్రామాలన్నీ ఒక నాడు ప్రజాపోరాటాల ఒరవడిలో ఎరుపెక్కిన చైతన్య వంతమైన గ్రామాలే. మా కాలి కింది దుమ్ము లాంటి వారురా మీరు అంటే ఆ దుమ్మే
వారి కండ్లల్లో ఎగిసి పడిన మట్టి ఇది. ప్రజా రాజకీయాలు నేర్పిన ఎందరో విప్లవ వీరులు నడయాడిన నేల ఇది. అన్నలె గనుక ఉండి ఉంటె మనకు ఈ దుస్తితి
దాపురించి ఉండి ఉండేదా అనుకొంటున్నారు వాళ్ళ సామూహ చర్చల్లో, ఓ ప్రభుత్వమా! సమస్య నీవే సృస్తిస్తావు, పరిష్కారం కోసం వస్తే నీకు దిక్కున్న చోట
చెప్పుకోమని వెక్కిరిస్తావు, ప్రజలను పోరాటాల వైపు ఎగదోస్తావు, ఆ తర్వాత ఆ ప్రజల పైననే తుపాకి ఎక్కుబెడుతావు.
తన ప్రజలను ఆ ప్రజల ప్రభుత్వమే కాల్చి చంపడం ప్రజాస్వామిక పాలన కాదు అని సుప్రీం కోర్టు ధర్మాసనం హెచ్చరించినా ఈ అధికారులకు తలకేక్కనపుడు
ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడ వేదుక్కోవాలో ఆలోచించే వైపు ప్రభుత్వాలే నేట్టివేస్తున్నాయి .
పెంటయ్య. వీరగొని.

Friday, March 9, 2012

granait kvarees.

రాళ్ళు కావు అవి - రాతి పుటలు మరి !
ప్రజల మేలు కోసమే జీవిస్తున్నం అను మాయ మాటలు జెప్పి ప్రజలిచ్చిన ఓట్ల తో అధికారం లోకి వచ్చిన రాజకీయ నాయకులు ప్రజాప్రయోజనాలకు పూర్తీ
వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. ప్రజలకు చెందవలసిన ప్రక్రుతి సహజ సిద్ధమైన వనరులను అన్నింటిని టోకున గంప గుత్తా గా కొద్దిమంది సంపన్నులకు
అమ్ముకుంటున్నారు. ప్రజా వ్యతిరేకమైన పాలనా పాపం బద్దలై ఐదు రాష్ట్రాల్లో వారి అధికారం పేకమేడల్లా కూలిపోతున్న సందర్భం ఇది. ఐన ఇక్కడ
కరీంనగర్ జిల్లాలో రాజ్యం నిర్భీతిగా తన విధ్వంసాన్ని కొనసాగిస్తూనే ఉంది. హుస్నాబాద్ మండలం పొట్లపల్లి లో ఎల్లమ్మ గుట్ట ను గ్రానైట్ క్వారీ యజమానులు
దసరా పండుగ నాడు యాత మాంసాన్ని కోసి పోగులేసుకున్న చందంగా ఖండ ఖండాలుగా ఖండించిన గండ శిలలను తరలించుక పోవడానికి రహదారి వేస్తున్నారు.రోడ్డుకు అడ్డం వచ్చిన అతి ప్రాచీనమైన మానవ నాగరికత ఆనవాళ్ళు అయిన బృహత్ శిలాయుగపు సమాధులను కూలదొస్తున్న దృశ్యాలను పరిశీలకులు గా వెళ్ళిన భూమి రక్షణ సంఘం బాధ్యులు మాడన కుమారస్వామి, మార్వాడి సుదర్శన్, తోటపల్లి జగన్మోహన్ రావు, మరియు తెలంగాణా ఐక్య కార్యాచరణ కమిటి కన్వీనర్ వీరగొని పెంటయ్య గమనించి నారు.
పొట్లపల్లి ఐదు వేల ఏండ్ల కిందనే ఆరు చదరపు మైళ్ళ విస్తీర్ణం తో నాగరికత విలసిల్లిన మహానగరం అని బయటి ప్రపంచానికి ఇంకా తెలియదు.ఊరికి ఉత్తరంగా
ఎత్తైన ఎల్లమ్మ గుట్ట. గుట్ట పైకి ఎక్కితే అక్కడ ఒక చతుర్ముఖ మంటపం ఆనవాళ్ళు, ఆ మంటపం తూర్పు ముఖం లో రాతి యుగపు ఆయుదాలయిన గోద్దన్లు రాతి గదలను బండ పై నూరిన ఆనవాళ్ళు. గుట్ట శిఖరం నుండి తూర్పు వైపు కొంచం కిందకు వస్తే గండు శిలల రాశి మధ్యన ఒక సొరంగం,ఆ సొరంగం గుహలో
ఆదిమానవులు నివసించిన ఆనవాళ్ళు. వాళ్ళు గీసిన ,చెక్కిన బొమ్మలు రాతి గోడల పైన సజీవంగా దర్శనమిస్తున్నాయి. గుట్ట మొదట్లోనే ఏ అజ్ఞాత శిల్పో
చెక్కిన అందమైన ఎల్లమ్మ శిల్పం ఉన్నది. అది దాటి కొంచం ముందుకు పొతే ఆ మధ్యన ఎప్పుడో దమ్మక్క ,సారలమ్మలకోసం గద్దెలు నిర్మించడానికి తవ్విన
పునాదులల్లో బయటపడ్డ పదుల సంఖ్యలో లభించిన అందమైన నాగాదేవతా శిల్పాలు ఉన్నాయి. స్తానికుల ను అడిగినపుడు గ్రామం లో ఎక్కడ తవ్విన ఈ నాగాదేవతా శిల్పాలు విరివి గా లభిస్తాయి అని ఆది కాలం లో ఎక్కడ జనమేజయునిలాంటి వారెవ్వరో సర్పయాగం చేసినాడట అంటున్నారు. అంటే నాగ జాతి
మూలవాసులకు మరో జాతితో జరిగిన యుద్ధం లో నాగజాతి వారు పెద్ద సంఖ్యలో మరణించి ఉండవచ్చు.గిరిజన సాంప్రదాయం ప్రకారం వారి జాతి నాయకుల
చిహ్నాలను రాళ్ళ పైన చెక్కుకొని ఉండవచ్చును. ఒక ఎల్లమ్మ, ఒక నాగదేవత లాంటి ప్రతిమలను చూస్తుంటే మాతృస్వామిక వ్యవస్థ పరిడవిల్లిన జాడలు ఇక్కడ
కనిపిస్తున్నాయి,
పొట్లపల్లి నుండి దేవక్క పల్లి దాకా వందల సంఖ్యలో విస్తరించి ఉన్న బృహత్ శిలయుగపు సమాధులను గమనించినపుడు ఎక్కడ క్రీస్తు పూర్వం మూడు వేల
ఏండ్ల కిందటనే ఒక గొప్ప నాగరిక సమాజం నడయాడిన ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. సమీపం లోఉన్న మాల గూడెం గుహలో అజంతా , ఎల్లోరా చిత్రాలను
బోలిన రంగులతో వేసిన బొమ్మలున్నాయి. బౌద్ధ మతం కూడా గొప్పగానే విలసిల్లిన జాడలు తెలిపే బౌద్ధ శిల్పాలు కూడా అనేకంగా ఉన్నాయి.
పోట్లపల్లికి ఈశాన్య దిశలో పడి కిలో మీటర్ల దూరంలో బయ్యన్న గుట్టల శ్రేణిని ఆనుకొని దొనబండ గుట్ట ,మూడు రోకండ్ల గుట్ట , బాపనాయనగుట్ట, ను కలుపుకొని మహ్మదాపురం గుట్టల శ్రేణులు ఉన్నాయి. ఆగ్నేయ దిశలో మన్నేగుట్ట ,మీర్జాపురం గుట్టల శ్రేణులు ఉన్నాయి. ఎత్తయిన ఈ గుట్టల శ్రేణుల పైన
దట్టమైన అడవుల మూలంగా లభించిన పుష్కలమైన జల సంపదతో ఈ నేల విలసిల్లిందని చెప్పడానికి ఎల్లమ్మ గుట్ట సమీపాన్నే తూర్పు వైపు ఉన్న ఎడెడ్ల
వాగు ఒక సాక్షం. ఇది ఇప్పుడు కరీంనగర్ జిల్లాలోనే అత్యల్ప వర్షా పాతం గల ప్రాంతం, కాని ఆనాడు ఈ ఎడెడ్ల వాగు దాటేతందుకు ఏడు ఎడ్లను జతలుగా కట్టి
దాటుతుంటే ఒకనాడు ఆ ఏడు ఎడ్లు కూడా వాగు ఉధృతికి కొట్టుకొని పోయినాయట. అందుకే ఆ వాగుకు ఆ పేరు స్తిరపడిపోయిందట.
ఈనాడు అణుబాంబు కలిగి ఉండడం ఎంత సాంకేతిక విప్లవమో ఆనాడు ఇనుము తయారి అంటే విప్లవకరం. పోట్లపల్లిలో ఇనుము వండిన చిట్లం విస్తారంగా
కనిపిస్తున్నది. అంటే అక్కడ ఉత్పత్తి చేయబడిన ఇనుము ఆయుధాలకు, వ్యవసాయ పనిముట్లకోసం దేశవిదేశాలకు ఎగుమతి చేయబడి పొట్లపల్లి మహానగరం
ఆనాటు కాస్మోపాలిటాన్ నాగరికతకు చిహ్నంగా విలసిల్లినదనడానికి గుర్తుగా ఒక పురుషుడు ఆవును తీసుకొని పోతుంటే స్తీ తన బాలునితో వెంట వస్తున్న
శిల్పం దొరికింది. ఇది మెసపటోమియా చిత్రాన్ని పోలియిన్నది.
క్రీస్తు పూర్వం 200 నుండి క్రేస్తుశకం 200 మధ్యకాలం లోనే మనుధర్మ శాస్త్రం భారత, రామాయణ రచనా కాలం అని చెప్పబడుతోంది.అంటే పొట్లపల్లి కి
ఇంతకంటే గూడా ప్రాచీనమైన చరిత్ర ఉన్నట్లే, క్రీస్తు పూర్వం 1300 నుండి 1200 మధ్యకాలం లో మన దేశానికి ఆర్యులు ఆగమనం జరిగితే ఇక్కడ అంతకు ముందే నాగరికత విలసిల్లిన ఆనవాళ్ళు లభిస్తున్నాయి. ఆదిమ సమాజం నుండి , శాతవాహన, కాకతీయుల దాకా ఒక సజీవ స్రవంతి లా సాగిన మానవేతిహాస
నాగరికతకు చిహ్నమైన అలనాటి మాహానగరమైన పోట్లపల్లిని కబళించడానికి ఇనుపకోరల గ్రానైట్ రాక్షసి కాలుమోపింది.
అయితే ఏంటి ? సహజ వనరులు వాడుకో కూడదా? అభువ్రుద్ది జరుగ వద్దా? అంటున్నారు కొందరు.
ఎల్లమ్మ గుట్ట 200 ఎకరాలు విస్తరించి ఉన్నది. గుట్టపైకి ఎక్కితే చుట్టూ మూడు వేల ఎకరాల వ్యవసాయ సాగు భూమి ఉన్నది. గుట్ట ఓవర్ హెడ్ ట్యాంక్ అయినందున మార్చి ఏప్రెల్ నెలలోని మండుటెండల్లో కూడా చుట్టూ పచ్చని వరిపోలాలు ఉన్నాయి.రెండు కుంటలు రెండు చెరువులు ఉన్నాయి, వర్షాకాలం
లో ఇవినిండుతే రెండు పాటలకు ధోకా ఉండదు. గుట్ట పైన నూట యాభయి దాక గుడ్డేలుగులు( ఎలుగుబంట్లు), వెయ్యికి పైగా కోతులు, నెమల్లు, జింకలు,
ఎదుపందులు ,అడవి పందులు ఉన్నాయి. గ్రానైట్ బ్లాస్టింగులతో ఇవన్ని అయితే చనిపోవాలి లేదంటే జనం లోకి పోయి జనాన్ని అయిన చంపుతాయి.
గుట్ట చుట్టూ పదివేల తాడి చెట్లు ఉన్నాయి. మామిడి, బత్తాయి తోటలు వందల ఎకరాల్లో ఉన్నాయి. ఇవన్ని దాదాపు పది వేల మంది జనాభాకు జీవనోపాధి
కల్పిస్తున్నాయి.
ఇప్పుడు అ గట్టాను ధ్వంసం చేస్తే భూగర్భ జలాలు అడుగంటి పోయి వ్యవసాయం వట్టిపోయి , తాటి, మామిడి, బత్తాయి తోటలు ఎండిపోయి పదివేల మంది
జీవనోపాధి పోయి రోడ్డున పాడుతారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే జూసిన ఈ క్వారీ ద్వారా ఏటా యాభై లక్షల రాయల్టీ వస్తుందనుకొన్న ఓ 20 ఏండ్లకు 10 కోట్ల
ఆదాయం వస్తుంది కాబోలు. కాని ఈ 20 ఎండ్లల్లో 10 నుండి 20 వేల మంది శాశ్వతంగా నిరాశ్రయులై పోతున్న దానితో పోలిస్తే ఈ 10 కోట్లు ఈ మూలకు?
నిన్నటికి నిన్న జస్టిస్ జి.ఎస్. సంఘ్వి, జస్టిస్ ఏ.కే . గంగూలి లతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం నోయిడా ప్రాంతం లోని పేదల భూములు గుంజుకొని పెద్దలకు
పందేరం చేస్తున్న విధానం కాకులను కొట్టి గద్దలకు వేస్తున్న చందంగా ఉందని అభిబర్నించింది .అలాగే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జస్టీస్ ఎల్. నరసింహారెడ్డి ఎమ్మార్
భూముల కేసులో ఎపి ఐ ఐ సి ద్వారా రైతుల భూములు కొల్లగొట్టి ఎమ్మార్ సంస్తకు కట్టబెట్టడం మిక్కిలి అనైతిక హేయమయిన చర్య అని అభివర్ణించింది.
పోట్లపల్లిలో ఉన్న గ్రానైట్ సహజ sampada prajalandari ummadi aasti. staanika ప్రజల upaadhi avakaashaalanu ధ్వంసం chesi , అతి pracheena itihaasa charitranu parishodhanalaku ఆనవాళ్ళు lekundaa chesi ikkadi ప్రజల jeevinche hakkunu kaala raasi
kevalam videshi avasaraalakosam , koddi మంది bada kantraktarlu marinni కోట్లు ఈ రాళ్ళ నుండి pindukovadaaniki palakulu
చేస్తున్న అతి kruramaina చర్య ఇది.
ikkadi prajalu ఈ గ్రానైట్ kvareeni nilipi veyaalani dimand chestunnaru. తన raajyaadhikaaram తో paalakulu kvaareeni
nadipistaamani mondi గా ముందుకు velite praja poraataala mundu paalakulu paraajitulu kaaka tappadu.
పెంటయ్య. వీరగొని.
కరీంనగర్.

Wednesday, February 15, 2012

What happens if Education privatizes?

ఏ వ్యవస్తకయినా దాని మనుగడకంటూ ఒక ఆర్ధిక వ్యవస్థ ఉంటుంది. దాని ఆర్ధిక వ్యవస్తను కాపాడుకోవడానికి ఒక సాంస్కృతిక వ్యవస్తను ఏర్పాటు చేసుకుంటుంది ఆ వ్యవస్థ. ప్రస్తుతం మన దేశానిది పెట్టుబడి దారి ఆర్ధిక వ్యవస్థ. అయితే ఆ ఆర్ధిక వ్యవస్థ దాని పునాది అనుకుంటే దాన్ని కాపాడుకోవడానికి ఉపరితలామ్శాలు అయిన విద్య, కట్టు, బొట్టు లాంటివి ఉంటాయి. పునాది చెడి పోకుండా ఉపరితలామ్శాలు పైన ఉండి కాపాడుతాయి, అలాగే ఉపరితలాంశాలను అవిపడిపోకుండా పునాది కాపాడుతుంది. అంటే ఒక దానిని ఒకటి పరస్పరం కాపాడుకుంటూ వాటి మనుగడను కొనసాగిస్తాయి. ఇక్కడ ఉన్నట్టి ఆర్ధిక వ్యవస్థ సరయ్యిందే అని చెప్పడానికి విద్య వ్యవస్థ పని జేస్తుంది. అలాగే ఇలాంటి విద్యా వ్యవస్థ
అయితేనే ఈ ఆర్ధిక విధానం కొనసాగా గలుగుతుంది అని రాజ్యం తన విధానంగా చెబుతుంది. ఇక్కడ కొంత మంది విద్యా వేత్తలు మన దేశం లో
విద్యా వ్యవస్థ ప్రయివే టీకరిన్చబడుతున్నది, తద్వారా పెట్టుబడి దారులు తమ ప్రయోజనాలకు అనుగుణంగా విద్య వ్యవస్తను రూపొందిస్తారు, దాంతో
రేపు వ్యవస్తలోని విలువలే తలకిందులు అవుతాయి అని ఆవేదన చెందుతున్నారు.
జాతీయ విద్యావిధానాన్ని పర్యవేక్షిస్తున్న కపిల్ సిబాల్, మేము ఎలాంటి విద్యా విధానాన్ని ప్రవేశ పెట్టాన్నో పార్లమెంటులో చర్చిస్తాము విద్యా వేత్తలతో ,ఉపాధ్యాయులతో చర్చించ వలసిన అవసరమే లేదు అంటున్నాడు. మన పార్లమెంటులో దాదాపు 300 మంది సభ్యలు పెట్టుబడి దారులే ఉన్నారు. వాళ్ళ పెట్టుబడులు రెట్టింపు జేసుకోవడానికి విద్య ప్రయివెటీకరించబడవల్సిందే అంటారు. దానితో వాళ్లకు లాభాలు వస్తాయి. స్తూల జాతీయాదాయం పెంరిగింది అని మన ఆర్ధిక వేత్తలు లెక్కలు చెబుతారు. విద్య ప్రయివేటీకరించవడితే అసలు ఏమవుతుంది? ఎవరికీ ఏమి నష్టం జరుగుతుంది? వాళ్ళ మాటల్లో చెప్పాల్సి వస్తే మంచి నాణ్యమైన చదువు దొరుకుతుంది గదా?
కాని మనం ఇప్పుడే ప్రాథమిక విద్య లోనే చూస్తున్నాము, ఒక్కో విద్యార్థి లక్ష నుండి రెండున్నర లక్షల దాకా ఒక సంవస్తరానికే చెల్లించ వలసి వస్తున్నది.ఆ విధమైన పాఠాశాలలో చదివిన విద్యార్థి మన వీధి బడిలోని విద్యార్థిని తన తోటి విద్యార్థిగా తోటి మానవునిగా గుర్తిస్తాడ? దేశ పౌరులందరూ సమానమే అనే భావన ఆ పిల్లోడిలో రావడానికి ఈ కార్పొరేటు బడులు దోహద పడుతాయా? రాజ్యాంగం లో అందరు సమానమే , అందరికి సమాన హక్కులే అని రాసుకున్నాము. కాని నిన్నటికి నిన్న ఐ ఏ ఎస్సు లు మేము అందరి లాంటివాళ్ళం కాదు మాకు ప్రత్యేకమైన
హాక్కులు ఉన్నాయి అన్నారా? అంతెందుకు ప్రజలవద్ద గొల్లూడ గొట్టి పైసా పైసా పోకుండా పన్నులు వసూలు జేసున సోమ్ముల్లో నుండి మంత్రులు , ఏమ్మేల్లెలు,కోట్ల కొద్ది అక్రమంగా కొల్లగోట్టితే తమ తమ రాజకీయ ప్రత్యర్థులను ఇబ్బంది పెడుతున్నారు కాని తమ వర్గం వారి పైన ఈగ వాలనివ్వడం లేదుకదా? ఇప్పుడే ఈ విధంగా ఉన్నప్పుడు రేపు రేపు ఈ కార్పొరేటు బడులలో, కాలేజి లలో చదువుకొని వచ్చే విద్యావంతులైన పౌరులు ఎట్లా వ్యవహరిస్తారో ఉహించ వచ్చు. బ్రిటిషర్ల ఏలుబడి లో సంస్థానాదీశులకే ఓటు హక్కులు ఉన్నట్లు గా ఈ కులీనులైన విద్యాదికులకే అన్ని హక్కులు అన్ని అవకాశాలు ఉండే ప్రమాదం ఉంటుంది. ఏమి , ఉండకూడదా? ఎందుకు ఉండకుడదో చెప్పుమని అడిగే పౌరులు కూడా బయల్దేరుతారు. కాని అప్పుడు ఏమి జరుగుతుంది అంటే సమాజం లో అశాంతి నెలకొంటుంది. సమానా హక్కుల కోసం సమాన అవకాశాల కోసం అసమాన సమూహాల మధ్యన సంఘర్షణ మొదలవుతుంది. సమాజం మొత్తంగా అశాంతికి ఆలవాలం అవుతుంది.
అప్పటికి ఈనాటి చిదంబరం వారసులు, వీళ్ళంతా వామ పక్ష తీవ్రవాదులు మనం ఎంతో కస్టపడి కూడబెట్టుకున్న ఆస్తులల్లో వాటా అడుగుతున్నారు కనుక వీళ్ళను జైళ్ళల్లో తోసేద్దాం అంటారో లేక ఏకంగా మానవ రహిత విమానాల తోటి బాంబింగ్ జేసి కాల్చి చంపుతామంటారో కాలమే చెప్పాలి.
పెంటయ్య.వీరగొని.
కరీంనగ

Saturday, February 4, 2012

I A S lu evari pakshamo telchukovaali.

ఐ ఏ ఎస్ లు ప్రెస్ మీట్ పెట్టి తమ బాధ ఆవేదన వెళ్ళగక్కిన తీరు చూసిన తర్వాత సామాన్య జనాలు గూడా వాళ్ళ బాధలు చెప్పుకున్నపుడు ఈ అధికారులే అది తమ
బాధ్యత కానట్లు తిక్క తిక్క జవాబులు ఇచ్చి అడ్డమైన ప్రశ్నలు వేసి అవమాన పరచిన సంఘటనలు వాళ్లకు జ్ఞాపకం వచ్చినాయో లేదో?
1 ) మేముమాత్రమే అవినీతికి పాల్పడ్డామ?
2 )రాజకీయ నాయకులు అవినీతికి పాల్పడడం లేదా?
3 ) పెద్ద చేపలను వదిలి వేసి చిన్న చేపల ను పట్టుకుంటున్నారు.
4 ) సి బి ఐ విచారణ మర్యాద గా లేదు.
5 ) క్యాబినెట్ ది సంబందిత మంత్రి దే బాధ్యత.
6 ) కోడ్ అఫ్ కండక్ట్ ప్రకారం సి బి ఐ విచారించడం లేదు.
7 ) కోట్లు లంచాలు తిన్న వారిని వదిలేసి మా వెంట పడుతున్నారు.
చెంద్ర బాబు నాయుడు , రాజశేఖర్ రెడ్డి లు అసెంబ్లీ లో ఒకరి అవినీతిని మరొకరి ఆడిపోసుకున్నట్టు ఇప్పుడు ఐ ఏ ఎస్ లు క్యాబినెట్ ను ఆడిపోసుకుంటున్నారు.
అంటే మాది అవినీతి లేదు అని మాట వరుసకు కూడ అనలేనంతటి అవినీతి లో ఐ ఏ ఎస్ లు కూరుక పోయినారు. ముందు రాజకీయ నాయకుల అవినీతిని ప్రశ్నించి
ఆ తర్వాత మమ్ములను ప్రశ్నించండి అంటున్నారు.ఎంత దిగ జారి పోయినారు గదా ఈ అధికారులు.
ఒక ఉపాధి హామీ రోజు కూలి ని నీవు 120 రూపాయలు తీసుకొని ఇదేనా చేసిన పని అంటే తవ్వని మట్టిని ఎత్తి పోసినట్టు ట్రాక్టర్ కు డబ్బులు తీసుకోవడం ఏమి నీతి ,
చేయని పనిని రికార్డ్ చేసి వేలకు వేలు డబ్బులు తీసుకోవడం ఏమి నీతి , అందరికి అక్కరకు వచ్చే భూములను ఓపెన్ కాస్త పేరిట తవ్వి వేయడం ఎట్లా అభివృద్ది , గుట్టలను
కొండలను కూల్చి వేసి కొనరికి గ్రానైట్ జిగేల్ లు కొందరికి దుమ్ము ధూలి, హేమటైటు, దోలమైటు , క్వారీలు తవ్వి అలివిగాని కాలుష్యం అభివృద్ధా అంటే నన్ను నువ్వు అడుగకు
నిన్ను నేను అడుగ . ఇద్దరం గలిసి ఉకున్నోని కాళ్ళ కింద నెల తవ్వుక పోదాం . ఇక అవినీతిని ఎవ్వరు కూడా ప్రశ్నించ వద్దు అంటున్నారు.
ఐ ఏ ఎస్ ల ను అడుగనంత వరకు రాజకీయ నాయకుల గురించి వారు ఎప్పుడు మాట్లాడ లేదు. క్యాబినెట్ లో రాజకీయ నాయకులు చేస్తున్న ఎన్నో నీతి బాహ్యమైన చర్యలను సమర్థిస్తూ ప్రశ్నించే ప్రజల నోళ్లను ఎందరో ఐ పి ఎస్ లు ఎందరో ఐ ఏ ఎస్ లు ముయించినారు. ఒకరి అవినీతిని ఒకరు చట్టాల పేరుతొ నిబంధనల పేరుతొ సమర్థించిన వారే. కాని ఇంత బాహాటంగా జరుగుతున్నా అవినీతిని ఏదో తు తు మంత్రంగా నన్నా చల్లార్చకుంటే రేపు ప్రజలల్లోకి ఏ మొఖం పెట్టుకొని పోగలం అనుకొన్న రాజకీయ నాయకులు అసలు దొంగలను వదిలి వేస్తూ అంతకాగిన వాళ్ళను కొందరినన్నా కొంచెం మందలిద్దాం అని చిన్న ప్రయత్నం చేస్తే మా బంగారుకన్నం లో వేలుబెడితే
మేము కుత్తమా అంటున్నారు.
అయ్యా ! మా పోరగాండ్లు మా తెలంగాణా మాకు కావాన్నని జై తెలంగాణా అంటే జైళ్లల్ల బెడితిరి, మా బిడ్డలను యునివర్సిటీ రూములల్లకు జొరబడి గొడ్లను బాదినట్టు బాదితిరి.
మా గ్రామాల్ల పోరగాండ్లు ఈ దొంగా రాజకీయ నాయకుల బండారం బయటబెడితే ఎన్కౌంటర్ చేసి పారేస్తిరి . విచారణ కమిటీల ముందు కు వచ్చి తమ పోరాగాన్డ్లను ఎవ్వరు చంపినారో చెబుతాం అంటే గూడా చెప్పనివ్వ కుండా అడ్డుబడితిరి. మీకు కోడ్ అఫ్ కండక్ట్ లు ఉన్నట్టే మాకు రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కు ఉన్నదంటే మీకు దిక్కున్న
చోట చెప్పుకో అంటిరి. ఒక నాడు రాజులు దొరలూ జమీందారులు పార్లమెంటులోకి వచ్చి వాళ్లకు అనుకూలమైన చట్టాలు చేసుకున్నారు.ఇప్పుడు కాంట్రాక్టర్లు , వ్యాపారస్తులు
గుండాలు , ఖునికోరులు ఎన్నిక కాబడి వాళ్లకు అనుకూలంగా చట్టాలు జేసుకుంటున్నారు. రాజకీయ నాయకులు తాము చేస్తున్న చట్టాల ద్వారా తమ వర్గానికి లబ్ది
చేకూర్చాలని చూస్తున్నారు. గొప్ప గొప్ప చదువులు చదివి న ఐ ఏ ఎస్ లు ఐ పి ఎస్ లు ఏ ప్రజల ఉప్పుదిని తాము బ్రతుకుతున్నారో ఆ ప్రజల పక్షాన నిలబడు తారో
లేక ప్రజల కష్టార్జితం తో బాటు గా వాళ్లకు చెందవలసిన వనరులను అన్నింటిని గంప గుత్తాగా కొల్ల గోడుతున్న రాజకీయ నాయకుల వైపు నిలుస్తారో నిర్నయిన్చుకోవాల్సిన
సమయం ఆసన్న మైంది.
వాళ్ళు యూదులకొసమ్ వచ్చిండ్రు. నేను యూదును కాదు కనుక అడ్డుజెప్పలేదు. వాళ్ళు కమ్యునిస్టుల కోసం వచ్చిండ్రు, నేను కమ్యునిస్టును కాను కనుక అడ్డుజెప్పలేదు.
వాళ్ళు మిలిటెంట్ల కోసం వచ్చిండ్రు . నేను మిలితెన్టును కాను కనుక అడ్డుజెప్పలేదు. ఇప్పుడు వాళ్ళు నీ కోసం వచ్చిండ్రు.. ఇప్పుడైనా అడ్డుజేప్పకుంటే ఇంకా నీవు ఎవరికోసం బతుకుతవు నీ బతుకు వృధా యే కదా?
పెంటయ్య. వీరగొని.
కరీంనగర్.

Thursday, February 2, 2012

dikku leni prajalu okkatavutunnaru.

రాజ్యం - దాని స్వభావం,

ప్రతి దినం వార్త పత్రికలల్లో వందల , వేల కోట్ల రూపాయల కుమ్బకోనాల గురించిన వార్తలు... అందుకు కారణమైన వ్యక్తుల ను విచారిస్తున్నట్టు మరియు అరెస్టులు
చేస్తున్నట్టుగా చదువుతున్నాము. అలాగే అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు ఒకరిపైన ఒకరు నీవు ఇన్ని కోట్ల ప్రజాధనం దిగామింగావంటే , నీవేమి తక్కువ తిన్నావా
నీవు ఇన్ని కోట్లు తినలేదా అంటూ ఒకరి పైన ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. అధికార ప్రతిపక్ష అనే తేడా లేకుండా అంతా ప్రజలు పన్నుల రూపం లో కడుతున్న
సొమ్ములు మరియు ప్రజలకు దక్కవలసిన కోట్లాది రూపాయల వనరులు కొందరే బొక్కి కుచుంటున్నారు. అయితే రాజ్యాంగం ప్రకారం డబ్బు సంపాదించడం నేరం కాదని
ఒక వైపు చెబుతూనే మరో వైపు సక్రమంగా సంపాదించాలని చెప్పబడుతున్నది. ప్రజలందరికి చెందవలసిన సంపదను ఇట్లా కొందరే కోట్ల కొద్ది ప్రోగుజేసుకోవడం , సంపద
అంతా అందరికి సమానంగా పంచవలసిన బాధ్యత కలిగిన రాజ్యం కొందరికే సంపద దోచిపెట్టే కార్యక్రమం ఎందుకు చేస్తున్నట్లో ఆలోచించాల్సిన అవసరం ఉంది.
మానవులు ప్రక్రుతి నుండే అన్నీ నేర్చుకున్నారని చెప్పే ఒక మేధావి ఏమంటాడంటే , మొక్కలు ,వృక్షాలు ,తాము భూమి ,సూర్యుడు,గాలి ఆధారంగా సంపాదించిన సంపదను
అవి తమకు అవసరమైన మేరకు ఉపయోగించుకొంగా మిగిల ఆహారాన్ని గింజల రూపం లో , గడ్డల రూపం లో, తమ వేర్లల్లో ఆకుల్లో, కాండం లో దాచుకుంటున్నాయి.
అలాగే జంతువులూ కూడా తాము వేటాడిన మాంసాన్ని తినే కాడికి తినగా మిగిలిన దాన్ని దాచిపెట్టుకొని అవసరమైనపుడు తింటున్నాయి. అలాగే మానవుడు కూడా
తాను సంపాదించిన సంపద కూడబెట్టుకొని ఆ సంపదనే పెట్టుబడిగా పెట్టి మరింత సంపాదించడమే గాకుండా ఆ పెట్టుబడి తో శాస్త్ర సాంకేతిక రంగాలను అభివృద్ది పరిచి
అధిక మరియు నాణ్యమైన ఉత్పత్తిని సాధించడానికి దోహద పడుతున్నాడని అని వాదిస్తున్నాడు.
అది ప్రక్రుతి నియమం . దాన్ని అందరం అంగీకరిస్తాము. అయితే ప్రకృతిని ఏ శక్తి నియంత్రించడం లేదు. కాని మానవ సమూహాలను నియంత్రించడానికి రాజ్యం ఉన్నది.
రాజ్యం లో ఎవరికీ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు వ్యవహరించడానికి వీలు లేదు. దానికి ఒక ఆర్డర్ ఉన్నది.ఆ మానవ సమాజం ఎట్లా వ్యవహరించాలని మౌఖికంగా అనుకుంటారో
లేక రాజ్యాంగం లో రాసుకుంటారో అట్లానే వ్యవహరించాలి . అట్లా వ్యవహరించక ఉల్లంఘించిన వాళ్ళను రాజ్యం తన బలగాలతో నియంత్రించ వలసి ఉంటుంది.అయితే రాజ్యం
అనేదానికి వర్గ స్వభావం ఉంటుంది. అది తన వర్గానికి లబ్ది చేకూర్చిపెట్టె విధంగా వ్యవహరిస్తూనే ఆ పని అంతా తమ వర్గం కాని వారి క్షేమం కోసమే అలా చేస్తున్నానని
నమ్మించ వలసిన బాధ్యతా కూడా అది స్వీకరిస్తుంది.ఎట్లా అంటే ఒక అడవిలో ఒక యాభై పులులు ఉన్నాయనుకొందాం.. అవి విచ్చల విడిగా ఒక క్రమం ,పద్దతి లేకుండా
వేటాడినట్లు అయితే అడవిలో ఉన్న లేళ్ళు అన్నీ ఆనతి కాలం లోనే అంతరించి పోతాయి.అప్పుడు అన్ని ఆకలి తో నక నక లాడి చనిపోవాల్సి ఉంటుంది. కనుక అవి ఏమని
కట్టుబాటుచేసుకున్నాయి ఆటా అంటే, మనం ఈ విధంగా ఎవరికీ తోచినట్టు వాళ్ళు వేటాడి తింటే కొద్ది రోజులకే మనకు తిండి దొరుకని పరిస్తితి వస్తుంది కనుక ఓ పులిరాజు లాలా
మీకు ప్రతి రోజు ఒక్కొక్కరికి ఒక లేడి చొప్పున తినడానికి మేము ఏర్పాటు జేస్తాము. మీరు హాయిగా తింటూ ఉండండి . తల గాక ఎవరైనా మనం చేసుకున్న ఈ నియమాన్ని
ఉల్లంఘించి నట్లు అయితే మన సివ్నగి సేనలతో వాళ్లకు బుద్ద్ది చెప్పించ బడుతుంది అనుకోన్న్నాయి ఒప్పందం చేసుకొన్నాయి. ఇక రోజు ప్రతి పులి రాజుకు ఒక్కొక్క లేడి
పిల్ల ఆహారం గా పోయే టట్టు చూడ వలసిన బాధ్యతా సింహాల రాజు పైన పడ్డది.
సింహాల రాజు ఆ మరునాడే లేడి జాతినంతటిని సమావేశ పరిచింది. ఓ నా ప్రియమైన లేడి సోదరి సోదరులారా! మీకు జరుగుతున్నా అన్యాయం అంతా ఇంత కాదు.
అది తలచుకుంటూ ఉంటె నా కడుపు తరుక్క పోతూ ఉంది.ఇట్లా అయితే మీకు తీవ్ర అన్యాయం జరుగుతుంది మీ జాతి అంతరించి పోయే ప్రమాదం ఉంది. మిమ్ములను
కాపాడడం కేవలం నా వకననే సాధ్యం అవుతుంది. అన్నది.అందుకు లేడి జాతి అంతా సింహ రాజుకు ప్రణమిల్లి మహా రాజ ఎలాగైనా మీరే మమ్ములను రక్షించాలని
వేడుకున్నాయి. తాము చేసుకున్న కుటిల ఒప్పందం బయట పడకుండా సింహ రాజు లేడి జన ఉద్దారకుడువలె ఒక ఫోజు పెట్టి , నేను మీకోసం లేడీజీవ ఉద్ధారక
పథకం ప్రవేశ పెడుతున్నానని ప్రకటించగానే లేడి జాతిమొత్తం జయ హో సింహ రాజా అని నినాదాలు ఇచ్చింది .ఆ పథకం ఎట్లా ఉంటుందో చెబుతున్నా వినండి ,
అంటూ వివరించడం ప్రారంభించింది . రేపటి నుండి మిమ్ములను ఏ సింహం గూడా వేట ఆడకుండా చూసే బాధ్యత నాది .మీకు నేను రక్షణ గా ఉండి మీవైపు ఏ క్రూర మృగం కూడా కన్నెత్తి చూడ కుండా చేసే బాధ్యత నేను వహిస్తున్నాను , అనంగానే సంతోషం తో చప్పట్లు కొట్టినాయి లేళ్ళు.మీరు చీకు చింత లేకుండా హాయిగా కాపురాలు చేసుకోవడం వలన మీ సంతానం అభివృద్ది అవుతుంది. అభివృద్ది చెందిన మీలోనుండి కొందరిని మాత్రం రోజుకు ప్రతి సింహానికి ఒక్క లేడి చొప్పున కప్పం ఇచ్చుకోవాల్సి ఉంటుంది అన్నది.
అయ్యో అని బాధపడ్డా చేసేది ఏమి లేక తలాడించి వెళ్లి వచ్చినాయి.సింహ రాజులు , సింహ రాజులు కల్సి లేళ్ళను పంచుకు తిన్నట్టు రాజకీయ పార్టీలు,రాజకీయ పార్టీలు అన్ని
కలసి ప్రజలకు చెందవలసిన సంపద అంత దోచుక తినున్నాయి .
సంపద సృష్టి కర్తలం మా సంపద మాకే చెందాలంటున్న వాళ్ళు ,జాన్ మిర్డల్ ప్రఖ్యాత అంతర్జాతీయ రచయిత రాసినట్టుగా దిక్కు లేని ప్రజలంతా ఒక్కటవుతున్నారు.
.
పెంటయ్య,
కరీంనగర్.

Saturday, January 28, 2012

గోదావరినది పైన కరీంనగర్ జిల్లాలో ఎల్లంపల్లి వద్ద శ్రీపాద సాగర్ ప్రాజెక్ట్ పేరుతొ ఒక ప్రాజెక్ట్ కడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 9 గ్రామాలు
కరీంనగర్ జిల్లాలో 9 గ్రామాలు ముంపుకు గురి అవుతున్నాయి. ప్రభుత్వం ఏదైనా ఒక ప్రాజెక్ట్ కడుతున్నపుడు ఆ ప్రాజెక్ట్ వలన సంభవించే
పర్యావరణ విఘాతం,గురించి ప్రజలకు జరిగే జీవనోపాధి నష్టం గురించి స్పష్టంగా తెలియ జెప్పి ప్రజాభిప్రాయ సేకరణ జరుగాలి. ప్రజలకు ఇవ్వజూపె
నష్టపరిహారం గురించి గూడా తెలియజేప్పవలసిన బాధ్యతా ప్రభుత్వానిదే . సమాచారహక్కు ప్రకారం ప్రభుత్వానిది పారదర్శకంగా ఉండాల్సిన బాధ్యత
మానవ హక్కుల వేదిక రాష్ట్ర అద్యక్షులు జీవన్ కుమార్ మరియు కరీంనగర్ జిల్లా అధ్యక్షులు సుధాకర్ రెడ్డి గారు. కుక్కల గూడూర్
గ్రామాన్ని దర్శించినారు. ప్రాజెక్ట్ నిర్మాణం వలన ఈ గ్రామం పాక్షికంగా ముంపుకు గురి అవుతున్నది. సర్వే జేసినా అధికారులు వ్యవసాయ భూములను నిర్మాణాలను సర్వే జేసి వ్యవసాయ భూములకు A క్యాటగిరికి 1.5 లక్ష లు నిర్నయిన్చినారట. నిర్మాణాలను కొలిచి ఒక్కొక్క చోట సగం ఇల్లు, ఒక బాత్ రూము వరకు మాత్రం తీసుకుంటాము మిగతాది మేము తీసుకోము అంతవరదాక నీళ్ళు రావు అంటూ అధికారులు బుకాయిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. నష్టపరిహారం తీసుకోవాలని పోలీసులతో బెదిరిస్తున్నారని ప్రజలు ఎంతో బేలగా బాధగా చెప్తున్నారు.
నిన్న గణతంత్ర దినోత్సవం నాడు భారత ప్రథమ పౌరురాలు tv లో ప్రసంగిస్తూ మన ప్రజలను మన ప్రజాప్రతినిధులను మనం నమ్మకుంటే ఎలా
అని మాట్లాడి నారు. మరి ఇక్కడ మన ప్రజల న్యాయమైన హక్కులను కాపాడవలసిన పోలీసులు ప్రభుత్వ అధికారుల మాటల ప్రకారం ఎందుకు అలా భయపెడుతున్నారో అర్థం కాదు. అంటే ప్రభుత్వం తమకు వేతనం చెల్లిస్తున్నది కనుక ప్రభుత్వం ఏది చెబితే దాన్ని పాటిస్తాం అని వాళ్ళు
అనుకోవడం సరిగాదు. ఉద్యోగులు ఎవరైనా వాళ్ళు వెతనరూపమ్ లో పొందుతున్న ప్రతి పైసా ప్రజల కస్తార్జితమే. ప్రజలు చెల్లిస్తున్న పన్నులనుండే
ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా వేతనం తీసుకొనేది అన్న స్పృహ ప్రతి ఉద్యోగికి ఉండాలి.
అల్లాగే rehabilitation and resettlement act ప్రకారం గ్రామం లో కొంత భాగాన్ని ప్రభుత్వం తన అవసరం కోసం తీసుకొని తక్కిన భాగం తనకు అవసరం లేదని వదలి వేయడానికి వీలులేదు . ఎందుకంటే తర తరాలనుండి ఆ ఊరి ప్రజలు కలిసిమెలిసి ఉంటున్నారు. వారిని కొందరిని అక్కడే ఉంచి కొందరిని వేరే చోటికి వేల్లిపోమ్మనడం న్యాయం కాదని ప్రభుత్వ పాలసీఏ చెపుతాఉన్నది. ఆ ఉరి మొత్తం ప్రజలందరికి అనువైన ప్రదేశం చూసి అక్కడ వారికి పునరావాసం కల్పించ వలసిన బాధ్యత ప్రభుత్వానిది. కేవలం భూమి ఇల్లు ఉన్న వారికి మాత్రమె నష్ట పరిహారం ఇస్తాం మిగతా వారికి ఇవ్వం అంటే కూడా కుదురాదు. చేతి వృత్తులు చేసుకునే వారికి దినసరి కూలీలకు కూడా నష్టపరిహారం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.
అందుకు గాను ముందుగా ప్రభుత్వం ఒక సంప్రదింపుల కమిటీ వేయాలి , ఆ కమిటీ లో ప్రాజెక్ట్ వలన బాధిత వ్యక్తీ , సర్పంచు, mla ఉండాలి .వీరు ఎవ్వరు లేకుండా నష్ట పరిహారం నిర్ధారించి తీసుకోవాలని పోలీసులను పెట్టి ఒత్తిడి చేయడం ప్రజాస్వామికం కాదు. అన్ని వ్యవస్తల ను నిర్వీర్యం చేసి ప్రజలకు ఆయా వ్యవస్తల పట్ల నమ్మకం లేకుండా చేస్తే ప్రజల్లో అశాంతి పెరుగుతుంది, అందు వలన వ్యవస్తలో హార్మని లేకుండా పోయి అలజడులు లేస్తాయి ,యానాం లో రిజెయిన్ సమస్త కార్మికులను పీడించి వేధించి వేధించి ఏమి సాధించింది.వందలాది కోట్ల రూపాయల ఆస్తులు బుగ్గి పాలు అయినాయి, ఆ సమస్త వైస్ చేర్మన్ అసువులు బాసినాడు. ఏ సంపద అయితే కార్మికులకు దక్కకుండా తానొక్కడే అనుభావిస్తానని అనుకొంటే
అతడే లేకుండా పోయినాడు. అంటే వ్యవస్తాలను కాపాడుకోకుంటే ఎంత మంది మార్బలం ఉన్న గూడా ఇవ్వాళ యానాం లో రిజెయిన్ సంస్త ఆస్తులు బుగ్గిపాలు అయినట్టే తమకే చెందాలి తాము మాత్రమె అనుభవించాలి అని అనుకుంటున్న ఈ సంపద వాళ్లకు దక్కకుండానే పోయే
పరిస్తుతులు ఏర్పడుతాయి.
పెంటయ్య. వీరగొని.
అడ్వకేట్, కరీంనగర్.

Friday, January 27, 2012

sanghatita poraataale sharanyam.

యానం లో వేతనాలకోరకు యాజమాన్యం తో పోరాటం జేస్తున్న కార్మికుల పైన పోలీసులు కాల్పులుజరిపి కార్మిక నాయకుణ్ణి చంపివేసినారు.
పరిస్తితిని చక్కదిద్దేకోరకు అదనపు బలగాలను సంఘటన స్థలి కి పంపినారట. పోయిన పోలీసులు ఎవరికీ మద్దతుగా వెళ్లినట్టు? ముందుగా పోయిన
పోలీసులు కాల్పులు జరుపడం ఎవరికీ రక్షణ కల్పించే కొరకు జరిపినట్టు. ఇంతవరుకు ఎక్కడయినా పోలీసుల కాల్పుల్లో కార్మికులు రైతులు చనిపోయిన సంఘటనలు ఉన్నాయి కాని ఎక్కడైనా రైతులో లేక కార్మికుల చేతిలో యజమానులో మరే పెట్టుబడి దారో కాల్చి చంపబడిన దాఖలాలు మనకు ఎక్కడా కనిపించవు. మరి అంత ఖచ్చితమయిన ఆధారాలు ఉన్న కూడా పదే పదే ఈ పోలీసు ప్రభువులు పేద రైతులను , కార్మికులను ఎందుకు కాల్చి చంపుతున్నారో సామాన్యులకు అర్థం కాని విషయం. ఇక్కడ యానం లో ఆ కంపని యజమానికి ఏమైనా ఆర్ధిక నష్టం జరిగితే జరిగి ఉండ వచ్చుగాని చనిపోయిన కార్మిక సోదరుడు అయితే తన కుటుంబ సభ్యులకోసం తిరిగి రాడు. కార్మికుల చమట తో సంపాదించుకున్న ఆస్తి కాలిపోతే మల్లి ఆ కార్మికులే ఆ సంపద అంత సంపాదించే పెడుతారు.
పది పదిహేను రోజుల కింద చెంద్రబాబు రాష్ట్రాన్ని లక్ష కోట్లకు ముంచిన నాయకుని బొమ్మలను ఎక్కడబడితే అక్కడబెడితే కులగోట్టబాడుతాయి అని హేచ్చరించినాడు. దానికి ప్రతిగా ఆ పార్టి నాయకుని ప్రతినిధి మీ ఎన్టీ ఆర్ బొమ్మలు ఉండవు అంటాడు. మా నాయకుని బొమ్మల జోలికి వస్తే రాష్ట్రాన్ని అగ్నిగుండం జేస్తాము అంటారు.కాని ఈ రెండు విగ్రహాలు నిక్షేపంగా ఉంటాయి . ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు.అంబేద్కర్ బొమ్మలు కూల్చబడుతున్నయి. దానికి నిరసనగా కేవలం దళిత సంఘాల వాళ్ళు మాత్రమె ఆందోళన చేస్తున్నారుగాని అంబేద్కర్ భారత దేశం మొత్తానికి నాయకుడు కనుక అందరం కలిసి దోషులను శిక్షించే విధంగా కృషి చేస్తాం అనే అన్య వర్గాల వారు కరువైనారు. గణతంత్ర దినోత్సవం నాడు కూడా అంబేద్కర్ బొమ్మ కూల్చబదిన్ది . దోషులను ఎంతటి వారైనా కతినంగా శిఖిస్తాము అని సర్కారు హుంకరిస్తుంది కాని ఏమీ జరుగదు.
ఆయన కాసు బ్రహ్మానందరెడ్డి కానివ్వండి,అయన జలగం వెంగల రావు కానివ్వండి, ఎన్టి రామ రావు గానివ్వండి, చెంద్రబాబు గానివ్వండి, వైఎస్సార్ గానివ్వండి ముఖ్య మంత్రులుగా పనిజేసిన ఈ పెద్దమనుషులు పదవుల్లోకి వచ్చేటందుకు డబ్బ్లు ఖర్చు చేసిన వాళ్ళే.మళ్ళీ అధికారం లోకి రావడానికి సంపాదించిన వాళ్ళే. తాము మాత్రమె గాకుండా తమ తరతరాలు తిన్న ఒడువని ఆస్తులు సంపాదిస్తారు,తమ సంతానాలు తిరిగి రాజ్యాధికారం లోకి రావడానికి అవసరమైన ఆర్ధిక, రాజకీయ నేపథ్యం ఏర్పాటు చేసి పెడుతారు. ఏ మావోయిస్టులో చెప్పింది గాదు స్వయంగా జాతిపిత గాన్ధిమహాత్ముడే చెప్పిన దేమంటే నీ జేబులో నీ కనీసావసారాలకు మించి ఒక్క రూపాయి ఉన్న అది పక్కవానికి చెందవలసినదే , వాని జేబులో ఉండవలసిన దాన్ని నీవు కాజేసి నట్టే అని అన్నాడు. మరి ఒక్కొక్క రాజకీయ నాయకుని వద్ద తరతరాలు తిన్న తరుగని ఆస్తి ఉంటది వాళ్ళు అపర అన్నహజారేలవలె ఫోజులు పెడుతున్నారు,మేమే అభివృద్ది చేసినం అంటే మేమే చేసినం అని సొంత డబ్బా వాయించుకుంటున్నారు. పైన తెలిపిన నాయకులు తాము సంపాదించుకున్నది మాత్రమె గాకుండా... మీరు సంపాదించుకున్నది అంతా ప్రజలకు చెంద వలసినదే దాన్ని మేము మీ నుండి కక్కిస్తాము అని నిలదీసిన వేలాది మంది విప్లవ యోధులను చంపించినారు.
అట్లా వాళ్ళు కోట్లు సంపాదించిన నాడుగాని , ప్రశ్నించిన వాళ్ళను చంపివేసిన నాడుగాని ఏ ఒక్కరు ఆ ప్రశ్నించిన వాళ్ళ పక్షాన నిలువక పోగా అట్లా ప్రశ్నించడం నేరము గదా అన్నారు. అట్లా ప్రశ్నించిన ఏ ఒక్కరికి గూడా స్వంత ఇల్లు లేదు.సెంటు భూమి లేదు. బ్యాంకు లో వాళ్లకు అంటూ ఒక్క పైసా బ్యాలెన్సు లేదు. కాని వాళ్ళంతా వేల సంఖ్యలో ప్రజల కోసం ప్రాణాలు సమర్పించినారు. అయినప్పటికీ వాళ్ళ చర్యలను తీవ్రవాద చర్యలు అన్నారు. ప్రజలకు చెందవలసిన వేల , లక్షల కోట్ల రూపాయలను వాళ్ళ స్వంత ఆస్తులుగా మార్చుకున్న వాళ్ళపట్ల చట్టం తనపని తాను చెసుక పోతుంది అంటారు. ఆ చనిపోయిన వాళ్ళ విగ్రహాలు కాదుగదా వాళ్ళ జ్ఞాపకార్థం నిర్మించుకున్న స్తూపాలను అవి ఎంత ప్రతిస్తాత్మకం అయినవి అయినా రాతో రాత్ కూల్చివెయబడుతాయి . అరె మావోని ఘోరి అయినా కట్టుకున్టం అంటే ఒప్పుకోబడదు. సాటి మనుషులను చంపినా , వాళ్ళ జ్ఞాపక చిహ్నాలను అలనాటి పిండారీల వలె పేల్చి వేసినా సభ్య సమాజం లో స్పందన ఉండదు.
లక్షలాది ఆదివాసులను నిర్వాసితులను జేసి పోలవరం కడుతామంటే వద్దనే వాళ్ళు కరువౌతారు. వేలాది మంది మత్స కార్మికులకు అన్నం బెట్టె బేల భూములను మల్టినేషనల్ కంపనిలకు అప్పగిస్తామంటే వద్దన్నవాల్లను కాల్చి చంపుతారు. ఆదిలాబాడునుండి ఖమ్మం వరకు లక్షలాది హెక్టార్ల బంగారం పండే సారవంతమైన భూమిని ఓపెన్ కాస్టుల పేరుతొ మరుభూమిగా మార్చి ప్రజలను పక్షుల వలె వలసలకు పంపితే అడ్డుజేప్పిన వాళ్ళను అభువ్రుద్ది నిరోధకులు అని నిందిస్తారు. కోట్ల సంవస్తారాలక్రితం రూపొందిన గుట్టలు ప్రజలకు ఓవర్ హెడ్ తుంకులు అయి వన్య ప్రాణులకూ గృహాలై రక్షణ ఇస్తుంటాయి.ఎవరి ప్రయోజనం కోసమో అవన్నీ ధ్వంసం చేయబడుతాయి , కాని కాదనే వారుండరు. ఇది వర్గాసమాజం దీన్ని అంతం జేయలంటారు కాని అనిచివేయబడుతున్న తెలంగాణా ప్రజలు ప్రత్యెక రాష్ట్రం కోరితే మటుకు అడ్డుజేబుతారు. తెలంగాణ ప్రత్యెక రాష్ట్రం కావాల్సిన్దేనంటారు కాని ఎస్సి వర్గీకరణ మాత్రం వద్దంటారు. నిజంగా నే సంపద అంతా అందరికి సమానంగా పంచాబడాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్న వాళ్ళంతా తమ తమ భేషజాలు , స్వార్థ ప్రయోజనాలు పక్కనబెట్టి సమిష్టిగా ఉద్యమించవలసిన తక్షణ అవసారాన్ని గుర్తించవలసిన అవసరం బడుగు బలహీన వర్గాల పైననే ఉన్నది.అట్లా సంగటిత పోరాటాలకు ముందుకు రాకుంటే?
ఇవ్వాళ మన నాయకుల విగ్రహాలు కూల్చివెస్తున్నరని , యానం లాంటి చోట మన తోటి కార్మికులను కాల్చి చంపుతున్నారని మొత్తుకొంటే వేట రుచి మరిగిన ఈ మృగారాజులకు వేరు వేరు జేసి వేటాడడం లో ఉన్న ఆ మృగయావినోదం రెట్టింపు అవుతుందే గాని భీతిపడబోవు.
పెంటయ్య.వీరగొని.
అడ్వకేట్
కరీంనగర్,

Sunday, January 22, 2012

apara raajulu!

పూర్వ కాలం లో రాజులు ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవడానికి మారువేషాల్లో ప్రజల్లో తిరిగి వాళ్ళ అవస్తలు గమనించి ఆ కస్టాలు తీర్చే వారని కథల్లో చదువుకున్నాము.అట్టి రాజులు చాల గొప్ప ప్రజారంజకులు అని ధర్మప్రభువులు అని ప్రజలు కీర్తించే వాళ్ళని కూడా చదువుకున్నాము. కాని ప్రజల కష్టాలకు కారకులు ఎవరో ఆ కథల్లో ఎక్కడ చెప్పిన దాఖలా లేదు. రాజు తన జనానా ఖర్చులకు, తన చీని చీనాంబరాలకు, దిన చర్యలకు,సేవకుల ఖర్చులు, సైన్యాల నిర్వాహణకు, శత్రు రాజులపైకి దండయాత్రలకు, తన రాజ్యవిస్తరనకోసం జరిగే యుద్దాలకోసం సైనికుల , ఆయుధాలకోసం అవసరమైన సొమ్మును ప్రజల నుండే వసూలు చేసే వాడు అని కూడా చదువుకున్నాము, అంటే ప్రజలు పడుతున్న అన్ని కష్టాలకు పరోక్షంగా రాజులే కారకులు అన్న విషయం ఆలోచించే వాళ్లకు అర్థం అయినాగుడా రాజ విధించే శిరచ్చేదం లాంటి శిక్షలకు భయపడి ప్రజలు ప్రశ్నించే వారు కాదు అనే విషయాలు సత్యకామ జాబాలి లాంటి కథల్లో కనిపిస్తుంటాయి.
అది రాజరిక వ్యవస్థ.. కాని ప్రస్తుతం నడుస్తున్నవి ప్రజాస్వామిక ప్రభుత్వాలు అని చెప్పుకుంటున్నాము.ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజలకోసమే పాలిస్తున్న ప్రభుత్వాలు ఇవి అని పొలిటికల్ సైన్సు లో చదువుతున్నాము.
అయితే ప్రజల్లో భాగమైన రైతుల కస్టాలు స్వయంగా చూసి పరిష్కరిస్తాము అని అపర రాజులు అయిన చంద్ర బాబు తన చెంద్ర దండును వెంటబెట్టుకొని వస్తే జగన్ వైఎస్సార్ సేన రక్షణలో తెలంగాణలో పర్యటించిన సంగతి చూసి నాము. రాచరిక వ్యవస్తలో ఎలాగైతే ప్రజల సమస్త కష్టాలకు రాజులు కారణం అయ్యేవాల్లో ఇక్కడ తెలంగాణా లో ప్రజలందరి సమస్త కష్టాలకు, నష్టాలకు బాధ్యులు సీమాంధ్ర నాయకత్వం.. ప్రధానంగా చెంద్ర బాబు తెలుగు దేశం ప్రభుత్వం,మరియు వైఎస్సార్ నాయకత్వం లో కొనసాగిన కాంగ్రెస్ ప్రభుత్వాల కారణం అనేది తెలంగాణా లో ప్రతి పౌరుడు ఇవ్వాళా అంటున్నాడు. తెలంగాణా ప్రాంతం ఆంధ్ర ప్రదేశ్ లో కలువడానికి ముఖ్య కారణం కాంగ్రెస్సు. అలాగే రాసుకున్న రాతలు చేసుకున్న ఒప్పందాలు, ఉల్లంఘించి తెలంగాణా నీల్లు, నిధులు, ఉద్యోగాలు, వనరులు బొగ్గు,విద్యుత్తూ,ఇలా సమస్త సంపదలు తెలంగాణా ప్రజలకు దక్కకుండా సీమాంధ్ర పెట్టుబడి దారులకు కట్టబెట్టినవి ఈ రెండు ప్రభుత్వాల ఏలుబడిలోనే.. తెలంగాణా లోనే రైతులను నిండా ముంచింది వీళ్ళే ఇవ్వాల రైతులను ఉద్ధరిస్తామని ప్రగల్బాలు పలుకు ఇగిలిచ్చుకుంట వస్తున్నది వీళ్ళే.
రైతులకు గిట్టుబాటు ధర వీళ్ళు కల్పించలేదని వాళ్ళు,, వాళ్ళు కల్పించ లేదని వీళ్ళు ఒకరిపైన ఒకరు నిందలు వేసుకొని ప్రజలను ఇంక మోసగించ గలమని వీళ్ళు భ్రమిస్తున్నారు. రైతుల పట్ల వీళ్ళు చూపిస్తున్న కపట ప్రేమను ప్రజలు గమనిస్తున్నారు. ఒక పిన్నీసు ను తయారు జేసినా ఆ తయారిదారు తన ఉత్పత్తి కి ధరను తనే నిర్ణయించి అమ్ముకుంటాడు . అట్లాగే దాని ధర కూడా సార్వ జనీనంగా అంతా ఒకే ధరతో అమ్ముకుంటాడు.అట్లా వాడు అమ్ముకోవడానికి ప్రభుత్వాలు సవా లక్ష రాయితీలు ఇస్తాయి .. రైతు పండించే ధరను మాత్రం అతడు నిర్ణయించడానికి వీలు లేదు. ప్రభుత్వాల దయా దాక్షిణ్యాల పైన రైతు పండించిన ధాన్యానికి ధర ఉంటుంది., ఒక్కక్క సారి పోయిన సంవస్తరం ధరకంటే గూడా తక్కువకు రైతు అమ్ముకోవాల్సి వస్తుంది. ఉదాహరణకు గత సంవస్తరం పత్తి క్వింటాల్ ఆరు వేలు ఉంటె ఈ సంవస్తరం గరిష్టంగా నాలుగు వేలే ఉంది.. అంతే గాక ప్రాంతానికి ఒకరకంగా , సరుకుకు ఒక రకంగా వ్యాపారుల ఇష్టానుసారంగా రైతులను దోచుకోవడానికి వ్యవస్తీక్రుతమైన ఏర్పాట్లు ఉంటాయి, సరుకు రైతుల వద్దనుండి వ్యాపారుల వద్దకు చేరగానే ధరలు ఆకాశానికి పోతాయి .అది కాంగ్రెస్ అయినా, తెలుగుదేశం అయినా,కమ్యునిస్టు అయినా బిజెపి అయినా అందరు ఒకే సూత్రాన్ని ఎందుకు అవలంభిస్తున్నారు? ఎందుకంటే పారిశ్రామాదిపతులు ఇస్తున్న లేదా ఇవ్వజుపుతున్నడబ్బులు కావాలి కనుక వాళ్లకు లబ్ది చేకూర్చే విధానాలు అవలంభిస్తారు . అలాగే రైతుల ఓట్లు కాకాలి కనుక వాళ్ళ కు ఏవో రాయితీలు ఇస్తున్నట్టు నమ్మబలుకుతారు. కాని ఎప్పుడు కూడా వారు చెప్పే మాటలకు చేసే చేతలకు పొంతన ఉండదు. నిజంగానే పాలిస్తున్న పార్టీలు రైతులకు మేలు చేసే ప్రభుత్వాలే అయితే కాస్మీరునుండి కన్యాకుమారి దాకా , బొంబాయి నుండి ఒరిస్సా దాక రైతుల ఆత్మహత్యలు నిరంతరాయంగా ఎందుకు జరుగుతున్నట్టు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎక్కడైనా ఒక్క జిఎమ్మారు , ఒక జిందాలు ఒక బ్రాహ్మణి , ఒక వేదాంత, ఏదయినా ఒక ఆయిల్ కంపని వాళ్ళు ఎవ్వరైనా ఎక్కడైనా ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మనకు ఒక్కటయినా కనిపించదు ఎందుకు ?
అయితే అంతిమంగా అయన చంద్రబాబు గానివ్వండి , జగన్ గానివ్వండి , కిరణ్ గానివ్వండి.మరే పాలకుడైనా గానివ్వండి ప్రజల పైన రైతుల పైన ప్రేమ అంటే అది వాళ్ళ ఓట్ల పైన ప్రేమ దప్ప ఆ వర్గాల ప్రయోజనం కోసం ఉద్దేశింప బడింది కాదు అనేది నిర్వివాదాంశం. ఇక ఇక్కడ తెలంగాణా లో వీళ్ళ పర్యటనల సారాంశం చాల స్పష్టం,ఏంటంటే తెలంగాణా వాదాన్ని పూర్వపక్షం చేసి ఇక్కడ ప్రజల్లో తెలంగాణా వాదం ఏమి లేదు అని ప్రపచానికి చెప్పడానికే అందరు కలిసి ఆడుతున్న దొంగ నాటకం. అన్ని పార్తీల వాళ్ళు వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలకు వచ్చేసరికి ఎవరికీ వారు విడివిడిగా కొట్లాడుతున్నగూడా తెలంగాణా విషయం వచ్చేవరకు మాత్రం అందరుకల్సి తెలంగాణా రాకుండా అడ్డుకోవడానికి చేయవలసిన ప్రయత్నం అంతా చేస్తున్న విషయాన్ని తెలంగాణా ప్రజలు జాగ్రత్తగానే గమనిస్తున్నారు.
పెంటయ్య.వీరగొని
అడ్వకేట్ , కరీంనగర్.

Click here to Reply or Fo

Tuesday, January 17, 2012

adiyunu okanduku manchide!

అత్యంత ప్రతిష్టాత్మకమైన నేషనల్ లా స్కూల్ బెంగుళూర్ లో చదువుతున్న విద్యార్థులు కామన్ స్కూల్ విధానాన్ని వ్యతిరేకిస్తూ తాము ఆర్థికంగా, సామాజికంగా ఎంతో ఉన్నతమైన వాళ్ళం
అయిఉన్నాము, మమ్ముల్ని మాతో సమానంగా సరితూగ లేని పిల్లల సరసన కూర్చొని చదువుకోనాలని శాసించే హక్కు ప్రభుత్వాలకు ఉండడం అంటే మా వ్యక్తీ గత స్వేచ్చకు భంగకరం అవుతుంది
అని వాళ్ళు బాధపడి పోతూ అక్కడ కామన్ స్కూల్ విధానాన్ని సమర్థిస్తూ మాట్లాడుతున్నా ప్రొఫెసర్ జి.హరగోపాల్ గారి ప్రసంగాన్ని అడ్డుకోన్నారని చదివినాము.
జ్ఞానం. విద్య , సంస్కృతీ , సంస్కారం ఒక మనిషికి ఎక్కడ నుండి లభిస్తాయి అని ప్రశ్నించుకుంటే అవి ఏ ఒక్కరి వ్యక్తిగత ప్రతిభ ఆధారంగానో వచ్చేటివి కావు , అవి మనుషులు ఈ భూమి మీద
సంచరిస్తున్నప్పటినుండి ఒకరి నుండి ఒకరికి, ఒక సమూహం నుండి మరొక సమూహానికి, ఒక తరం నుండి మరొక తరానికి,ఇచ్చి పుచ్చుకున్న వ్యవహారాలని అర్థం అవుతాయి.మనిషి బ్రతుకదానికి
ప్రాథమికంగా స్వాశించడానికి గాలి తర్వాత అత్యంత ప్రాథమిక అవసరం ఆహారం. ఆ ఆహార సంపాదనలో మనిషి అనేక వేల సంవస్తరాలు పెనుగులాడి, బతుకు పోరాటం జేసి స్తావర జీవితాలకు వచ్చిన
తర్వాత వ్యవసాయం అభివృద్ది జేసుకొని మిగులు ఉత్పత్తి సంపాదించుకున్న తర్వాత ఆ మిగులు సంపదను గతం లో వలె అందరికి సమానంగా పంచకుండా కొందరే దాన్ని దాచుకొనే క్రమం వచ్చిన
తర్వాత సంపద ఎవరివద్దనైతే పోగు అవుతూ పోయిందో వారి ఆధిపత్యం పెరుగుతూ పోయిన విధం చరిత్రలో చూస్తుంటాము. తాము కుదబెట్టుకొన్న సంపదను మరొకరు లాగుకొని వెళ్ళకుండా సైన్యం
కావాల్సి వచ్చ్సింది, సైన్యం తో బాటుగా రాజ్యం వచ్చ్సింది. చిన్న చిన్న రాజ్యాలు ఓడగోట్టబడుతున్నందున సామ్రాజ్యాల అవసరం వచ్చింది. ఈ క్రమం లో ఉత్పత్తిలో భాగస్వాములు కాక పోతున్న
వారి సేవలకు కూడా ప్రతిఫలం ఇవ్వవలసిన పరిస్తితి లో ఉత్పత్తితికి మూలాధారమైన భూమికి అధిపతి రాజు , భూసురుడు. భూమి అంతా ఆయనకే చెందుతుంది కనుక ఆ భూమిని ఎవరు సేద్యానికి
ఉపయోన్చినా రాజుకు పన్ను చెల్లించాలి అనే చట్టం చేసినారు.. అట్లా సేవారంగం లో ఉన్నవారికి ప్రజల కష్టార్జితం వెళ్ళడం ప్రారంభం అయింది. సేవారంగం లో ఉన్నవారికి నిరంతరం ఆహార అన్వేషణలో
పెనుగులాట తప్పింది. వారికి ఆలోచించడానికి విశ్రాంతి లభించింది . విశ్రాంత జీవులు ప్రకృతుని నిశితంగా పరిశీలించి సూర్య, చంద్రుల గతి, ఉరుము,మెరుపు, మేఘాలు వర్షించడం,పంటలు పండడం,
అగ్గిని కనుక్కోవడం చక్రాన్ని, లోహాన్ని కనుక్కోవడం జరిగింది, ఆ శ్రామికులు ఈ సేవారంగం లో ఉన్నవారికి విశ్రాంతి కలిగించకుండా ఉండిఉంటే వీళ్ళకు వాటిని కనుక్కోవడం వీలయ్యేది కాదు. ఆ
కనుక్కున్నా వాళ్ళు అదంతా మా ప్రతిభే అని ఏనాడు అనుకోలేదు. పేటెంట్ హక్కులు తీసుకోలేదు. అదంతా సమాజగాతమే అయ్యింది. ఇంతాగా ప్రజాస్వామిక ఆలోచనలు లేని నాడే ఆ శాస్త్రజ్ఞులు
అది మా ప్రతిభాకాడు అదంతా ప్రజలందరి పైశోధనల ఫలితమే అన్నారు.
రాజ్యాలు రాజులకోరకు అనే భావన పోయి ప్రజాస్వామీకరించాబడి రాజ్యం ప్రజలకోరకే అని అనుకున్న తర్వాత ఆనాటి రాజులు భూస్వాములు, తమ బూజు వాసనలను వదిలించుకోకుండా అవుతున్న
ఉత్పత్తులు, ఉత్పత్తిసాధనాలు అయిన భూమి, పరిశ్రమలు, యంత్రాలు తమవే కనుక ఉత్పత్తి అవుతున్న సంపద తమదే అని శ్రమ పడుతున్న వారికి జీతాలు మాత్రమె ఇస్తాము ఉత్పత్తి సాదహనాల
పైన హక్కులు మాత్రం ఇవ్వము అంటూ తదనుగుణంగా చట్టాలు చేస్తున్నారు. చేస్తున్న చట్టాలు అన్నిగుడా తమ ప్రయోజనాలు నెరవేర్చే విధంగానే ఉండే విధంగా జాగ్రత్త పడుతున్నారు. ఆ విధంగా సంపద
చదువు కొందరికి మాత్రమె అందుబాటులోకి వచ్చిందన్న విషయం అర్థం అవుతుంది. జరుగుతున్నా సంపదలో హక్కు గురించి ఆలోచించకుండా నిరంతరం సంపద శ్రుస్తిలో పాలు పంచుకొంటున్న
సమూహాలు ఎల్లవేళలా ఆలోచనా రహితంగా ఉండవుకదా? ఇప్పుడు వాళ్ళు తమ హక్కు ను అడుగుతున్నారు. చట్! మీరు మా దగ్గరకు కూడా రావడానికి అర్హత లేని వాళ్ళు అని వాళ్ళను దూరం
కొడితే వాళ్ళు ఘర్షణకు దిగుతారు. సమాజాలల్లో అంతర్యుద్ధం మొదలవు తుంది. అందుకే బూర్జువా మేధావులు, ఫిలాసఫర్స్ ప్రజల హక్కులు కాపాడున్నట్లు నటించాలని అల నటించక నగ్నంగా
బయట పడితే మన అధికారాలకే ఇబ్బంది అని కోల్పోతున్న సమూహాలు రాజ్యాధికారం కోసం తిరుగబడితే అణిచివేతకు హింసను ప్రయోగించ వలసి వస్తుంది ఆ తిరుగుబాటులో మనకు ప్రాణ నష్టం
జరుగుతుంది, కనుక మనం దోచుకు తింటున్న సంపదలో రాలిపడుతున్న తుంపరల ను అయినా వాళ్లకు దక్కేటట్లుచూసుకోవాలి అని చెప్పుకొన్నారు. మనలో కలుపుకోన్నట్లు అయినా నటించాలి
అని రాసుకున్నారు. ఈ పిల్లకాకులను పెంచిన ఆ పెద్దకాకులకు ఈ సామాజిక స్పృహ లేక పోవడం వలన పెద్దకాకుల మాటలను, వాదనలను వినివినీ ఉన్న పిల్లకాకులు అట్లా వాదిస్తున్నారు.
అదియును ఒకందుకు మంచిదే, కోల్పోతున్నవాళ్ళు ఇప్పటికైనా తమలో తాము పోట్లాడుకోవడం ఆపివేసి సంపద అంతా అందరికి సమానంగా చెందే పోరాటాలవైపు సాగిపోతారని ఆశిద్దాం.
పెంటయ్య.వీరగొని.
న్యాయవాది.
కరీంనగర్.

Tuesday, January 10, 2012

telangaana prajalu chustunnaru.

విద్యుత్ చార్జీల పెంపుకు నిరసనగా చంద్రబాబు పాద యాత్ర చేస్తుంటే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని కిరణ్ కుమార్ సర్కార్ బాబును అరెస్టు చేయడం అప్రజాస్వామికం,
వాస్తవానికి ఈ నినాదం తో ప్రభుత్వాన్ని నిలదీయ గలిగిన నైతికత బాబుకు లేదు. ఇతని హయాం లో విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ రైతులు , ప్రజలు ఎద్యమిస్తే కాచి చంపిన ఒక
అప్రజాస్వామికుడు. మరో విషయం , బాబు యాత్ర శాంతి భద్రతలకు విఘాతం అని. ఎవరి శాంతి, ఎవరి భద్రత? ప్రజలెవ్వరు గూడా చార్జీలు పెంచాలని కోరుకోవడం లేదు.పెంచ వద్దనే అంటారు.
ప్రజల ఉద్దేశానికి మద్దతుగా బాబు ఉద్యమిస్తానంటే ప్రజలేందుకు వద్దంటారు.? ఈ యాత్ర అయితే గియితే కిరణ్ శాంతికి ఇబ్బంది అవుతుందేమో ?
ఇంకో విషయం , అతడు చంద్రబాబు గావచ్చు,కిరణ్ కుమార్ గావచ్చు, అధికార పీఠం అధిస్టించినపుడు భారత రాజ్యాంగం మీద ప్రమాణం జేసి పక్ష పాత రహితంగా , స్వీయ ప్రయోజనాలకు
తావులేకుండా ప్రజలందరికి సమాన న్యాయం చేస్తామని చెప్పి అధికార పీఠం అధిష్టించిన వారే. కాని కోట్లాది ప్రజలకు కష్ట నష్టాలు కలిగే అనేక చర్యలు చేపడుతూ పిడికెడు పెట్టుబడిదారుల
పెట్టుబడులు మరింత పెరిగే నిర్ణయాలు ఎన్నో తీసుకున్నారు.తీసుకుంటున్నారు. ముఖ్యంగా , తెలంగాణా నీళ్ళు, భూములు, ఉద్యోగాలు, నిధులు, వనరులు తెలంగాణా ప్రజలకు చెందకుండా
తమ ప్రాంతం వాడని, తమ వర్గం వాడని, తమ కులం వాడని, తమ తమ బంధు మిత్రులకు లబ్ది చేకూర్చినారు. రాజ్యాంగం ప్రకారం ప్రాంతాల భేదం లేకుండా పాలించిన వాళ్ళ నందరిని జైళ్లల్ల
పెట్టాలి.
చంద్ర బాబు వరంగల్ లో పర్యటించినపుడు గాని, ఇపుడు జగన్ నిజామ బాద్ లో పర్యటిస్తున్నపుడు గాని ప్రజలు నిరసనలు తెలుపుతూ వీరి పోరులు, దీక్షలు తెలంగాణా ప్రత్యెక రాష్ట్ర
ఆకాంక్షను పూర్వ పక్షం చేస్తాయి గాని తెలంగాణా రాష్ట్ర సాధన లక్షాన్ని బలపర్చేవిగా లేవు అని అడ్డు చెప్పినారు. తెలంగాణా ప్రజల శాంతికి విఘాంతం కలుగుతున్నదని రోడ్ల పైకి
వచ్చి అడ్డుకొనే ప్రయత్నం చేసినారు.ప్రజాస్వామ్యం లో ప్రజల అభిప్రాయాన్ని మన్నిస్తేనే ప్రజాస్వామ్యం మనగాలుగుతుందని ప్రజలు నెత్తి నోరు కొట్టికొని చెప్పినారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి
ఇబ్బంది లేకుండా తెలంగాణా వాదం పూర్వ పక్షం అయ్యే పని జరుగు తున్నది కనుక నాయకులను గృహ నిర్బంధం లో పెడుతారు, అయిదు వేల మందిని అరెతుజేస్తారు.వందల సంఖ్యలో
ప్రజల కాళ్ళు,చేతులు విరిచి తలలు పగులగోట్టడానికి తమ బలగాలకు తోడుగా ప్రయివేటు దండులను అనుమతిస్తారు. యునివర్సిటీ హాస్టల్ గదులల్లోకి వెళ్లి ఆడ పిల్లలని గూడా చూడకుండా
ఇష్టం వచ్చినాట్లు కొట్టినా, విద్యార్థుల పైన విచక్షణా రహితంగా కాల్పులు జరిపినా, ఈ దమన కంద చూడ లేక 800 మంది పిల్లలు తమ ప్రాణాలు దీసుకుటే అటు ప్రభుత్వం గాని ఇటు
ప్రతిపక్షం గాని అది తమకు సంబంధించిన విషయమే గానట్టు ఎక్కడ గుడా ఒక్క మాట మాట్లాడని మీకు ఇవ్వాల రైతుల పెరుజేప్పుకొని తెలంగాణా లో కాలుబట్టే అర్హత ఉందా?
తెలంగాణాకు ప్రధాన అద్దంకి అయిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తెలంగాణా లో నడిపించవలసిన బాధ్యతా కిరణ్ కుమార్ పైన ఉంది. తెండు సార్లూ తెలంగాణా రాకుండా అడ్డుపడిన
చంద్ర బాబుకు తెలంగాణలో కూడా తన పార్టీని బతికిన్చుకోవాల్సిన బాధ్యతా ఉంది. తెలంగాణా నినాదం ఆధారం తో రెండుసార్లు గద్దేనిక్కి తల్లి రొమ్ముగుద్దిన తాయీ గండడు
వై ఎస్సార్,, తనయుడు తండ్రి ఆశయం కోసమట తెలంగాణా లో తన పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యతత జగన్ కు కూడా ఉందట. కాని తెలంగాణా ప్రజల ఆకాంక్షలను కాపాడ
వలసిన బాధ్యత మాత్రం ఎవరికీ లేదు. అలాగే ఈ పార్తీలల్లో తిరుగుతున్నా తెలంగాణా నేతలకు రేపు తమ పార్టీల టిక్కెట్లు గావాలె, ఆ నాయకులు ఇచ్చేలేదా ఇప్పించే డబ్బులు
గావలె .తప్పిజారిపోయి గెలిస్తే అధికారం పంచుకొనే పదవులు గావలె, అంతే గాని తెలంగాణా ప్రజల ఆకాంక్షలతో వాళ్లకు పని లేదు.తమ నేతల మాటను తెలంగాణా లో తన్నులు
బడి అయినా తన్ని అయినా నెగ్గించి ! భళీరా మన్నీడా, శహబ్బాస్! అంటే , బాంచన్ దొరా, అనే గడీ పాలేర్లుగా నిలబడుతున్నారు.
ఇక అత్యంత ప్రధానమైన విషయం, అందరు అనుకుంటున్నట్టుగా తర తమ భేదాలు లేకుండా అన్ని పార్టీల వాళ్ళు తెలంగాణా వాదాన్ని తమ తమ మాటల గారడీలతో తమకు
అనుకూలంగా మార్చుకొని ఓట్లను దండుకొని ప్రజాప్రతినిధులుగా గెలిచి అధికారం సంపాయించి సంపద పెంచుకోవడానికే దప్ప ప్రజల పక్షాన నిలిచి వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా
పాలిస్తాము,నడుచుకున్టాము అనే వాళ్ళు ఎవ్వరు కూడా కనిపించడం లేదు.
రైతుల సమస్యల పేరుతొ చంద్రబాబు గాని, జగన్ గాని , తెలంగాణలో తిరుగుతారట, కాని తెలంగాణా ఇవ్వాలని మాత్రం అనరట. అయినా ఎద్దిబాగుల తనం అందామా ఇంత అవకాశ వాదం,
ఇంత స్వార్థపరత్వం అందామా మన తెలంగాణా నేతలు వాళ్ళ సీమాంధ్ర నాయకులకు వీర బావుటా ఎత్తుతూనే ఉన్నారు . ఇక అదేదో సినిమాలో అన్నట్లుగా పూరేకు పూరా తెలంగాణా వాదం తో
రెండుసార్లు అధికారం లోకి వచ్చిన ప్రస్తుత ప్రభుత్వం వాళ్ళ పార్టి అన్ని పార్టీల అభిప్రాయాన్ని అడుగుతది కాని తమ అభిప్రాయం చెప్పదు. ఇక్కడనేమో వీళ్ళు ఇచ్చేది మేమే తెచ్చేది మేమే అంటారు.
ఈ రైతు డ్రామాలు,రచ్చబండ డ్రామాలు, ఉపఎన్నికల డ్రామాలు,ఎవరికోసమో,ఎందుకోసమో తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా గమనిస్తున్నారు... ఉపఎన్నికలు, మున్సిపాలిటీ, స్తానిక సంస్తలు,
ఆ తర్వాత అసెంబ్లీ, పార్లమెంటు, ఎన్నికలాట. అప్పుడు ఎన్నికల కోసం దప్ప ప్రజల కోసం ఏమీ చేయని , చేయలేని మీకు ఎందుకు ఓటు వేయాలని నిలదీయనున్న తెలంగాణా ప్రజలను
నిలువరించే దమ్ము మీ కిరాయి సైన్యాలకు ఎంత మాత్రం ఉండబోదు .
పెంటయ్య వీరగొని.

Friday, January 6, 2012

prajasvaamika hakkulu maaku undavaa?

చంద్ర బాబు మాల్లో సారి అబద్దాలుజెప్పి తెలంగాణా ప్రజల చెవిలో పూవుపెట్టి పోయిండు. అయన తెలంగాణాకు వ్యతిరేకంగా ఎప్పుడూ మాట్లాడ లేదట? నిజ్జంగా నిజమేనా? వాజ్ పేయి సర్కారుల ఒక్క ఓటు
రెండు రాష్ట్రాలు అన్న మానానికి మేము తెలంగాణా ఇవ్వబోతున్నమంటే అడ్డుతగిలి అప్పుడు తెలంగాణ రాకుండా చేసింది ఎవరు మరి? అసెంబ్లీ లో తెలంగాణా అనవద్దు వెనుక బడిన ప్రాంతాలు అని మాట్లాడాలని
ఆదేశించినది ఎవరో? తొమ్మిది డిసెంబర్ అర్ధరాత్రి నుండి రాజకీయం నడిపి నన్నపునేని రాజకుమారితో లగడపాటికి ముద్దులు ఇప్పించి మన పార్టీలు ఎవ్వైతే ఏందీ మనం అందరం సీమంధ్ర వాళ్ళమే, తెలంగాణా వాళ్ళు
మన ఏలుబడి పిడికిలి నుంచి జారిపోతమంటే మనమెట్ల పోనిస్తం అని ఐక్యంగా అడ్డుదగులదానికి నాయకత్వం వహించింది ఎవ్వరు? నిన్నటికి నిన్న అసెంబ్లీ లో అవిశ్వాస తీర్మానం లో మూడు గంటలు మాట్లాడి తెలంగాణా
ముచ్చట ఒక్కసారన్న తీయడానికి నీకు నోరు రాలేదు ఎందుకు? ఏడు వందల మంది తెలంగాణా బిడ్డలు కాంగ్రెస్ , టిడిపి బొంకు రాజకీయాల కారణంగా చనిపోతే కనీసం సంతాప తీర్మానం పెట్టడానికి కూడా నీ మహా నాడు
లో అవకాశం లేకుండా పోయినంతటి అప్రస్తుతమైపోయిన మా తెలంగాణా విషయం నిన్ను ఇవ్వాల తనగురించి నీతో నోరు తెరిపించి మాట్లాదిపిచ్చింది. ఇన్ని సంవస్తరాల నుండి మా తెలంగాణా ప్రజలకు జీవన్మరణ
సమస్య అయ్యి మేము పోరాటం జేస్తుంటే మా గురుంచి ఒక్క మాట జెప్పడానికి కూడా నీకు అసెంబ్లీలో నోరు రాకపాయే కాని నేను మీ తెలంగాణాకు వ్యతిరేకం కాను అనేదానికి నీకు నోరెట్ల వచ్చే గదా ?
మనందరికీ తెలిసిన సంగతే ... అదే ఉప ఎన్నికలు వస్తున్నాయి గనుక ఎట్లా నన్నా కొన్ని ఓట్లు సంపాయిన్చాలేనన్న తపన కనిపిస్తున్నది. కాని మా ఉసికే, మా బొగ్గు, మా నీళ్ళు, మా ఉద్యోగాలు, మా గుట్టల
గ్రానైటు , బాక్షైతు, ప్రధానంగా మా భూములు కొల్లగొట్టుక పోతుంటే మీకు మీ కాంగ్రెస్సుకు వ్యతిరేకంగా మేము పోరాటం జేస్తూ వస్తున్నాం. అది మా ప్రజాస్వామిక కాంక్ష అయిన తెలంగాణా రాష్ట్రం వస్తే దప్ప
ఈ విధ్వంసం ఆగదని. కాని ఒక ప్రతిపక్ష నాయకునివి అయి ఉంది పది జిల్లా ల నాలుగు కోట్ల మంది ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షను నీవు అసెంబ్లీ లో ఎందుకు ప్రస్తావించలేదని అడిగితె నీ ప్రజాస్వామిక హక్కుకుభంగం
వాటిల్లిందా? నీ ఒక్కనికి గీ మాత్రం ఇబ్బంది అయితే అంత బాధ పడి పోతున్నావే, మా నాలుగుకోట్ల మంది ప్రజాస్వామిక హక్కుకు భంగం కలిగితే మేము ఎంత బాధపడి పోవాలేనో చెప్పు? మా వెయ్యి మంది బిడ్డల
రక్తం ఏరులయి ప్రవహిస్తే మేము ఎంత బాధ పడి పోవాన్నో చెప్పు? మా ఆపతిల , మా సంపతిల, మా ఏడుపుల, మా ఓదార్పుల అక్కరకు రాని నువ్వు ఇవాళ నీకు ఓట్ల అక్కెర బడంగనే అలాయి బలాయి దీసుకుంట
అంటే నిన్ను ఎట్లా నమ్ముమంటావు. మీ సోదరుడు రాజశెకరుడు 2009 ఎన్నికల పోలింగు అటు అయిపొంగానే , తెలంగాణాకు పోవాన్నంటే ఇక మనకు పాస్పోర్టులు గావాన్నత అని కారేడ్డమాడ లేదా?
టీ అర ఎస్ ను తిడితే తెలంగాణా ఉద్యమం గాదు? ఓ తెలంగాణా టి డి పి నాయకులారా మీరు తెలంగాణా కొరకు చేసిన పోరాటం ఏదైనా ఉంటె ఒక్కటి జెప్పండి. రాజీనామాలు అంటారా? అదొక జోక్ అయిపొయింది.
చేయవలసినప్పుడు వాళ్ళు చేస్తే మేము చేస్తామని డ్రామాలు చేసిండ్రు. సకల జనుల సమ్మె లో మీరు ఎక్కడబోయిండ్రు? పార్ల మెంటులో అసెంబ్లీలో తెలంగాణా రాష్ట్రం కోసం మీరు చేసింది ఏందో సెప్పుండ్రి?
నిన్నటికి నిన్న కిరణ్ కుమార్ తెలంగాణ ల తిరిగి పోయిండు. ఇవ్వాల తెలంగాణా టిడిపి వాళ్ళు చెంద్ర బాబును తిప్పిండ్రు, రేపు వై ఎస్సార్ పార్టి వాళ్ళు జగన్ ను తిమ్పుతారు. ఎల్లుండి నుంచి ఇదే సీమాంద్ర మీడియా,
సీమంద్ర పెట్టుబడి దార్లు అగాగో చూడండి తెలంగాణా ల తెలంగాణా వాదమే లేడని విశాలాంధ్ర విషం గక్కుతాడు పరకాల..
, ... ప్రజాస్వామ్యం గురించి తెగ బాధపడి పోతున్నారు గదా? 5 జనవరి 2010 నాడు డిల్లి లో చిదంబరమే ఏమన్నడు? ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలను మనం పట్టించుకోక పొతే ఉద్యమం మన
చేతుల్లోంచి వెళ్లి పోవాల్సిన వాళ్ళ చేతుల్లోకి పోతది అని అనలేదా? మరి అప్పుడు ప్రజాస్వామ్యం గురించి మతికి రాదు. చర్చిల్ మహాశయుడు అన్నట్టుగా నేను నీ ఆలోచనలతో అసలు ఏకీభవించక పోయినా
నీ ఆలోచనలు చెప్పుకొనే ప్రజాస్వామిక స్వచ్చకోసం నా గొంతులో చివరి ఉపిరి ఉన్నంత వరకు పోరాడుతా నని అన్నాడు గదా? మరి ఆ ప్రజాస్వామిక స్వేచ్చ ప్రకారమే గదా ఆనాడు బషీర్ బాగ్ లో అయినా
ఇయ్యాల 2009 ఎన్నికలప్పుడు నీవు అన్న తెలంగాణ వాదానికి ఎందుకు నిలబడుత లేవు అని నిలదీసిన పాపానికి ఐదువేల మంది అర్రేస్టు, వందల మంది తలలు పగుల గొట్టిచ్చి అక్రమ కేసులు
బెట్టిస్తావ్ ఇదేనా నీ ప్రజాస్వామ్యం అని తెలంగాణా ప్రజలు నిలదీస్తున్నారు. అట్లనే ఇంకొక్క మాట మా తెలంగాణా మాకు కావాలె అని పాటబాడినమా బెల్లి లలితను ముక్కలు ముక్కలుగా నరికి పిచ్చినావు , మా వీణవంక రవీందర్ రెడ్డి ని, మా కనుకా చారిని తెలంగాణా జనసభలో పనిజేసినందుకని నడివీధిలో నరికి చంపిపిచ్చినావు . అప్పుడు నీకు ప్రజాస్వామ్యం లో ప్రతి పౌరునికి తన భావం చెప్పుకొనే స్వేచ్చ ఉంటది అన్న విషయం ఎందుకు
గుర్తుకు రాలేదని అడుగుతున్నాం. నీకు ఒక్కనికే ప్రజాస్వామిక హక్కు ఉంటాడా? తెలంగాణా గడ్డమీద పుట్టిన పాపానికి మాకేవ్వరికి ప్రజాస్వామిక హక్కులు ఉండవా? అవి కేవలం మీ సమైక్యాంధ్రుల సొత్తు మాత్రమేనా?
పెంటయ్య. వీరగొని.
అడ్వకేట్
కరీంనగర్.