Wednesday, February 15, 2012

What happens if Education privatizes?

ఏ వ్యవస్తకయినా దాని మనుగడకంటూ ఒక ఆర్ధిక వ్యవస్థ ఉంటుంది. దాని ఆర్ధిక వ్యవస్తను కాపాడుకోవడానికి ఒక సాంస్కృతిక వ్యవస్తను ఏర్పాటు చేసుకుంటుంది ఆ వ్యవస్థ. ప్రస్తుతం మన దేశానిది పెట్టుబడి దారి ఆర్ధిక వ్యవస్థ. అయితే ఆ ఆర్ధిక వ్యవస్థ దాని పునాది అనుకుంటే దాన్ని కాపాడుకోవడానికి ఉపరితలామ్శాలు అయిన విద్య, కట్టు, బొట్టు లాంటివి ఉంటాయి. పునాది చెడి పోకుండా ఉపరితలామ్శాలు పైన ఉండి కాపాడుతాయి, అలాగే ఉపరితలాంశాలను అవిపడిపోకుండా పునాది కాపాడుతుంది. అంటే ఒక దానిని ఒకటి పరస్పరం కాపాడుకుంటూ వాటి మనుగడను కొనసాగిస్తాయి. ఇక్కడ ఉన్నట్టి ఆర్ధిక వ్యవస్థ సరయ్యిందే అని చెప్పడానికి విద్య వ్యవస్థ పని జేస్తుంది. అలాగే ఇలాంటి విద్యా వ్యవస్థ
అయితేనే ఈ ఆర్ధిక విధానం కొనసాగా గలుగుతుంది అని రాజ్యం తన విధానంగా చెబుతుంది. ఇక్కడ కొంత మంది విద్యా వేత్తలు మన దేశం లో
విద్యా వ్యవస్థ ప్రయివే టీకరిన్చబడుతున్నది, తద్వారా పెట్టుబడి దారులు తమ ప్రయోజనాలకు అనుగుణంగా విద్య వ్యవస్తను రూపొందిస్తారు, దాంతో
రేపు వ్యవస్తలోని విలువలే తలకిందులు అవుతాయి అని ఆవేదన చెందుతున్నారు.
జాతీయ విద్యావిధానాన్ని పర్యవేక్షిస్తున్న కపిల్ సిబాల్, మేము ఎలాంటి విద్యా విధానాన్ని ప్రవేశ పెట్టాన్నో పార్లమెంటులో చర్చిస్తాము విద్యా వేత్తలతో ,ఉపాధ్యాయులతో చర్చించ వలసిన అవసరమే లేదు అంటున్నాడు. మన పార్లమెంటులో దాదాపు 300 మంది సభ్యలు పెట్టుబడి దారులే ఉన్నారు. వాళ్ళ పెట్టుబడులు రెట్టింపు జేసుకోవడానికి విద్య ప్రయివెటీకరించబడవల్సిందే అంటారు. దానితో వాళ్లకు లాభాలు వస్తాయి. స్తూల జాతీయాదాయం పెంరిగింది అని మన ఆర్ధిక వేత్తలు లెక్కలు చెబుతారు. విద్య ప్రయివేటీకరించవడితే అసలు ఏమవుతుంది? ఎవరికీ ఏమి నష్టం జరుగుతుంది? వాళ్ళ మాటల్లో చెప్పాల్సి వస్తే మంచి నాణ్యమైన చదువు దొరుకుతుంది గదా?
కాని మనం ఇప్పుడే ప్రాథమిక విద్య లోనే చూస్తున్నాము, ఒక్కో విద్యార్థి లక్ష నుండి రెండున్నర లక్షల దాకా ఒక సంవస్తరానికే చెల్లించ వలసి వస్తున్నది.ఆ విధమైన పాఠాశాలలో చదివిన విద్యార్థి మన వీధి బడిలోని విద్యార్థిని తన తోటి విద్యార్థిగా తోటి మానవునిగా గుర్తిస్తాడ? దేశ పౌరులందరూ సమానమే అనే భావన ఆ పిల్లోడిలో రావడానికి ఈ కార్పొరేటు బడులు దోహద పడుతాయా? రాజ్యాంగం లో అందరు సమానమే , అందరికి సమాన హక్కులే అని రాసుకున్నాము. కాని నిన్నటికి నిన్న ఐ ఏ ఎస్సు లు మేము అందరి లాంటివాళ్ళం కాదు మాకు ప్రత్యేకమైన
హాక్కులు ఉన్నాయి అన్నారా? అంతెందుకు ప్రజలవద్ద గొల్లూడ గొట్టి పైసా పైసా పోకుండా పన్నులు వసూలు జేసున సోమ్ముల్లో నుండి మంత్రులు , ఏమ్మేల్లెలు,కోట్ల కొద్ది అక్రమంగా కొల్లగోట్టితే తమ తమ రాజకీయ ప్రత్యర్థులను ఇబ్బంది పెడుతున్నారు కాని తమ వర్గం వారి పైన ఈగ వాలనివ్వడం లేదుకదా? ఇప్పుడే ఈ విధంగా ఉన్నప్పుడు రేపు రేపు ఈ కార్పొరేటు బడులలో, కాలేజి లలో చదువుకొని వచ్చే విద్యావంతులైన పౌరులు ఎట్లా వ్యవహరిస్తారో ఉహించ వచ్చు. బ్రిటిషర్ల ఏలుబడి లో సంస్థానాదీశులకే ఓటు హక్కులు ఉన్నట్లు గా ఈ కులీనులైన విద్యాదికులకే అన్ని హక్కులు అన్ని అవకాశాలు ఉండే ప్రమాదం ఉంటుంది. ఏమి , ఉండకూడదా? ఎందుకు ఉండకుడదో చెప్పుమని అడిగే పౌరులు కూడా బయల్దేరుతారు. కాని అప్పుడు ఏమి జరుగుతుంది అంటే సమాజం లో అశాంతి నెలకొంటుంది. సమానా హక్కుల కోసం సమాన అవకాశాల కోసం అసమాన సమూహాల మధ్యన సంఘర్షణ మొదలవుతుంది. సమాజం మొత్తంగా అశాంతికి ఆలవాలం అవుతుంది.
అప్పటికి ఈనాటి చిదంబరం వారసులు, వీళ్ళంతా వామ పక్ష తీవ్రవాదులు మనం ఎంతో కస్టపడి కూడబెట్టుకున్న ఆస్తులల్లో వాటా అడుగుతున్నారు కనుక వీళ్ళను జైళ్ళల్లో తోసేద్దాం అంటారో లేక ఏకంగా మానవ రహిత విమానాల తోటి బాంబింగ్ జేసి కాల్చి చంపుతామంటారో కాలమే చెప్పాలి.
పెంటయ్య.వీరగొని.
కరీంనగ

Saturday, February 4, 2012

I A S lu evari pakshamo telchukovaali.

ఐ ఏ ఎస్ లు ప్రెస్ మీట్ పెట్టి తమ బాధ ఆవేదన వెళ్ళగక్కిన తీరు చూసిన తర్వాత సామాన్య జనాలు గూడా వాళ్ళ బాధలు చెప్పుకున్నపుడు ఈ అధికారులే అది తమ
బాధ్యత కానట్లు తిక్క తిక్క జవాబులు ఇచ్చి అడ్డమైన ప్రశ్నలు వేసి అవమాన పరచిన సంఘటనలు వాళ్లకు జ్ఞాపకం వచ్చినాయో లేదో?
1 ) మేముమాత్రమే అవినీతికి పాల్పడ్డామ?
2 )రాజకీయ నాయకులు అవినీతికి పాల్పడడం లేదా?
3 ) పెద్ద చేపలను వదిలి వేసి చిన్న చేపల ను పట్టుకుంటున్నారు.
4 ) సి బి ఐ విచారణ మర్యాద గా లేదు.
5 ) క్యాబినెట్ ది సంబందిత మంత్రి దే బాధ్యత.
6 ) కోడ్ అఫ్ కండక్ట్ ప్రకారం సి బి ఐ విచారించడం లేదు.
7 ) కోట్లు లంచాలు తిన్న వారిని వదిలేసి మా వెంట పడుతున్నారు.
చెంద్ర బాబు నాయుడు , రాజశేఖర్ రెడ్డి లు అసెంబ్లీ లో ఒకరి అవినీతిని మరొకరి ఆడిపోసుకున్నట్టు ఇప్పుడు ఐ ఏ ఎస్ లు క్యాబినెట్ ను ఆడిపోసుకుంటున్నారు.
అంటే మాది అవినీతి లేదు అని మాట వరుసకు కూడ అనలేనంతటి అవినీతి లో ఐ ఏ ఎస్ లు కూరుక పోయినారు. ముందు రాజకీయ నాయకుల అవినీతిని ప్రశ్నించి
ఆ తర్వాత మమ్ములను ప్రశ్నించండి అంటున్నారు.ఎంత దిగ జారి పోయినారు గదా ఈ అధికారులు.
ఒక ఉపాధి హామీ రోజు కూలి ని నీవు 120 రూపాయలు తీసుకొని ఇదేనా చేసిన పని అంటే తవ్వని మట్టిని ఎత్తి పోసినట్టు ట్రాక్టర్ కు డబ్బులు తీసుకోవడం ఏమి నీతి ,
చేయని పనిని రికార్డ్ చేసి వేలకు వేలు డబ్బులు తీసుకోవడం ఏమి నీతి , అందరికి అక్కరకు వచ్చే భూములను ఓపెన్ కాస్త పేరిట తవ్వి వేయడం ఎట్లా అభివృద్ది , గుట్టలను
కొండలను కూల్చి వేసి కొనరికి గ్రానైట్ జిగేల్ లు కొందరికి దుమ్ము ధూలి, హేమటైటు, దోలమైటు , క్వారీలు తవ్వి అలివిగాని కాలుష్యం అభివృద్ధా అంటే నన్ను నువ్వు అడుగకు
నిన్ను నేను అడుగ . ఇద్దరం గలిసి ఉకున్నోని కాళ్ళ కింద నెల తవ్వుక పోదాం . ఇక అవినీతిని ఎవ్వరు కూడా ప్రశ్నించ వద్దు అంటున్నారు.
ఐ ఏ ఎస్ ల ను అడుగనంత వరకు రాజకీయ నాయకుల గురించి వారు ఎప్పుడు మాట్లాడ లేదు. క్యాబినెట్ లో రాజకీయ నాయకులు చేస్తున్న ఎన్నో నీతి బాహ్యమైన చర్యలను సమర్థిస్తూ ప్రశ్నించే ప్రజల నోళ్లను ఎందరో ఐ పి ఎస్ లు ఎందరో ఐ ఏ ఎస్ లు ముయించినారు. ఒకరి అవినీతిని ఒకరు చట్టాల పేరుతొ నిబంధనల పేరుతొ సమర్థించిన వారే. కాని ఇంత బాహాటంగా జరుగుతున్నా అవినీతిని ఏదో తు తు మంత్రంగా నన్నా చల్లార్చకుంటే రేపు ప్రజలల్లోకి ఏ మొఖం పెట్టుకొని పోగలం అనుకొన్న రాజకీయ నాయకులు అసలు దొంగలను వదిలి వేస్తూ అంతకాగిన వాళ్ళను కొందరినన్నా కొంచెం మందలిద్దాం అని చిన్న ప్రయత్నం చేస్తే మా బంగారుకన్నం లో వేలుబెడితే
మేము కుత్తమా అంటున్నారు.
అయ్యా ! మా పోరగాండ్లు మా తెలంగాణా మాకు కావాన్నని జై తెలంగాణా అంటే జైళ్లల్ల బెడితిరి, మా బిడ్డలను యునివర్సిటీ రూములల్లకు జొరబడి గొడ్లను బాదినట్టు బాదితిరి.
మా గ్రామాల్ల పోరగాండ్లు ఈ దొంగా రాజకీయ నాయకుల బండారం బయటబెడితే ఎన్కౌంటర్ చేసి పారేస్తిరి . విచారణ కమిటీల ముందు కు వచ్చి తమ పోరాగాన్డ్లను ఎవ్వరు చంపినారో చెబుతాం అంటే గూడా చెప్పనివ్వ కుండా అడ్డుబడితిరి. మీకు కోడ్ అఫ్ కండక్ట్ లు ఉన్నట్టే మాకు రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కు ఉన్నదంటే మీకు దిక్కున్న
చోట చెప్పుకో అంటిరి. ఒక నాడు రాజులు దొరలూ జమీందారులు పార్లమెంటులోకి వచ్చి వాళ్లకు అనుకూలమైన చట్టాలు చేసుకున్నారు.ఇప్పుడు కాంట్రాక్టర్లు , వ్యాపారస్తులు
గుండాలు , ఖునికోరులు ఎన్నిక కాబడి వాళ్లకు అనుకూలంగా చట్టాలు జేసుకుంటున్నారు. రాజకీయ నాయకులు తాము చేస్తున్న చట్టాల ద్వారా తమ వర్గానికి లబ్ది
చేకూర్చాలని చూస్తున్నారు. గొప్ప గొప్ప చదువులు చదివి న ఐ ఏ ఎస్ లు ఐ పి ఎస్ లు ఏ ప్రజల ఉప్పుదిని తాము బ్రతుకుతున్నారో ఆ ప్రజల పక్షాన నిలబడు తారో
లేక ప్రజల కష్టార్జితం తో బాటు గా వాళ్లకు చెందవలసిన వనరులను అన్నింటిని గంప గుత్తాగా కొల్ల గోడుతున్న రాజకీయ నాయకుల వైపు నిలుస్తారో నిర్నయిన్చుకోవాల్సిన
సమయం ఆసన్న మైంది.
వాళ్ళు యూదులకొసమ్ వచ్చిండ్రు. నేను యూదును కాదు కనుక అడ్డుజెప్పలేదు. వాళ్ళు కమ్యునిస్టుల కోసం వచ్చిండ్రు, నేను కమ్యునిస్టును కాను కనుక అడ్డుజెప్పలేదు.
వాళ్ళు మిలిటెంట్ల కోసం వచ్చిండ్రు . నేను మిలితెన్టును కాను కనుక అడ్డుజెప్పలేదు. ఇప్పుడు వాళ్ళు నీ కోసం వచ్చిండ్రు.. ఇప్పుడైనా అడ్డుజేప్పకుంటే ఇంకా నీవు ఎవరికోసం బతుకుతవు నీ బతుకు వృధా యే కదా?
పెంటయ్య. వీరగొని.
కరీంనగర్.

Thursday, February 2, 2012

dikku leni prajalu okkatavutunnaru.

రాజ్యం - దాని స్వభావం,

ప్రతి దినం వార్త పత్రికలల్లో వందల , వేల కోట్ల రూపాయల కుమ్బకోనాల గురించిన వార్తలు... అందుకు కారణమైన వ్యక్తుల ను విచారిస్తున్నట్టు మరియు అరెస్టులు
చేస్తున్నట్టుగా చదువుతున్నాము. అలాగే అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు ఒకరిపైన ఒకరు నీవు ఇన్ని కోట్ల ప్రజాధనం దిగామింగావంటే , నీవేమి తక్కువ తిన్నావా
నీవు ఇన్ని కోట్లు తినలేదా అంటూ ఒకరి పైన ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. అధికార ప్రతిపక్ష అనే తేడా లేకుండా అంతా ప్రజలు పన్నుల రూపం లో కడుతున్న
సొమ్ములు మరియు ప్రజలకు దక్కవలసిన కోట్లాది రూపాయల వనరులు కొందరే బొక్కి కుచుంటున్నారు. అయితే రాజ్యాంగం ప్రకారం డబ్బు సంపాదించడం నేరం కాదని
ఒక వైపు చెబుతూనే మరో వైపు సక్రమంగా సంపాదించాలని చెప్పబడుతున్నది. ప్రజలందరికి చెందవలసిన సంపదను ఇట్లా కొందరే కోట్ల కొద్ది ప్రోగుజేసుకోవడం , సంపద
అంతా అందరికి సమానంగా పంచవలసిన బాధ్యత కలిగిన రాజ్యం కొందరికే సంపద దోచిపెట్టే కార్యక్రమం ఎందుకు చేస్తున్నట్లో ఆలోచించాల్సిన అవసరం ఉంది.
మానవులు ప్రక్రుతి నుండే అన్నీ నేర్చుకున్నారని చెప్పే ఒక మేధావి ఏమంటాడంటే , మొక్కలు ,వృక్షాలు ,తాము భూమి ,సూర్యుడు,గాలి ఆధారంగా సంపాదించిన సంపదను
అవి తమకు అవసరమైన మేరకు ఉపయోగించుకొంగా మిగిల ఆహారాన్ని గింజల రూపం లో , గడ్డల రూపం లో, తమ వేర్లల్లో ఆకుల్లో, కాండం లో దాచుకుంటున్నాయి.
అలాగే జంతువులూ కూడా తాము వేటాడిన మాంసాన్ని తినే కాడికి తినగా మిగిలిన దాన్ని దాచిపెట్టుకొని అవసరమైనపుడు తింటున్నాయి. అలాగే మానవుడు కూడా
తాను సంపాదించిన సంపద కూడబెట్టుకొని ఆ సంపదనే పెట్టుబడిగా పెట్టి మరింత సంపాదించడమే గాకుండా ఆ పెట్టుబడి తో శాస్త్ర సాంకేతిక రంగాలను అభివృద్ది పరిచి
అధిక మరియు నాణ్యమైన ఉత్పత్తిని సాధించడానికి దోహద పడుతున్నాడని అని వాదిస్తున్నాడు.
అది ప్రక్రుతి నియమం . దాన్ని అందరం అంగీకరిస్తాము. అయితే ప్రకృతిని ఏ శక్తి నియంత్రించడం లేదు. కాని మానవ సమూహాలను నియంత్రించడానికి రాజ్యం ఉన్నది.
రాజ్యం లో ఎవరికీ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు వ్యవహరించడానికి వీలు లేదు. దానికి ఒక ఆర్డర్ ఉన్నది.ఆ మానవ సమాజం ఎట్లా వ్యవహరించాలని మౌఖికంగా అనుకుంటారో
లేక రాజ్యాంగం లో రాసుకుంటారో అట్లానే వ్యవహరించాలి . అట్లా వ్యవహరించక ఉల్లంఘించిన వాళ్ళను రాజ్యం తన బలగాలతో నియంత్రించ వలసి ఉంటుంది.అయితే రాజ్యం
అనేదానికి వర్గ స్వభావం ఉంటుంది. అది తన వర్గానికి లబ్ది చేకూర్చిపెట్టె విధంగా వ్యవహరిస్తూనే ఆ పని అంతా తమ వర్గం కాని వారి క్షేమం కోసమే అలా చేస్తున్నానని
నమ్మించ వలసిన బాధ్యతా కూడా అది స్వీకరిస్తుంది.ఎట్లా అంటే ఒక అడవిలో ఒక యాభై పులులు ఉన్నాయనుకొందాం.. అవి విచ్చల విడిగా ఒక క్రమం ,పద్దతి లేకుండా
వేటాడినట్లు అయితే అడవిలో ఉన్న లేళ్ళు అన్నీ ఆనతి కాలం లోనే అంతరించి పోతాయి.అప్పుడు అన్ని ఆకలి తో నక నక లాడి చనిపోవాల్సి ఉంటుంది. కనుక అవి ఏమని
కట్టుబాటుచేసుకున్నాయి ఆటా అంటే, మనం ఈ విధంగా ఎవరికీ తోచినట్టు వాళ్ళు వేటాడి తింటే కొద్ది రోజులకే మనకు తిండి దొరుకని పరిస్తితి వస్తుంది కనుక ఓ పులిరాజు లాలా
మీకు ప్రతి రోజు ఒక్కొక్కరికి ఒక లేడి చొప్పున తినడానికి మేము ఏర్పాటు జేస్తాము. మీరు హాయిగా తింటూ ఉండండి . తల గాక ఎవరైనా మనం చేసుకున్న ఈ నియమాన్ని
ఉల్లంఘించి నట్లు అయితే మన సివ్నగి సేనలతో వాళ్లకు బుద్ద్ది చెప్పించ బడుతుంది అనుకోన్న్నాయి ఒప్పందం చేసుకొన్నాయి. ఇక రోజు ప్రతి పులి రాజుకు ఒక్కొక్క లేడి
పిల్ల ఆహారం గా పోయే టట్టు చూడ వలసిన బాధ్యతా సింహాల రాజు పైన పడ్డది.
సింహాల రాజు ఆ మరునాడే లేడి జాతినంతటిని సమావేశ పరిచింది. ఓ నా ప్రియమైన లేడి సోదరి సోదరులారా! మీకు జరుగుతున్నా అన్యాయం అంతా ఇంత కాదు.
అది తలచుకుంటూ ఉంటె నా కడుపు తరుక్క పోతూ ఉంది.ఇట్లా అయితే మీకు తీవ్ర అన్యాయం జరుగుతుంది మీ జాతి అంతరించి పోయే ప్రమాదం ఉంది. మిమ్ములను
కాపాడడం కేవలం నా వకననే సాధ్యం అవుతుంది. అన్నది.అందుకు లేడి జాతి అంతా సింహ రాజుకు ప్రణమిల్లి మహా రాజ ఎలాగైనా మీరే మమ్ములను రక్షించాలని
వేడుకున్నాయి. తాము చేసుకున్న కుటిల ఒప్పందం బయట పడకుండా సింహ రాజు లేడి జన ఉద్దారకుడువలె ఒక ఫోజు పెట్టి , నేను మీకోసం లేడీజీవ ఉద్ధారక
పథకం ప్రవేశ పెడుతున్నానని ప్రకటించగానే లేడి జాతిమొత్తం జయ హో సింహ రాజా అని నినాదాలు ఇచ్చింది .ఆ పథకం ఎట్లా ఉంటుందో చెబుతున్నా వినండి ,
అంటూ వివరించడం ప్రారంభించింది . రేపటి నుండి మిమ్ములను ఏ సింహం గూడా వేట ఆడకుండా చూసే బాధ్యత నాది .మీకు నేను రక్షణ గా ఉండి మీవైపు ఏ క్రూర మృగం కూడా కన్నెత్తి చూడ కుండా చేసే బాధ్యత నేను వహిస్తున్నాను , అనంగానే సంతోషం తో చప్పట్లు కొట్టినాయి లేళ్ళు.మీరు చీకు చింత లేకుండా హాయిగా కాపురాలు చేసుకోవడం వలన మీ సంతానం అభివృద్ది అవుతుంది. అభివృద్ది చెందిన మీలోనుండి కొందరిని మాత్రం రోజుకు ప్రతి సింహానికి ఒక్క లేడి చొప్పున కప్పం ఇచ్చుకోవాల్సి ఉంటుంది అన్నది.
అయ్యో అని బాధపడ్డా చేసేది ఏమి లేక తలాడించి వెళ్లి వచ్చినాయి.సింహ రాజులు , సింహ రాజులు కల్సి లేళ్ళను పంచుకు తిన్నట్టు రాజకీయ పార్టీలు,రాజకీయ పార్టీలు అన్ని
కలసి ప్రజలకు చెందవలసిన సంపద అంత దోచుక తినున్నాయి .
సంపద సృష్టి కర్తలం మా సంపద మాకే చెందాలంటున్న వాళ్ళు ,జాన్ మిర్డల్ ప్రఖ్యాత అంతర్జాతీయ రచయిత రాసినట్టుగా దిక్కు లేని ప్రజలంతా ఒక్కటవుతున్నారు.
.
పెంటయ్య,
కరీంనగర్.