Monday, September 24, 2012


సకల జనుల సమ్మె విరమించ బడిన తర్వాత తెలంగాణా ఉద్యమం పని అయిపోయిందని సమైక్య వాదులు సంబరపడి పొతే తెలంగాణా ప్రజలు కూడా కొందరు ఇంత పెద్ద ఉద్యమం ఆబాలగోపాలం అందరు పాల్గొని ఇన్ని రోజులు ఇంత త్యాగం తో ఇంత ప్రశాంతంగా ఇంత ఉత్తేజంగా ఇంత ప్రజాస్వామ్య యుతంగా పోరాటం జేస్తే గూడా ప్రత్యేక రాష్ట్రం సాధ్య పడలేదు గనుక ఇక మనం ఎంత కొట్లాడినా ఏమీ లాభం అనుకోని నిరాశ పడ్డారు. ఇప్పుడు తలపెట్టిన సెప్టెంబర్ 30 లాంటి ర్యాలి సమ్మె సందర్భం లో జేస్తే ప్రజల ప్రతిస్పందన భాగస్వామ్యం బాగా ఉండేది, ప్రభుత్వం దిగివచ్చేదని, చేయ వలసిన సమయం లో చేయకుండా తెలంగాణా రాష్ట్ర సిద్ధిని వాయిదా వేయడం లో అన్ని రాజకీయ పార్టీల తోబాటుగా జాకులు గూడా తమ బాధ్యత ఏమీ లేదని అంటే ప్రజలు నమ్మే పరిస్తితి లేదు. 1948 కి ముందే ప్రారంభ మైన గయిర్ ముల్కి గో బ్యాక్ నినాదం 1969 నాటికి రక్తం చిందించ గలిగినంతటి తీవ్ర స్తాయికి వెళ్ళిపోయింది.369 మంది అస్తిపంజరాలతో ముఖ్యమంత్రి సింహాసనాన్ని చేక్కిన్చుకున్న మర్రిచేన్న రెడ్డి ఒక్కడే తెలంగాణా ద్రోహి కాదు, ఆయనతో బాటుగా రాజ్యాధికారం పచుకున్న రాజకీయ నాయకులు అందరితో బాటుగా ఎమ్మెల్సి పదవులు పొందిన ఉద్యోగ సంగాల నాయకులూ కూడా భాగస్వాములే. 1970 నుండి 1997 లో తెలంగాణా జనసభ ఆవిర్భావం దాక ఈ 27 ఏండ్ల సుదీర్ఘ కాలం తెలంగాణా వాదం తెలంగాణా ప్రజల గుండెల్లో గూడు కట్టుకొని పదిలంగా అలాగే ఉంది. వరంగల్ డిక్లరేషన్ నాటి ఊరేగింపు లో ckm కాలేజి నుండి బస్సు స్టాండ్ ముందున్న స్పోర్ట్స్ గ్రౌండ్ దాక సాగిన ప్రజల కవాతు లో పెల్లుభికిన ఉత్సాహం చూసిన తర్వాతనే సీమాంధ్ర పాలకుల పాలన పట్ల ప్రజలు ఎంతగా ఏవగించు కుంటున్నారో అర్థం అయ్యింది . 1997 నుండి 2004 వరకు ఈ ఏడేండ్ల కాలం లో తెలంగాణా ప్రజలను, తెలంగాణా వాదాన్ని, తెలంగాణా రైతులను, యువకులను , విద్యార్థులను అత్యంత కిరాతకంగా అణిచి వేసి వ్యక్తులను నిర్మూలించడం ద్వారా ఉద్యమాలను లేకుండా చేయచ్చునన్న ఒక తప్పుడు అవగాహనతో ఒక బెల్లి లలితను, ఒక కనక చారి లాంటి ఎందరోతెలంగాణా ఉద్యమ కారులను హత్యలు గావించి న చంద్రబాబు నాయుడు సర్కారు తెలంగాణా వాదాన్ని ప్రజల్లో లేకుండా చేయ లేక పోయింది.2004 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఏకంగా , తెలంగాణా వాదానికి వ్యతితెకంగా , బహుళ జాతి కంపనీల వ్యాపారాలకు అనుకూలంగా tips , trims intellectual property rights ఎజెండాగా, తన మానిఫెస్టో తో ఎన్నికలకు దిగింది. ఆంధ్ర , తెలంగాణా తేడ లేకుండా అన్ని ప్రాంతాల్లో చెంద్రబాబు పాలసీని ప్రజలు తిరస్కరించినారు.చెంద్రబాబు నాయుడు క్రూర నిర్బంధ పాలన వలన రెక్కలు తెగిన పక్షి వలె గాయ పడి ఉన్న తెలంగాణా వాదాన్ని 2000 సం. లో కెసిఆర్ చేతిలోకి తీసుకున్నాడు.అణిచివేత నుండి కొంత వెసులు బాటు దొరికిన తెలంగాణా ప్రజలు కేసీఆర్ చెంతన సేద దీరి ఆయనకు బంగారు బాతుగుడ్లనే బహుకరించారు. కాని అక్కడనే అయన ప్రజల వైపు నుండి గాక ప్రభుత్వం లో చేరిపోయి కాంట్రాక్టులు కమిషన్లు గురించి మంతనాలు సాగిస్తుంటే ఒక వైపు ప్రజలు దూరం గావడం మరో వైపు ఉన్న ఏమ్మేల్లెలు ఊసి పోవడం తో రాజశేకర్ రెడ్డి తన సర్కారు నుండి బయటకు వెళ్లి పోయే పరిస్తితి కల్పించిండు. బై ఎలెక్షన్ల తో చావుదప్పి కన్ను లొట్ట బోయినట్టు అయింది.మొదటి నుండి కేసీఆర్ ఉద్యమాలు వద్దు లాబీయింగ్ ద్వారానే తెలంగాణా నేను సాధించి పెడుతానంటే , తేరగా వస్తుంటే ఎందుకు తిప్పల బడాలె అనుకొనే కొందరు అరె అయన పద్దతిలో అయన పోతుండు, మీరు కావాలంటే కొట్లాడుకోండి అన్నారు. అందుకే మిలియన్ మార్చ్ వద్దన్నాడు, సకల జనుల సమ్మె అనే సంకుల సమరం ఒక వైపు ముమ్మరంగా సాగుతుంటే ప్రధాన నాయకత్వం యుద్ధ రంగాన్ని వదిలేసి రాయబారానికి హస్తినాపురికి వెళ్ళింది. ఇందులో ఏదో మతులబు ఉండే ఉంటుంది అనుకొన్నారు అమాయకమ్మన్యులు కొందరు. పర్కాల ఉప ఎన్నికల తర్వాత సెప్టెంబర్ 29 నాటికి తెలంగాణా ఇవ్వకుంటే 30 నాడు తెలంగాణా ప్రజలంతా పెద్ద ఎత్తున హైదరాబాద్ కు మార్చ్ చేస్తామని పొలిటికల్ జే ఎసి ప్రకటించింది. రేపో మాపో ఒకవైపు తెలంగాణా వస్తా ఉంటె ఇంకా ఈ ఉద్యమాలతో ఏమి పని అని నాకు సిగ్నల్స్ వస్తున్న్నాయి అని అన్నవాళ్లు ఉన్నారు.. ఇట్లా ఎన్నో సార్లు వచ్చే దసరా, వచ్చే దీపావళి, వచ్చే ఉగాది, వచ్చే రంజాన్, వచ్చే బక్రీద్, వచ్చే స్వతంత్ర దినోత్సవం ఇక మన తెలంగాణా రాష్ట్రం లోనే అనంగా వినీ, వినీ విసుగుజెందిన ప్రజలు తమ మానాన తాము 30 నాటి మార్చ్ కోసం తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు. మీరు చేసుకుంటే ఉద్యమాలు చేసుకోండి నేను మాత్రం ఇగో చుడుండి లాబీయింగ్ తోనే తెలంగాణా తెస్తానని గత 20 రోజులనుండి డిల్లీ లో దిగే గడపా ,ఎక్కే గడప తో ఫుల్ బిజీ. ఆఖరుకు వాళ్ళు తెలంగాణా ప్రకటించక ముందే TRS ను ఆఫర్ జేసిండు. ప్రణబ్ కుఖర్జీ కమిటీ వలె, రోశయ్య కమిటి వలె,శ్రీకృష్ణ కమిటి వలె ఒక కమిటి వచ్చినా , లేదా సిక్స్ పాయింట్ ఫార్ముల వలెనో, 610 జివో వలెనో ప్రాంతీయ మండల్ వలెనో ఒక ప్యాకేజి వచ్చినా ఇంకేంది ఇగ తెలంగాణా వచ్చినట్లే సంబురాలు జేసుకుందాం రండని పిలుపు ఇచ్చేటట్లు ఉన్నారు. కాని తెలంగాణా ప్రజలు ఇప్పటికే లెక్క లేనన్ని సార్లు, కమిటీల పేరుతొ ప్యాకేజీల పేరుతొ మోసపోయి ఉన్నారు.తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు దప్ప మరే విషయాన్ని గూడా తెలంగాణా ప్రజలు అంగీకరించరు. కనుక రాజకీయ నాయకుల మాయోపాయ ఉచ్చులలో ప్రజలు చిక్కుకొని 30 సెప్టెంబర్ మార్చ్ ను ఎట్టి పరిస్తితిలో గూడా వాయిదా వేసుకోవద్దు. అలాంటిది ఏదయినా జరిగితే మాత్రం ఇక చాల కాలం దాక ఏ నాయకత్వాన్ని గూడా తెలంగాణా ప్రజలు నమ్మని ఒక నిస్సహాయ స్తితికి తెలంగాణా ఉద్యమాలు నేట్టివేయబడుతాయి. అందుకని నాయకత్వం బహుపరాక్! వీరగొని పెంటయ్య. విశ్రాంత విద్యా పర్యవేక్షనాదికారి తెలంగాణా ప్రజా ఫ్రంట్, కరీంనగర్.