Monday, October 8, 2012

bio diversity meeting in hydrabad is a joke!


తెలంగానీయులను అపహాస్యం జేస్తున్న హైదరాబాద్ జీవ వైవిధ్య సదస్సు ! ఈ రోజు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ సదస్సులో మాట్లాడుతూ సేవ్ ఎర్త్, సేవ్ బయో దైవేర్సిటి అని ప్రజలకు పులుపునిచ్చినాడు.అసలు భూమిని కాని, జీవవైవిధ్యాన్ని కాని ధ్వంసం చేస్తున్నదెవరు? నిస్సందేహంగా ఆ పని చేస్తున్నది ప్రభుత్వాలే. ఎలాగో ఒక సారి పరిశీలిద్దాం.కరీంనగర్ జిల్లాలో కొన్ని కోట్ల సంవస్తరాల క్రితం భూమి ఏర్పడ్డనాడు పుడమి తల్లి పుక్కిలించి ఉమిసిన లావా గట్టి పడి గండు శిలలు గా మారిన క్రమం, ఆ గండు శిలలు మరికొన్నికోట్ల సంవస్తరాలు మంచుచే కప్పబడి ఉండడం, ఆ తర్వాత వాతావరణ ప్రభావం వలన క్రమంగా మంచుకరిగి నున్నని రాళ్ళు ఏర్పడడం అనేది అద్భుతము అయిన ఒక ప్రక్రుతి ప్రక్రియ.అనంతమయిన మంచు కరిగి బండ రాళ్ళను ఒరుసుకొని ప్రవహించిన ఫలితంగా పగిలిన రాళ్ళు దుమ్ము దుమ్ము అయి ఇసుక, మట్టిగా ఈ బండ రాళ్ళు రూపాంతరం చెందినాయి.కరిగిన మంచులో కొట్టుకొని పోకుండా మొండిగా నిలిచిన బండ రాళ్ళకు ఇన్ని కోట్ల సంవస్తరాల తర్వాత తాము గ్రానైటు సరుకై అటు ప్రభుత్వాలకు ఇటు క్వారీ యజమానులకు కరెన్సీ నోట్లము అయి సామాన్య ప్రజల బ్రతుకుల్లో బండలై పడుతామని పాపం మా సినారే అన్నట్లుగా మునులవోలె కారడవుల మూలలందు పడి ఉన్నఆ రాళ్ళ కు అప్పుడు తెలియదు. అలాగే ఇప్పుడుకరీంనగర్ లో మొత్తం 750 గుట్టలకు గ్రానైట్ క్వారీలు నడుస్తున్నందున ఆయా గుట్టల పైన నివసిస్తున్న గుడ్డేలుగులు,కోతులు, కొన్దేంగాలు,కొండచిలువలు,రామ చిలుకలు, నెమళ్ళు,గబ్బిలాలు,ఉడుతలు,తేనెటీగలు తమ ఆవాసాలు కొల్లగొట్టబడి నందున ఊళ్ళ పైన పడి మనుషుల చేతుల్లో చచ్చిపోతున్నాయి.సీతా ఫలాలు,దొరుకుత లేవు.పశువులకు మేతదొరుకక గొడ్డు,గొర్రె అంతరించి పాలు ,మాంసం దొరకటం గగనమే అయింది.వర్షాన్ని కురుపింప జేసే పర్వతాలు లేనందున వర్షాలు పడక వాగులు ఒంకలు పొర్లి పొంగక చెర్లు నిండక చేపలు దొరుకక పోవడం మాత్రమె గాదు వ్యవసాయాలు కూడా సాగడం లేదు. భుగర్భ జలాలు అడుగంటే పోయి తాగడానికి నీళ్ళు దొరుకని పరిస్తితి.ఇదంతా అభివ్రుద్దియే అంటున్నది ప్రభుత్వం, దాని ఘనులఅభివృద్ధి శాఖ....పైన జెప్పిన జీవులన్నీ అంతరించి పోవడానికి ప్రభుత్వ విధానాలే కారణం. ఇక మరో విషయం,ఇదే జిల్లాలో తిమ్మాపూర్ అనే మండలం లో పర్ల పెళ్లి అని ఒక మేజర్ గ్రామం ఉన్నది.అక్కడ చుట్టూ పక్కల వరి, మొక్క జొన్న విస్తారంగా పండించడానికి కారణం లోయర్ మానేరు డ్యాం సమీపాననే ఈ ఉరు ఉండడం.పచ్చని పంటపొలాలతో అలరారుతున్న ఈ గ్రామానికి ఇప్పుడు ప్రభుత్వం ఒక చీడ పట్టించింది. అది హరిత బయో ప్రోడక్ట్ కంపని.ప్రభుత్వం తన విధానాల్లో భాగంగా పెట్రోల్ కొనుగోలుకు విదేశీ మారకం ఆదా చేయాలనే కారణం తో బాటుగా వాతావరణ కాలుష్యాన్ని తగ్గించాలనే కారణం చూపుతూ పెట్రోల్ లో20% ఇథనాల్ కలిపి ఇందనం వాడాలని నిశ్చయించింది.అందులో భాగంగా అభివృద్ధి చెందిన దేశాలల్లో పర్యావరణ రక్షణ ఉద్యమాల వలన మూతబడిన పాత అవుట్ డేటెడ్ టెక్నాలజీ మిషనరీలను అతి తక్కువ ధరలకు ఇక్కడి పెట్టుబడి దారులకు సాంకేతిక సహాయం పేరుతొ అక్కడి ప్రభ్య్త్వాలు సప్లై చేసినాయి.అట్లా హరిత బయో కంపని యజమాని పర్లపల్లికి రావడానికి, కిరణ్కుమార్ సామాజిక వర్గానికి ఆ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్సి సైలెంట్ వర్కింగ్ పార్టనర్ కావడం కారణమయింది.అప్పటి సర్పంచ్ కూడా అదే సామాజిక వార్గానికి చెందిన వాడు అయినందున తనను వాళ్ళు మోసం చేయరన్న నమ్మకం తో వాళ్ళు చెప్పిన చోటనల్ల సంతకాలు చేసిండు. గత సంవస్తరం కంపని స్టార్ట్ అయింది.ఈ కంపని మొక్క జొన్న్, బియ్యం నూక తో ఇతోనాల్ తయారు చేస్తుంది.ఈ బియ్యం నూక లో కూడా ఒక మోసమే. బ్లాక్ మార్కెట్ అయిన ఉచిత రెండు రూపాయల కిలో బియ్యం లారీల కొద్ది ఇక్కడికే చేరిన కూడా అధికార పార్టి వాళ్ళది కనుక ఎవరు అడ్డగించఋ. సరే ఆ బియ్యాన్ని మరియు మక్కలను పెద్ద పెద్ద నీటి తోట్లల్లో పులియ బెడుతారు.అలా పులియ బెట్టడానికి ఒక లీటర్ ఇతోనాల్ తయారీకి 25 లీటర్ల నీరు కావాలి.అంటే దీని కెపాసిటీ రోజుకు 60 ,౦౦౦ లీటర్ల ఎతోనల్ తాయారు చేస్తుంది కనుక రోజుకు దీని నీళ్ళ వాడకం 15 లక్షల లీటర్ల నీరు. అట్లా మురిగిన 15 లక్షల లీటర్ల నీటిని రోజు బయటికి వదలడం వలన వాయు కాలుష్యం జరిగి గబ్బు కంపు వాసన దానితో ఆ చుట్టూ పక్కల పర్లపెల్లి,మొగిలిపాలెం,పీసుపల్లె,ములకనూరు,కొత్తపల్లి,నల్లగొండ,నాతకానిపల్లె,పోలంపల్లి,ఇప్పలపల్లె,నుస్తులాపూర్,మల్లాపూర్ ,మన్నేమ్పల్లి 12 గ్రామాల కు చెందిన దాదాపు యాబయ్ వేల మంది జనాబాకు వాంతులు, శరీరాల పైన దద్దులు, గర్బిణీ స్తీలకు గర్భ స్రావాలు అయిన సందర్భం కూడా ఉన్నది.అలాగే ఈ 15 లక్షల లీటర్ల నీరు భూమిలోకి ఇంకి పోయి జల కాలుష్యం ఏర్పడి త్రాగునీరు కలుషితం అయిపోయి వాంతులు విరోచనాలు,కరీంనగర్ నుండి వైద్య బృందం వెళ్లి ప్రజల అభియోగాలు వాస్తవమే నని చెప్పినాయి,ఈ 12 గ్రామాల కు చెందిన 50 వేల జనాభా,వారికి అన్నపానీయాలు అందిస్తున్న 45 వేల ఎకరాల సాగు భూమి,30 చెరువులు,100 కుంటల అస్తిత్వం ప్రశ్నార్థకం అయిన సందర్భం లో ప్రజలు ప్రతినిద్యాలు చేయడం మొదలుకొని ధర్నాలు రాస్త్త రోకో లు చేసి విసిగి పోయి ఆకరుకు ప్రజలంతా కలిసి కంపనిని ఆపి వేసిన తర్వాత పర్యావరణ శాఖ స్పందించి ప్రజల అభ్యంతరాలు వాస్తవమేనని తాత్కాలికంగా కంపనీని మూసి వేసింది. కాని హైదరాబాద్ లెవల్లో యజమానులకు ఉన్న పరపతిని ఉపయోగించుకొని మళ్ళీ కంపని తెరువడానికి అనుమతి తెచ్చుకున్నారు. ఎంతగానో పోరాడి కేసులు జైళ్ళ పాలు అయి మురుగును మూసివేయించుకుంటే ప్రభుత్వ పెద్దలు మల్లి ఈ పాకి ని తమ పైన రుద్దినారు గదా అని ఆందోళన చెందిన ప్రజలు ఈ రోజు దాదాపు ఒక 500 మంది మహిళలు సాయంత్రం రెండున్నర గంటల ప్రాంతం లో కలెక్టరేట్ ముట్టడించినారు.ఈ బయో ప్రాడక్ట్ విషాల వలన ఉర పిచ్చుకలు, బల్లులు చనిపోతున్నాయి.ఎలుకలు పిల్లులు కూడా ఆ నీళ్ళు ద్రాగి చనిపోతున్నాయి. రాష్ట్ర రాజధానిలో జీవ వైవిధ్య సదస్సు గురించి అంతంత గొప్పగొప్ప మాటలు చెబుతున్నా ఓ ప్రభుత్వమా 193 దేశాలల్లో పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిస్తున్నారే! మరి ఇక్కడ మా 12 గ్రామాల 50 వేల మంది ప్రజల ప్రాథమిక హక్కు అయిన జీవించే హక్కును కోల్పోతున్నాము,మా ఉర పిచ్చుకలు మా బల్లులు మా పిల్లలు అన్యాయమై పోతుంటే మేము ఐదు గంటల నుండి ఓ ప్రభుత్వమా మా కస్టాలు వినరండి అని మండుటెండలో మహిళలం పిల్ల పాపాలను వదిలి మీ కార్యాలయం ముందు పడిగాపులు పడి ఉన్నాము అని గొంతు ఎండిపోయేదాకా నినాదాలు చేసినారు.ఓ నాగరికమయిన ,ఆధునికమైన కరీంనగర్ ప్రజలారా!వినండి , ఈ సమస్య మా ఒక్కరిదే కాదు,రోజుకు 15 లక్షల లీటర్ల నీటిని ప్రస్తుతం మా భూగర్భం నుండే ఇస్తున్నా,,ఇప్పుడు కంపని మానేరు డ్యాం నుండి ఆ నీటిని తీసుకోవడానికి అనుమతి పొందింది,ఇప్పుడే మీకు రోజు విడిచి రోజు నీళ్ళు వస్తున్నాయి, మరి 15 లక్షల లీటర్లనీల్ల్లు రోజు బయో కంపనీకి పొతే కరీంనగర్, హనుమకొండ పట్టణవాసులకు విపరీతమయిన త్రాగు నీటి సమస్య వస్తుంది అని ఆ అమాయక పల్లె జనం నగరవాసులకు జ్ఞానోదయం కలుగ జేసినారు ఓ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమా! నీ పాలనా లోని 12 గ్రామాల కు చెందిన 50 వేల మంది కే స్వచ్చ మైన గాలి, స్వచ్చమైన నీరు, ఆరోగ్యంగా బ్రతికే ప్రాథమిక హక్కుకే భద్రత కల్పించ లేని నువ్వు 193 దేశాలకు చెందిన 200 కోట్ల పై చిలుకు ప్రజలకు ఏమి జీవ వైవిధ్యాన్ని ఉద్భోదిస్తావని పర్ల పల్లి బయో ప్రాడక్ట్ ను వ్యతిరేకించే ప్రజలంతా ఇవ్వాళ నిలదీస్తున్నారు. పెంటయ్య. వీరగొని విశ్రాంత విద్యా పర్యవేక్షనాదికారి, పర్యావరణ కార్యకర్త,

Friday, October 5, 2012


అది కరీంనగర్ జిల్లా కేంద్రానికి ఆగ్నేయంగా ఉన్న చిన్న గ్రామం, సర్వాయి పేట.. అక్కడ ఎప్పుడో 1675 లో సర్వాయి పాపన్న నిర్మించిన ఒక కోట శితిలావస్తలో ఉంది. అలనాడు సర్వాయి పాపన్న దాచిపెట్టిన సంపద దొరుకుతుంది అన్న అత్యాశ తో గుప్త ధనం కోసం కోటలోని చాల భాగాన్ని తవ్వి పోసినారు. తెలంగాణా కు చరిత్రే లేదని బుకాయించే సీమాంధ్ర పాలకవర్గాలు చారిత్రిక ఆధారాలను కాపాడడం లో విఫలం అయినారు. కోటకు కొద్ది దూరం లోనే సర్వాయి పాపన్న నిర్మించిన సర్వాయి చెరువు ఇంకా చెక్కు చెదరకుండా ఉంది. ఊరికి మధ్యలో ఉన్న కోట ముఖ ద్వారం, దానిని అనుకోని ఉన్న బురుజు అలనాటి దర్పానికి గుర్తుగా ఇంకా అలాగే ఠీవిగా నిలబడి ఉన్నాయి. ఆ బురుజు పైన ఫిరంగులు పెట్టి శత్రువులను నిలువరించే వారట. అక్కడినుండి భూమిలో గుండా కొమ్ముగుట్ట పైన ఉన్న కోటకు దారి ఉండేదంటారు. బురుజు పక్కన్నే పెద్ద బావి ఉన్నది.కోట ముఖద్వారం ఈ బురుజు ను ఆనుకొని ఎత్తయిన ప్రాకారం చాల వరకు శిథిలమై ఉన్నది. ఆ కోట ముఖద్వారం వద్దా కూర్చొని ఆనాటి పాపన్న గుర్రపు డెక్కల చప్పుడు ఏమైనా వినిపిస్తుందో ఏమో నని భూమికి చెవు ఆనించి విన్న గూడా 350 ఏండ్ల కింద గాలిలో కలిసిన ఆ శబ్ద తరంగాలను వినలేక పోయాము. కాని ఆ బండ రాళ్ళ పైన ఆయన హస్త ముద్రికలను , ఎత్తయిన ఆ బురుజుల పైన ఆయన నడయాడిన కాలి ముద్రల ఆనవాళ్ళను పోల్చుకొనే ప్రయత్నం లో అక్కడ నుండి కదిలినాము., అలనాడు దొరల భూస్వాముల ఆగడాలను అరికట్టడం లో అయన కూడ గట్టిన ఆ దళిత బహుజన సైన్యాలు ఎంతటి నిర్భీతి తో ఎంతటి ధైర్య సాహసాలతో ఆ నేల పైన నడయాడినాయో కదా అన్న తన్మయత్నం అక్కడనుండి కదుల లేక కదుల లేక మెల్లగా కొమ్ముగుట్ట వైపు బయలు దేరి పోయినాము. గొల్ల పల్లి, ఉమ్మాపురం గ్రామాల గుండా సాగిన మా ప్రయాణం కొమ్ముగుట్ట, బయ్యన్న గుట్ట, మూడురోకండ్ల గుట్ట, ఇట్లా ముప్పై యారు గుట్టల శ్రేణి లో తలమానికంగా ఉన్న కొమ్ముగుట్ట పాదాల నుండి ప్రయాణం సాగుతుంటే నెమలి పక్షుల కూతలు మనుషులు పిలిచినట్టుగా వినిపిస్తున్నాయి. శత్రువులు ఎవరో వస్తున్నారు జాగ్రత్త అని అలనాడు సర్వాయి పాపన్న్నకు కూడా ఇట్లాగే ఈ ప్రక్రుతి సహకరించింది కావచ్చు అనిపించింది. ఆ చిట్టడివి చెట్ల సందుల నుండి పోతుంటే చిన్న కాలి దారి వొకటి కనిపించింది.ఆ కాలి దారెంట పొతూ ఉంటె సీతాకోకలు గుంపులు గుంపులు గ బండ రాళ్ళ పైన ఉన్న, మట్టి పైన ఉన్న మాధుర్యాన్ని గ్రోలటానికి కాబోలు కింద వాలుతూ పైకి లేస్తూ వాటి ఆకలి పోరాటం సాగిస్తున్నాయి, అలాగే దాదాపు ఒక అరగంట నడిచిన తర్వాత బండ రాళ్ళ సందుల గుండా వస్తున్న సెలయేళ్ల ధారలు, అక్కడక్కడ చిన్న చిన్న మడుగులు. అబ్బ నీళ్ళు ఎంత స్వచ్చంగా ఉన్నాయి కదా ఇక్కడ అనిపించింది. అప్పటికే మిట్ట మధ్యాహ్నం అయి నందున మేము తెచ్చుకున్న నీళ్ళ బాటిల్స్ అయిపోయినందున ఆ బండల పైనుండి జల జలా వస్తున్న సెలయేటి నీటిని దోసిటి నిండా పట్టుకొని తాగినాము. అసలు మినరల్ వాటర్ అంటే అవి. . ఎంత చల్లగా ఎంత కమ్మగా ఉన్నాయో కదా ఆ నీళ్ళు. ప్రకృతిని ఆస్వాదిస్తూ వెళ్ళిన మేము సరిగా గమనించ లేదు కాని అప్పటికే మేము పోతున్న దారి అన్ని చిన్న చిన్న దారులు గా విడి పోయింది . ఏ దారి గుండా వెళ్ళాలో అర్థం కావడం లేదు. సరే ఏదో ఒక దారి అనుకోని ఒక దారి గుండా వెల్లినాము. అయితే అ దారి మమ్ములను సర్వై పాపన్న నిర్మించుకున్న కోట వైపు కాకుండా మరో వైపు కు తీసుకొని పోతున్నది. అయితే అప్పటికే బాగా అలిసి పోయిన మేము ఏమి చేద్దాం తిరిగి వాపసు పోదామా , ఇంతకష్ట పడివచ్చి అయన నివసించిన స్తావరం చూడకుండా నే వెళ్ళిపోవడం ఎట్లా అని మీమాంస లో ఉండగా మా టీం సభ్యుల్లో ఒకరు అగాగో కోట గోడ అంటూ చుపెడుతున్నారు.ఉత్సాహం తో అందరం అటువైపు చూసినాము. దూరంగా చాల ఎత్తులో ఒక పాకురుబట్టిన పాత బండ రాళ్ళ గోడ ఒకటి కనిపించింది.ఏదో గొప్ప నిధి దొరికినట్టుగా అందరం బిరా బిరా అటువైపు అడుగులు వేసినం. కంటికైతే కనిపిస్తున్నది కాని దాని లోనికి పోవడానికి ద్వారం దొరుకుత లేదు.ఎటు వైపు పోయినా ఎక్కి దాట వీలు గాని కోట గోడనే అడ్డం వస్తున్నది. అరె ఆ కాలం ల ఇక్కడ ఇంతటి శత్రు దుర్భేద్యమైన కోట కట్టుకోవచ్చునని అతి సామాన్యుడు, ఒక కళ్ళు గీత వృత్తి దారునికి ఇంతటి ఇంజనీరింగ్ పరిజ్ఞానం ఎట్లా కలిగిందోకదా అని అబ్బురపడ్డాము. అయితే మాకు తెలిసింది ఏమిటంటే ఆ కోట లోపలికి పోవడానికి ఒకే ద్వారం ఉన్నదట.చివరికి మా టీం సభ్యులు చెట్లు ఆకుల తో ముసి ఉన్న ఒక ద్వారం కనుగొన్నారు. ఆ ద్వారం గుండా లోపలి పోయినాము. విశాలమయిన బండ రాళ్ళు. అక్కడ ఒక ఎత్తయిన రాయి పైన పాపన్న కూర్చునేవాడు అని ఒక రాతి సింహాసనం వంటి పెద్ద బండ రాయినే చూపినారు. అక్కడ నుండి శత్రువుల ఆచూకీని చూడడానికి రెండు వైపులా ఎత్తయిన బురుజులు ఉన్నాయి అయితే అవి చాల వరకు శిథిల మై పునాదులు, కొన్ని కొన్ని నిర్మాణాలు ఉన్నాయి. అక్కడ నుండి కొంత దూరం వెళ్ళిన తర్వాత కాలక్షేపానికి ఆడుకొనే పులి జూదం పటం బండ పైన చెక్కి ఉన్నది. దాని కి కొంచం ఎడమ వైపు ఒక హనుమంతుని విగ్రహం చెక్కి ఉన్నది. కాని అది పాపన్న కాలం లో చెక్కినది కాకపోవచ్చుననుకొనే వారు ఉన్నారు. ఎందుకంటే పాపన్న బ్రాహ్మనీయ సంస్కృతిని పెద్దగ అభిమానించిన ఆధారాలు ఎక్కడ కనిపించడం లేదు.ఎందుకంటే ఆసియా ఖండం లోని అత్యంత ఉన్నతమైన స్తూపం నిర్మించబడి రాజ్యం చే ధ్వంసం చేయబడిన హుస్నా బాద్ పట్టణం లో సర్వాయిపాపన్న చేత మట్టి తో నిర్మించ బడ్డ పోచమ్మ గుడి ఉన్నది.దాని పూజారి గా కూడా ఒక దళిత మహిలనే నియమించి నట్లు గా ఆధారాలు ఉన్నాయి. అంతే గాకుండా ఆయనకు సమయం చిక్కినపుడల్లా రక్షణ స్తావరాలు నిర్మించుకోవడం,ప్రజల కష్టసుఖాలు తెల్సుకోవడం, శత్రువులు వసూలు చేస్తున్న పన్నులు చెల్లించ వద్దని ప్రజలను చైతన్య పరచడం. లాంటి పనులతోని తీరిక లేకుండా ఉన్న వాస్తవ వాది. ఛత్రపతి శివాజీ సమకాలికుడు అయిన పాపన్న శివాజీ వలె గుళ్ళు, గోపురాలు కట్టి ఉంటె బ్రాహ్మణా సమాజం పాపన్న చరిత్రను కుడా గ్రంధస్తం చేసి ఉండేది.మొఘల్ చక్రవర్తులను ఎదిరిస్తున్నాడు కనుక మహ్మదీయ చరిత్ర కారులు, మొఘల్ చక్రవర్తులకు తాబెదార్లు గా, పన్నులు వసూలు జేసి ఇస్తూ వారికంటే క్రూరంగా ప్రజలను హింసిస్తున్న స్తానిక హైందవ దొరలను చీల్చి చండాడుతున్నాడు కనుక హైందవ చరిత్ర కారులు పాపన్న చేరిత్రను ఎక్కడ గ్రంధస్తం చేయలేదు. అయిన ప్రజా నాలుకల పైన ఆశువు గా వచ్చిన పాపన్న చరిత్రను జానపదులు తమదయిన వీరోచిత , తమదైన సంస్కృతితో ఈ తరం దాక తమ నాలుకల పైన మోసుకొని తెచ్చినారు. ఆ కొండ పైన రెండు పెద్ద బండ రాళ్ళ మధ్యన ఉన్న చిన్న చిన్న రాళ్ళు, మట్టిని తొలిగించి అక్కడ ఆ గుట్ట పైన రెండు కోనేరులను నిర్మించినాడు.ఆ కోనేరులోనికి దిగడానికి మెట్లు సైతం చెక్కించి నాడు.సముద్ర మట్టం నుండి దాదాపు 300 మీటర్ల ఎత్తున ఉన్న ఇతని కోటపైన సహజ సిద్ధమైన కోనేరులు నిర్మించుకొని ప్రకృతిని సైతం అక్కడ తన అధీనం లో ఉంచుకో గలిగినంతటి ఇంజనీరింగ్ నైపుణ్యం కలిగిన అసాధరణమైన ఒక సామాన్య మనిషి పాపన్న.కొండ పై భాగాన ఉన్న శిల్పాలు కొన్ని చూసి కిందకి ప్రయాణం అయినాము. అయితే పాపన్న ఆరాధించే ఒక ప్రక్రుతి శిల్పం, దాని పేరు.బయ్యన్న, అది మాకు ఎక్కడా కనిపించలేదు. అది చూడ లేక పోయామే అన్న అసంతృప్తి మాకుఉన్నది. . కాని అప్పటేకే బాగా అలిసి పోయి ఉన్నాము .పైగా సూర్యుడు మాకంటే ముందుగానే తిరుగు ప్రయాణం లో ఉండీ మమ్ములను వేగిర పెడుతున్నాడు.అలనాడు గుర్రాలు సైతం ఎక్కినా గుట్టల పైనకు మాకు పోవడానికే గాదు రావడానికి కూడా చాల కష్టం అవుతున్నది. బండల పైనుండి జారుతూ చెట్ల ఉడలు పట్టుకొని , మెల్ల మెల్లగా కిందికి వస్తున్నాము ఒక్కసారిగా దాదాపు ఏడు ఫీట్ల ఎత్తుగా ఉన్న బయ్యన్న విగ్రహం మాకు అడ్డంగా వచ్చింది నన్ను దర్శించుకోకుండానే మిమ్ములను పోనిస్తానా అన్నట్లు గ మాకు అయన తారస పడేసరికి చాల ఆనంద ఆశ్చర్యాలు కలిగినాయి. కోర మీసాలు, ఏడు చేతులు,ప్రతి చేతిలో ఒక ఆయుధం, ఆ ఆయుధాలన్నీ కూడా ప్రకృతియే.ఇనుప శూలం,విల్లంబులు,పడగ విప్పిన నాగుపాము,అర్ధ చంద్రుడు,డమరుకం,కమలం, యమపాశం,ఉన్నాయ్. ఒక కుక్క,బుద్దుడు,నరుకబడిన శత్రువు తల ఉన్నాయి.దిగంబరంగా చెక్కిన్చుకోబడ్డ ఈ విగ్రహానికి పాపన్న కోట లోనికి వచ్చేటప్పుడు,కోటలోనుండిబయటికి పోయేటప్పుడు పూజున్చుకొని పోయే వాడట. ఆ విగ్రహం కింద నిధి ఉండవచునో ఏమో అనుకోని దుండగులు.తవ్వినారు.విగ్రహం పక్కనుండి తెల్లని సెలయేరు పారుతున్నది.బయ్యన్నను దర్శించుకున్నామన్న సంతోషం మా అలసటను తొలగించింది.చల్లని తెల్లని సెలయేటి నీరు కడుపునిండా తాగి మనుసు నిండా పాపన్న చరిత్రను తలుచుకొంటూ తిరుగు ప్రయాణం అయినాము. గుట్ట దిగువన మరో చారిత్రిక మైదానం . అదే దండు దుబ్బ. తన సైన్యానికి పాపన్న అక్కడే శిక్షణ ఇచ్చేవాడట. సామాన్యులకు, సంపద సృస్తికర్తలకు సరైన వాటా లభించాలంటే సాయుధ పోరు చేయక తప్పదని 375 సంవస్తరాల కింద నే మార్క్స్ మాటే లేని రోజుల్లో మన సర్వాయి పాపన్న మహ్మదీయులైన మొఘల్ లను, హైన్దవులయిన స్తానిక దొరలను ఎదిరించడానికి ఒక చాకలి సర్వాన్న, ఒక మంగలి మాదన్న, ఒక జక్కుల పెరుమండ్లు,ఒక దూదేకుల పీర్ సాహెబ్,లాంటి దళిత బహుజనులతో దండు గట్టి సాయుధ పోరు జేసి దళిత బహుజనుల రాజ్యం సాధించుకున్నాడు.ఇంతటి మహత్తర దార్శనికుడు., ఇంతటి గొప్ప యుద్ద్దవీరుడు,ఇంతటి ప్రజాపక్షపాతి,సంపద సృష్టికర్తలకు సంపద దక్కాలన్న సమ సమాజ వాది యొక్క చరిత్ర గాని, ఒక విగ్రహం గాని తెలంగాణా లో అందునా ఆయన పుట్టిన వరంగల్ జిల్లలో గాని,అయన సమరం జేసిన పొలాస జగిత్యాల, కరీంనగర్ లో గాని లేదా గోల్కొండానే జయించిన ఈ విప్లవ యోధుని విగ్రహం హైదరాబాద్ ట్యాంక్ బండ్ పైన గాని పెట్టుమని అడుగడానికి కారణం చరిత్ర తెలియక పోవడం ఒక కారణమయితే దళిత బహుజనులలో తమ ఆత్మ గౌరవ ఉనికి కై తమ అస్తిత్వాలను నిలుపుకోవడానికి తెగించి పోరాడాలన్న సీరియెస్ నేస లేక పోవడం మరో కారణం. సంపద సృస్తికర్తలకు సమ న్యాయం జరుగాలని అనోకొనే వారు,అగ్రకుల ఆధిపత్యాన్ని ధిక్కరించే వాళ్ళు,ఇప్పటికయినా ఒక్కటయ్యి ,375 ఏండ్ల కిందనే మొఘల్ సామ్రాజ్య వాదాన్ని ఎదిరించి, అగ్రకుల హైందవ పాలనను ఓడించి, ప్రకృతినే ఆరాధించి ,దళిత బహుజలతోదండు గట్టి సాయుధ పోరుజేసిన తెలంగాణా దేశీ దార్శనికుని మార్గం లో ఆలోచించి రాజ్యాధికారం దిశలో ఆలోచించాల్సిన అవసరాన్ని గుర్తించవలసి ఉన్నది. పెంటయ్య.వీరగొని. విశ్రాంత విద్యపర్యవేక్షనాదికారి. న్యాయవాది.