Tuesday, April 17, 2012

ఈ ఏప్రిల్ 20 తో ఇంద్రవెల్లి మారణకాండకు 31 సంవస్తరాలు. 1981 ఏప్రిల్ 2o న గిరిజన రైతు కూలి సభ ఆధ్వర్యం లో గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములు వారికే చెందేవిధంగా పట్టాలు ఇవ్వాలని, ఎందుకంటే అప్పటికే గిరిజనుల భూములను మైదాన ప్రాంతం నుండి వచ్చిన గిరిజనేతరులు ఆక్రమిన్చుకుంటున్నారు. అలాగే తమ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించాలని, తప్పుడు కొలతలతో తప్పుడు తూకాలతో తమను మోసం జేస్తున్న వారినుండి రక్షణ కల్పించాలనే డిమాండ్ తో ఇంద్రవెల్లి లో గిరిజనులు సభ జరుపుకుంటున్నారు. వారి డిమాండ్స్ ఏమి రాజ్యాన్గెతరమైనవొ లేక రాజ్యాధికారాన్ని లాక్కునేవో కాదు. కాని రాజ్యం నిర్దాక్షిణ్యంగా దాదాపు 60 మంది గిరిజనులను కాల్చి చంపింది. అమరులైన వారి రక్తం ఏరులై గోదావరి, మానేరు , ప్రాణహిత, ఇంద్రావతి, శబరీ నదుల గుండా ప్రవహించి చత్తీస్ గడ్, అభూజ్ మాడ్ లో జల్, జంగల్, జమీన్ ల పైన హక్కులకు ఉద్యమించాలన్నశక్తులకు ఊపిరులూదిన్ది.
ఇదే సందర్భం లో డిల్లీ లో మన్మోహన్ సింగ్, చిదంబరం లు దేశ ముఖ్యమంత్రుల సమావేశం లో తమ ఆర్ధిక మూలాలకు తమ భద్రతకు రక్షణ లేదు కనుక ఎన్సిటిసి ఏర్పాటుకు అందరు సహకరించాలని ముఖ్య మంత్రులతో అభ్యర్థించారు. ఇక్కడ ఎవరి ఆర్ధిక మూలాలకు భద్రత లేకుండా పోయిందో ఎవరి భద్రతకు భంగం కలిగిందో చర్చించాల్సిన అవసరం ఉంది. దేశ వ్యాప్తంగా సెజ్ ల పేరుతొ, అనువిద్యుత్ కర్మాగారాల పేరుతొ , నీటి ప్రాజెక్టుల పేరుతొ, ఖనిజ సంపద తవ్వకాల పేరుతొ కోట్లాది పేద ప్రజల భూములను బలవంతంగా లాగుకొని ఒక వేదాంత , ఒక బ్రహ్మని, ఒక రహేజ , ఒక రిలయెన్స్ ఇట్లా బడా బాబులకు అప్పనంగా అప్పగించి వాళ్ళ ప్రయోజనాలకు రక్షణ కల్పించి వాళ్ళు సమర్పించే సుట్కేసులతో రాజకీయ నాయకుల వ్యక్తిగత ఆస్తులు పెంచుకుంటున్నారు. ఒక మధుకోడా , ఒక లాలు ప్రసాద్ యాదవ్, ఒక రాజశేకర రెడ్డి, ఒక రాజీవుగాంది , ఒక మాయావతి, ఒక జయలలిత, ఇలా వందల సంఖ్యలో నాయకుల పైన కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు వచ్చినాయి. అదంతా ప్రజలకు చెందవలసిన సొమ్మే. కాని ప్రజలు పాపం ఎప్పుడు కూడా తమ ఆర్ధిక మూలాలకు ఈ రాజకీయ నాయకుల చీడ పట్టిందని వీళ్ళను అంతమొందించాలని అనుకోలేదు. సమస్యల మూలాలను వెదికి శాస్త్రీయ పరిశ్కారాలకోరకు కోల్పోతున్న ప్రజా సమూహాలను సమీకరించే ప్రయత్నం జేస్తున్నారు. కాని మన్మోహనుడు, చిదంబరం లు మాత్రం వాళ్ళ సమూహాల దోపిడీ ని ప్రశ్నిస్తున్న ప్రజా రాశులను అది ఇంద్రవెల్లి గాని, అది కాకరాల పల్లి కాని, అంది నందిగ్రామ్ కాని ఎక్కడైనా ప్రజలను కాల్చి చంపుతున్నారు. అంతే భవిష్యత్ లో అట్లా కాల్చి చంపడానికి మనమంతా ఏకం కావాలని పిలుపు ఇస్తున్నారు.
మరొక్క విషయం విధ్వంసం. అసలు ఎవరు విధ్వంసం చేస్తున్నారు. అది ఇసుక, అది మట్టి. అది ముడి ఖనిజం, అది గ్రానైట్, గ్రాఫైట్, అల్యూమిన, నీరు ఇట్లా అన్ని వనరులను ఒక లెక్క పక్క లేకుండా భావి తరాలకు మిగులకుండా తవ్వి విధ్వంసం చేస్తున్నది రాజ్యం అండ దండలతో పెట్టుబడి దారలా లేక ప్రజలా? ఈ విధ్వంసం వలన ఎంతటి కాలుష్యం వస్తున్నకూడా వాళ్ళ ఆరోగ్యాలను ఫణంగా పెడుతిన్నారే కాని మా ఆరోగ్యాలకు హాని కలిగిస్తూ మా జీవించే ప్రాథమిక హక్కుకు భంగం కలిగిస్తున్నారని ఇప్పటికి ఇంకా ప్రజలు తిరుగ బడటం లేదు. ఎక్కడో చదివినట్లు వేటాడే తోడేళ్ళు వేటకు ఐక్యం అవుతున్నాయి కాని వేటకు గురయ్యే గొర్రెలు ఐక్యం కావడం లేదుఅన్నట్లుగా ఎక్కడో కాదు మన రాష్ట్రం లో మన హైద్ర బాద్ చుట్టూ పక్కలనే 34 వేల ఎకరాల అత్యంత విలువైన భూములను పేదలైన హక్కు దారుల నుండి బలవంతంగా లాగుకొని నామ మాత్రపు ధరలకు ఆ భూమిని బడా బాబులకు ధారాదత్తం జేశారు. వారు ఏ ప్రాజెక్టులు కట్టక పోయినా ఏ ఒక్కరికి ఉద్యోగం ఇవ్వక పోయినా పైగా అదే భూములను బ్యాంకులకు తాకట్టు పెట్టి కోట్ల కొద్ది బ్యాంకు రుణాలు పొందినా, ఉద్దేశించిన ప్రాజెక్టు కట్టక పోగా ప్లాట్స్పెట్టి అమ్ముకుంటున్నా కూడా ఏ ఒక్కరిని ఏమి అనరు. ఎందుకంటే అందులో వాటాలు మీకు అదివరకే అంది ఉన్నాయి కనుక. మీవి , మీ చందాదారుల అక్రమ సంపాదన 5oo లక్షల కోట్ల రూపాయలు విదెశీ బ్యాంకులల్లో దాచుకుంటారు. అవి తెప్పెంచే ప్రయత్నం అధికార, ప్రతిపక్షాలు ఏవీ కాని చేయవు, కాని ఇక్కడ పేద ప్రజల అవసరాలైన ఉప్పుల పై, పప్పుల పై చెప్పుల పై, గ్యాస్, పెట్రోల్, డీసెల్ పైన అలివి గాని పన్నులు వేస్తారు. ప్రజలు స్వేచ్చ ,స్వాతంత్రాలతో, బ్రతుకు భద్రతతో జేవించే పాలన అందించుమని అధికారాన్ని పాలకులకు అప్పగిస్తే పాలకులు చేస్తున్నది ఏమిటి, ప్రజలు నిలబడ్డ నీడను అడుగిడిన ఆధారాన్ని విదేశాలకు మల్టీ నేషనల్ కంపనీలకు గంపగుత్తాగా అమ్మివేస్తూ ప్రశ్నించే ప్రజలను ఖబర్దార్ మా అంతర్గత భద్రతకు మీరు ముప్పుగా ఉన్న్నారని, తమ ఆర్ధిక మూలాలకు నీళ్ళు అందకుండా జేస్తున్నారని హెచ్చరిస్తా ఉంటె ప్రజలు ఇంకా ఎంతో కాలం సహించరు.
పెంటయ్య,వీరగొని.
కరీంనగర్.

Thursday, April 12, 2012

రపంచ వ్యాప్తంగా  కోట్లాదిమంది అవకాశాలను కేవలం వేలాది మంది అత్యంత దురాశా పరులైన వ్యక్తులు ప్రజలందరికి చెందవలసిన సంపదను అలనాడు హిరణ్యాక్షుడు భూమిని చాప చుట్టినట్లు చుట్టి చంకలో పెట్టుకొని పోయినట్లుగా వీళ్ళు సంపదనంతా పోగుజేసుకొని తిరుగుబాటుకు కారనమౌతున్నారు. పైగా తిరుగుబాటు దారులనే దోపిడీ దొంగలుగా  తీవ్రవాదులుగా సృష్టిస్తున్నారు. 11 వ శతాబ్దానికి  పూర్వం ప్రజలనుండి గోల్లుడ గొట్టి  వసూలు జేసిన సంపద అంతా మతాధి పతులు ప్రార్థనా మందిరాలలో దాచి పెట్టినపుడు ఆకలి బాధితులు అది దోచుకొని పొతే వాళ్ళను దగ్గులు, పిండారీలు , బందిపోట్లు దొంగలు అన్నారు. 12 వ శతాబ్దం తర్వాత నుండి ఆంగ్లేయులు  రాజ్యాధికారానికి వచ్చేదాకా దొరల గడీల పైన, మొగల్ చక్రవర్తుల కోటల పైన, వాళ్ళ సామంతుల దేవిడీల  పైన  ఒక సర్వాయి పాపన్న గౌడ్, ఒక ఛత్రపతి శివాజీ లాంటి బహుజన యోధులు చేసిన తిరుగుబాట్లను  పాలక వర్గాల కు వందిమాగదులైన చరిత్రకారులు దొంగ తనాలుగా దొంగ దాడులు గా, అభివ్రుద్దినిరోధకులుగా విచ్చిన్న కారులుగా  చిత్రీక రించారు. అలాగే ఇప్పుడు సెజ్జులల్లో, అభాయారన్యాలల్లో, పోలవరం లో, శ్రీపాద సాగర్ లో,  నెల్లూరు జిల్లా ముత్త్కూరు మండలం చిల్లకూరు, వెంకటచలంలో, సింగూరు, నందిగ్రామ్ , పోస్కో, నియమగిరి,సోంపేట,కాకరాలపల్లి, ప్రాజేక్టులల్లో భూములు కోల్పోయిన , తమ ఉపాధి కోల్పోయిన లక్షలాది మంది నిర్వాసితులు తిరుగుబాటు జేస్తే వారిని  అభివృద్ది నిరోధకులు అంటున్నది రాజ్యం.
      రాజ్యం దాని స్వభావం ఎలా ఉండాలో ప్లేటో,అరిస్టాటిల్ నుండి చానుక్యుని  దాక రాజగురువులే ఏమని ప్రస్తావించారు? రాచరిక వ్యవస్థ లో గాని  శ్రేయో రాజ్యం లో గాని సంక్షేమ రాజ్యాలల్లో గాని ప్రజలనుండి తిరుగుబాటు రాకుండా రాజు ప్రజలను పాలించాలని చెప్పబడింది. అంతే గాని ప్రజలకు చెందవలసిన సమస్త సంపదలను తమ సైనిక బలం తో తమ తమ వ్యక్తిగత ఆస్తులు పెంచుకోవడం తో బాటుగా తమ తమ అనుచర బందుగానాలకు అందిన కాడికి దోచి పెట్టడం, రాజ రాజ వైభోగాలు  ప్రజల కన్ను కుట్టే ల అనుభ వించడం  ఉత్తమ పాలకులకు తగదు అని చెప్పినారు.కాని . ఇక్కడ భూ ప్రపంచం మీద ఎంత విధ్వంసం జరిగినా ఎంత కాలుష్యం విరజిమ్మినా సకల భద్రతల నడుమ బతుకుతున్న తమ జీవితాలకు ధోకా లేదన్న భరోసా తో గాలి, నీరు, రాయి, ఇసుక, మన్ను, ఖనిజ సంపద లను విచ్చల విడిగా భావి తరాలకు దక్కకుండా బొక్కేస్తున్నారు. ఇలా  కన్ను మిన్ను గానక బొక్కేస్తున్న దానికి అజీర్ణ రోగాలే ఈ ప్రజా ఉద్యమాలు అని వాళ్ళు అర్థం జేసుకోకుండా పోలీసు సైనిక బలగాలను ఉపయోగించి తమ రోగ నివారణ జేసుకోవచ్చు అని భ్రమ పడుతున్నారు. కాని పెట్టుబడి అనే లాభాపేక్ష కాన్సర్ తమ అన్నవాహికలకు సోకింది అన్న సోయి వాళ్లకు కలుగడం లేదు.
   ప్రైవేట్ విద్యుత్ సంస్తలకు ఇందన సరఫరా ఒప్పందానికి ప్రభుత్వ రంగ సంస్థ కోల్ ఇండియా మేడలు వంచి మార్కెట్ రేటు కంటే తక్కువకు బొగ్గు సరఫరా చేయండని సాక్షాత్ భారత రాష్ట్ర పతే స్వయంగా ఉత్తర్వులు ఇచ్చిన ఫలితంగా కోల్ ఇండియా సంస్థ 95 వేల కోట్లు నష్టపోయి అంతర్జాతీయ ఇన్వెస్ట్ మెంట్ సంస్థలు లాభ పడుతున్నాయి. ఒక టన్ను బొగ్గు బయటికి తీయడానికి ఎంత మానవ శ్రమ అవసరం అవుతుంది అనే దానితో బాటుగా ఆ ఫాజిళ్ ఇందనం మండించడం ద్వారా ఎంత క్షయ , కాన్సర్ కారకాలు వ్యాపిస్తాయో ఆయా వ్యాధుల రేట్ ఆఫ్ ఇంక్రీసేస్ ను చూస్తే అర్థం  అవుతూనె ఉంది. అంతే గాకుండా స్తానికుల అవసరాలు వారి ఆరోగ్యాలను పరిగణన లోకి తీసుకోకుండా విదేశీ అవసరాలకోసం పెట్టుబడి దారుల లాభాల కోసం అపురూపమైన, మల్లి పునరుత్పత్తికి అవకాశం లేనట్టి సహజ వనరులను దోచి పెట్టె వాళ్ళు దొంగలు అవుతార లేక భావి తరాల కోసం కొంచమైన మిగుల్చుదాం, ఇంతగా మానవ హననానికి మేము అవకాశం ఇవ్వం  అని అడ్డుకొనే వాళ్ళు దొంగలు అవుతారా ఆలోచించ వలసిన విషయం.
     ఖతార్ రాజు షేక్ హమదబిన్ ఖలీఫా అల థాని ఏకంగా 747 -8 ఇంటర్ కంటినేన్తల్ అతి పెద్దవిమానం 480 మంది పయనించే విమానాన్ని 25o కోట్లకు కొనుక్కొని అందులో తాను తన పరివారం తో విహార యాత్ర చేస్తాడట. అందులో గుర్రాలు, ఒంటెలు,పెంపుడు  గద్దలు.రెండు రోల్స్ రాయిస్ కార్లు కూడా పెట్టుకొని ఆకాశం లో విహరిస్తాడు. నేనేమి తక్కువ వాన్నా అనీ తన రాజసం చూపుకొవదానికి సౌదీ రాజు ఆల్వా బీద్ బిన్  తలాల్ ఏర్బస్ ఎ 380 డబుల్ డెక్కర్ విమానాన్ని కొనుక్కున్నాడు. ఈ భూమి లో ఇంతటి ఖనిజ సంపద ఇందన సంపద నింపింది వీళ్ళు గాని వీళ్ళ తాత ముత్తాతలు గాని కాదు.ఈ బొగ్గు, ఈ పెట్రోలు ఆ బావులల్లో నింపింది వీళ్ళు గాదు,తవ్వి తీస్తున్నది కూడా వీళ్ళు గాదు. కాని సంపద మాత్రం వీళ్ళదే ఎలా అవుతుందో వాళ్ళ ఆస్తి హక్కు కే తెలుసు..  మన దేశం లో అనిల్ అంభాని కట్టిన భవనాన్ని చూసి తోటి పెట్టుబడి దారు అయిన టాటా నే మనమే సంపదను ఇలా అనుత్పాదక రంగం లో విలాసాలకు ఖర్చు చేస్తే ఇక నక్షలైట్లు పుట్టుకు రమ్మంటే రారా అని కామెంట్ చేసినట్లు ఒక పత్రికలో చదివినం.మన రాజశేకర్ రెడ్డి పుత్రుడు జగన్ లోటస్ పాండ్ ఎన్ని కోట్లు మింగిందో ఎంత రాజసం వెలగబెడుతున్నదో పత్రికల్లో చదివినం, నిన్నటికి నిన్న పోలీస్ డైరెక్టర్ జెనరల్ దినేష్ రెడ్డి, ఐ పి ఎస్ ఆఫీసర్ ఉమేష్ కుమార్ ల ఒకరి పై ఒకరు అక్రమ సంపాదనల గురించి చేసుకున్న ఆరోపణల పైన నిగ్గు తేల్చండి అని  సాక్షాత్ ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ ఆదేశించిందంటే అక్రమ ఆస్తుల వ్యవహారం అతడు ఒక పెట్టుబడి దారుడా ? ఒక రాజకీయ వేత్తా ? ఒక ఐ ఎ ఎస్ ఆఫీసరా ? ఈ వ్యవస్థ లో అవినీతి అక్రమాలకూ అవకాశం లేకుండా అడ్డుగా నేను విధులు నిర్వహిస్తా నని చెప్పుకొంటున్న పోలీస్ అధికారా ? సర్పంచ్ నుండి ప్రధాన మంత్రి దాకా , గ్రామా పరిపాలనాధికారి నుండి కలెక్టర్ దాక , పోలీస్ కానిస్టేబుల్  నుండి సైన్యాధి పతుల దాకా స్వంత ఆస్తులు పెంచుకోవడానికి ఎలా తండ్లాడు తున్నారో రొజూ పత్రికలల్లో చూస్తున్నాము. కనుక స్వంత ఆస్తికి అవకాశం లేని రాజ్యం కోసం ఆనాడు చానిక్యుడు చెప్పక పోయినా ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న ఆలోచనలను స్వాగాతిన్చాకుండా అణిచి వేత పైననే ఆధార పడితే సమాజాలు మరింత సంక్షోభాలల్లో కూరుకు పోయి ఈ భూ గ్రహం మీద మానవ మనుగడే ప్రశ్నార్థకం కాగలదు.
పెంటయ్య. వీరగొని.

Friday, April 6, 2012

ఆత్మహత్యలు ఆపుదాం.

ఆత్మా హత్యలు ఆపుదాం!
ఎందరు ఎన్ని తీర్ల విజ్ఞప్తులు చేసినా ఆత్మా హత్యలు ఆగడం లేదు. అసలు మరి ఈ ఆత్మా హత్యలు ఎందులకు జరుగుతున్నాయి. ఆ
పిల్లల మానసిక స్తాయి అలా ఎందుకు నిరాశావాదం వైపు పోతున్నదో ఆలోచించాల్సిన విషయం. తెల్నగాన లో ఉన్న రాజకీయ నాయకుల
స్వార్థ పూరిత వైఖరి కారణంగానే తెలంగాణా రావడం లేదు అన్న విషయం నిర్వివాదం.
ఇక్కడ మనం ఒక్కొక్క రాజకీయ పార్టీల అప్రజాస్వామిక విధానాల గురించి చూస్తే , తెలంగాణాకు తోలి శత్రువు కాంగ్రెస్. 1956 లో ఆనాటి హైదరాబాద్ రాష్ట్రం తెలంగాణా ప్రజల అభీష్టానికి మరియు ఫసల్ అలీ కమిషన్ కు వ్యతిరేకంగా ఆంధ్ర లో విలీనం కావడానికి ఆనాటి కాంగ్రెస్ పార్టి ప్రభుత్వమే కదా కారణం. అలాగే 1969 ఉద్యమాన్ని అణిచి వేసిన బ్రహ్మానంద రెడ్డి ప్రభుత్వం గాని లేదా తెలంగాణా ప్రజలకు వెన్నుపోటు పొడిచిన తెలంగాణా గడ్డ పైన చెడబుట్టిన చెన్నారెడ్డి గాని కాంగ్రెస్ పార్టి గన్నేరు పలుకుల గంధాలే కదా? బూర్గుల రామకృష్ణ రావు, సంజీవరెడ్డి, బ్రహ్మానంద రెడ్డి, వెంగల రావు , నుండి మొదలుకొని నిన్నటి రాజశేకర్ రెడ్డి రోశయ్య, ఇప్పటి కిరణ్ కుమార్ దాక అందరు తెలంగాణా రాష్ట్రం రాకుండా అడ్డుపడిన వారే. ఆ పార్టీకే చెందినా కొందరు ఎంపి ఏమ్మేల్లె లు తెలంగాణా తెచ్చేది మేమే ఇచ్చేది మేమే అని నమ్మబలుకు తుంటే ఇంకా మనయువకులు నమ్ముతూ వాళ్లకు జై కొడుతున్నారు.
ఇక తెలుగు దేశం పార్టి, అది మొదటి నుండే అంటే ఎన్టి రామారావు నుండే తెలంగాణాకు వ్యతిరేకంగానే ఉన్నది. తెలంగాణా రీజినల్ కమిటి రద్దు, రాష్ట్రపతి ఉత్తర్వులు రద్దు, ఉద్యోగ నియామకాలల్లో వివక్షత, తెలుగు జాతిమనది చక్కగా వెలుగు జాతి మనది అంటూ పాటలు పాడి గోదావరి కృష్ణ డేవలోప్మెంట్ ఫోరం కు రామోజురావు ను నాయకునిగా పెట్టి తెలంగాణా నీళ్ళను మద్రాస్ దాక తరలించుకు పోవడానికి పతక రచన చేసిన తెలంగాణా వ్యతిరేకి. ఆ తాను ముక్క చెంద్రబాబు ఏకంగా 2004 ఎన్నికల్లో తెలంగాణా విడిపోవడానికి వీల్లేదు, సమైక్యాంధ్ర నా నినాదం అన్న మానిఫెస్టో తో ఎన్నికల బరిలో నిలిచిన చరిత్ర టిడిపిది. 9 డిసెంబెర్ 2009 నాడు వచ్చినట్టే వచ్చి పోయిన తెలంగాణా రాష్ట్రాన్ని అడ్డుకున్నది టిడిపి. మొదటి నుండి కూడా అది తెలంగాణాకు వ్యతిరేకమే కనుక ఇవ్వాళ కొత్తగా అది తెలంగాణాకు ద్రోహం చేసేది కూడా ఏమీ లేదు. వాళ్ళు ఏమి చెప్పిన తెలంగాణా ప్రజలు నమ్మే స్తితిలో లేరు. ఆ మేరకు ఈ రెండు పార్టీలు ప్రజల్లో తమ ప్రాభవాన్ని కోల్పోయిన విషయం అంతా గమనిస్తూనే ఉన్నారు.
ఇక తెలంగాణా కోసమే పుట్టినం అని చెప్పుకుంటున్న టి, ఆర్ ఎస్ కూడా తన ఓట్ల సంఖ్యా సీట్ల సంఖ్యా పెంచుకునే కార్యక్రమం దప్ప తనకు తానుగా పెద్దగా చేసింది ఏమి లేదు. 2004 ,2009 , జగిత్యాల్ ఉప ఎన్నికలల్లో మీరు మాకు ఒత్లువేసి గెలిపించండి చుక్క రక్తం చిందకుండా తెలంగాణా తెస్తానని చెప్పింది. అన్నిసార్లు ప్రజలు టి,ఆర్ ఎస్ ను ఆదరించారు.నిన్నటికి నిన్న ఒక్క మహాబుబు నగర్ దప్ప అన్ని చోట్ల టి, ఆర్ ,ఎస్ ను గెలిపించినారు.కాని తెలంగాణా రానే లేదు. పైగా 2014 లో అన్ని సీట్లు గెలిపిస్తే తెలంగాణా వచ్చితీరుతుంది
అనే మాయ మాటలు చెబుతున్నారు. వచ్చే ఉగాది, వచ్చే దసరా, వచ్చే దీపావళి, వచ్చే బక్రీద్ తెలంగాణలోనే అని అబద్దపు మాటలు జెప్పి బిడ్డలను ఆశ పెడుతున్నారు. ఒత్లంటే ఓట్లు వేస్తున్నారు, పండుగల వెనుక పండుగలు పోతున్నాయి. కాని తెల్నగా మాత్రం రావడం లేదు.
కాంగ్రెస్ నాయకులే తెలంగాణకు అడ్డంకి అని ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి అంటడు. కిరణ్ కుమార్ అది కేంద్రం చుసుకున్తున్నది అంటాడు.గండ్ర వెంకట్ రామనా రెడ్డికి దిమ్మ తిరిగి ఇప్పుడు తెల్నగాన ఇచ్చేది మేమే అంటాడు. మేము తెలంగాను వ్యతిరేకం కాదు అని బాబు సన్నాయి నొక్కులు నొక్కుతాడు. ఇంకా ఇక్కడి నర్సింహులు నానా బూతులు మాట్లాడు తాడు, 4 కోట్ల మంది నీ విధానం ఎండని నిలదీస్తే పట్టించుకోదతకాని ప్రధాన మంత్రి, హోం మంత్ర అడిగేతే లేఖ ఇస్తాం అంటడు ఎర్రబల్లి.
ఇక్కడ ఎవ్వరు తెలంగాణాకు వ్యతిరేకం కాదు అంటరు తెలంగాణా మరి ఎందుకు రావడం లేదో అర్థం గాక అమాయకులైన బిడ్డలు ఆత్మాహుతికి పాల్పడుతున్నారు. కాని ఇక్కడే యువత జాగ్రత్తగా ఆలోచించాలి. గ్లోబలైజేషన్ పుణ్యాన ఇవ్వాళ అంతా వ్యాపారమే. డబ్బు సంపాదనే! సంపద ఇచ్చే సౌఖ్యలకు మొహం వాచిపోయిన మొఖాలే! అందునా రాజకీయ పార్టీలు మరీ దారుణం.ఘర్షణ లేకుండా ఎక్కడ మార్పు జరిగిన దాఖలా లేదు. శాంతియుతంగా గాది మహాత్ముడు దేశానికి స్వాతంత్రం తెచ్చాడన్నది పచ్చి అబద్దం. ఒక భగత్ సింగ్, ఒక సుఖ దేవ్, ఒక ఆజాద్ చెంద్ర శేకర్, 1857 సిపాయిల తిరుగుబాటు నుండి చౌరా చౌరీ సంఘటనలు, జలియన్ వాళ బాఘ్ దురంతాల దాకా రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడిన తర్వాతనే ఆంగ్లేయులు భారత దేశాన్ని విడువలేక విడువలేక విడిచిపోయిన విషయాలను మనం చరిత్రలో చదువుకున్నాము. ఇక్కడ 4 కోట్ల తెలంగాణా ప్రజల విముక్తి పోరాటం జరుగుతున్నది. ఇంత కాలం మంది అవకాశాలను , మంది సొమ్మును తిన మరిగిన .శక్తులు అంత సులభంగా తెలంగాణను వదిలి పొవాడానికి అంగీకరించవు.
అందుకని ఇది చదువుతున్న విద్యార్తులార, మేధావులారా, ముందుగా మనమంతా తెలంగాణా వ్యతిరేక శక్తుల తో పోరాటానికి సిద్ధ పడుదాం. మన చైతన్యాన్ని మన చుట్టుపక్కల పంచుదాం, కుత్తుకలకు ఉరితాల్ల్లు బిగించుకోవడం కాదు శత్రువుల ఆర్ధిక మూలాలను కత్తరిద్దాం.
పెంటయ్య,వీరగిని.

Reply

Forward