Tuesday, December 16, 2014

The Gouds living in Agency area must be given S.T. Certificates!

రాజ్యాంగం రాసుకున్న నాటి కంటే ముందే నాగరిక సమాజాలు  అడవుల్లో గుట్ట చెట్టును నమ్ముకొని జీవిస్తున్న ప్రజలను దృష్టిలో పెట్టుకొని క్రీ|| శ || 1917 నాటి నుండే ఆ ప్రజల కొరకు షెడ్యూల్డ  ట్రైబ్ అనే మాటను ఉపయోగించి నట్లు మనకు ఆధారాలు ఉన్నాయి. షెడ్యూల్ ట్రైబ్ అంటే చాలా స్పస్టంగా ఒక్కొక్క కులం, వృత్తి ని పేర్కొవడం జరిగింది. అట్లా పేర్కొన్న వాటిలో కళ్ళు గీత వృత్తిగా జీవిస్తున్న గౌడ్ లను కూడా షెడ్యూల్ ట్రైబ్ గా పేర్కొనడం జరిగింది. డా|| భీమ్ రావ్ రాంజీ అంబేడ్కర్ అధ్యక్షులు గా ఏర్పడ్డ భారత రాజ్యాంగ కమిటీ  26 నవంబర్ 1949 న ఆడాప్ట్ చేయబడి 26 జనవరి 1950 లో అమలు లోకి వచ్చింది. 25 భాగాలు కలిగిన భారత రాజ్యాంగం లో మొత్తం 448 ఆర్టికల్లు ఉంటే అందులో 7 వ ఆర్టికల్ లో చాలా స్పస్టంగా . ఏజెన్సీ ఏరియాలో నివసిస్తున్న గౌడ్ లు షెడ్యూల్ ట్రైబ్ కు చెందుతారని చెప్పబడింది. 1956 విశాలాంధ్ర ఏర్పడ్డప్పుడు అదే 7 వ ఆర్టికల్ లో ఏజెన్సీ ఏరియా లో నివసిస్తున్న గౌడ్ లను షెడ్యూల్ ట్రైబ్ లని అన్నారు. నిన్నటికి నిన్న ఆంధ్ర ప్రదేశ్ పునర్విభజన బిల్లు. 2014  లో సైతం అక్షరం పొల్లుబోకుండా అదే 7 వ ఆర్టికల్ అలాగే చెప్పబడింది. కానీ సీమాంధ్ర పాలన లో అయితే ఎట్లాగైతే ఎస్టీ సర్టిఫికెట్లు ఇవ్వకుండా గౌడ బిడ్డలకు చదువుకొనే సౌకర్యం అందకుండా జెసి ఉద్యోగాలలో అవకాశం లేకుండా జేశారో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పరిస్తితిలో ఏమీ మార్పు కనిపించడం లేదు.వాస్తవానికి ఖమ్మం,వరంగల్, ఆదిలా బాద్ జిల్లాలల్లోని ఏజెన్సీ ఏరియా లల్లో నివశిస్తున్న గౌడ్ లందరికి ఎస్టీ సర్టిఫికట్ ఇవ్వాల్సి ఉంది. ఇక్కడ లేనిదేదో ఇవ్వాలని గౌడులు గొంతెమ్మ కోర్కెలను కోరడం లేదు. రాజ్యాంగం లో ఉన్న దాన్నే కొందరు అవగాహన లేని అధికారుల మూలంగా జరిగిన పొరబాటును సరిదిద్దాలని మాత్రమే గౌడులు డిమాండ్ జేస్తున్నారు. 

  అందుకు నాంది గా ఖమ్మం జిల్లాలో కొందరు చదువుకున్న యువకులు విద్యార్థులు ఏకమై ఉద్యమం ప్రారంభించారు. ములుకల పెళ్లి మండలం లో కార్తీక వనభోజనాలల్లో కార్య రూపం దాల్చి, 10 డిసెంబర్ నాటికి అశ్వరావ్ పేట లో ఉద్యమ రూపం తీసుకున్నది. ప్రసాద్, శ్రీనివాస్, వెంకటేశ్వర్ రావు ,లాంటి యువకులు గౌడుల ఇంటింటికి దిరిగి మోటివేట్ చేసినారు. ఖర్చులకు కూడా ప్రజలు డబ్బులు ఇస్తూ వేలాదిగా పిల్లలు, మహిళలు వృద్ధులు కదులుతున్న విధానం గమనించినపుడు వారు ఇంతవరదాక కోల్పోయినది ఏమిటో వారికి అర్థం అయినట్లు ఉంది.
    వీరి ఉద్యమానికి సంఘీభావం దెలుపడానికి సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు వీరగొని పెంటయ్య గౌడ్ , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింగం సత్తెయ్య గౌడ్ గారాలు అక్కడ ముల్కల పెళ్ళిలో మరియు అశ్వరావ్ పేట లో కూడా హాజరయ్యి వేలాదిగా తరలి వచ్చిన గౌడ బిడ్డలకు  బాసట గా నిలిచినారు. సర్వాయి పాపన్న ఫౌండేషన్ చేర్మన్ పంజాల జైహింద్ గౌడ్ సైతం రెండు సమావేశాలల్లో పాల్గొని ఉత్తేజకరమైన ఉపన్యాసాలతో వారిని ఉద్యమం వైపు సాగడానికి అవసరమైన విశ్వాసాన్ని కలిగించినారు. సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం సెక్రటరీ జెనరల్ గణగొని సత్యనారాయణ గౌడ్ ముల్కల పెళ్ళిలో పాల్గొని సర్వాయి పాపన్న వారసులమై పోరుజేయాలని సూచించినారు. ఖమ్మం లో 26 మండలాలు ఏజెన్సీ ఏరియా గా నిర్ధారించ బడినాయి. కనుక అక్కడ నివసిస్తున్న గౌడ్ లకు ఎస్టీ సర్టిఫికట్స్ ఎప్పటినుండో ఇవ్వాల్సి ఉండే.  అలా ఇవ్వకపోవడం వలన ఈ 65 సంవస్తరాల కాలం లో పది సంవస్త రాలకు ఒక తరం చొప్పున ఆరున్నర తరాలు తమ విద్య, ఉద్యోగ అవకాశాలను కోల్పోవడం వలన ఎంతటి ఆర్థిక, సామాజిక నస్టమ్ జరిగిందో అంచనాకు సైతం అందని విషయం.ఒక ఉదాహరణ చూద్దాం! భారత భూభాగం లో ఎవ్వరైన ఏ వృత్తి అయినా చేసుకొని జీవించ వచ్చు అన్న హక్కును రాజ్యాంగం భారత ప్రజలకు ధకలు పరిచింది. వ్యాపారాలు చేసుకొనే వారు చేసుకుంటున్నారు. కమ్మరి, కుమ్మరిమ్ వడ్రంగి, చాకలి,మంగలి నేత వృత్తుల వాళ్ళు నిర్ణిబంధంగా ఎవరి వృత్తులు వాళ్ళు చేసుకుంటున్నరు . కానీ విచిత్రంగా ఒక కల్లు గీసుకొనే  గౌడ వృత్తి మాత్రం  గౌడులు చేయ గూడదు అని ఒక రాజకీయ పార్టీ శాసన సబ్యుడు చట్టం చేయించి తెస్తాడు. కానీ ఇదే చట్ట సభల్లో గౌడ బిడ్డలై పుట్టిన అనేక మంది సభ్యులు ఉంటారు, కానీ తమ తోటి సహోదరులకు జరుగుతున్న అన్యాయాన్ని పట్టించుకోరు.ఇదీ మనలోని ఐక మత్యానికి ఒక మచ్చు తునుక. అలా చట్టం తేవడం వలన 26 మండలాలల్లోని వందలాది గీత కార్మిక సొసైటీలకు మనుగడ లేకుండా పోయింది. వీలాది మంది గీత కార్మికులు పొట్ట చేత బట్టుకొని రోడ్డున పడ్డారు. పడి లేచిన ఆ బిడ్డలే ఇక ఎవ్వరినీ నమ్మక తమ బతుకులు తామే బాగు జేసుకొనడానికి ఉద్యమ జెండా భుజాన బెట్టుకొని లాంగ్ మార్చ్ కు బయల్దేరినారు.

          తమకు జరిగిన జరుగుతున్న నస్టాన్ని నివారించడానికి ప్రస్తుత ప్రభుత్వామైనా వెంటనే స్పందించాలని ప్రజలతో బాటుగా సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం సైతం బలంగా డిమాండ్ జేస్తున్నది. ప్రభుత్వం తక్షణం స్పందించని పక్షం లో ముందుగా క్షమ్మం జిల్లా కేంద్రం లో 10 వేల మందితో ప్రదర్శన నిర్వహ్స్తామని, అప్పటికి ప్రభుత్వం స్పందించని యెడల రాష్ట్ర రాజధాని హైద్రాబాదు లో ఒక లక్ష మండి తో సెక్రటేరియట్ ను ముట్టడిస్తామని ప్రబుత్వాని హెచ్చరిస్తున్నాము అని అశ్వరావ్ పేట పురవీధుల గుండా జరిగిన ఊరేగింపులో ప్రజాల్తో బాటు సర్వాయి పాపన్న సంఘం సైతం నినాదాలు చేయడం జరిగింది.

వీరగొని పెంటయ్య.
అధ్యక్షులు 

సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం.

Wednesday, November 19, 2014

రాజ్యాధికారం ఎందుకోసం?

చాలా కాలం నుండి  అన్ని తరగతులకు చెందిన శ్రేణులు తమకు రాజ్యాధికారం కావాలని నినదిస్తున్నాయి..కొందరు దళిత బహుజనుల నినాదం తీసుకొంటే మరికొందరు బీసీ నినాదం తీసుకొంటున్నారు..ఇంకా మరికొందరు ప్రాంతీయ వాదం లేవనెత్తుతున్నారు.అసలు రాజ్యాధికారం అంటే ఏమిటి? ఒక ఎమ్మెల్లే సీటో , ఒక ముఖ్య మంత్రి పదవో వస్తే రాజ్యాధికారం వచ్చినట్లేనా? ఇంత వరదాకా దళితులు, బీసీలు ఎంత మంది ఎమ్మెల్లెలు కాలేదు, ఎంతమంది దళితులు ఎంత మంది బీసెలు ముఖ్య మంత్రులు కాలేదు? మరి వాళ్ళ వలన ఈ దళిత, బీసీ , ఎస్టీల సమస్యలు ఎందుకు పరిస్కారం కాలేక పోయినాయి? 
     
   అట్లా అడిగితే , ఇంత వరదాకా ఆయా పదవుల్లోకీ వచ్చిన వారు ఏదో ఒక రాజకీయ పార్టీ తరఫున గెలిచి వచ్చినారు, కనుక ఆ రాజకీయ పార్టీ సిద్దాంతం మేరకు పనిజేసినారే కానీ దళిత బహుజనుల కోసం పని చేయలేదు , చేద్దామన్నా ఆ పార్టీ వాళ్ళు ఒప్పుకోరు కనుక ఏమీ చేయలేక పోయినారు , కావున ఇప్పుడు మేము ఆ నినాదం తోటి వస్తున్నాము, కావున దళిత బీసీ ఓటర్లు మాకే ఓటు వేసి గెలిపించాలి అన్నది వారి వాదన. సరే వాళ్ళు అన్నట్లు గానే ఓటర్లు అట్లానే ఆలోచిస్తారని కాసేపటి కోసం అనుకుందాం. మరి వీళ్ళ పార్టీ ఏమిటి? వీళ్ళ మానిఫెస్టో ఏమిటి? ఇంత వరదాకా ఈ వాదం తో ఉన్న ఏకైక పార్టీ బీఎస్పీ. మరి దాని ఆచరణ యూపీ లో ఎట్లా విఫలమైందో చూసినాము.అవకాశం వచ్చినప్పుడు అగ్రకుల రాజకీయ నాయకుల కంటే ఏమీ తీసిపోని విధంగా పాలన చేసి మళ్ళీ అదే సిద్దాంతం పైన మాకు అధికారం కట్టబెట్టండి అంటే ప్రజలు నమ్మరు కదా?

     స్వంత సైన్యం లేకుండా రాజ్యాధికారం అనేది ఉండదు. స్వంత సైన్యం మన రాజ్యాంగం ప్రకారం కేంద్ర లో అధికారం లోకి వస్తే తప్ప సాధ్యం కాదు. సరే కేంద్రం లో కూడా అధికారం లోకి ఇట్లా వాదించే వాళ్ళు ఏదో ఒకనాడు వస్తారనే అనుకుందాం. అప్పుడు అమెరికా అనుమతి లేకుండా ఇక్కడి ప్రభుత్వాలు ఎవరి ఆస్తులు ఎవరికి పంచుతారు? పార్లమెంటు లో  ఇంత స్తంపింగ్ మెజారిటీ ఉండీ కూడా కనీసం విదేశీ బ్యాంకుల్లోని నల్ల ధనాన్ని తెప్పించడానికి మోడీ ప్రభుత్వం పడుతున్న ఆపసోపాలు చూస్తున్నాము. అలాంటిది ఒక రాష్ట్రం లోనో లేక కేంద్రం. లో  కూడా అధికారం లోకి వచ్చి ఇట్లా వాదిస్తున్న వాళ్ళు చేసేది ఎక్కువకు ఎక్కువ తమకు అత్యంత సన్నిహితులు అయిన వారికి కొన్ని ప్రయోజనాలను సమకూర్చి పెట్టగలరేమో గాని వాళ్ళు మాటల్లో చెబుతున్నట్లు గా సంపూర్ణ మైన మార్పు వాళ్ళు అనుకుంటున్న పద్దతుల్లో ఎట్లా సాధ్యమో ఈ వాదనజేసే వాళ్ళ మేధావి వర్గం జవాబు చెప్పాలి. వర్గ స్పృహ లేకుండా వర్గరహిత సమాజం గురించిన ఆలోచన లేకుండా ఎవరు అధికారం లోకి వచ్చినా వాళ్ళ వాళ్ళ ఆస్తులు మరి కొంచెం పెంచుకోవడానికి పనికి వస్తుంది గాని అశేష ప్రజానీకం ఆకాంక్షలు నెరవేర్చే విధంగా ఉండ జాలదు.

    వీరగొని పెంటయ్య.
  విశ్రాంత విద్యా పర్యవేక్షణాధికారి.
కరీంనగర్.

Monday, October 27, 2014

1969 తొలిదశ ఉద్యమం లో 369 మంది బిడ్డలు చనిపోతే , 1997 వరంగల్ డిక్లరేషన్ తో ఆకుల భూమయ్య కన్వీనర్ గా ఏర్పడ్డ తెలంగాణ జన సభ లోని  బెల్లి లలితా కనకా చారి ని అత్యంత క్రూరంగా చంద్రబాబు ప్రబుత్వమ్  చంపించిన తర్వాత వచ్చిన కాంగ్రెస్, తెలంగాణ ఇస్తున్నామని పార్ల మెంటు లో ప్రకటించిన వెంటనే  చంద్రబాబుతో బాటు సీమాంధ్ర లోని అన్నీ రాజకీయ నాయకులు అడ్డు దగిలి ఆపించిన తర్వాత అధైర్య పడ్డ వెయ్యి మంది బిడ్డలు బలవన్మరణం చెందితే సి డబ్ల్యూ సి నిర్ణయం జరిగింది. పార్లమెంటు లో ప్రత్యేక తెలంగాణ బిల్లు పాస్ కాక ముందే కిరణ్ కుమార్ రెడ్డి సర్కారు ఆకుల భూమయ్యను కూడా పొట్టన పెట్టుకుని ప్రజాస్వామిక తెలంగాణా భావనను అడ్డుకొనే ప్రయత్నం చేసింది. సరే ఇంత మంది బలిదానాల కారణంగా తెలంగాణ రాష్ట్రం సిద్దిస్తే సమైక్య రాష్ట్రం లో జరిగిన అన్యాయాలను సరిదిద్దే కార్యక్రమం లో భాగంగా కల్లు గీత కార్మికుల కు జరుగుతున్న న్యాయాన్యాలేమితో ఒక సారి చూద్దాం.
       2004 లో రాజశేకర్రెడ్డి ప్రభుత్వం రాగానే మల్టీ నేషనల్ కంపనీలు లిక్కర్ డాన్ లకు లబ్ది చేకూర్చి అందినకాడికి దండుకోవాలన్న కుట్ర మొదలైయింది . ఫలితంగా అల్తాఫ్బదలా  హైద్రాబాద్ లో .కల్లును  నిషేదించారు.టీఆర్ ఎస్ ప్రభుత్వం తన ఎన్నికల మనిఫెస్టో అమలు లో భాగంగా హైద్రా బాద్ లో కల్లు దుకాణాలను తిరిగి తెరిపించింది . మల్టీ నేషన్ కంపనీల తొత్తులైన సీమాంధ్ర పెట్టుబడి దార్లకు ఇది ఎంతమాత్రం మింగుడు పడలేదు. బస్ , లిక్కర్ మాఫియా లీలలు మళ్ళీ మొదలైనై . పట్టణాల్లో కల్లు కాంపౌండులు వద్దని మహిళా మణుల చేత ఉద్యమాలు తీయిస్తున్నారు. కల్లు కాంపౌండులు తెరిచినందున తమ మగవాళ్ళ ఆరోగ్యాలు చెడిపోతున్నాయని తామూ స్వేచ్చగా తీరుగ లేక పోతున్నామన్నది వారి ఆరోపణ. 

        వాస్తవానికి స్వచ్చమైన కల్లు ఆరోగ్యానికి ఎలాంటి హాని చేయదు. పైగా ఆరోగ్యానికి అవసరమైన మినరల్స్, విటామీన్స్ కల్లు లో పుష్కలంగా ఉంటాయి. భారత ఫుడ్ & న్యూట్రిషన్ గణాంకాల ప్రకారం ఒక కప్పు కల్లు లో శక్తి  114 క్యాలరీలు, పొటాషియం 15 mg.కాల్షియం 0.5%, ఫాస్ఫరస్ 0.1%, మెగ్నీషియం 0.6%, మాంగనీస్ 0.9%, ఐరన్ (ఇనుము ) 0.5% సోడియం 4.4gr,కాపర్ 1.1%, జింక్ 0.3%, సెలీనియం 0.2%, నియాసిన్ (బి 3విటమిన్) 0.1%, ఫంటోతెనిక్ ఆసిడ్ (బి3విటమిన్) 0.2%, థయమైన్(బి1విటమిన్)0.1%, రెబోఫ్లోవిన్ విటమిన్ బి2 0.5%, విటమిన్ బి6 0.3%, విటమిన్ సి 2.4%, ఫోలేట్ 0.2%, ఆల్కహాల్ 4 నుండి 6శాతం , కార్బోహైడ్రేట్స్ 21 gr,  ప్రోటీన్ 0.23 గ్రా||, షుగర్ 18 గ్రా|| డైటరీ ఫైబర్ 0.1 గ్రా||, ఆస్కార్బిక్ ఆసిడ్ 0.16 గ్రా||, సుక్రోజ్ 17.4 గ్రా||. చూడండి ఇవన్నీ మనం అవసరం మేరకు టాబ్లెట్ల రూపం లో టానిక్ రూపం లో మందుల షాప్ లో కొనుక్కొని వాడుతామ్. మందులకంటే  స్వచ్చమైన కళ్ళు వాడితే మంచిదే కదా?

    కళ్ళు దాదాపు 3500 యేండ్ల నుండే ప్రజల వాడుకలో ఉంది.పండుగలు, పబ్బాలు, విషాద,వినోద సమయాల్లో మానసికొల్లాసం కోసం, రిక్రియేషన్ కోసం మనుషులు వాడే ఒక ప్రకృతి సహజ సిద్దమైన , ఆరోగ్య పానీయం కల్లు .ఇటువంటి పానీయాన్ని లిక్కర్ డాన్ లు నియమించిన కూలి ఉద్యమ కారులు వద్దని వారిస్తున్నారు. ప్రతి సెకన్ కు ఒక ప్రాణం  తీస్తున్న మద్యం, గల్లీ గల్లీకి విస్తరించి ఒక్కొక్క సీసా రూ|| 100 నుండి 5000 దాకా అమ్ముడై తుంటే జేబులకు, తాగుబోతుల గుండెలకు చిల్లులు పొడువడం లేదా? అవి వద్దని ఈ మహిళా మనులు ఎందుకు ఉద్యమ్మలు చేయడం లేదని గీత కార్మికులు ప్రశ్నిస్తున్నారు, చరిత్రలో కల్లును మినహాయించి సంపూర్ణ మద్యపానం కోసం ఉద్యమాలు జరిగిన సంఘటనలు ఉన్నాయి. కానీ కల్లు వద్దు మద్యం ముద్దు అన్న ఉద్యమాలు చరిత్ర ఇంతవరకు చూడలేదు మరి .1980 ప్రాంతం లో ఆనాటి పీపుల్స్ వార్ పార్టీ తెలంగాణలో ప్ర, సా. దు , లను , బ్రాందీ బీరు దుకాణాలను మూయించింది. ఆ కొడుకులు సల్లగుండ అని గీత కార్మికులు దీవించిండ్రు.  ఆనాడు గ్రామాల నుండి తరిమి వేయబడ్డ దొరలు,భూస్వాములు పట్టణాలకు జేరి తొండ ముదిరి ఊసర వెల్లి  అయినట్లు బడా పెట్టుబడి దార్లు గా అభివృద్ధి చెంది లిక్కర్ డాన్ లు గా ఎదిగి  పేద  ప్రజల వృత్తుల్లోకి జొరబడి తమ తోడేలు కడుపులు నింపుకోవడానికి గొర్రెల గొంతులు కోరికే కుట్రలు జేస్తున్నరు .
      ఆఁ! కల్లులో కల్తీ జరుగకుండా ఉద్యమించండి ,  నిర్దిస్ట సమయం లోనే కల్లు కాంపౌండు లు తెరువాలని ఉద్యమించండి. ఇంకా మీకు మీ మీ కుటుంబాల ఆరోగ్యాల పట్ల ఆసక్తి ఉంటే పురుగు మందులు కలిపిన కూల్ డ్రింక్స్ నిషేదించాలని వాటి స్తానమ్ లో కల్లును శీతల పానీయంగా అభివృద్ది పర్చాలని ఉద్యమించండి. ఇంకా సమాజం పట్ల మీరు బాధ్యత గా ఫీల్ అయితే కల్లును మినహాయించి సంపూర్ణ మద్యపానం కోసం ఉద్యమిద్దామ్ రండి మీతో చేరడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. 

     మల్టీ నేషన్ కంపనీల ఉత్పత్తులు వాడితే లాభాలన్నీ విదేశాలకే గదా?కానీ కల్లు వినియోగం వలన స్టానిక కార్మికులకు ఉపాధి లభించి విదేశీ మారకం కూడా ఆదా అవుతుంది కదా? కనుక కల్లు వద్దని వాదించే వాల్లు ఎవరి ప్రయోజనం కోసం ఉద్యామిస్తున్నారో ఒక సారి ఆలోచించుకొమ్మని కోరుతున్నాం.
    స్టానిక వనరులను ఉపయోగించుకొని స్టానిక కస్టజీవులకు ఉపాధి చేకూర్చుకోగలిగిన విధానాలు అవలంభించి నపుడే స్వయం సంపూర్ణ ఆర్థిక వ్యవస్తను బలోపేతం జేసిన వాళ్ళం అవుతాము.కావున కల్లును మినహాయించి కూల్ డ్రింక్స్ తో బాటు సంపూర్ణ మద్యపానం నిషేదం కోసం ఉద్యమిద్దామ్ రండని ఆహ్వానిస్తున్నాం .
                                                           వీరగొని పెంటయ్య.
                                                  సర్వాయి పాపన్న  తెలంగాణ గీత కార్మిక సంగం .
                                                        9908116990.

Thursday, September 4, 2014

5 సెప్టెంబర్ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా!

ఉపాధ్యాయుడు ఎట్లా ఉండేవాడు,ఎట్లా ఉండాలని కోరుకొంటున్నారో అని ప్రసార మాధ్యమాలు

ఉపాధ్యాయ. దినోత్సవం నాడైనా సంవస్తరానికి ఒక రోజైన  సమాజానికి తెలియజెప్పడం ఒక మంచి పనే! 

 రాయ , చదువ నేర్పడం తో బాటుగా సామాజిక విలువలు తన విద్యార్థులకు నేర్పించడం ఉపాధ్యాయుని

 బాధ్యతగా ఉండేది కొంతకాలం. మరీ పూర్వకాలం లో అయితే విద్య యొక్క లక్ష్యం, కైవల్య ప్రాప్తి, జన్మ 

రాహిత్యం, మోక్ష సాధన గా ఉండేది. ఆనాడు గురువు లక్ష్యం కూడా అదే కనుక గురు, శిష్యుల మధ్య 

సంబంధం కూడా చాలా ఆనంద దాయకంగా ఒకరి అవసరం మరొకరిదిగా చాలా ఆదర్శ వంతంగా ఉండేది 

,ఆంగ్లేయుల ప్రవేశం తర్వాత విద్య లక్ష్యం విద్యార్థులను ఆంగ్ల మానస పుత్రులుగా తీర్చి దిద్ది పాలక వర్గాల 

సేవలో తరించి వాళ్ళ దోపిడి సొమ్ము లో నుండి కొంత జీత భత్యాలుగా పొందడం గా ఉండేది.

                      1947 తర్వాత కూడా అదే విధానం కొనసాగుతున్నప్పటికినీ పాలకులు మాత్రం 

మారినారు .అయినప్పటికినీ స్వాతంత్రోధ్యమ స్పూర్తి ఫలితంగా 1980 పీవీ నర్సింహా రావు నూతన విద్యా

 విధానందాకా చదువుకున్న వారికి చదువు చెప్పిన వారికి సమాజం లో ఎంతో కొంత గౌరవం ఉండేది. కానీ

 పీవీ పుణ్యాన పెట్టుబడి దారులకు విద్యారంగ లో ఉన్న లాభదాయకమైన మార్కెట్ అర్థం అయ్యి ప్రైవేటు 

రంగం లో విద్య ప్రారంభం అయ్యింది. పెట్టు బడి దారుల ఒత్తిడుల ప్రభావం వలన ప్రభుత్వ పాఠశాలల్లో 

నియామకాలు నిలిచి పోయి విషయ బోధకులు లేకుండా పోయినారు. ఫలితంగా ఆర్తికంగా వెసులు బాటు 

కలిగిన వాళ్ళు ప్రైవేట్ పాఠశాలల వైపు వెళ్ళడం జరిగింది.

          1991 లో దేశ పదవ ప్రధానిగా పీవీ అధికారం లోకి రాగానే మన్మోహన్ సింగ్ ఆర్టిక మంత్రి గా

 వీరిరువురు ప్రవేశ పెట్టిన ఆర్థిక విధానాల వలన సమాజం లో అంతవరదాక ఉన్న విలువల నిర్వచనమే 

మారిపోయింది. కరికులం లో ఉండే పౌరనీతి శాస్త్రం పోయి పర్సనాలిటీ డెవలప్మెంట్ , వ్యక్తిత్వ వికాసం 

వచ్చి చేరినాయి . పక్కవాడు పడిపోయినప్పుడు నీవు వానికి చేయి అందించావో నీ పరుగు పందెం లో నీవు  

.ఓడి పోతావు. .నీకు చేతనైనా కాకపోయినా , నీకు ఆ శక్తి ఉన్నా లేకపోయినా ఉన్నతమైన లక్షాన్నే 

ఎన్నుకో.నీవు ఎన్నుకున్న లక్షం వైపు నీవు సాగి పో పక్క వాన్ని ఎట్టి పరిస్తితి లో కూడా పట్టించుకోవద్దు 

అనే ఫిలాసఫీ వచ్చింది. అది ఎక్కడి దాకా వచ్చిందంటే కన్న తలిదండ్రులను కూడా పట్టించుకోని  పరిస్తితి.

సరే అది మన సబ్జెక్ట్ కాదనుకుందాం. ఈ భావజాలం జీర్ణించుకున్న సమాజం నుండి ఎదిగి వచ్చిన 

యువత అతడు ఉపాధ్యాయుడా, అతడు డాక్టరా, అతడు రాజకీయ  నాయకుడా ఎవరైతే ఏమిటి ఎట్లా 

అయితే ఏమిటి డబ్బు సంపాదించు వస్తువులు సమకూర్చుకో సౌఖ్యాలు అనుభవంచు. అదే నీతి.

మనుషులు, మానవ సంబంధాల కంటే వస్తువులే ఆనందాన్ని యివ్వగలవు అనే వస్తు వినిమయ 

సంస్కృతి పరిఢవిల్లిన సమాజం లో ఉపాధ్యాయులు కూడా శలభాలే అయినారు. ఆ మంట సృస్టించిన 

పాలక వర్గాలే ఉపాధ్యాయులు సరిగా పనిజేయడం లేదని ఊదర కొడుతూ మొత్తంగా విద్యా రంగాన్ని ప్రైవేట్ 

పరం జేసె కుట్ర జేస్తున్నారు .


          అయితే ఏమిటి? సార్లు సరిగా పనిజేయడం లేదు కనుక విద్య ప్రైవేట్ అవుతుంది మరి అనే వాళ్ళు 

రేపు పెట్టుబడి మోనోపలి అయిన తర్వాత పేదలకే కాదు మధ్య తరగతి వాళ్ళకు కూడా చదువు ''కొన ''

లేనంతటి పిరపు సరుకు అవుతుంది . కనుక ప్రజలంతా ప్రభుత్వాలను అడుగవల్సింది ప్రభుత్వ 

పాఠశాలలకు ఇచ్చే గ్రాంటు మాకే ఇవ్వుమని మరిన్ని ప్రైవేట్ విద్యా సంస్తలను పెట్టండి అని కాదు,

  అన్నిటికి అమెరికనే ఆదర్శం  అని వల్లిస్తున్న అమెరికా వలె కామన్ హుడ్ సిస్టమ్ 

ద్వారా అందరికీ ఒకే విధమైన కామన్ స్కూల్ విధానం  ద్వారా విద్యను అందించాలని ప్రజలు, ప్రబుత్వ 

ఉపాధ్యాయులు వారి సంఘాలు ఉద్యమించాల్సిన అవసరాన్ని గుర్తించాల్సి ఉంది. ఇకనైనా ఉపాధ్యాయులు 

కేవలం తమ హక్కుల కోసం మాత్రమే గాకుండా బాధ్యతలను గుర్తించాలి. ప్రభుత్వ పాఠశాలలు ఒకవైపు 

మూత బడుతుంటే ఉదయం తొమ్మిది గంటలకే మీరు బడి ఎట్లా పెడుతారు అని అడుగుతున్నారంటే 

ఇంకా ఉపాధ్యాయులు  వాస్తవ పరిస్తితులను ఎన్నడు అర్థం జేసుకుంటారని ప్రజలు అడుగుతున్నారు.

                   ఉపాధ్యాయులు వృత్తి  నైపుణ్యాలను మెరుగు పరుచుకోవాలి. ఏ వృత్తులను జుసినా 

మారుతున్న కాలానికి అనుగుణంగా అభివృద్ధి అయినవి మాత్రమే మనుగడ కొనసాగిస్తాయి. మారము 

అని మొండికి వేస్తే కాలగర్భం లో కలిసి పోక తప్పదు.

      ఏసు ప్రభువు భక్తులు ప్రార్తిస్తున్నట్టు '' ప్రభువా ! వారేమీ చేస్తున్నారో వారికి తెలియదు '' అన్నట్లుగా 

తలిదండ్రులు వారేమీ చేస్తున్నారో వారికి తెలియడం లేదు. ఒక ఆట లేని ,పాట లేని ,ఆహ్లాదం లేని వంచిన 

తల ఎత్తకుండా ఎంత ఎక్కువ సేపు కూర్చుండ బెడితే తమ బిడ్డడు అంత గొప్పవాడు అవుతాడనుకొంటు 

పిల్లల బాల్యాన్ని హరించి వేస్తున్నారు. వారిని సహజంగా వికసింపనివ్వకుండా అత్యుస్తాహమ్ తో 

 చిన్నప్పటి నుండే అలివి గాని కోచింగులతో , మొగ్గలను బలవంతంగా విప్పదీస్తున్నారు . అందుకే అవి 

సహజమైన తమ సువాసనలను కోల్పోయి ప్లాస్టిక్ పువ్వుల వలె కన్న తలిదండ్రుల తో బాటు గా 

తమ చుట్టూ ఉన్న సమాజపు తంద్లాటను స్పందనను  పట్టించుకోవడం లేదు, తమ తమ వ్యక్తిగత 

సుఖ సంతోషాలను దప్ప . తలిదండ్రులు , ఊపాధ్యాయులు పాలకులు ఇప్పటికైనా స్పందించక పోతే 

భావి సామాజానికి భవిష్యత్తు ఉండదు.



                                                              వీరగొని పెంటయ్య,

                                                    విశ్రాంత విద్యా పర్యవేక్షణాధికారి 

                                                      9908116990

Wednesday, August 27, 2014

                                                                  చెట్టు !

                                                  నల్లటి దృఢమైన మొదలుతో 

                                                  తలలో సతత హరిత పత్రాల గుచ్ఛం 

                                                  అది తలెత్తి ఆకాశం వైపు చూస్తూ ఆలోచిస్తున్నది !

                                                          
                                                          వాడు పొద్దున్నే తన ఛాతీ పైనుండి ఎగబాకీ 

                                                          తలలోని గెలల తడిమి తడిమీ తరిగి తరిగీ 

                                                          కారిన రసాన్ని లోట్టి నిండా పట్టి తెస్తడు.
.
                                                         
                                                          రసమేనా అది ?

                                                          నల్లని దేహం నుండి కారిన తెల్లని రక్తమా ?

                                                          బొట్టు బొట్టు స్రవించి లోట్టి నిండా నిండి నట్టు 

                                                          చుక్క చుక్కా స్వేదం ఎవని బొక్కసాన్ని నింపుతోంది?


                                            చెట్టుకు తెలుసు, 

                                            ప్రతి దినం ఉదయం వాడు 

                                            తన ఛాతీ మీదుగా ఎందుకెక్కుతాడో .?

                                            ఇంకా ఇది కూడా తెలుసు ,

                                            మేర కత్తి తో సన్నటి కోతలు కోసీ కోసీ 

                                            తన దేహం లోని రసాన్నెందుకు పిండుతున్నాడో?


                                                           రోజూ ఉదయం వాడు దించేది 

                                                           చెట్టు శ్రోణితమే గాదు 

                                                           లోట్టి నిండుగా కోపాన్ని గూడా !


                                           వాని కత్తి వేటుకు నేల రాలిన 

                                           ఆకులను  ఆకలైన చేతులు ఏరుకొని ,
                                              
                                           అల్లుతున్నయ్ ఆయుధాలకు ఒరలను .


                                                             వాడు పిండి తెస్తున్నది మొగిలో ఊరిన రసమే గాదు 

                                                             తన రక్త మాంసాల్లోని జవసత్వాల తో బాటు 

                                                             తన నిండు జీవితం లో కరిగి పోయిన కాలాన్ని గూడా!

                                          
                                           చెట్టుకు తెలుసు !

                                           మందందరి కోసం మధువు దించి పోస్తూనే 

                                           తన కోసం వాడు చుక్క చుక్క కోపాన్ని తాగుతూ 

                                           నిండిన బుంగా నురగలు గక్కినట్టు 

                                           వనరుల ధ్వంసకుల పైకురికే పోరైతడని .

                        
                                                                 ప్రతి రోజూ చెట్టు వాణ్ని గురించి ఆలోచిస్తూనే ఉంది !

                                                                 వాడు వీపు కాయలు గాసి మాసి పోయిన

                                                                మనిషి మాత్రమేగాదు, నల్లటి తాటిమాను మాత్రమేగాదు 

                                                                 మండువాల్లోని  మనుషులను  దండు గట్టించిన 

                                                                 సర్వాయి పాపని  తమ్ములైన

                                                                 ఖైరి గంగారాం బుర్ర చిన్ను వారసుడా ? అని !




                                                                          వీరగోని  పెంటయ్య ,

                                                                             9908116990 

Saturday, August 16, 2014

సర్వాయి పాపన్న తాత్వికత !

      క్రీ|| శ || 1649 లో ఇంగ్లండు లో మొదటి చార్లెస్  ను ఆలివర్ క్రమ్ వెల్ ఉరి దీసి ఇంగ్లీశ్ నిరంకుశ రాచరి-

కత్వానికి సమాధి కట్టడం జరిగింది. రాచరిక , భూస్వామ్య విధానాలతో వారికి  కొమ్ముకాసిన మతకర్తల తో 

విసిగి పోయిన ఫ్రాన్స్ ప్రజల మనో భావాలకు పదును పెట్టడానికి ఆ సమాజం నుండి మతం అజ్ఞానానికి 

మోసానికి మూలం అంటూ వాల్టెయర్ ముందుకు వస్తే రూసో మరో అడుగు ముందుకు వేసి " మానవులు 

అందరు పుట్టుకతో సామానులు,కానీ ఈ సమాజం వ్యక్తిగత ఆస్తి హక్కు నొకదాన్ని తెచ్చి అసమానతలు 

సృస్టించడం వల్లే , యజమాని-- దాసుడు, జ్ఞాని --అజ్ఞాని, పేద -- ధనిక వర్గాలుగా విభజింప బడ్డారు అన్నాడు 

ఇక్కడ భారత దేశం లో ఆనాటికి బ్రాహ్మణీయ సాంప్రదాయ తర తరాల ఛాందస వాద నలను పూర్వ పరమ్ 

జేస్తూ కబీర్, గురునానక్, తుకారాం,సామ్ దేవ్, సంత్ రోహి దాస్, లాంటి వారి సాంఘిక మత తిరుగు బాట్ల కు 

కోన సాగింపుగా సర్వాయి పాపన్న తెలంగాణ లో తెరమీదికి వచ్చినాడు.

     ఆనాటికి సామాన్యులకు ప్రతీక  అయిన  వీర శైవాన్ని పాపన్న కుటుంబం ఆశ్రయించినట్లు తెలుస్తోంది.

కులీనుల వలెనే తాము మత ఆచారాలు ఆచరిస్తున్నప్పటికినీ  అగ్ర కులాలకు లభిస్తున్న ఆదరణ తమకు 

దొరుకని తీరు గమనించిన పాపన్న మతం పైన తిరుగు బాటు చేసిండు. ఆనాటికి దక్కను లో ఒక వెలుగు 

వెలుగుతున్న మరాఠా సర్ధార్ శివాజీ, బీజా పూర్ మరియు గోలకొండ నవాబు తానీషా కలిసి మొఘలుల 

అధికారాన్ని ధిక్కరించే ప్రయత్నం లో ఉన్నారని గ్రహించిన ఔరంగా జీబ్ వారికంటే తానే ముందుగా 

గోల్కొండ పైన దండయాత్ర జెసి అక్కన్న, మాదన్నలను చంపివేసి తానేశాను ఖైదు లో వేశాడు.గోల్కొండ 

మిగతా నాలుగు సంస్తానాలు గుల్బర్గా, బీదర్, అహ్మద్ నగర్ బేరార్ లతో నిత్యం గర్శన జరుగుతున్న 

కారణంగా సైనిక పదాతి దళాలు నిరంతరం గ్రామాల మీదుగా ప్రయాణం చేస్తుండడం వలన కల్లు 

మండువాల్లో కల్లు అమ్ముకునే  పాపన్న లాంటి విచక్షణా పరులకు ఆధిపత్యం కోసం జరుగున్న పోరాటాలు

అర్థం కాసాగినాయి. 

యుద్ధ అవసరాల కోసం ప్రజల పైన వేస్తున్న పన్నులు , అవి కట్ట లేక. తీవ్ర అసంతృప్తి తో ఉన్న ప్రజలు 

 అవకాశం ఉంటే తిరుగు బాటుకు సిద్ధంగా ఉన్నట్లుగా పాపన్న గమనించి నట్లు తెలుస్తోంది.

.      తండ్రి లేని పాపన్నకు పితృస్వామిక ఆధిపత్యం లేనందున కొంత స్వతంత్ర భావనలతో పెరిగి ఉంటాడు.

అందుకే సైనిక పదాతి దళాలు తన గ్రామం గుండా పోతున్నప్పుడు వారు కల్లు పోయుమని ఇబ్బంది 

పెట్టడం , పోయకుంటే కొట్టడం, ప్రజల వద్ద ఉన్న కోళ్ళు గొర్రెలను బలవంతంగా లాక్కు వెళ్ళడం చూసిన 

పాపన్న వాళ్ళ దౌర్జన్యానికి చరమ గీతం పాడాలనుకున్నాడు. వారి రాజకీయాధికారాన్ని ఓడించాలను 

కున్నాడు . రాజ్యాధికారం సాధించాలంటే సంత సైన్యం అవసరాన్ని గుర్తించాడు. దానికి అవసరమైన 

సొమ్ము ను తన ఇంటి నుండే సమకూరిస్తే విశ్వస నీయత పెరుగుతుంది అనుకున్నాడు. అందుకే తన తల్లి 

తన భవిష్యత్ కోసం దాచి పెట్టిన సొమ్ము తోనే తన మొదటి ఆయుధాన్ని సమకూర్చుకున్నాడు. ఆయన 

నిజాయితీ, పేదలను ప్రేమించే గుణం, ఆధి పత్యాన్ని, అణిచి వేతను సహించ లేని లక్షణం పాపన్నను 

మొఘల్ సామ్రాజ్యాధి పత్యానికి వ్యతిరేకంగా సాయుధ తిరుగు బాటుకు ప్రోత్సహించింది. షాపురం ,

(పాపన్న ఖిలా కట్టిన తర్వాత ఖిలాషపురం అయింది.) తాడికొండ, సర్వాయి పేట,ధూల్ మిట్ట లో పాపన్న 

కట్టిన కోటలు చూస్తే తన పరిమితమైన ఆర్థిక వనరులతో అంతటి కోటలు ఎట్లా కట్టగలిగినాడో ఆశ్చర్యం

వేస్తుంది. పాపన్న కోటలో లేనప్పుడు తాటికొండ ఫోర్ట్ పైన దిలావర్ ఖాన్ దాడి జెసి పాపన్న ఖజానా లెక్కల

పుస్తకాన్ని స్వాధీన పర్చుకొని  నాలుగు రోజుల పాటు చూస్తే గాని అవి ఒడువ లేదట. అంటే తనకు ఎంత 

ఆర్థిక నిబద్ధత ఉందో అర్థం జేసుకోవచ్చు .అలాగే బంది పోటు, దారిదోపిడి గాడని దోపిడీ వర్గాల 

ప్రతినిధులు కొందరు బహదూర్ షా తో మొర బెట్టుకుంటే 20 వేల సైన్యాన్ని ఇచ్చి యూసుఫ్ ఖాన్ ను 

పాపన్నను చంపి రమ్మని పంపిస్తే , పాపన్న తాను అతని తో తలపడకుండానే తన సైన్యాధి కరిని పంపి 

మార్గ మధ్యం లోనే యూసుఫ్ ఖాన్ ను మట్టు బెట్ట గలిగాడంటే పాపన్న యెంతటి యుద్ధ కుశలుడో 

అర్థం జేసుకోవచ్చు. 

          పాపన్న సర్వాయి పేట లో ఎత్తయిన గుట్టల పైన నిర్మించిన తన కోట పైకి వెళ్ళే టప్పుడు, కోట

 నుండి బయటకు వెళ్ళేటప్పుడు  ఆయన తన ఆరాధ్య దైవం బయ్యన్న కు  మొక్కి వెళ్ళేవాడట . 

ఎవరీ బయ్యన్న? ఒక దిగంబర మూర్తి. కుడి వైపు నాలుగు చేతులు ఎడమ వైపు నాలాగు చేతులు 

ఉన్నాయి . ఢమరుకం, యమపాశం, గద, కమలం, కుడి వైపు చేతుల్లో ఉంటే ఎడమ వైపు చేతుల్లో 

శూలం, విల్లు , సర్పం, నరుకబడిన శత్రువు తల ఉన్నాయి. కుక్క &, బుద్ధుడు పద్మాసనం లో ఉన్నాడు. 

ప్రకృతిని ఆరాధించే వాడని, మజీద్, మందిర మతాలను త్రోసిరాజని బౌద్ధం ఆచరించే వాడని అర్థం .

అవుతున్నది. దిగంబరత్వం నిరాడంబరతను తెలుపుతుంటే తన వర్గ శత్రు నిర్మూలతలో ఆయుధాల 

ఉపయోగం తెలిపే విధంగా ఉందా విగ్రహం. ప్రపంచం లోనే అంత పెద్ధ భైరవ మూర్తి మరెక్కడా లేదు అని 

తెలుస్తోంది. ప్రస్తుతం శష్ట్రీయంగా ఎంతో అభివృద్ధి చెందిన సామాజిక శాస్త్రం  మార్క్సిస్ట్ తత్వశాష్ట్రాన్ని  క్రీ||పూ||

535--475 లో హెరాక్లిటస్, 460--370 లో డెమోక్రట్స , క్రీ || పూ|| 4వ శతాబ్ధం లో సోక్రటీస్ , అతని 

శిష్యులు ప్లేటో ప్రశిష్యుడు అరిస్టాటిల్, ఆ తర్వాత పాపన్న కాలపు బర్కెలే దాకా ఎందరో తత్వ వేత్తలు  

పరిపుస్టమ్ జేస్తే పాపన్న ఆచరణ కూడా ఈ వాదానికి తన కంట్రీబూషన్ అందించినాడని చెప్పడానికి 

ఇంకా శాష్ట్రీయమైన చరిత్ర పరిశోధన  పాపన్న కంటెక్స్ లో జరుగాల్సి ఉంది.

Thursday, August 14, 2014

సర్వాయి పాపన్న జయంతిని దళిత బహుజనులందరు  పండుగలా జరుపుకోవాల్సిన అవసరం

 ఏమిటి? అన్న విషయాన్ని ఇప్పటికైనా మనం లోతుగా ఆలోచించాలి.

.   1650 ఆగస్ట్ 18 న పాపన్న పుట్టిన నాటికి మనకు ఇంకా ఒక జ్యోతి బా ఫూలే గానీ ఒక బాబా సాహెబ్ 

అంబేడ్కర్ .గానీ జన్మించ లేదు. అలాగే ఫూలే వలె గానీ అంబేడ్కర్ వలె గానీ చదువుకున్న వాడు గాదు. 

కానీ ఆనాడు  బడుగు బలహీన వర్గాల హక్కుల ను అనగదొక్కు తున్న వైదిక, మహ్మదీయ మతాలను 

త్రోసి రాజని దళితులను  ఎల్లమ్మ, పోచమ్మ గుడుల్లో పూజార్లు గా నియమించినట్లు పాపన్న  చరిత్ర లో

  ఉంది. నేడు 21 వ శతాబ్ధం లో జరుగుతున్న వర్గ పోరును పాపన్న 17 వ శతాబ్ధం లోనే చేసి చూపించిన

 వైతాళికుడు. ఆనాటికి మార్క్సిసమ్. గానీ మావో ఇజామ్ గానీ లేని ఒక ఫ్యూడల్ వ్యవస్త రాజ్యమేలు 

తున్న  

కాలం. దళిత బహుజనులకు ఆస్తి కలిగి ఉండే హక్కు గానీ, ఆయుధాలు ధరించి యుద్ధ  యోధులు గా 

జీవితాలు గడిపేపరిస్తితి గాని లేని కాలం లో ,సర్వాయి పాపన్న హాసన్, హుసేన్,తుర్క ఇమామ్, దూదేకుల పీర్,

 కోత్వాల్ మీర్ సాహెబ్ , అనే అయిదుగురు ముస్లిములను, హనుమంతు, చాకలి సర్వన్న, మంగలి 

మానన్న,కుమ్మరి గోవిందు, మేదరి ఎంకన్న యెరుకల సిట్టేలు జక్కుల పెరుమాళ్ళు యేనాది పాసేల్ , 

లాంటి 20,000 మంది దళిత బహు జనులతో దండు కట్ట గలిగినాడు.అదీ కేవలం వరంగల్ , కరీంనగర్, 

నల్గొండ, మరియు మేదక్ జిల్లాల నుండే,  ప్రబుత్వ మాటల్లోనే వామ పక్ష తీవ్రవాద ఉద్యమాల సైన్యం అన్నీ

 రాష్ట్రాలల్లో కలిసి30 సంవస్తారాల తర్వాత  40 వేలు ఉన్నదట. అంటే ఆనాటి ప్రజల దయనీయమైన జీవన 

స్తితిగతులతో బాటుగా పాపన్న నాయకత్వ లక్షణాలను గూడా మనం పరిగణించాలి .

            ఆయన టిప్పు సుల్తాన్ వలెనో  , ఝాన్సీ లక్ష్మి బాయి వలేనో , లేదా తొలి స్వాతంత్ర ఉద్యమం లో 

పోరాడిన రాజుల , చక్రవర్తుల  వలె నో  తన రాజ్యం దక్కించు కోవడానికి పోరాడిన వాడు కాదు . ఆయనకు

 రాజ్యమే లేదు. కేవలం బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం, సంపదలో  వారికి దక్క వల్సిన వాటా 

కోసం తన ప్రాణాలను ఫణంగా పెట్టినాడు. కానీ చరిత్ర లో ఆయనకు దక్క వల్సిన చోటు దక్క లేదు. తమ 

తమ మూలాలను పెకిలించి వేస్తున్నాడని కసి తో రగలి పోయిన వైదిక,మహ్మదీయ మతాల సైనికాధి కార్లు 

చరిత్ర కారులు పాపన్న ఆనవాళ్లను చెరిపెసే ప్రయత్నం చేసినారు. ఆయన బ్రెస్ట్ సైజ్ ఫోటో అయిన లండన్ 

లో ఉన్నది కనుక ఆ మాత్రమైన ఆ చిత్రం మిగిలింది . 1710 లో ఆయన మరణించి నట్లు చెబుతున్నారు .

ఆయన మరణించిన తర్వాత దాదాపు 165 సంవస్తారాలకు 1874  లో J A బోయేల్ కర్ణాటక రాష్ట్రం లోని 

బళ్ళారి లో ఒక జాన పద గాయకుని నోట విన్న పాటను ఆయన ఆంగ్లం లో రాసుకున్నాడు. దాన్ని 1909 

లో రికార్డు లోకి ఎక్కించాడు.తిరిగి 1974 లో జెన్ రొగేర్ గుంటూరు లో విన్న పాట ను రికార్డ్ చేశారట. 

ఆయన పుట్టింది వరంగల్ జిల్లా ఘనపురం మండలం ఖిలాషపురం. ఆయన నడయాడిన నేల నేటి 

తెలంగాణ పోరు గడ్డ. అన్ని సంవస్తారాల తర్వాత ఒక పరాయి దేశస్తుడు పరాయి ప్రాంతం లో ఏదో విని ఏదో 

రాస్తే దాన్ని మనం పాపన్న చరిత్ర గా ఎలా స్వీకరిస్తాం? 

   ఇవ్వాళ మన తెలంగాణ రాష్ట్రం సిద్దించిన తర్వాత పాపన్న చరిత్రను పాఠ్య పుస్తకం లో చేర్చాలన్న

డిమాండ్ చాలా  బలంగా వస్తున్నది . అవును తప్పకుండా చేర్చవల్సిందే. యూరప్ లోని ఆలివర్ క్రామ్ వెల్  
.వలె మన పాపన్న భారతీయ తొలి తెలుగు ప్రజాస్వామిక విప్లవ వీరుడు. ఆయన చరిత్రను శాస్త్రీయంగా 

పరిశోధించి తవ్వి తీసి భావి తరాలకు అందించ వల్సిన బాధ్యత మన తెలంగాణ ప్రభుత్వం స్వీకరించాలి.

       కల్లు గీసుకొని, పసుల గాసు కొని బతికిన పాపన్న కు అత్యంత బల శాలి అయిన మొఘల్ 

సామ్రాజ్యాన్నే ఎదిరించాలన్న ధైర్యం ఎట్లా వచ్చింది? ఆనాడు తెలంగాణ మాత్రమే గాకుండా మొత్తం దక్కన్ 

ప్రాంతపు ఆర్థిక సామాజిక పరిస్తితి పాపన్నను పోరు బాట వైపు ఎలా పురి కొల్పింది? తెలంగాణ లోఆనాటికి 

భూమి తో బాటు ఆర్థిక వనరులన్నింటి పైనా పెత్తనం మరియు ఆయుధాలు తిప్ప గలిగిన అధికారం గల 

 వెలమ, రెడ్డి కులాల పెత్తందార్లు పాపన్న జయించిన కోట ను విదేశీయు లైనప్పటికినీ తమ మతం గానీ 

ముస్లిం  రాజు లకే మళ్ళీ ఎందుకు అప్పగించాలను కొన్నారు ? ఆనాడు తాము వలచిన స్త్రీలను 

బలవంతంతంగా అయినా పెళ్లి జేసుకొనే అవకాశం ఉన్నప్పటికినీ పాపన్న తాను కోరుకున్న స్త్రీని తనకిచ్చి 

పెళ్లి జేయిమని అడిగినాడే గానీ బలవంత పెట్టని సంస్కారం కలిగిన పాపన్నను స్త్రీల పైనా అఘాయిత్యాలు 

చేసినాడని చేసిన దుష్ప్రచారం వెనుక ఏ వర్గ ప్రయోజనాలు దాగున్నాయో, అవి ఇప్పటికీ ఎలా ఆచరణలో

 పెడుతున్నారో, ఆనాటి ఖాజీ ఇనాయత్ షా నుండి నేటి కర్ర పెత్తనం  చేస్తున్న అధికార వర్గాల దాకా ప్రజా 

ఉద్యమాలను బలహీన పర్చడానికి ఎలా బరిదేగిస్తున్నారో పరిశీలించాల్సి ఉంది.

     ఆనాడు పాపన్న జేసిన పోరాటం యొక్క కొనసాగింపే  ప్రస్తుతం జరుగుతున్న ప్రజా ఉద్యమాలు 

అన్న అవగాహనతో పరిశోధన జేస్తే వర్తమాన ఉద్యమాలకు ఎంతో మేలు జరగడం తో బాటుగా తన రక్తం తో 

తెలంగాణ గడ్డను ఎరుపెక్కించిన పాపన్నకు ఇప్పిటికైనా ఘనమైన నివాళి అర్పించిన వాళ్ళం అవుతాము. 

                                                                                                                 వీరగొని పెంటయ్య 

                                                                                          విశ్రాంత విద్యా పర్యవేక్షణ అధికారి .  

Saturday, May 3, 2014

http://www.speedtest.net/my-result/3479210166

Tuesday, March 25, 2014

మానేటి జలాశయమా !

మానేటి   జలాశయమా
మది జిలికిన  ఆశయమా !

                           సీమాంధ్ర  పాలకూలే
                           శ్రీమంత మంత   దోచి

                           తెలగాణ  ముంచిరాని
                           ప్రజలంత ఏకమయ్యీ

                           ప్రాణాలు    ఒడ్డి  పోరి
                           సీమాంధ్ర   పెత్తనాన్ని
                           ఓడించి   గెలిచినారు   .

తెచ్చింది  మేమే నంటే
ఇచ్చింది   మేమే నంటూ

పోటీలు బడుతు వచ్చి
ఉదరా గొట్టుతుండ్రు

మాకంటే మాకే ఓటని
పడి పడీ మొక్కుతుండ్రు !

                             గిరిజనుల ఉసురు దీసే
                             పోలవరం ఆపకుండా

                            పొలాలు , సంపదంతా
                            పజల పరమ్ జెయ్యకుండా

                            పదవులు ఎక్కిణాంక
                            పంపకాలకు పన్నాగం

                            పారేటి     నీళ్ళ  తోటి
                            వీచేటి   గాలి కలిపి

                            భూమిలో ఉన్న ఖనిజం
                            పైనున్న చెట్టు గుట్ట

                            గుండు గుత్త  అమ్మేటొల్లు
                            వీర్ని  నమ్ము డెట్ల  వారి  !

Thursday, March 20, 2014

సామాజిక న్యాయం సాధ్యమేనా ?

ప్రస్తుతం సామాజిక తెలంగాణా పేరిట ఒక పెద్ద చర్చ జరుగుతోంది . ఒక ఓట్ల రాజకీయ పార్టీ బీసీ లకు ముఖ్య మంత్రి పదవి ఇస్తామమంటే , మరో రాజకీయ పార్టీ దళితులకు ముఖ్య మంత్రి పదవి ఇస్తామని ఆయా సామాజిక వర్గాల ఓట్లు దక్కించు కోవడానికి పడరాని పాట్లు పడుతున్నాయి . నిజంగానే ఆయా రాజకీయ పార్టీలు చెబుతున్నట్లుగా ఆ సామాజిక వర్గాలకు ముఖ్య మంత్రి పదవి లభిస్గే లభిస్తే పేదల సమస్యలు పరిష్కరించ బడుతాయా ? ఒకసారి ఆలోచిద్దాం . 

 క్రీ . పూ . 3 వ శతాబ్దం .లో అలేగ్జాండార్ దండయాత్ర తర్వాత విదేశీ దండయాత్రలను సమర్థవంతంగా ఎదురుకొని దేశాన్ని రక్షించు కోవాలంటే ఆనాటికి ఉన్న చిన్న చిన్న రాజ్యాల తో సాధ్య పడదన్న ఉద్దేశం తో చాణుక్యుడు ముర అనే దాసీ కుమారుడైన చంద్ర గుప్తున్ని చక్ర వర్తిని జేసి ముర పేరుతొ మౌర్య సామ్రాజ్యాన్ని స్తాపించి దాదాపు 150 సంవస్తరాలు దాసీ పుత్రులు రాజ్య పాలన చేసినట్లు చరిత్రలో చదువుకున్నాము . అలాగే క్రీ . శ . ఒకటవ శతాబ్దం శాలి వాహనులు రాజ్యాధి కారం లోకి వచ్చి వాళ్ళు కూడా 120 సం . పై బడే పరిపాలించి నారు . 8 వ శతాబ్దం లో ఎర్రగొల్లలు అయిన రాష్ట్ర కూటులు  115  సం . రాజ్య పాలన చేసినారు . 11వ శతాబ్దం లో కురుమ కులాంకి చెందిన కాకతీయులు 250 సం . రాజ్య పాలన చేసినారు . గుర్జరులు లంబాడ వాళ్ళు  రాజ్య పాలన చేసినారు .గోండ్వాన ప్రాంతాన్ని గోండు రాజులే పాలించి నారు . ఇదంతా రాజరిక పాలన లో జరిగింది . కనుక రాజ ధర్మం మేరకు దాస దాసీలను ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచారని అనుకుందాం . 

1947తర్వాత దేశానికి స్వతంత్రం వచ్చి 1950 లో మనకంటూ ఒక రాజ్యాంగం వచ్చిన తర్వాత పరిస్తిత చూద్దాం . కర్పూరి ఠాకూర్ సింగ్ ,కళ్యాణ్ సింగ్ ,ఉమా భారతి, కరుణానిధి , లాలూ ప్రసాద్ యాదవ్ , ములాయం సింగ్ యాదవ్ ఆయన కొడుకు అఖిలేష్           యాదవ్ , ఆంద్ర ప్రదేశ్ కు ఆనాడు టంగు టూరి అంజయ్య , వీళ్ళంతా బి . సి  వర్గాలకు చెందిన ముఖ్య మంత్రులే . అట్లాగే అజిత్ జోగి , బాబు లాల్ మరాండి , అర్జున్ ముండా , శిబూ సోరెన్ , మధూ కోడా వీళ్ళంతా ఎస్టీ వర్గాలకు చెందిన ముఖ్య మంత్రులు . నిన్నటికి నిన్న ఎస్సీ వర్గానికి చెందిన మాయా వతి కూడా పది సంవస్తరాలు ఉత్తర ప్రదేశ్ లాంటి అతి పెద్ద రాష్ట్రానికి ముఖ్య మంత్రి గా పనిజేశారు . వందల సంవస్తరాలు బీసీ లు రాజ్యాలు ఏలినారు .ప్రస్తుత ప్రజాస్వామ్య వ్యవస్తలో కూడా బీసీ , ఎస్టీ , ఎస్సీ వర్గాలకు చెందిన వారు చాలా మందే ముఖ్య మంత్రులు గా చాలా సంవస్తారాలే పరిపాలించి నారు . అయిన కూడా ఆయా వర్గాల ఆర్ధిక సామాజిక పరిస్తితులల్లో పెద్దగా మార్పులు ఏమీ రాలేదు . మరి ఎందుకు మార్పు రాలేదో మనం ఆలోచించాలి . 

ఫ్యూడల్ వ్యవస్థ లో పాలించిన వారు ఎవరైనా పూజారి వర్గాల ప్రతినిధి గానే వ్యావహ రించాలి గాని పేదల పక్షాన లేదా కర్షకుల , దాసీ దాస జన పక్షాన ఆలోచించ డానికి వాళ్లకు అవకాశం లేదు . అట్లాగే ఈ సోకాల్డ్ ప్రజాస్వామ్య వ్యవస్థ లో బడా బడా పెట్టు బడి దారుల ప్రయోజనాలు రక్షించే కొరకే ఎవరికైనా అధికారం ఇవ్వబడుతున్నది తప్పితే పేదల బాగు కోసం కాదు అని మనం గుర్తించాల్సి ఉంటుంది . మొన్నటికి మొన్న మీ ఇష్టం వచ్చి నట్లు పెట్రోల్ ధరలు పెంచనివ్వను అంటే జయ పాల్ రెడ్డి గారి మంత్రి పదవి మారి పోయింది . రిలయన్స్ అధినేత ఢిల్లీ లో విద్యుత్ చార్జీలు ఉత్పత్తి ధర తో పొంతన లేకుండా ఎట్లా పెంచుతాడన్నా నేరానికి అరవింద కేజ్రీ వాల్ తన ముఖ్య మంత్రి సీటునే వదులు కోవాల్సి వచ్చింది . అంటే ఒక ఎమ్మెల్లె సీటో ఒక మంత్రి పదవో ఒక ముఖ్య మంత్రి సీటో పొంది సంతృప్తి చెందడం కాదు లూసర్స్ బాధ్యత . 

ఇంత వరదాక వ్యవస్తలో తాము కోల్పోయిన దానికి న్యాయమైన వాటా లభించే కొరకు జరుగుతున్న మౌలికమైన పోరాటాలల్లో భౌతికంగా , బౌద్ధికంగా పాల్గొన కుండా అంది వస్తున్న అధికారం కోసం అర్రులు చాస్తే అయితే వ్యక్రులు గా వాళ్ళు లాభ పడుతూ సంపన్న వర్గాల సేవలో తరిస్తారేమో  గాని వ్యవస్తకు జరిగే ఉపకారం ఏమీ ఉండదు 

పెంటయ్య వీరగొని