Thursday, September 4, 2014

5 సెప్టెంబర్ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా!

ఉపాధ్యాయుడు ఎట్లా ఉండేవాడు,ఎట్లా ఉండాలని కోరుకొంటున్నారో అని ప్రసార మాధ్యమాలు

ఉపాధ్యాయ. దినోత్సవం నాడైనా సంవస్తరానికి ఒక రోజైన  సమాజానికి తెలియజెప్పడం ఒక మంచి పనే! 

 రాయ , చదువ నేర్పడం తో బాటుగా సామాజిక విలువలు తన విద్యార్థులకు నేర్పించడం ఉపాధ్యాయుని

 బాధ్యతగా ఉండేది కొంతకాలం. మరీ పూర్వకాలం లో అయితే విద్య యొక్క లక్ష్యం, కైవల్య ప్రాప్తి, జన్మ 

రాహిత్యం, మోక్ష సాధన గా ఉండేది. ఆనాడు గురువు లక్ష్యం కూడా అదే కనుక గురు, శిష్యుల మధ్య 

సంబంధం కూడా చాలా ఆనంద దాయకంగా ఒకరి అవసరం మరొకరిదిగా చాలా ఆదర్శ వంతంగా ఉండేది 

,ఆంగ్లేయుల ప్రవేశం తర్వాత విద్య లక్ష్యం విద్యార్థులను ఆంగ్ల మానస పుత్రులుగా తీర్చి దిద్ది పాలక వర్గాల 

సేవలో తరించి వాళ్ళ దోపిడి సొమ్ము లో నుండి కొంత జీత భత్యాలుగా పొందడం గా ఉండేది.

                      1947 తర్వాత కూడా అదే విధానం కొనసాగుతున్నప్పటికినీ పాలకులు మాత్రం 

మారినారు .అయినప్పటికినీ స్వాతంత్రోధ్యమ స్పూర్తి ఫలితంగా 1980 పీవీ నర్సింహా రావు నూతన విద్యా

 విధానందాకా చదువుకున్న వారికి చదువు చెప్పిన వారికి సమాజం లో ఎంతో కొంత గౌరవం ఉండేది. కానీ

 పీవీ పుణ్యాన పెట్టుబడి దారులకు విద్యారంగ లో ఉన్న లాభదాయకమైన మార్కెట్ అర్థం అయ్యి ప్రైవేటు 

రంగం లో విద్య ప్రారంభం అయ్యింది. పెట్టు బడి దారుల ఒత్తిడుల ప్రభావం వలన ప్రభుత్వ పాఠశాలల్లో 

నియామకాలు నిలిచి పోయి విషయ బోధకులు లేకుండా పోయినారు. ఫలితంగా ఆర్తికంగా వెసులు బాటు 

కలిగిన వాళ్ళు ప్రైవేట్ పాఠశాలల వైపు వెళ్ళడం జరిగింది.

          1991 లో దేశ పదవ ప్రధానిగా పీవీ అధికారం లోకి రాగానే మన్మోహన్ సింగ్ ఆర్టిక మంత్రి గా

 వీరిరువురు ప్రవేశ పెట్టిన ఆర్థిక విధానాల వలన సమాజం లో అంతవరదాక ఉన్న విలువల నిర్వచనమే 

మారిపోయింది. కరికులం లో ఉండే పౌరనీతి శాస్త్రం పోయి పర్సనాలిటీ డెవలప్మెంట్ , వ్యక్తిత్వ వికాసం 

వచ్చి చేరినాయి . పక్కవాడు పడిపోయినప్పుడు నీవు వానికి చేయి అందించావో నీ పరుగు పందెం లో నీవు  

.ఓడి పోతావు. .నీకు చేతనైనా కాకపోయినా , నీకు ఆ శక్తి ఉన్నా లేకపోయినా ఉన్నతమైన లక్షాన్నే 

ఎన్నుకో.నీవు ఎన్నుకున్న లక్షం వైపు నీవు సాగి పో పక్క వాన్ని ఎట్టి పరిస్తితి లో కూడా పట్టించుకోవద్దు 

అనే ఫిలాసఫీ వచ్చింది. అది ఎక్కడి దాకా వచ్చిందంటే కన్న తలిదండ్రులను కూడా పట్టించుకోని  పరిస్తితి.

సరే అది మన సబ్జెక్ట్ కాదనుకుందాం. ఈ భావజాలం జీర్ణించుకున్న సమాజం నుండి ఎదిగి వచ్చిన 

యువత అతడు ఉపాధ్యాయుడా, అతడు డాక్టరా, అతడు రాజకీయ  నాయకుడా ఎవరైతే ఏమిటి ఎట్లా 

అయితే ఏమిటి డబ్బు సంపాదించు వస్తువులు సమకూర్చుకో సౌఖ్యాలు అనుభవంచు. అదే నీతి.

మనుషులు, మానవ సంబంధాల కంటే వస్తువులే ఆనందాన్ని యివ్వగలవు అనే వస్తు వినిమయ 

సంస్కృతి పరిఢవిల్లిన సమాజం లో ఉపాధ్యాయులు కూడా శలభాలే అయినారు. ఆ మంట సృస్టించిన 

పాలక వర్గాలే ఉపాధ్యాయులు సరిగా పనిజేయడం లేదని ఊదర కొడుతూ మొత్తంగా విద్యా రంగాన్ని ప్రైవేట్ 

పరం జేసె కుట్ర జేస్తున్నారు .


          అయితే ఏమిటి? సార్లు సరిగా పనిజేయడం లేదు కనుక విద్య ప్రైవేట్ అవుతుంది మరి అనే వాళ్ళు 

రేపు పెట్టుబడి మోనోపలి అయిన తర్వాత పేదలకే కాదు మధ్య తరగతి వాళ్ళకు కూడా చదువు ''కొన ''

లేనంతటి పిరపు సరుకు అవుతుంది . కనుక ప్రజలంతా ప్రభుత్వాలను అడుగవల్సింది ప్రభుత్వ 

పాఠశాలలకు ఇచ్చే గ్రాంటు మాకే ఇవ్వుమని మరిన్ని ప్రైవేట్ విద్యా సంస్తలను పెట్టండి అని కాదు,

  అన్నిటికి అమెరికనే ఆదర్శం  అని వల్లిస్తున్న అమెరికా వలె కామన్ హుడ్ సిస్టమ్ 

ద్వారా అందరికీ ఒకే విధమైన కామన్ స్కూల్ విధానం  ద్వారా విద్యను అందించాలని ప్రజలు, ప్రబుత్వ 

ఉపాధ్యాయులు వారి సంఘాలు ఉద్యమించాల్సిన అవసరాన్ని గుర్తించాల్సి ఉంది. ఇకనైనా ఉపాధ్యాయులు 

కేవలం తమ హక్కుల కోసం మాత్రమే గాకుండా బాధ్యతలను గుర్తించాలి. ప్రభుత్వ పాఠశాలలు ఒకవైపు 

మూత బడుతుంటే ఉదయం తొమ్మిది గంటలకే మీరు బడి ఎట్లా పెడుతారు అని అడుగుతున్నారంటే 

ఇంకా ఉపాధ్యాయులు  వాస్తవ పరిస్తితులను ఎన్నడు అర్థం జేసుకుంటారని ప్రజలు అడుగుతున్నారు.

                   ఉపాధ్యాయులు వృత్తి  నైపుణ్యాలను మెరుగు పరుచుకోవాలి. ఏ వృత్తులను జుసినా 

మారుతున్న కాలానికి అనుగుణంగా అభివృద్ధి అయినవి మాత్రమే మనుగడ కొనసాగిస్తాయి. మారము 

అని మొండికి వేస్తే కాలగర్భం లో కలిసి పోక తప్పదు.

      ఏసు ప్రభువు భక్తులు ప్రార్తిస్తున్నట్టు '' ప్రభువా ! వారేమీ చేస్తున్నారో వారికి తెలియదు '' అన్నట్లుగా 

తలిదండ్రులు వారేమీ చేస్తున్నారో వారికి తెలియడం లేదు. ఒక ఆట లేని ,పాట లేని ,ఆహ్లాదం లేని వంచిన 

తల ఎత్తకుండా ఎంత ఎక్కువ సేపు కూర్చుండ బెడితే తమ బిడ్డడు అంత గొప్పవాడు అవుతాడనుకొంటు 

పిల్లల బాల్యాన్ని హరించి వేస్తున్నారు. వారిని సహజంగా వికసింపనివ్వకుండా అత్యుస్తాహమ్ తో 

 చిన్నప్పటి నుండే అలివి గాని కోచింగులతో , మొగ్గలను బలవంతంగా విప్పదీస్తున్నారు . అందుకే అవి 

సహజమైన తమ సువాసనలను కోల్పోయి ప్లాస్టిక్ పువ్వుల వలె కన్న తలిదండ్రుల తో బాటు గా 

తమ చుట్టూ ఉన్న సమాజపు తంద్లాటను స్పందనను  పట్టించుకోవడం లేదు, తమ తమ వ్యక్తిగత 

సుఖ సంతోషాలను దప్ప . తలిదండ్రులు , ఊపాధ్యాయులు పాలకులు ఇప్పటికైనా స్పందించక పోతే 

భావి సామాజానికి భవిష్యత్తు ఉండదు.



                                                              వీరగొని పెంటయ్య,

                                                    విశ్రాంత విద్యా పర్యవేక్షణాధికారి 

                                                      9908116990