Thursday, March 26, 2015

రీంనగర్ జిల్లాలో గ్రానైట్ పరిశ్రమ ఇబ్బందుల్లో ఉన్నదని చదివిన తర్వాత ఆ జిల్లా వాసిగా నా అనుభవం రాస్తున్నాను. ఒక 30 సంవస్తారాల కింద కరీంనగర్ జిల్లా లో గ్రానైట్ క్వారీలు అసలు లేకుందేటివి. ఆనాడు ప్రజలు ఈ గుట్టల పొంటి ఉన్న పచ్చిక మైదానాలల్లో గొర్రెలను మేపుకొని, ఆవులను,బర్రెలను మోపుకొని జీవిస్తూ ఉండే వారు. గుట్ట వెంట ఉన్న పేద వారైనగ్రామస్తులు కట్టెలు కొట్టుకొని పట్టణాల్లో అమ్మేవాళ్లు. మోదుగ ఆకులు తునికి ఆకులు సేకరించి విస్తర్లకు బీడీ లకు వాడేవాళ్లు. గుట్ట మొదళ్ళలో ఉండే ఇప్ప చెట్ల నుండి ఇప్ప పువ్వు. ఇప్ప పరుక సేకరించి అమ్ముకొని జీవించే వాళ్ళు. సీతా ఫలాలు ఓగు కాయలు బలుసు పండ్లు తవిశి బంక సేకరించి అమ్ముకొని జీవించే వాళ్ళు. గుట్ట ప్రారంభం లో ఉండే మైదానాలల్లో తాటి ఈత వనాల ను ఆసరా జేసుకొని గీతా వృత్తుల వాళ్ళు, చాపలు , బుట్టలు అల్లుకొనిజీవించే వాళ్ళకు   బ్రతుకు దెరువు ఉండేది. గుట్ట బందలకు పెట్టిన తేనె తెరల నుండి తేనె సేకరించి జీవించే వాళ్ళు.  ఇంత మందికి గుట్టలు ఆధారమై ఉండేవి. అంతే గాదు ఎన్నో వందల ఏళ్ల నుండి ఈ జీవన చక్రం ఆగి పోకుండా సాగుతున్నది.ఇంకా ఎన్ని వేల ఏండ్లయిన అరిగి పోనీ తరిగి పోనీ ఈ విధానం ఎలాగే కోన సాగే అవకాశం ఉంటుంది. గుట్ట మొదళ్ళలో ఉండే బావులల్లో నీళ్ళు పుష్కలంగా ఉండేటివి. వాటితో వ్యవసాయం నడిచేది. పది మందికి అన్నం దొరికేది, గుట్టల సమీపం లో వర్షాలు కూడా బాగా పదేవి. 
  ఇక పోతే గుట్టలను ఆసరా జేసుకొని కోతులు గుడ్డెలుగులు  జింకలు.నెమల్లు. .గడ్డలు గబ్బిలాలు. కొండ చిలువలు జీవిక్నేటివి. ఇదంతా ఒక జీవావరణ వలయం .
   గ్రానైట్ క్వారీలు వచ్చిన తర్వాత జీవ వైవిధ్యం విధ్వంసం అయింది. గుడ్డెలుగులు కోతులు కొండ చిలువలు గ్రామాలల్లో చేరినయి. పంటల దిగుబడి తగ్గింది. పంట పొలాల వైశాల్యం తగ్గింది. గ్రానైట్ ద్వారా ఏటా 200 కోట్ల రాయల్టీ ప్రభుత్వానికి వస్తున్నదట. కానీ 500 కోట్ల విలువగలిగిన రోడ్లు ధ్వంసం అయితున్నాయి . విలువ తెలియదు గాని మానేరు పై ఉన్న వంతెన పాడై పోయింది. .గ్రానైట్ క్వారీల వలన ఈ గుట్టలన్నీ అంతరించిన తర్వాత మళ్ళీ గుట్టలు మొలువవు కదా అప్పుడు ఇక్కడ జీవించే ప్రజలకు జీవనోపాధి ఉండదు. ఇక్కడ చూడ వాల్సింది పెట్టుబడి దారులకు ప్రకృతి సంపద అప్పనంగా దోచి పెట్టడానికి ప్రభుత్వాలు ఆలోచించడం గాడు స్టానికంగా జెవ్విస్తున్న ప్రజల బ్రతుకు దెరువు ఎట్లా అన్నదే ప్రధానం. గ్రానైట్ క్వారీలు రాక ముందు ఇక్కడి ప్రజలు జీవించి నారు. గ్రానైట్ క్వారీల వలన గుట్టలు అంతరించి పోయినాంక ఇక్కడి ప్రజలు ఎలా బతుకాలో ప్రభుత్వం, ఆలోచనా పరులంతా ఆలోచించాల్సిన విషయం.
  వీరగొని పెంటయ్య. విశ్రాంత విద్యా పర్యవేక్షణాధికారి.