Tuesday, December 16, 2014

The Gouds living in Agency area must be given S.T. Certificates!

రాజ్యాంగం రాసుకున్న నాటి కంటే ముందే నాగరిక సమాజాలు  అడవుల్లో గుట్ట చెట్టును నమ్ముకొని జీవిస్తున్న ప్రజలను దృష్టిలో పెట్టుకొని క్రీ|| శ || 1917 నాటి నుండే ఆ ప్రజల కొరకు షెడ్యూల్డ  ట్రైబ్ అనే మాటను ఉపయోగించి నట్లు మనకు ఆధారాలు ఉన్నాయి. షెడ్యూల్ ట్రైబ్ అంటే చాలా స్పస్టంగా ఒక్కొక్క కులం, వృత్తి ని పేర్కొవడం జరిగింది. అట్లా పేర్కొన్న వాటిలో కళ్ళు గీత వృత్తిగా జీవిస్తున్న గౌడ్ లను కూడా షెడ్యూల్ ట్రైబ్ గా పేర్కొనడం జరిగింది. డా|| భీమ్ రావ్ రాంజీ అంబేడ్కర్ అధ్యక్షులు గా ఏర్పడ్డ భారత రాజ్యాంగ కమిటీ  26 నవంబర్ 1949 న ఆడాప్ట్ చేయబడి 26 జనవరి 1950 లో అమలు లోకి వచ్చింది. 25 భాగాలు కలిగిన భారత రాజ్యాంగం లో మొత్తం 448 ఆర్టికల్లు ఉంటే అందులో 7 వ ఆర్టికల్ లో చాలా స్పస్టంగా . ఏజెన్సీ ఏరియాలో నివసిస్తున్న గౌడ్ లు షెడ్యూల్ ట్రైబ్ కు చెందుతారని చెప్పబడింది. 1956 విశాలాంధ్ర ఏర్పడ్డప్పుడు అదే 7 వ ఆర్టికల్ లో ఏజెన్సీ ఏరియా లో నివసిస్తున్న గౌడ్ లను షెడ్యూల్ ట్రైబ్ లని అన్నారు. నిన్నటికి నిన్న ఆంధ్ర ప్రదేశ్ పునర్విభజన బిల్లు. 2014  లో సైతం అక్షరం పొల్లుబోకుండా అదే 7 వ ఆర్టికల్ అలాగే చెప్పబడింది. కానీ సీమాంధ్ర పాలన లో అయితే ఎట్లాగైతే ఎస్టీ సర్టిఫికెట్లు ఇవ్వకుండా గౌడ బిడ్డలకు చదువుకొనే సౌకర్యం అందకుండా జెసి ఉద్యోగాలలో అవకాశం లేకుండా జేశారో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పరిస్తితిలో ఏమీ మార్పు కనిపించడం లేదు.వాస్తవానికి ఖమ్మం,వరంగల్, ఆదిలా బాద్ జిల్లాలల్లోని ఏజెన్సీ ఏరియా లల్లో నివశిస్తున్న గౌడ్ లందరికి ఎస్టీ సర్టిఫికట్ ఇవ్వాల్సి ఉంది. ఇక్కడ లేనిదేదో ఇవ్వాలని గౌడులు గొంతెమ్మ కోర్కెలను కోరడం లేదు. రాజ్యాంగం లో ఉన్న దాన్నే కొందరు అవగాహన లేని అధికారుల మూలంగా జరిగిన పొరబాటును సరిదిద్దాలని మాత్రమే గౌడులు డిమాండ్ జేస్తున్నారు. 

  అందుకు నాంది గా ఖమ్మం జిల్లాలో కొందరు చదువుకున్న యువకులు విద్యార్థులు ఏకమై ఉద్యమం ప్రారంభించారు. ములుకల పెళ్లి మండలం లో కార్తీక వనభోజనాలల్లో కార్య రూపం దాల్చి, 10 డిసెంబర్ నాటికి అశ్వరావ్ పేట లో ఉద్యమ రూపం తీసుకున్నది. ప్రసాద్, శ్రీనివాస్, వెంకటేశ్వర్ రావు ,లాంటి యువకులు గౌడుల ఇంటింటికి దిరిగి మోటివేట్ చేసినారు. ఖర్చులకు కూడా ప్రజలు డబ్బులు ఇస్తూ వేలాదిగా పిల్లలు, మహిళలు వృద్ధులు కదులుతున్న విధానం గమనించినపుడు వారు ఇంతవరదాక కోల్పోయినది ఏమిటో వారికి అర్థం అయినట్లు ఉంది.
    వీరి ఉద్యమానికి సంఘీభావం దెలుపడానికి సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు వీరగొని పెంటయ్య గౌడ్ , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింగం సత్తెయ్య గౌడ్ గారాలు అక్కడ ముల్కల పెళ్ళిలో మరియు అశ్వరావ్ పేట లో కూడా హాజరయ్యి వేలాదిగా తరలి వచ్చిన గౌడ బిడ్డలకు  బాసట గా నిలిచినారు. సర్వాయి పాపన్న ఫౌండేషన్ చేర్మన్ పంజాల జైహింద్ గౌడ్ సైతం రెండు సమావేశాలల్లో పాల్గొని ఉత్తేజకరమైన ఉపన్యాసాలతో వారిని ఉద్యమం వైపు సాగడానికి అవసరమైన విశ్వాసాన్ని కలిగించినారు. సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం సెక్రటరీ జెనరల్ గణగొని సత్యనారాయణ గౌడ్ ముల్కల పెళ్ళిలో పాల్గొని సర్వాయి పాపన్న వారసులమై పోరుజేయాలని సూచించినారు. ఖమ్మం లో 26 మండలాలు ఏజెన్సీ ఏరియా గా నిర్ధారించ బడినాయి. కనుక అక్కడ నివసిస్తున్న గౌడ్ లకు ఎస్టీ సర్టిఫికట్స్ ఎప్పటినుండో ఇవ్వాల్సి ఉండే.  అలా ఇవ్వకపోవడం వలన ఈ 65 సంవస్తరాల కాలం లో పది సంవస్త రాలకు ఒక తరం చొప్పున ఆరున్నర తరాలు తమ విద్య, ఉద్యోగ అవకాశాలను కోల్పోవడం వలన ఎంతటి ఆర్థిక, సామాజిక నస్టమ్ జరిగిందో అంచనాకు సైతం అందని విషయం.ఒక ఉదాహరణ చూద్దాం! భారత భూభాగం లో ఎవ్వరైన ఏ వృత్తి అయినా చేసుకొని జీవించ వచ్చు అన్న హక్కును రాజ్యాంగం భారత ప్రజలకు ధకలు పరిచింది. వ్యాపారాలు చేసుకొనే వారు చేసుకుంటున్నారు. కమ్మరి, కుమ్మరిమ్ వడ్రంగి, చాకలి,మంగలి నేత వృత్తుల వాళ్ళు నిర్ణిబంధంగా ఎవరి వృత్తులు వాళ్ళు చేసుకుంటున్నరు . కానీ విచిత్రంగా ఒక కల్లు గీసుకొనే  గౌడ వృత్తి మాత్రం  గౌడులు చేయ గూడదు అని ఒక రాజకీయ పార్టీ శాసన సబ్యుడు చట్టం చేయించి తెస్తాడు. కానీ ఇదే చట్ట సభల్లో గౌడ బిడ్డలై పుట్టిన అనేక మంది సభ్యులు ఉంటారు, కానీ తమ తోటి సహోదరులకు జరుగుతున్న అన్యాయాన్ని పట్టించుకోరు.ఇదీ మనలోని ఐక మత్యానికి ఒక మచ్చు తునుక. అలా చట్టం తేవడం వలన 26 మండలాలల్లోని వందలాది గీత కార్మిక సొసైటీలకు మనుగడ లేకుండా పోయింది. వీలాది మంది గీత కార్మికులు పొట్ట చేత బట్టుకొని రోడ్డున పడ్డారు. పడి లేచిన ఆ బిడ్డలే ఇక ఎవ్వరినీ నమ్మక తమ బతుకులు తామే బాగు జేసుకొనడానికి ఉద్యమ జెండా భుజాన బెట్టుకొని లాంగ్ మార్చ్ కు బయల్దేరినారు.

          తమకు జరిగిన జరుగుతున్న నస్టాన్ని నివారించడానికి ప్రస్తుత ప్రభుత్వామైనా వెంటనే స్పందించాలని ప్రజలతో బాటుగా సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం సైతం బలంగా డిమాండ్ జేస్తున్నది. ప్రభుత్వం తక్షణం స్పందించని పక్షం లో ముందుగా క్షమ్మం జిల్లా కేంద్రం లో 10 వేల మందితో ప్రదర్శన నిర్వహ్స్తామని, అప్పటికి ప్రభుత్వం స్పందించని యెడల రాష్ట్ర రాజధాని హైద్రాబాదు లో ఒక లక్ష మండి తో సెక్రటేరియట్ ను ముట్టడిస్తామని ప్రబుత్వాని హెచ్చరిస్తున్నాము అని అశ్వరావ్ పేట పురవీధుల గుండా జరిగిన ఊరేగింపులో ప్రజాల్తో బాటు సర్వాయి పాపన్న సంఘం సైతం నినాదాలు చేయడం జరిగింది.

వీరగొని పెంటయ్య.
అధ్యక్షులు 

సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం.