Monday, December 21, 2020

Article on Education.

 .                పాలక వర్గాలకు పావుగా ఉపయోగ పడుతూ వస్తున్న విద్య.


జాతీయ విద్యావిధానం 2020చట్టం,  భారత సమాజం లో  ఏదో చాలా గొప్పమార్పు  తీసుకొని వస్తుంది అని వాదిస్తున్నారు కొందరు. కానీ ఈ చట్టం లో చెప్పబడిన అనేక విషయాలు ఎప్పుడో 200 ఏండ్ల కింద అమెరికాలో ప్రవేశ పెట్టబడి,  పెట్టుబడిదారీ విధానానికి పట్టుగొమ్మలుగా నిలిచిన విషయాన్ని మనం గమనించ వచ్చు. 


క్రీ.ష. 1776 లో అమెరికా కు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, ఉత్తర దక్షిణ ప్రాంతాల మధ్య ఉన్న ఆర్థిక సామాజిక వ్యత్యాసాలు, స్టేట్  ,ఫెడరల్ ప్రభుత్వాల అధికారాల పంపకం ,  మరియు అక్కడ ఉన్న నల్ల జాతులవారి బానిస విధానానికి వ్యతిరేకంగా జరిగిన సివిల్ వార్ 1861 లో మొదలై 1865 లో ముగిసింది. ఈ మధ్య కాలం లో యూరప్ లో పారిశ్రామిక విప్లవం మొదటి దశ ప్రారంభింప బడి పారిశ్రామికాధిపతుల వద్ద డబ్బు ప్రోగు పడడం మొదలైంది. అలా ప్రోగుపడ్డ సంపదను ఇబ్బడి ముబ్బడిగా పెంచుకోవడం కోసం మళ్ళీ మళ్ళీ వివిధ పరిశ్రమలల్లో పెట్టుబడులు పెట్టి సరుకు ఉత్పత్తి చేసి మారకం చేయడం ద్వారానే పెట్టుబడి అభివృధ్ధి అవుతుంది అన్న  ఆర్థిక సూత్రాల ఆధారంగా పెట్టుబడి దారి విధానం మొదలైంది.అందరికీ చెందవలసిన యూనివర్సల్ సంపద అయిన  మౌలిక వనరులు ఖర్చై  డబ్బున్న వారి సంపదే పెరుగుతున్నది కదా సామాన్యులమైన మాకు ఒనగూరే ప్రయోజనం ఏమిటి అన్న ప్రశ్న మొదలైన తర్వాత మీకు పనిజేసుకొనే అవకాశం కల్పిస్తున్నాము కదా అన్న ఊరడింపు, బుజ్జగింపు  మాటలు ముందుకు వచ్చాయి. 


 అధిక సరుకుల ఉత్పత్తి అధిక లాభాలు తెచ్చి పెడుతుందన్న వాదన వచ్చిన తర్వాత పారిశ్రామికీకరణకు సాంకేతిక నైపుణ్యం అవసరం పడింది. అందుకు శ్రామిక జనాలకు కూడా విద్య అందించ  వలసిన అవసరం పడింది. అప్పుడు,  అంటే 19 వ శతాబ్దం ప్రారంభం లోనే యూరప్, అమెరికా, పారిశ్రామికీకరణ చెందిన దేశాలల్లో  పెద్ద ఎత్తున శ్రామిక జనాలకు విద్య  అందించ వలసిన అవసరం ఏర్పడింది. అప్పటివరకూ ఆయా మతగ్రంథాల బోధన వరకే పరిమితమైన చదువులు సాంకేతిక, భౌతిక,రసాయనిక శాస్త్రలను బోధించడం కూడా మొదలుపెట్టక తప్పలేదు. అందుకని ప్రధానంగా అమెరికా లో కామన్ స్కూల్ విధానం 19 వ శతాబ్దం లోనే ప్రారంభించ బడింది. 


ఒక రాజకీయ పార్టీ అధికారం లోకి రావడానికి ప్రజలు పెద్దసంఖ్యలో ఓట్లు వేసి దానిని గెలిపించుకోవాలి. అట్లా అధికారం లోకి వచ్చిన పాలక పార్టీ ,  పెట్టుబడి దారి వర్గానికి తమ సేవలను అమ్ముకోవడానికి ప్రజలను ఎప్పటికప్పుడూ ఒప్పిస్తూ వారు లాభాలు పెంచుకోవడానికి దోహద పడుతూ ఉండాలి. పాలక పార్టీ ఆ విధంగా దోహద పడనప్పుడు,  పెట్టుబడి తమవద్ద ఉన్న సంపద, ప్రచార సాధనాలను ఉపయోగించి దాని స్తానమ్ లో తమకు అనుకూలంగా ఉండే మరో పార్టీని అధికారం లో కూర్చోబెడుతుంది.( ఒక దళారి పశ్చాత్తాపం)  


1945 లో 2వ  ప్రపంచ యుధ్ధం ముగుసి 1947 లో బ్రిటిషర్ల నుండి స్తానిక   పాలకుల చేతిలోకే అధికారం బదిలీ అయిన తర్వాత దేశం లో  మిశ్రమ ఆర్థిక విధానాలను అమలుపరిచే క్రమం లో విద్యా విధానం ఎలా ఉండాలి అనే దానికి పెద్దగా కస్టపడవలసిన అవసరం లేకుండానే తాము వలసగా ఉన్న ఇంగ్లాండ్ విద్యావిధానన్నే యథాతథంగా కొనసాగించడానికి పాలకులు నిర్ణయించారు. కానీ యూరప్ లో మాదిరిగా దేశం లో పారిశ్రామికీకరణ జరుగనందున సాంకేతిక విద్య అవసరం అంతగా లేకుండా పోయింది. సామాజిక శాష్ట్రాలు, న్యాయ, వైద్య విద్య అవసరాలు ఎక్కువగా ఉండేవి. వైద్య విద్యాలయాల ఏర్పాటు ఖర్చుతో కూడినవి కావడం చేత ప్రభుత్వాలే తమ శక్తి మేరకు చాలా స్వల్పంగా వైద్యవిద్యాలయాలు ఏర్పాటుచేశాయి. ప్రభుత్వాపాలనలో, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలల్లో,, రక్షణ, రెవెన్యూ శాఖల్లో, న్యాయ శాఖలో పనిజేయడానికి పరిమితమైన అవసరాల కోసం తాలూకాకు ఒక పాఠశాల, జిల్లాకు ఒక కాలేజీ, రాష్ట్రానికి ఒకటి లేదా రెండు యూనివర్సిటీలు  ఏర్పాటు చేశారు. అవన్నీ ప్రభుత్వాల అవసరాలు తీర్చేవిగానే ఉన్నాయి. 


ఇప్పుడు  మనం చూస్తున్న భారత దేశం 650 సంస్తానాలు, ఇంకా ఒకనాడు 56 రాజ్యాలు గా ఉండేవి. ఇక్కడ ఉత్తర, దక్షిణ ప్రాంతాలకు భాష, కట్టు బొట్టు, ఆహారం,  ఆహార్యం ఎంతో భిన్నంగా ఉంటాయి. హింది, భోజ్పురి, మరాఠీ,బెంగాలీ, రాజస్తానీ, పంజాబీ, ఒరియా, గుజరాతీ, అస్సామీ, మణిపురి, కన్నడం, తమిళం, తెలుగు, మలయాళం, లాంటి లిపి ఉన్నవి ,లేనివి అనేక భాషలు  మాట్లాడే ప్రజలున్నారు. వీరందరికి ఆయా స్టానిక పరిస్తితులకు అనుకూలంగా రాష్ట్రాల జాబితాలో విద్య ఉండేది. తార్వాత విద్య ,  కేంద్ర రాష్ట్ర ఉమ్మడి జాబితాలోకి చేర్చ బడింది. సరే మాద్యమాలు ఏవైనా బోధించే విషయాలను చూసినపుడు అవి ప్రభుత్వ ఉద్యోగులు గా లేకుంటే ప్రైవేట్ వారికి సేవలు చేసేడానికి ఉపయోగ పడేవిగానే ఉన్నాయి. నెహ్రూ, కాలం లో వచ్చిన గ్రీన్ రెవల్యూషన్ కోసం అవసరమైన ప్రాజెక్టులు, భాక్రానంగల్, హీరాకుడ్, దామోదర్ వ్యాలీ, చంబల్, గండక్ , తుంగభద్రా, నాగార్జున సాగర్, శ్రీరాంసాగర్ లాంటి భారీ ప్రాజెక్ట్ ల నిర్మాణం కోసం సివిల్, టెక్నికల్ నిపుణుల అవసరం కొరకు కొన్ని ఇంజనీరింగ్ కాలేజీల అవసరం ఏర్పడింది. మొత్తంగా ఏ విద్యాసంస్తాలు వచ్చినా అయితే అవి ప్రభుత్వ సేవలకు లేదా ప్రైవేట్ రంగం లో ఉన్న పెట్టుబడిదారుల సేవలకే పరిమితమైనవి దప్పితే    మనం మొదటే చెప్పుకున్నట్లుగా సామాన్యులకు పనిజేసుకొని బతికే అవకాశం కలిపించ బడిందే కానీ సమాజం లో ఉన్న ఆర్థిక సామాజిక  అంతరాలు తగ్గించడానికి విద్య ఎంతమాత్రం దోహద పడలేదన్నది నిర్వివాదాంశం. 


ఇక 1991 లో పాముల పర్తి వెంకట నర్సింహా రావ్ ప్రధానిగా, మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా ఏర్పడ్డ ప్రభుత్వం అప్పుడప్పుడే ఏర్పాటు చేయబడ్డ నూతన ఆర్థిక , పారిశ్రామిక  విధానాలకు  దేశం లో తలుపులు బార్లా తెరిచారు. ఈ నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాల కు రూపకర్త అప్పటి ప్రపంచ బ్యాంక్ చేర్మన్ ఆర్థర్ డంకేల్. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ఇంటర్ నేషనల్ మానిటరింగ్ ఫండ్, మరియు ప్రపంచ బ్యాంక్ ఆధ్వర్యం లో Build Sruggle to Stop the Explaitation Of Working People అన్న నినాదం తో ( ఇప్పుడు గదా మధ్య దళారీల నుండి రైతుల దోపిడీని ఆపుతామని సాగు చట్టాలు తెచ్చినట్టు) అమెరికా సూపర్ పవర్ ను ప్రపంచం లో ఎస్టాబ్లిష్ చేయడానికి  ఆర్థర్ డంకేల్ , తన డంకేల్ డ్రాఫ్ట్ ను ప్రపంచం ముందుకు తెచ్చి అలిమిన్నో, బలిమిన్నో భారత్ ను ఒప్పించారు. అట్లా ఇక్కడ అమెరికా అవసరాలు నెరవేర్చడానికి విద్యా రంగం లో మార్పులు తీసుకొని రాబడ్డాయి.. 


నిజానికి విద్య మానవుల జీవితాల్లో అభివృధ్ధికరమైన మార్పు తేవడానికి చాలా బలమైన సాధనం, కానీ అది ఇంతవరదాక పాలక వర్గాల ద్వారా పెట్టుబడికి ఊడిగం చేయడానికే పనికి వచ్చింది గాని సామాన్యుల బతుకుల్లో ఆర్థిక, సామాజిక, రాజకీయ మార్పుతేవడం లో పెద్దగా దోహద పడలేదు అన్నది గత 250 సంవస్తారాల చరిత్ర చెబుతున్నది.   


వీరగొని పెంటయ్య 

 విశ్రాంత విద్యా పర్యవేక్షణాధికారి 

కరీంనగర్.     


Sunday, December 20, 2020

On Agricultural Acts 2020.

               కొనుగోలు దారులు ఎక్కువైతే రైతులకు ఎక్కువ రేటు వస్తుందా? 


సాగు చట్టాలను సమర్థించే వారు చెపుతున్న దాని ప్రకారం కొనుగోలు దారులు ఎక్కువైతే రైతులకు ఎక్కువ రేటు వస్తుంది అంటున్నారు, అది నిజమేనా చూద్దాం.


నిజానికి రైతు మార్కెట్ లో రైతులు అమ్ముకుంటున్న దానికంటే గూడా ప్రస్తుతం ప్రైవేట్ మార్కెట్ ద్వారా నే ధాన్యం ఎక్కువగా అమ్మబడుతున్నది అనేది ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. ఇప్పుడుకూడా  రైతులు ప్రభుత్వ రైతు మార్కెట్ లోనే అమ్ముకోవాలే అనే నిబంధనలు కూడా ఏవీ లేవు. ఎవరు వచ్చి రైతుల వద్దనుండి కొనుగోలు చేస్తామన్నాకూడా ఎలా రైతుల వద్ద కొంటావు అని ప్రశ్నించే వారు కూడా ఎవరు లేరు. అయినా సరే సాగు చట్టాలు చేయడమే అని ప్రభుత్వం ఎందుకు మొండి పట్టుదలతో ఉందో తర్వాత చెప్పుకుందాం. 


మోనోపాలి ఉంటే ఎక్కడైనా వినియోగ దారునికి నస్టమే. . ప్రభుత్వ రైతు మార్కెట్ మోనాపలి ఏమీ కాదని మొదటే చెప్పుకున్నాము. నిజానికి  ప్రివెట్ మార్కెట్ ఇవాళ ప్రపంచం లో  మోనాపలి చలాయిస్తు లాభాలు గడిస్తున్నది. అది ఇక్కడ మన దేశీయ మార్కెట్ లో ఎలా  చేస్తున్నాధో చూద్దాం. గత సంవస్తరకాలంగా కోవిడ్ 19 మూలంగా ప్రతి రంగం వెనుక బడిపోయింది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ అయితే మరింతగా కుంగి పోయింది అనేది Builders Associations Of India( బి‌ఏ‌ఐ) మరియు( BCA)  Building Construction Association వారి ఆవేదన. అంటే కట్టడానికి స్కిల్లెడ్ లేబర్ దొరకని కారణం ఒకటైతే, కట్టినవి అమ్ముడు పోనీ కారణంగా మొత్తం పైన  రియల్ ఎస్టేట్ రంగం నస్టాల్లో ఉంది అన్నది వారి గోడు. ఐతే ఇప్పటికే ఒక సంవస్తర కాలం గడిచిన కారణంగా ఇప్పుడిప్పుడే ఆ రంగం కొద్ది కొద్దిగా పుంజుకుంటున్నది.  కట్టుబడికి ముడి సరుకులు  అయిన సిమెంట్, ఐరన్ దరలు ప్రస్తుతం ఆకాశానికి అంటాయి. ఈ సంవస్తర కాలం లో వీటి దరలు  సిమెంట్ 24% శాతం ఐరన్ 48% శాతం పెరిగింది. సిమెంట్ కు ఐరన్ తయారీకి అవసరం అయిన ముడి సరుకులు ఏవీ గూడా పెద్దగా పెరిగిన దాఖలాలు ఏమీ లేవు. మార్కెట్ లో సిమెంట్ , ఐరన్ ప్రొక్యూర్ చేసే కంపనీలు చాలానే ఉన్నాయి. వాటి మధ్య అమ్మకోవడానికి అవి ఏమీ పోటీ పడి  వాటి దరలు ఏమీ తగ్గించుకోవడం లేదు. పైగా అవి ఒకదానితో ఒకటి పరస్పర  ఒప్పందం,  అంటే సిండికేట్ అయి దరలు పెంచేసుకొని లాభాల మీద లాభాలు సంపాదించుకొంటున్నాయి. మరి ఇక్కడ మార్కెట్ లో కార్పొరేట్ సంస్తలు పోటీ పడి వినియోగ దారులకు లాభాలు చేకూరే విధంగా వ్యవహరించడం లేదు కదా? Price Controle System ఏమి చేస్తున్నాట్లో సామాన్యునికి అర్థం కానీ విషయం. వాళ్ళు ఎంత రేటుపెట్టిన జనం  కొంటున్నారు, కట్టుకుంటున్నారు.  ఏమైంది పోటీ? ఎవరికి జరుగుతున్నది లాభం? ఇక్కడ ప్రభుత్వ సిమెంట్ కంపనీలో , ప్రభుత్వ ఇనుప కంపనీలో వినియోగ దాంరుని పక్షాన  నిలిచి వినియోగ దారులకు లాభం చేకూర్చడమేమీ లేదు కదా? ఉన్నవి అన్నీ ప్రైవేట్ కంపనీలే కదా, పోటీబడి వాటి ఉత్పత్తులను చౌకగా వినియోగ దారులకు ఇవ్వడం లేదేందుకు?  ఇంతింత మాత్రంగా ఉన్న ఈ రైతు మార్కెట్లను కూడా ప్రభుత్వ పాఠశాలల వలె నిర్వీర్యం చేస్తే నోరు లేని రైతుల పరిస్తితి ఏమిటి అని రైతులు ప్రశ్నించడం  నేరమా?  వారికి విశ్వాసం కల్పించాల్సింది పోయి రైతులను వారిపక్షాన నిలిచి పోరాడుతున్నవారిని దేశ ద్రోహులు, కలిస్తానీలు, పాకిస్తానీలు, చైనీలు, అంటూ తిట్టిపోయడం ఏమిటి?  అదేనా ప్రజాస్వామ్యం? 


దీని వలన రేపు వినియోగ దార్లు కూడా దారుణంగా నస్టపోతారు. రైతుల వద్ద నుండి ధాన్యం ఎవరెవరు ఎంతెంత కొంటున్నారు, లెక్కలు లేవు. ఎవరెంత స్టాక్ పెట్టుకుంటున్నారు, లెక్కలేదు. ఏమి రేటుకు కొంటున్నారు లెక్కలేదు. ఎంతకూ అమ్మబోతున్నారు ,లెక్కలేదు. ఈ లెక్క లేని తత్వం ఎవరికి లాభం చేకూర్చుతుంది? ఈ విశ్రుంకలత్వం  ఎవరి లాభం కోసం? 


అరే అయ్యా! రైతు పండించే పంటకు అవసరం అయిన ముడి సరుకు భూమి. అది పంటలు పండించడం ద్వారా నిస్సారం అవుతోందా? మౌలికంగా భూమి దేశ ప్రజల అందరి  సొత్తు. అది నిస్సారం అవుతుంటే దాని ఫలితం దేశ ప్రజలందరికీ చెందాలా లేదా?. ఇక రెండోది నీరు. అది ఏ ఒక్కరి సొత్తు కాదు. అది పంటలకు విరివిగా ఉపయోగిస్తారు. నీటి  వినియోగం ద్వారా లభించే ఆ లాభం ఏ ఒక్కరికో ఎలా ఇస్తారు. ఎరువులు, పురుగు మందులు, విద్యుత్ ఉత్పత్తికి కాల్చే బొగ్గు, వినియోగం వలన అయ్యే  కాలుష్యం వలన దేశ ప్రజలందరూ సఫర్ అవుతారు, ఇంత మంది  నస్టానికి కారణం అవుతున్న పంట మీద దొరికే లాభం ఒక్క దళారీకీ  పంచి, మిగతా వారి నోరు కొడతా అన్న నీతి నీకు ఏ రాజ్యాంగం నేర్పింది అని ప్రశ్నించడం నేరమా?  


రైతు తన పంటను నెలల పర్యంతరం గోడామ్ లల్లో పెట్టుకొని వాటి అద్దే  కట్టడం చేయలేడు. ఆ పంట ఆయన అమ్ముకొని అప్పులు కట్టుకోవాలి.  కుటుంబ అవసరాల మేరకు అంటే పిల్లల చదువులు, వైద్యం, పెండ్లిల్లు, దుస్తులు, గృహోపకరణాలు, లాంటి అనేకి దినసరి అవసరాలకు ఖర్చు చేసుకోవడానికి ఆయనకు ఉన్న ఒకే ఒక వనరు తాను పండించిన పంట. వ్యాపారి కి వలె ఆయన నెలల పర్యంతం రేటు వచ్చేదాకా నీవు చెప్పినట్లు గోడామ్ లో దాచుకొంటే కుదురదు .  ప్రభుత్వం రైతుకు అండగానిలిచి గిట్టుబాటు దర లభించే విధంగా చూడవలసింది పోయి చచ్చిన శవాన్ని రాబందులకు ఈడ్చి పారేసి నట్లు కార్పొరేట్ శక్తుల ధన దాహానికి రైతుల శ్రమను, వారి బతుకు దెరువులను , దేశ మూల వనరులు అయిన భూమి, నీరు, గాలిని వదిలేయడం అమానవీయం అవుతుంది. ఆర్థిక విషయాలు, అన్నపానీయాలతో సంబంధం లేకుండా కేవలం భావావేశాలతో ఎంతో కాలం మనుషులను మోసగించలేమని మనకు హిట్లర్ చక్కటి మార్గదర్శకత్వం చూయించి పోయినాడు.  


Veeragoni Pentaiah.

Rtd. Dt. Academic Monitoring Officer

Karimnagar.

9908116990