Thursday, November 19, 2020

                             విద్యారంగం ..వైఫల్యాలు .. పరిష్కారాలు. 


రైట్ ఎజుకేషన్ ఫర్ బెటర్ సొసైటీ (REBS) యొక్క రెండవ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటుజేసిన వెబ్నార్ లో విద్యారంగం..వైఫల్యాలు..పరిష్కారాలు అన్న విషయంగా చర్చ జరిగింది. ఈ  చర్చలో పానల్ స్పీకర్ల్లుగా లింగయ్య rtd Dy director, అల్లం రాజయ్య రచయిత, డా. సాంబయ్య DIET, సంజయ్ ఒమెకర్ పొటర్స్ వీల్ ఎజుకేషన్, మరియు  సమన్వయ  కర్తగా వీరగొని పెంటయ్య సంస్త ఉపాధ్యక్షులు వ్యవహరించారు.   సంస్త సభ్యులు మరియు విద్యాభిమానులు  చర్చలో పాల్గొన్నారు. 

 

  పుట్టిన ప్రతి బిడ్డ ,  తన తలిదండ్రుల నుండి సమాజం నుండి నేర్చుకున్న జ్ఞానానికి విద్య మెరుగులు అద్ది , అనేకంగా ఉన్న సామాజిక అవసరాలల్లో ఏదో ఒక చోట తనకు అబ్బిన విద్య ద్వారా  సామాజిక అవసరాలను తీరుస్తూ తన జీవికను కొనసాగించేదిగా విద్య  ఉండాలి. 


  కానీ మన చదువుల్లో మార్కులు గ్రేడ్ లు, పాస్, ఫెయిల్, అనే విధానం  అమలౌతున్నప్పటినుండి కొందరు పిల్లలు జీనియస్, వరప్రసాదులు అనీ, మరికొందరు చదువు అబ్బనివారు, స్లో లర్నర్స్ అని ముద్ర  వేసి మన విద్యావిధానం బడి బయటకు పంపుతున్నది. తద్వారా  కోట్లాది మంది పిల్లలు సరైన ఉపాధి అవకాశం లభించక సమాజం లో గౌరవంగా జీవించే అవకాశాన్ని కోల్పోతున్నారు. 


పోనీ ఈ జీనియస్ లు గొప్పగా చేస్తున్నది ఏమిటని గమనిస్తే ఐతే కార్పొరేట్ సంస్టల్లో ఉద్యోగాలు జేస్తూ వారి సంపదను మరికొన్ని రెట్లు పెంచడానికి దోహదపడుతున్నారు. కాదూ కూడదు అంటే , కార్పొరేట్ సంస్తలకు ప్రకృతి సంపదలను, కారుచౌకగా మానవ వనరులను సమకూర్చి పెట్టె ప్రభుత్వాలల్లో బ్యూరోక్రాట్లు గా పనిజేస్తూ దోపిడి ప్రభుత్వాల పాలనను సుస్తిరం జేసె పనిలో తలమునకలై జీవిస్తున్నారు తప్పితే, సమాజం లో ప్రేమ, సమభావం, సౌశీలం, సంపద సమానంగా పంచబడాలనే దానికోసం వారు పనిజేయడమ్ లేదు, అలాగే మన విద్యావిధానం కూడా ఆ జ్ఞానాన్ని అందించడం లేదు. 


విద్యారంగం యొక్క ఈ వైఫల్యాలను తొలగించే పరిస్కార మార్గాల అన్వేషణలో ఈ చర్చా కార్యక్రమం ఏర్పాటు చేయబడింది కనుక వక్తలు పైవిషయాన్ని దృస్టిలో పెట్టుకొని మాట్లాడాలని సమన్వయకర్త కోరగా చర్చ ప్రారంభించబడింది. 


అల్లం రాజయ్య:-  విద్యను పై పై గా ఉపరితలం నుండి చూస్తే అనేక అంశాలు మనకు సరిగా అర్థం కావు. అందుకే విద్యా అంటే ఏమిటి? విద్యకు సమాజానికి ఉండే సంబంధం  ఏమిటి? విద్యకు చరిత్రకు ఉండే సంబంధం ఏమిటి అనే సామాజిక పునాది నుండి ఆలోచించక పోతే మనం ఎన్ని పిల్లిమొగ్గలేసినా దాని రూపానికి సంబంధించిన విషయమేతప్ప సారనికి చెందిన విషయాన్ని అర్థం జేసుకోలేము. సారం అంటే ఏమిటి? ఏ దేశం లోనైనా , ఏ ప్రాంతం లోనైనా ఉత్పత్తి శక్తులు ఎట్లున్నై అనే దాని పైన్నే ఆధారపడి విద్య,విజ్ఞాన శాస్త్రం , రాజకీయకార్య కలాపాలు , కళలు,మతాచారాలు,  అన్నీ ఉంటాయి. రెండోది ఉత్పత్తి సంబంధాలు. భారత దేశం లాంటి చోట్ల ఉత్పత్తి సంబంధాలు ఎలా ఉన్నాయి? ఉత్పత్తి సంబంధాలను నిర్ణయించే పద్దతి ఏముంటది? ఉత్పత్తి సాధనాల రూపం కూడా విద్యలో ప్రధానమైంది. ఉత్పత్తిలో మనుషుల స్తానమ్ ఏమిటి? పరస్పర సంబంధాలు ఎలా ఉన్నాయి? ఉత్పత్తి పంపిణీ ఎలా ఉంది? ఇవన్నీ కూడా అన్నీ రకాల సామాజిక జీవితాల  తో బాటు విద్యాపైన కూడా  ప్రభావం చూపుతాయి. మన దేశానికి వస్తే కులమున్నది, వర్గమున్నది, మతమున్నది. లింగవివక్షత ఉంది. భాషా పర వివక్షత ఉంది. ప్రాంతీయ వివక్షత ఉంది. ఇవన్నీ వివక్షలతో బాటు పిల్లల ఎదుగుదల ఎట్లా ఉంటదో  చూద్దమ్. 


అద్భుతమైన వ్యక్తిత్వం తో రూపొందించబడాల్సిన విద్యార్థికి  ప్రప్రథమంగా స్వంత ఆస్తి కేంద్రం గా గల కుటుంబాల్లో ముందుగా వాళ్ళ తలిదండ్రులనుండే వారి మానసిక వికాసానికి అడ్డంకులు ఎదురౌతాయి. విద్యార్హి ఏమో ఉత్పత్తి శక్తుల వికాసం గురించి ఆలోచిస్తే వారి తలిదండ్రులేమో స్వంత ఆస్తి కేంద్రంగా  వాళ్ళు ఏమి చేయాలో నియంత్రిస్తారు. కుటుంబం లో ఆడపిల్లలను ఒక రకంగా చూస్తార్, మొగపిల్లలను ఒకరంగా చూస్తారు.కుటుంబంలో  పితృస్వామిక భావజాలం పసిపిల్లల మనసులను తీవ్రంగా గాయపరుస్తుంది. తనకు ఊహ తెలిసినప్పటినుండే స్వేచ్ఛగా వికసించాల్సిన పసి మనసులను  తలిదండ్రులు నిర్దయగా నలిపేస్తున్నారు. తాను ఏమి  నేర్చుకోవాలో తెలియని అయోమయం లో పిల్లలను కుటుంబ వ్యవస్త ఖూనీ చేస్తున్నది. ఇక రెండోది బడి. ఆ బడి ప్రజలు పెట్టుకున్నది కాదు.  తన అవసరాలకోసం ప్రజలనుండి అదనపు ఉత్పత్తిని  ఎలా పిండుకోవాల  అన్న స్వార్థ  చింతనతో దానికి ఓక పద్దతిని రూపొందించి రాజ్యం పెట్టిన బడి అది. ఇక్కడ పెట్టిన కరికులం అంతా కూడా అంటే అది భారతీయ తత్వశాస్త్రం, సాహిత్యం, ఆలోచనలు అన్నీ కూడా హేతు విరుద్దం అయినవి. పుక్కుటి  పురాణాలు.  3000 ఏండ్ల నుండి ఇదే  విధానం మనది. పిల్లలు వేసే అనేక ప్రశనలకు మనవద్ద జవాబులు ఉండవు. ఎంతో అద్భుతంగా వికాసం చెందాల్సిన విద్యార్థిని ఒక చెరసాల, ఒక కాన్సెంత్రేషన్ క్యాంప్ లాంటి చోట పెడుతున్నాం. అక్కడ మళ్ళీ భాష వివక్షత, కుల ,లింగ వివక్షత తో పాటు ఉపాధ్యాయుల కోపతాపాల మనోభావాల ఫలితాలు ఉంటాయి. ఇలాంటి అభ్యసన కేంద్రాలల్లో 48 కోట్ల మంది  18 సంవస్తారాల లోపు పిల్లలు విద్యను అభ్యశిస్తున్నారు. ఇలాంటి చోట్ల వారి శారీరక, మానసిక వికాసం ఎట్లా జరుగుతది? వాళ్ళు ఏ సమాజం గురించి ఆలోచిస్తారు. 3000 సంవస్తారాల నుండి ఇదే ఒక అసమంజసమైన విధానం నడుస్తా ఉంటే మరీ ముఖ్యంగా గ్లోబలైజేషన్ మొదలైనప్పటి నుండి ఈ సమస్యలన్నీ ఇలాగే ఉండగా భారతీయ సంపదను ఎలా కొల్లగొట్టుక పోవాలనే దానికి ఒక ప్రణాళిక జరుగుతున్నది. 


ఈ విషయాలేవీ చెర్చించకుండా కేవలం విద్యావిధానం గురించి చర్చిస్తామంటే మనం గోతిలో పడ్డాట్లే. ప్రపంచీకరణ అంటే స్టానిక సమస్యలు వస్తాయి. ఈ రెండింటి మధ్యన ఘర్షణ ఉంటది. సార్వత్రీకరణకు , వ్యక్తిగతానికి ఘర్షణ ఉంటది. సాంప్రదాయానికి,సనాతన వాదానికి  , గతితార్కికానికి ఘర్షన ఉంటది. దీర్ఘ కాళిక ప్రయోజనాలకు తక్షణ ప్రయోజనాలకు ఘర్షణ ఉంటది.  ఈ ఘర్శనలన్నీ మాయజేసి పోటీ తత్వం, నేర్చుకోవడం అనే ఓ పుక్కిడి పురాణాల కల్పిత గాతలను పిల్లల ముందుకు తెస్తు , మొత్తంగా భారతీయ సంపదని కొల్లగొట్టేందుకు మొత్తంగా 65% శాతం యువతను సర్వీస్ రంగం అనే ఒక కట్టుబానిస వ్యవస్తాలోకి తెచ్చే ఒక  కుట్ర అమలౌతున్నది. 


పైన చెప్పుకున్న అన్నీ సమస్యల గురించి భారతీయ సమాజం ఆలోచిస్తున్నది. వీటికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు జరుగుతున్నాయి. ఈ వైఫల్యాలు వైదొలుగాలి అంటే కార్మికుల, ఆదివాసీల, రైతుల, పేదల, కింది కులాల   బిడ్డలు అందరికీ  శాస్త్రీయమైన ,  నాణ్యమైన విద్య అందాలి. పాఠ్యాంశాలను ఆచరణతో,  శారీరక శ్రమతో, ఉత్పత్తి ప్రక్రియ తో అనుసంధానం జేయడం, అప్పజెప్పే బట్టే విధానం కాకుండా జ్ఞానాన్ని కలిగించే బోధన,  జ్ఞాపక శక్తి కంటే జ్ఞానాన్ని సమీక్షించే పరీక్షావిధానం, వ్యక్తిగత జ్ఞానాన్ని లాజికల్ జ్ఞానం గా లాజికల్ జ్ఞానాన్ని  గతితార్కిక చారిత్రిక జ్ఞానం గా అభివృధ్ధి చేయడం, 40 కోట్ల మంది  పిల్లలు 30 కోట్ల మంది యువకుల జీవితాలు అర్థం,పర్థం  లేకుండా పోవడానికి ముందుగా రాజ్యం , ఆ తర్వాత ఉపాధ్యాయులు, తలిదండ్రులు , పౌర సమాజం మొత్తంగా  బాధ్యత వహించవలసి ఉంటుంది.  దీనికి కారణాలు  కొందరు పిల్ల పైకి నెడితే, కొందరు ఉపాధ్యాయుల పైన మరికొందరు తలిదండ్రుల పైంకి నేడుతున్నారు. తెలివైన వారు మాత్రం రాజ్యం పైకి నేడుతున్నారు.విద్య ఒక వర్గ పోరాటం.  ఒక ఆచరణాత్మకమైన అంశం. విద్య సామాజిక వైరుద్యాల్తో కూడుకున్నది. ఈ వైరుద్యాలు ఏమిటో  తెలుసుకున్నంత  మాత్రాన అవి  పరిష్కారం కాజాలవు .   మరి  ఎవరు పరిష్కరించాలి అంటే విద్యార్థులు తమ వ్యక్తిగత అనుభవాన్ని లాజికల్ అనుభవంగా, లాజికల అనుభవాన్ని గతితార్కిక అనుభవంగా , చారిత్రిక అనుభవంగా చేసుకొని ఉద్యామిస్తూ ఉంటే వారికి జతగా ఉపాధ్యాయులు,  తలిదండ్రులు,  మొత్తంగా పౌర సమాజం ఉద్యామిస్తే దప్ప ఈ విద్యా రంగ సంస్యలకు  పరిష్కారం లభించబోదు.