Saturday, May 14, 2011

ఓట్ల రాజకీయాలు ఎట్లున్నాయో చూస్తున్నారా?

ఒకచోట రెండు లక్షల కోట్ల కుంభకోణం 2స్పెక్ట్రమ్ విషయాన్ని అసహ్యించుకున్న తమిళ ప్రజలు కరుణానిధిని గద్దెనుండి తొలగించారు.అవినీతికి మారుపేరే అయినా జయలలితా చిన్న గీత పక్కన 2g పెద్దగీతే గాదా అని జయాని కరుణించారు.
అట్లాగే పశ్చిమ బంగాల లో మార్క్సిస్ట్ పేరు తో కప్తాలిస్టేక్ పనే జేస్తున్న దొంగ మార్క్సిస్టులకు బాలెగానే బుద్ధి చెప్పారు.
కానీ ఇక్కడ ఆంధ్ర లో మాత్రం అటు అయ్యా రాజశేకారుడు కొడుకి రాజా వారు లక్ష కోట్ల అక్రమ సంపాదనకు పాల్పడ్డా
జనం పట్టిచ్చుకోలేదు.
ఇట్లా ఎందుకు జరుగుతున్నది.ప్రజలు ఎక్కడయిన సహజంగా అవినీతి పరులను నిరంకుశులను సహించరు అది మానవ
స్వభావం కూడా! కానీ ఇక్కడ మానవ స్వభ్వానికి బిన్నమయిన చర్య ఎందుకు జరిగినట్టో విశ్లేషకులు ఆలోచించాలి.ఒకటి
కాంగ్రెస్స్ వాళ్ళు జగన్ కంటే గూడా అవినీతి పరులు అనో లేదా నిరంకుశులు అనో లేదా అప్రాజా స్వామిక వాదులు అనో
ప్రజలు భావించి ఉండాలి.అట్లా చూసి నప్పుడు రాజశేఖర రెడ్డి వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్పినట్టు తాను లక్షల కోట్లు అక్రమంగా
సంపాదిస్తే అందులో తన వాటా తీసుకోకొండానే సోనియామ్మో లేదా వాళ్ళ అధిస్తానమో ఎందుకు ఉరుకుంటుంది.కనుక ఆ
అవినీతిలో సింహా భాగం కాంగ్రెస్స్ పెద్దలకు దక్కింక్ది కాదా?కనుక తమిళ నాద్కులో వలె చిన్న గీతను మరిపిస్తూ పెద్ద గీతా
గీయబడి నప్పుడు సహజంగానే ప్రజలు చిన్న గీతను మన్నిస్తా ఉన్నారు మరి. అందరూ అవినీతి పరులే అయినప్పుడు
అందులో చిన్న అవినీతి పరుల వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ఇది మంచి పరిణామమేనా? మొత్తంగా అవినీతిని
కుటుంబ పాలనను వ్యతిరేకించ కుండా ఇలా చిన్న చిన్న దొంగలకు అధికారం అప్పగిస్తూ పోతే స్వాతంత్ర ఫలాలు అందిరికి
ఈ ప్రజస్వామ్యం లో అందు తాయా?అల అందువు అని ప్రజా రాసులంతా అనుకోని ప్రత్యామ్నాయ రాజకీయాలను
వెదుక్కొంటే తద్వారా సంభవించే సామాజిక కుడుపులకు బాధ్యత ఈ సమ్మంజానిది కాక అందులో భాగస్వాములవబోతున్న
ప్రజారసులదేనా?
ఆలోచనా పరులు అందరూ మిన్న కుంటె రానున్న పరిణామాలకు మా బాధ్యత కేదూ అని తప్పుకోవడానికి కుదురాదు .

No comments:

Post a Comment