Sunday, September 15, 2013

    కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం గనాపురం అనే చిన్నగ్రామం, దానికి తూర్పు వైపున రెండు గొలుసుకట్ట చెరువులు ఉన్నాయి. చేర్రువులకు ముందు అధ్బుతమైన ఒక ఒక ఏకశిలా గుట్ట . ఆ గుట్ట పైన బడిన వర్షం మూలాన ఈ రెండు చెరువులు నిండు తాయి. ఆ రెండు చెరువుల కింద ఆయకట్టు ఇక రెండు వందల ఎకరాలు రెండు పంటలు పండు తాయి. దాదాపు రెండు వందల తాడి చెట్లు ఉన్నయి. యాబై కుటుంబాల గౌడులు ఆ తాడి చెట్ల ఆధారం తో బతుకుతున్నారు. ఒక వంద యాదవ కుటుంబాలు గొర్రెలు మేకలను పోషించుకొని జీవిస్తున్నారు. గుట్ట పైన ఒక ఇరవై వరకు ఎలుగుబంట్లు ఉన్నాయి. అందు వలన రైతులు వాళ్ళ పంట పొలాలకు దొంగ, డోరా భయం లేకుండా జీవిస్తున్నారు. 
  
       ప్రస్తుతం ఆ గుట్టలను గ్రానైట్ క్వారీలకు  కు ఇవ్వడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. గనాపురం తో బాటుగా చుట్టుపక్కల ఉన్న కొన్ని లంబాడా తండాలకు బతుకు దెరువు లేకుకండా పోయే పరిస్తితి. ప్రజల పక్షం వహించి ఇది ప్రజల జీవన విధ్వంసం దప్ప గ్రామ అభివృధికి తోడ్పడదు అని చెప్పా వలసిన స్తానిక ప్రజా  ప్రతినిధులు గ్రానైట్ యజమానులు ఇచ్చే పర్సులకు ఆశ పడి కంటాక్తర్ల  పక్షం వహిస్తున్నారు. అందు వలన ప్రజలు వాళ్ళ వైపున పోరాటం చేసే నాయకత్వం లేక కొట్టు మిట్టు ఆడుతుండుగా గ్రానైట్ క్వారీ యజమానులు అడ్డు అదుపు లేకుండా 400 కోట్ల సంవస్తారాలనుండి  ఈ భూమి పైన ఉండి జీవ వైవిధ్యాన్ని కాపాడుతూ వస్తున్నా ఈ గుట్టలను విదేశీ అవసరాలకోసం కొల్లగోట్టుకొని పోవడానికి సిద్దపడుతున్నారు . 

       సరే ఇవ్వాల కాకపోయినా రేపైన తెలంగాణా రాక తప్పదు .వనరులు అన్ని పోయిన తెలంగాణాను మనం ఏమి చేసుకుందాం ?తెలంగాణా సాధించుకోవడం అంటే తెలంగాణా చెట్టు,పుట్ట , వాగు వంకలను, కాపాడు కొవదమె. కనుక తెలంగాణా వాదులు అంటా ఈ గుట్టల విధ్వంసాన్ని ఖండిస్తూ గుట్టలను కాపాడు కోవాడానికి ఉద్యమాలు చేయాల్సిన అవసరాన్ని గుర్తించ వలసి ఉన్ది. 

      గ్రానైట్ మాఫియ వెంట అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి, అందరు అధికారుల అండదండలు ఉన్నయి. మన లాంటి సాధారణ ప్రజలు అడ్డుకుంటే గుట్టలు ఆగుతాయా అనిపుట్టుకతో వృద్ధులు అయిన  కొందరు సందేహాలు వ్యక్తం చెస్తున్నారు. స్వయానా ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డే రాజశేకర్ రెడ్డే, చంద్రబాబే అడ్డుపడినా మనం తెలంగాణా సాధించుకున్తున్నాం ఆలాంటిది బువ్వ బెట్టి నీడనిచ్చి మనలను ఇంతవరదాక సాదిన గుట్టలను కాపాడుకొని మన తల్లి ఋణం తీర్చుకోవాల్సిన బాధ్యతను నిర్వర్తించ లేమా?కొద్ది మంది తాయీ గండ మతస్తులు పునుకుంటున్న విధ్వంసాన్ని ప్రజలు తలచుకుంటే తప్పక ఆప గలుగు తారు. ఎక్కడైతే గుట్టలు ఉన్నాయో అక్కడ ప్రజలు గ్రామా సందర్శిని కార్యక్రమం రోజున అధికారులను కలసి మా గుట్టల పైన గ్రానైట్ క్వారీకి మేము అనుమతించం అని చెప్పన్ది. 

    పెంటయ్య .వీరగొని. 
     కరీంనగర్ 

    No comments:

    Post a Comment