కొనుగోలు దారులు ఎక్కువైతే రైతులకు ఎక్కువ రేటు వస్తుందా?
సాగు చట్టాలను సమర్థించే వారు చెపుతున్న దాని ప్రకారం కొనుగోలు దారులు ఎక్కువైతే రైతులకు ఎక్కువ రేటు వస్తుంది అంటున్నారు, అది నిజమేనా చూద్దాం.
నిజానికి రైతు మార్కెట్ లో రైతులు అమ్ముకుంటున్న దానికంటే గూడా ప్రస్తుతం ప్రైవేట్ మార్కెట్ ద్వారా నే ధాన్యం ఎక్కువగా అమ్మబడుతున్నది అనేది ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. ఇప్పుడుకూడా రైతులు ప్రభుత్వ రైతు మార్కెట్ లోనే అమ్ముకోవాలే అనే నిబంధనలు కూడా ఏవీ లేవు. ఎవరు వచ్చి రైతుల వద్దనుండి కొనుగోలు చేస్తామన్నాకూడా ఎలా రైతుల వద్ద కొంటావు అని ప్రశ్నించే వారు కూడా ఎవరు లేరు. అయినా సరే సాగు చట్టాలు చేయడమే అని ప్రభుత్వం ఎందుకు మొండి పట్టుదలతో ఉందో తర్వాత చెప్పుకుందాం.
మోనోపాలి ఉంటే ఎక్కడైనా వినియోగ దారునికి నస్టమే. . ప్రభుత్వ రైతు మార్కెట్ మోనాపలి ఏమీ కాదని మొదటే చెప్పుకున్నాము. నిజానికి ప్రివెట్ మార్కెట్ ఇవాళ ప్రపంచం లో మోనాపలి చలాయిస్తు లాభాలు గడిస్తున్నది. అది ఇక్కడ మన దేశీయ మార్కెట్ లో ఎలా చేస్తున్నాధో చూద్దాం. గత సంవస్తరకాలంగా కోవిడ్ 19 మూలంగా ప్రతి రంగం వెనుక బడిపోయింది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ అయితే మరింతగా కుంగి పోయింది అనేది Builders Associations Of India( బిఏఐ) మరియు( BCA) Building Construction Association వారి ఆవేదన. అంటే కట్టడానికి స్కిల్లెడ్ లేబర్ దొరకని కారణం ఒకటైతే, కట్టినవి అమ్ముడు పోనీ కారణంగా మొత్తం పైన రియల్ ఎస్టేట్ రంగం నస్టాల్లో ఉంది అన్నది వారి గోడు. ఐతే ఇప్పటికే ఒక సంవస్తర కాలం గడిచిన కారణంగా ఇప్పుడిప్పుడే ఆ రంగం కొద్ది కొద్దిగా పుంజుకుంటున్నది. కట్టుబడికి ముడి సరుకులు అయిన సిమెంట్, ఐరన్ దరలు ప్రస్తుతం ఆకాశానికి అంటాయి. ఈ సంవస్తర కాలం లో వీటి దరలు సిమెంట్ 24% శాతం ఐరన్ 48% శాతం పెరిగింది. సిమెంట్ కు ఐరన్ తయారీకి అవసరం అయిన ముడి సరుకులు ఏవీ గూడా పెద్దగా పెరిగిన దాఖలాలు ఏమీ లేవు. మార్కెట్ లో సిమెంట్ , ఐరన్ ప్రొక్యూర్ చేసే కంపనీలు చాలానే ఉన్నాయి. వాటి మధ్య అమ్మకోవడానికి అవి ఏమీ పోటీ పడి వాటి దరలు ఏమీ తగ్గించుకోవడం లేదు. పైగా అవి ఒకదానితో ఒకటి పరస్పర ఒప్పందం, అంటే సిండికేట్ అయి దరలు పెంచేసుకొని లాభాల మీద లాభాలు సంపాదించుకొంటున్నాయి. మరి ఇక్కడ మార్కెట్ లో కార్పొరేట్ సంస్తలు పోటీ పడి వినియోగ దారులకు లాభాలు చేకూరే విధంగా వ్యవహరించడం లేదు కదా? Price Controle System ఏమి చేస్తున్నాట్లో సామాన్యునికి అర్థం కానీ విషయం. వాళ్ళు ఎంత రేటుపెట్టిన జనం కొంటున్నారు, కట్టుకుంటున్నారు. ఏమైంది పోటీ? ఎవరికి జరుగుతున్నది లాభం? ఇక్కడ ప్రభుత్వ సిమెంట్ కంపనీలో , ప్రభుత్వ ఇనుప కంపనీలో వినియోగ దాంరుని పక్షాన నిలిచి వినియోగ దారులకు లాభం చేకూర్చడమేమీ లేదు కదా? ఉన్నవి అన్నీ ప్రైవేట్ కంపనీలే కదా, పోటీబడి వాటి ఉత్పత్తులను చౌకగా వినియోగ దారులకు ఇవ్వడం లేదేందుకు? ఇంతింత మాత్రంగా ఉన్న ఈ రైతు మార్కెట్లను కూడా ప్రభుత్వ పాఠశాలల వలె నిర్వీర్యం చేస్తే నోరు లేని రైతుల పరిస్తితి ఏమిటి అని రైతులు ప్రశ్నించడం నేరమా? వారికి విశ్వాసం కల్పించాల్సింది పోయి రైతులను వారిపక్షాన నిలిచి పోరాడుతున్నవారిని దేశ ద్రోహులు, కలిస్తానీలు, పాకిస్తానీలు, చైనీలు, అంటూ తిట్టిపోయడం ఏమిటి? అదేనా ప్రజాస్వామ్యం?
దీని వలన రేపు వినియోగ దార్లు కూడా దారుణంగా నస్టపోతారు. రైతుల వద్ద నుండి ధాన్యం ఎవరెవరు ఎంతెంత కొంటున్నారు, లెక్కలు లేవు. ఎవరెంత స్టాక్ పెట్టుకుంటున్నారు, లెక్కలేదు. ఏమి రేటుకు కొంటున్నారు లెక్కలేదు. ఎంతకూ అమ్మబోతున్నారు ,లెక్కలేదు. ఈ లెక్క లేని తత్వం ఎవరికి లాభం చేకూర్చుతుంది? ఈ విశ్రుంకలత్వం ఎవరి లాభం కోసం?
అరే అయ్యా! రైతు పండించే పంటకు అవసరం అయిన ముడి సరుకు భూమి. అది పంటలు పండించడం ద్వారా నిస్సారం అవుతోందా? మౌలికంగా భూమి దేశ ప్రజల అందరి సొత్తు. అది నిస్సారం అవుతుంటే దాని ఫలితం దేశ ప్రజలందరికీ చెందాలా లేదా?. ఇక రెండోది నీరు. అది ఏ ఒక్కరి సొత్తు కాదు. అది పంటలకు విరివిగా ఉపయోగిస్తారు. నీటి వినియోగం ద్వారా లభించే ఆ లాభం ఏ ఒక్కరికో ఎలా ఇస్తారు. ఎరువులు, పురుగు మందులు, విద్యుత్ ఉత్పత్తికి కాల్చే బొగ్గు, వినియోగం వలన అయ్యే కాలుష్యం వలన దేశ ప్రజలందరూ సఫర్ అవుతారు, ఇంత మంది నస్టానికి కారణం అవుతున్న పంట మీద దొరికే లాభం ఒక్క దళారీకీ పంచి, మిగతా వారి నోరు కొడతా అన్న నీతి నీకు ఏ రాజ్యాంగం నేర్పింది అని ప్రశ్నించడం నేరమా?
రైతు తన పంటను నెలల పర్యంతరం గోడామ్ లల్లో పెట్టుకొని వాటి అద్దే కట్టడం చేయలేడు. ఆ పంట ఆయన అమ్ముకొని అప్పులు కట్టుకోవాలి. కుటుంబ అవసరాల మేరకు అంటే పిల్లల చదువులు, వైద్యం, పెండ్లిల్లు, దుస్తులు, గృహోపకరణాలు, లాంటి అనేకి దినసరి అవసరాలకు ఖర్చు చేసుకోవడానికి ఆయనకు ఉన్న ఒకే ఒక వనరు తాను పండించిన పంట. వ్యాపారి కి వలె ఆయన నెలల పర్యంతం రేటు వచ్చేదాకా నీవు చెప్పినట్లు గోడామ్ లో దాచుకొంటే కుదురదు . ప్రభుత్వం రైతుకు అండగానిలిచి గిట్టుబాటు దర లభించే విధంగా చూడవలసింది పోయి చచ్చిన శవాన్ని రాబందులకు ఈడ్చి పారేసి నట్లు కార్పొరేట్ శక్తుల ధన దాహానికి రైతుల శ్రమను, వారి బతుకు దెరువులను , దేశ మూల వనరులు అయిన భూమి, నీరు, గాలిని వదిలేయడం అమానవీయం అవుతుంది. ఆర్థిక విషయాలు, అన్నపానీయాలతో సంబంధం లేకుండా కేవలం భావావేశాలతో ఎంతో కాలం మనుషులను మోసగించలేమని మనకు హిట్లర్ చక్కటి మార్గదర్శకత్వం చూయించి పోయినాడు.
Veeragoni Pentaiah.
Rtd. Dt. Academic Monitoring Officer
Karimnagar.
9908116990
No comments:
Post a Comment