Saturday, April 10, 2010

తరలిపోతున్న వనరులను కాపాడుకుందాం కదలి రండి.

శిలలు ఈ భూమి మీద ఎప్పుడి ఏర్పడినయో ఆలోచిస్తే ఈ పుడమి తల్లి పురిటి నొప్పుల సమయంలో ఎగజిమ్మిన లావా చల్లబడి ఘనీభవించి ఏర్పడిన

గండశిలలు ఇప్పుడు గుత్తేదార్లకు కొంగు బంగారం అవుతున్నది.మాది కరీంనగర్ జిల్లాలో తూర్పున ఉన్న పాత మహాదేవపూర్ తాలూకా.అక్కడ అడవికి

గుట్టలకు అవినాభావ సంభందం. గుట్టలు ఉన్నాయి అంటే అడవి ఉంటుంది అన్నమాటే. మా చిన్నతనం లో వేములవాడకు ఎడ్ల బండ్లు కట్టుకొని వచ్చే

వాళ్ళం. రామగిరి ఖిల్లా గుట్టలు దాటిన తర్వాత సుల్తానాబాద్ నుండి వచ్చే గుట్టలను మేము బోడ గుట్టలు అని పిలిచే వాళ్ళం ఎందుకంటే ఆ గుట్టల పైన

చెట్లు ఉండేటివి కాదు. అప్పుడు మాకు ఆ గుట్టల పట్ల చిన్న చూపు ఉండేటిది.ఎందుకంటే మా అనుభవం లో గుట్టలు అంటే చెట్లు ఉండాల్సిందే. సుల్తానాబాద్

గర్రెపల్లి.ఎలగందల.నుండి వేములవాడ దాకా అన్నీ గుట్టలే.ఈ గుట్టల వయస్సు 2,500 మిలియన్ సంవస్తారాలు అంటున్నారు తెలిసినవారు.

అయితే ఇప్పుడు తెలుసుకుంటే ఈ గుత్తలు సామాన్యమైనవి కాదు అని తెలుస్తున్నది. వర్షాలు పడినప్పుడు ఈ గుట్టలు ఒంటెలవలే కడుపు

నీళ్ళు త్రాగి మెల్ల మెల్లగా ఆ నీటిని భూమిలోనికి ఇంజెక్ట్ చేస్తాయట. అందుకనే గుట్ట కింద ఉండే ఊళ్లకు నీటి కొరత ఉండదు అని తెలిసినపుడు ఆవురా

ఈ గుట్టలు మానవుల క్షేమం కోసం స్పాంజ్ ముద్దలు అయి నీళ్ళను నింపుకొని మానవుల పాలిటి మరో కాసారం అవుతున్నది కదా? అన్నట్టు రామగిరి

ఖిల్లా గుట్ట కింద ఒక గ్రామం ఉంది దాని పేరు కాసారం. అంటే సముద్రం అన్న మాట. అలాగే ఈ గుట్టలనుడి భూమిలోనికి వచ్కిన నీళ్ళు మనం పైకి

తోడుకున్నపుడు చాలా తీయగా ఉంటున్నాయి.ఎందుకంటే ఆ నీటిలో సల్ఫెట్ లు,ఫాస్ఫెట్ లు ఉండవు.ఎందుకంటే బండరాళ్ల గుండా వచ్చే ఆ నీరు చాలా

ఫిల్టర్ అవుగుండి కనుక. అలాగే గొడుగుకు పైన నల్లగుడ్డ ఎందుకు పెట్టికుంటాం అంటే అది ఉత్తమ ఉష్ణవాహకం కనుక. అలాగే ఈ గండ శిలాలు కూడా

వాతావరణం లోని వేడిని గ్రహించి మనకు చల్లదనాన్ని ఆందిస్తున్నది. ఆకాశం లోని మేఘాలను అడ్డుకొని వర్షాలు పడేటట్లు చేస్తున్నాయి.వేసవి కాలంలో

వీస్తున్న వేడి వడ గాలులను అడ్డుకోని ప్రజలను అగ్నిగుండాల వడ గాలుల నుండి కాపాడుతున్నాయి. సుడి గాలుల నిండి ఎగసిపడిన దుమ్ము,ధూళిల

నుండి మానవ జాతిని కాపాడుతున్నవి ఈ బండ రాళ్ళు అని తెలిసి నపుడు గుండెలే లేని ఈ నల్ల రాతి బండలకు మనుషులంటే ఇంత ప్రేమ,

మనుషుల పట్ల ఇంత దయ జాలి ఎలా వచ్చాయో కదా అని ఆశ్చర్యం కాలుగాక మానదు.
1) మేఘాలను అడ్డుకోని వర్షాలు కురిపిస్తున్నాయి.
2)వర్షించిన నీటిని పుడమి తల్లి కడుపార తాగే విధంగా సరా సరి దాని కడుపులోకే పంపు చేస్తున్నది.
3)ఆ నీటిని కూడా పూర్తి స్థాయిలో ఫిల్టర్ చేసి మనుషులు తాగడానికి అనువుగా చేసి పెడుతున్నాయి.
4)వేడి తాపాన్ని అపుతున్నాయి.
5)దుమ్ము ధూళి నుండి రక్షణ ఇస్తున్నాయి.
6)తనపైనా చెట్లను పెరుగనిచ్చి సీత ఫంలాలు.మామిడి,రేగు, లాంటి ఫలాలను ఇస్తూ మానవుల క్షుద్బాధ ను తీరుస్తున్నాయి.
7) గడ్డి గాదం తనపైనా పెరుగనిచ్చి పశు,పక్షాదులకు ఆకలిని తీరుస్తున్నాయి,
8) తమ దేహలను ముక్కలు ముక్కలుగా చేసుకొని మనకు ఇండ్ల పునాదులు అవుతున్నాయి,గోడలు,పైకప్పులు,చలువ రాతి గచులు అవుతున్నాయి.
9) నెమళ్లకు,గుడ్డేలుగులకు నిలువ నీడై ఇండ్ల యి వాటికి రక్షణ ఇస్తున్నాయి.
10) ఆస్తికులకు దేవత శిల్పాలయి సాంత్వన ఇస్తున్నాయి.

ఇలా ఒక్కటేమిటి మానవ మనుగడకు మానవులకంటే ఎక్కువ దోహద పడుతున్నవి ఈ గుండెలు లేని బండ రాల్లే.హృదయం ఉన్నదని చెప్పుకుంటున్న

మనుషులు ఏమీ చేస్తున్నారు అంటే......

ఈ బండ రాళ్లను కూకటి వేళ్ళతో పెకిలించి వేస్తూ వానలు కురువకుండా అడ్డుపడుతున్నారు

తామే విపరీతమయిన వేడి సెగలు సృస్టిస్తూ చల్ల బరిచే గుట్టలను నిర్మూలిస్తున్నారు.

దుమ్ము ధూళి నుండి కాపాడే రక్షణ వలయాన్ని ధ్వంసం చేస్తున్నారు.

ఉన్న చెట్లను నరికి వేస్తూ ఇకనుండి చెట్లు పెరిగే వ్యవస్థ లేకుండా చేస్తున్నారు.

పశుపక్షాదులకు నిలువ నీడ లేకుండా చేసి అవి గ్రామాలల్లోకి వస్తే కాల్చి చంపి ఎకలాజికల్ సమతుల్యతను నాశనం చేస్తున్నారు.

నిజానికి ఈ విధ్వంసం అంతా చేస్తున్నది సామాన్య ప్రజానీకమేనా? ఎంత మాత్రం కాదు.డబ్బు,రాజకీయ అధికారం ఉండి, రాజ్యాంగం

మీద ప్రమాణం చేసి ఈ ప్రజల జీవన విధానాన్ని మెరుగు పరుస్తామని ప్రజలకు,పర్యావరణానికి రక్షణ కల్పిస్తామని మాయ మాటలు చెప్పి మన ఓట్ల

తోనే అధికారం లోకి వచ్చి ఆ అధికారం ద్వారా సంక్రమించిన అధికారంతో అడిగిన వాళ్ళ నోర్లు మూయిస్తున్నారు. అలనాడు హిరణ్యాక్షుడు సంపద

అంతా తన సొంతమే కావాలనుకొని భూమిని చాప తీరుగా చుట్టుకొని పోయి సముద్రం లోని దాక్కోన్టే తినడానికి కందమూలాలు లభించని వరాహ

సమూహం హిరణ్యాక్షుని వధించి భూమిని కాపడి నట్లు అధర్వులు కోల్పోతున్న బక్క జనులంట సంఘటిత పది పోరాటలకు దిగి ఈ భూమిని

కాపాడకుంటే ఈ రాక్షస సమూహం సామాన్య ప్రజలకు ఈ భూమి పైన ఏమీ మిగులకుండా బొక్కెస్తారు.

సహజ వనరులు ఎక్కడ ఉన్నా అక్కడి స్థానిక ప్రజలకు వాటి ఫలాలు దక్కాలి.కానీ ఎక్కడి వాల్లో వచ్చి ఇక్కడిది అంతా ఎప్పటికీ

లేకుండా ,ఇక్కడి సామాన్యులకు ఏమాత్రం దక్కకుండా దోచుకొని పోతుంటే చూస్తూ ఉంటూ మేము ప్రజలకోసమే ఉన్నము అని మాయ మాటలు

చెపుతున్న రాజకీయ నాయకుల మాటలు ప్రజలు ఇక నమ్మే పరిస్తీతిలో లేరు. స్టానికులకు దక్కకుండా తరలి పోతున్న వనరులను

కాపాడుకుందాం కదలి రండి.ఉద్యమం లో భాగస్వాములు కండి.

No comments:

Post a Comment