Monday, December 13, 2010

మీడియాలో అందరం చూస్తున్నాము. వాళ్ళ హోమ్ మినిస్టరే యేడాదికింద ప్రకటించిన కేసుల ఎత్తివేత అమలు చేయండి అంటే యెంత యాగీ చేస్తున్నారో చూస్తున్నాము.వంగవీటి మోహనరంగా,రాజీవ్ గాంధీ లు చంపబడ్డపుడు ఎన్ని గృహదహనాలు,ఎంత ఆస్తుల విధ్వంసం ,ఎన్ని బస్సుల కాల్చివేత, ఎన్ని ప్రైవేట్ ఆస్తులు బుగ్గిపాలు అయ్యింది మనం మర్చిపోలేదు ఇంకా.అందులో పాల్గొన్నవాళ్లు చాలా మంది గూండాలు,హంతక చరిత్ర ఉన్నవాళ్లే, అయిన గూడా రాజ్యానికి ముఖ్యంగా జయప్రకాష్ నారాయణ లాంటి చట్టాలను గురించి మాట్లాడే వాళ్ళకు ఏది గుర్తుకు రాలేదు.తమ వర్గం,తమ కులం వాళ్ళ పైన కేసులు ఎత్తివేస్తే ఆయా సర్కారులను వీళ్ళు పల్లెత్తు మాట అనలేదు సరికదా అభినందించిన వాళ్ళే వీళ్ళంతా.అది ఎంత చట్టవ్యతిరేకమయింది అయిన కానివ్వండి ఎంత అమానవీయమైంది అయినా కానివ్వండి తమ రాజకీయాలను ఆమోదించే వాళ్లెనా,తమ అడుగులకు మడుగులు ఒత్తే వాళ్లెనా అయితే ఏ కేసులు ఉండవు .వై ఎస్సార్ బాడీ గార్డ్ సూరీడు రాజీవ్ విద్యామిస్సిన్ లోని కోట్లాది రూపాయలను పసి పిల్లలకు దక్కవలసినవి వాళ్ళ విద్యావసరాలు తీర్చ వలసిన సొమ్ము అప్పనంగా బొక్కి కూర్చుంటే సూర్యనారాయణ మీదగాని ఆయన ఉంపుడుగత్తెమీద గాని ఏ కేసులు ఉండవు.
రాజ్యాంగ బద్ధంగా దక్కవలసిన హక్కులను కలరాస్తున్న వేల కడుపు మండిన యువత రాజ్యాంగం లో ఉన్న అవకాశాల మేరకే ఉద్యమిస్తే 307 హత్యా ప్రయత్నం కేసులు పెట్టి తీవ్రమయిన నేరాలకు పాల్పద్దవారిని ఎలా విడిచి పెడుతాము అని ఒక హోమ్ మంత్రి అన్నా ఒక j p అన్నా తెలంగాణ ప్రజలు ఎలా సాహిస్తారు అన్న కనీస ఇంగిత జ్ఞానం లేని రాజ్యం ఆ రాజ్యాన్ని సమర్థిస్తున్న తెలంగాణ శాసన సభ్యులను తెలంగాణ ప్రజలు ఎంతమాత్రం క్షమించరు.
కానీ అధికార పీఠం పయిన కూర్చున్న పెద్దలకు ప్రజల అభిప్రాయాలతో ఏమీ సంబంధం లేనట్లుగానే వాల్లు ప్రవర్తిస్తున్నారు. అది అరిస్టాటిల్ చెప్పింది అయినా అంబేడ్కర్ చెప్పింది అయినా ప్రజల అభీస్టమ్ మేరకే పరిపాలన సాగాలి.కానీ ఏమి జరుగుతున్నదో చూస్తున్నాము, వాళ్ళ వాళ్ళ రాజకీయాలకు ఇబ్బన్దులు గానీ వాళ్ళ ఆర్థిక ప్రయోజనాలకు ఇబ్బందులు గాని జరుగనంత వరకు ప్రజలు ఎంత అరిచి గీ పెట్టిన రాజ్యం పట్టించుకోవడం లేదు అనేది మనం ప్రత్యక్షంగా చాలా చాలా విషయాలల్లో చూస్తున్నాము. అది హైద్రాబాద్ చుట్టుపక్కల భూముల కుంభకోణం గాని సెజ్జులు గాని,జలయజ్ఞం గాని, ఘనుల కుంభకోణం గాని, k v p కొండ సురేఖ పంచాయితీ గాని బోఫోర్స్ కుంభకోణం నుండి బొగ్గుల వాగు ఓపన్ కాస్ట్ కుంభకోణం దాకా అన్నింటిలో ఒకటే ధోరిని అవలంభిస్తున్నారు.
తెలంగాణ విషయం లో కూడా వాళ్ళ రాజకీయ అవసరాలకోసం అప్పుడప్పుడు అది కాంగ్రెస్ కానివ్వండి తెలుగు దేశం కానివ్వండి,ప్రజారాజ్యం కానివ్వండి,రేపు జగన్ పార్టీ కానివ్వండి తెలంగాణ అంటున్నారు, అంటూనే ఉంటారు, తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలన్న తమ బలమయిన ఆకాంక్ష ను అనేక సార్లు చాలా స్పస్టంగా kcr మాటల ప్రకారం దిమ్మ దిరిగి పోయేలా చెప్పినారు.TRS చెప్తున్నట్లు రేపు 16 డిసెంబర్ నాడు 25 లక్షల మంది తో ప్రదర్శన్ చేస్తే ఈ గుడ్డి సర్కారుకు జ్ఞానోదయం అయ్యేది కొత్తగా ఏమీ ఉండది అనేది జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న వారికి అందిరికి సులభంగానే అర్థం అవుతున్నది.ప్రజల అభిప్రాయం ఏమిటో ఇప్పటికే చాలా స్పస్టంగా ప్రజలు పదే పదే చెప్పినారు.బలప్రదర్శన కూడా ఇప్పటికే అనేకసార్లు జరిగింది. కొత్తగా ఈ బల ప్రదర్శనతోటి అదనంగా జరిగేది,ఒరిగేది ఏమీ లేదు.ఖర్చూ కాలయాపన దప్ప .
ఆనాడు బ్రిటిష్ సర్కారును ఎదురించడానికి ఏ సహాయ నిరాకరణ అయితే చేపట్టినామో ఇప్పుడు కూడా పోరాడుటము, ఉద్యమిస్తాము అని చెప్పే శక్తులు,శ్రేణులు, రాజకీయ పార్టీలు,ఒక చంద్రబాబు, ఒక లగడపాటి, ఒక జగన్మోహన రెడ్డి, ఒక కావూరి, ఒక సుబ్బిరామి రెడ్డి, ఒక రామోజీ, ఒక మోహన్ బాబు, ఒక చిరంజీవి, ఒక మురలి మోహన్,ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరైతే తెలంగాణ కు వ్యతిరేకంగా పనిజేస్తూ తెలంగాననే మార్కెట్ గా సొమ్ముజేసుకుంటున్నారో వాళ్లందరి ఆర్థిక ప్రయోజనాలను దెబ్బకొట్టే విధంగా ప్రణాళికలు వేసుకొని అమలు చేస్తేనే ప్రయోజనం ఉంటుంది తప్ప ఇక ఈ మీటింగులు చాటింగులతో ప్రయోజనం ఉండదు, అసలే ఉండడా అంటే ఉంటుంది వాళ్ళ వాళ్ళ ఓట్లు, సీట్ల ప్రయోజనం ఉంటుంది ,తెలంగాణ వచ్చినా మంచిదే రాకున్నా మంచిదే రేపటి లోకల్ బాడీ ఎన్నికల్లో తెలంగాణ పేరుతో మాకిన్ని ఒట్లూ,మా వెంట తురుగుతున్నవాళ్లకు కొన్ని సీట్లు దక్కితే చాలా సంతోషం అనుకునే వాళ్ళు చేసే జిమ్మీక్కులు ఇంకా ఎంతో కాలం జనం నమ్మరు,
ఇప్పటికయినా ప్రత్యక్ష పోరాటానికి ఉద్యమ శక్తులు పిలుపునివ్వాలి. ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని చెప్పడానికి నిదర్శనం ఇంకా ఇప్పటికీ జరుగుతున్న ఆత్మహత్యలే. సీరియస్ పోరాటాలు ఉంటే ఆత్మహత్యలు ఉండవు.

No comments:

Post a Comment