Monday, June 6, 2011

ప్రశించే వాళ్ళంతా ప్రభుత్వం దృస్తీలో ఆటంక వాదుళే!

రాజ్యాంగ బద్ధంగా నిరసన తెలిపినా గూడా సహించలేని స్తితిలో అవినీతి పరులు, వాళ్ళ రక్షకులు!

యోగా గురూ రామ్ దేవ్ బాబాను అరెస్ట్ చేయడానికి ప్రభుత్వం చెప్పిన కారణాలు,1) ఆయన మాట తప్పినాడు అని 2)
శాంతి,భద్రతల సమస్య ఉన్నది అనేది.
ఆయన మాట తప్పింది ఎక్కడ? ప్రభుత్వం ఏదయితే ఒప్పుకున్నదో అదే విషయాన్ని రాత పూర్వకంగా ఇమ్మని అడుగడం
నేరం ఎట్లయ్యిందో?శాంతి భద్రతల సమస్య ఎట్లయ్యిందో ప్రభుత్వం ప్రజలకు అర్థం చేయించడంలో విఫలం అయ్యింది. బాబా
అడుగుతున్న విషయాలను ప్రభుత్వం గనుక ఒప్పుకుంటే నిరసన విరమిస్తానని లేఖ ఇ వ్వుమని అడుగడం లో వారికి ఎంత
హక్కు ఉంటుందో బాబా గూడా ప్రభుత్వాన్ని లేఖ ఇమ్మని అడుగడం లో అంతే హక్కు ఆయనకు కూడా ఉంటుంది అన్న కనీస
ప్రజాస్వామ్య విలువలు పాటించని నిరంకుశ ఏలుబడిలో ఉన్నాము మనం. ప్రభుత్వానికి ఏ రకమయిన కుటిలపు ఆలోచనలు
లేకుంటే వారు అంగీకరించిన విషయాలకు లేఖ ఇస్తే దీక్ష విరమించ బడేదే కదా? మరి ప్రభుత్వానికి ఆ ఇంగిత జ్ఞానం ఎందుకు లేకుండా పోయింది? అంటే ప్రభుత్వం రామ్ దేవ్ బాబా కు ఇచ్చిన మాట మీద కట్టుబడి ఉన్ డడం ఇస్తాం లేదు. ఆ దొంగ సంపాదన అంతా తర తరాలకు తమ వారికే చెందాలన్న రాజ్యాంగ వ్యతిరేకమయిన ఉద్దేశం తో కేవలం మభ్య పెట్టె కొరకే మాట ఇచ్చింది గాని దాన్ని నిలబెట్టుకోవాలన్న నిజాయితీ ప్రభుత్వానికి లేదని తేటతెల్లం అయ్యింది. ప్రభుత్వ నిజస్వరూపం బయట పడింది.
ఇక రెండో కారణం శాంతి భద్రతలు. అసలు ఎవరికి శాంతి? ఎవరి భద్రత? అది పశ్చిమ బెంగాల్ నుండి ఛత్తీస్ గఢ్ దాకా కోయ గోండు గూడాలల్లో పోలీసులతో మాకు శాంతి లేకుండా పోతున్నది.బడా బడా కార్పొరేట్ సంస్తలతో మా భూములకు భద్రత
లేకుండా పోతున్నది అని ఆ ఆదివాసీలు మొత్తుకుంటే మీకు మావో లతో సంబంధాలు ఉన్నాయి అది మా శాంతి భద్రతల
సమస్య అంటూ నోరు ముయిస్తున్నారు. ఇక్కడ రామ్ దేవ్ బాబా దేశంలో శ్రుస్టించ బడ్డ సంపద అది దేశ సంపదే . అది
భారత దేశానికే చెందాలి అన్నందుకు ఆయన్ను అరెస్టు చేసి డెల్లి బహిష్కారం చేస్తారు.ఇదెక్కడి న్యాయం?
మహిళలకు గౌరవం, చట్ట సభల్లో హక్కులు అంటారు. సాక్షాత్తు దేశ రాజధాని నడిబొడ్డున అందునా రాంలీల మైదానం లో
నడి రాత్రి మహిళలు,పిల్లలు అని చూడకుండా విచక్షణ రహితంగా లాఠీ చార్జ్ చేసే అధికారం ఏ రాజ్యాంగం కల్పించిందట
వీళ్ళకు. బాబా చేస్తున్నది రాజ్యాంగ బద్ధమే అయినా వాళ్ళకు నొప్పి కలుగుతున్నది కనుక బాబా దీక్షకు ఆటంకం కలిగించి
నారే అనుకుందాం. కానీ ఈ మహిళలు,పిల్లలు చేసిన నేరం ఏమిటాటా? సరే వాళ్ళ దృష్టి లో నేరమనే అనుకుందాం. కానీ
రాత్రి నిద్ర పోయిన వాళ్ళ పైన దాడి చేయడం ఫ్యూడల్ సంప్రదాయం కూడా కాదుకదా? వాళ్ళు చెప్పుతున్న ఏకైక కారణం
వీళ్ళకు ఆర్‌ఎస్‌ఎస్ వాళ్ళతో సంబంధాలు ఉన్నాయని. మావోలనంటే నిషేదిస్థిరీ మరి ఆర్‌ఎస్‌ఎస్ వాళ్ళను ఎప్పుడు
నిషేధించినారు తండ్రి?
మిమ్ములను ప్రశ్నిస్తే వాడు మావోనో, ఆర్‌ఎస్‌ఎస్ ఓ లేదా ముస్లిం తీవ్రవాదో అని నెపంబెట్టి మీ అవి నీతిని అక్రమాలను
అణిచివేతలను ఎంత కాలం కొనసాగిస్తారు? ప్రజలంతా తిరుగబడనంత కాలం కొనసాగిస్తారు. ప్రజలు తిరుగ బడితే మీరు
ఎంత కాగితం పులులో ఈజిప్టు ప్రజలు నిరూపించారు.
పెంటయ్య. వీరగొని.

No comments:

Post a Comment