Sunday, November 6, 2011

కరీంనగర్ జిల్లా [ప్రజా ఫ్రంట్ !

కరీంనగర్ జిల్లా లో తెలంగాణ ప్రజా ఫ్రంట్

9 వ అక్టోబర్ 2010 నాడు తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఆవిర్భావ సభ హైద్రాబాద్ లో జరిగిన రోజున ఉద్యమాల పురిటి గడ్డ కరీంనగర్ జిల్లా నుండి వేల సంఖ్యలో కార్యకర్తలు హాజరైనారు..
ప్రజా ఉద్యమాల ద్వారానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధ్యపడుతుంది అన్న ఒక స్పష్టమైన అవగాహనతో జిల్లాకు రావడం జరిగింది. జిల్లా నుండి రాష్ట్రానికి ప్రతినిధులుగా డా||సూరేపల్లి

సుజాత.మేకల వీరన్న యాదవ్. తిరుపతి రెడ్డి మరియు వీరగొని పెంటయ్య లను రాష్ట్ర మహా సభలో ఎన్నుకోవడం జరిగింది. జిల్లా కు వచ్చిన వెంటనే సంస్త నిర్మాణ బాధ్యతలు చేపట్టే

కొరకు జిల్లా లో ఉన్న కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, మంథని, హుజూరాబాద్, సిరిసిల్ల డివిజన్లల్లో ఎలా నిర్మాణ కార్యక్రమాలు చేపట్టాలో ఎవరెవరు ఏ డివిజనుకు బాధ్యత వహించాలో

నిర్ణయం చేసుకొని కార్య క్రమాలకు పూనుకున్నారు. సంఘటిత రంగం మాత్రమే గాకుండా చైతన్యానికి మారు పెరయిన సింగరేణి ప్రాంతం నుండే కార్య క్రమాలు ప్రారంభిస్తే ఊపు వస్తుందన్న

ఉద్దేశం తో ముందుగా గోదావరిఖని కి వెళ్ళడం జరిగింది.ఒక 300 మంది హాజరైన ఆ సభ t p f కార్యక్రమాలతో తమ సంఘీభావం వ్యక్త పరుస్తూ నవెంబర్ 1, 2010 విద్రోహ దినం పాటించ

దానికి ముందుకు వచిండ్రు. కానీ కార్య కర్తల పైన వచ్చిన నిర్భందం వలన ఎంత వేగం తో ముందుకు వచ్చిండ్రో అంటే వేగం తో మనం పిలిస్తే మళ్ళీ రాకుండా వెళ్ళిపోయినారు.

అణగారిన హక్కుల పోరాట సంఘం tpf కు మద్దతుగా కరీంనగర్ పట్టణం లో ఒక సభ జరుపుతున్నాం అని ఆ సభకు tpf చేర్మన్ ను ఆహ్వానించారు. కానీ ఆ సభలో హాజరైన

మేకల వీరన్న యాదవ్ ను వేదిక పైకి పిలువక పోవడం మాత్రమే గాకుండా సంస్థ చేర్మన్ అధ్య్క్షతన జరిగిన సభలో సంస్థ జండా కూడా వద్దని తీసివేయడం తో tpf బాధ్యులు బాధపడినారు.

ఆ తర్వాత తెలంగాణ పోలిటికల్ jac నిర్వహించిన సభలకు సంస్థ చేర్మన్ వచ్చిగూడా అక్కడి స్టానిక బాధ్యులకు సమాచారం ఇవ్వకపోవడం తో సంస్త నిర్మాణం పైన దాని ప్రభావం పడ్డది

దాని కారనంగా చాలా కాలం పాటు సంస్త కార్యక్రమాలు ఏవీ గూడా సాగా లేదు. రాస్త్ర కమిటీ సమావేశాలకు హాజరు గావడము డప్ప జిల్లా లో ఏ కార్యక్రమాలు జరుగలేదు.

రాస్థ్త్ర కమిటీ సభ్యులు రత్నమాల, వెదకుమార్ జిల్లా కేంద్రానికి వచ్చిన సందర్భంగా విస్తృత స్తాయి కార్య కర్తల సమావేశం ఏర్పాటు జేసుకొనే జిల్లా అఢక్ కమిటీ వేసుకోవడం జరిగింది.

వి సుధాకర కన్వీనర్ గా మరో 12 మంది కోకన్వీనర్లతో కమిటీ వేసుకున్న తర్వాత కొంత చలనం ప్రారంభమయింది. చొప్పదండి నియోజక వర్గం బాధ్యుడు వీరన్న, కరీంనగర్ టౌన్ బాధ్యుడు

మొగురం రమేశ్ అణగారిన హక్కుల పోరాట కమిటీ బాధ్యుల్డు రమేశ్, మొదలగు వారు తీవ్రంగా కృషి చేసి జగిత్యాల, చొప్పదండి, హుస్నాబాద్, కరీంనగర్ నియోజక వర్గాలల్లో మండల కమిటీలు

మరియు గ్రామ కమిటీలు వేసుకోవడం జరిగింది. 9 అక్టోబర్ 2011 నాడు సంస్త ఆవిర్భావం రోజున అమరవీరుల స్తూపం వధ్ధ ఘనంగా శ్రద్ధాంజలి ఘటించి రేకుర్తి వరకు ఊరేగింపు గా వెళ్ళి అక్కడ

స్టానిక కార్యకర్తల సహకారం ప్రధానగా గాయకుడు పరుషరమ్ నేతృత్వం లో tpf జండాను ఆవిష్కరించుకోవడం జరిగింది.

అక్టోబర్ 13 నుండి సకల జనుల సమ్మేలో భాగంగా సింగరేణి కార్మికులు చేస్తున్న సమ్మెకు సన్హీభావం తెలుపడానికి సంస్థ ఉపాధ్యక్షులు ఆకుల భూమయ్య, వీరగొని పెంటయ్య గోదావరిఖనికి వెళ్ళి

కార్మికులు ఏర్పాటు జేసిన సమ్మేలో పాల్గొని వారికి మద్దతు ప్రకటించి వారి త్యాగాలని కొనియాడి తెలంగాణ సాధించ బడే దాకా తెగించి పోరాడాలని కోరడం జరిగింది. సకల జనుల సమ్మె విరమించ బడ్డ

తర్వాత tpf పేర సమ్మె విద్రోహులెవరూ అని వెలువద్ద కరపత్రం చదివి కొందరు కార్మికులు బాధను వ్యక్తీకరించినారు. సమ్మె ప్రారంభానికి సన్నధ్ధం జేయడానికి ఏ ఒక్క ఉద్యమ సంస్థ గాని, tpf బలపర్చిన

aituc గానీ ఏ కార్మిక సంఘం గాని ముందుకు రాకపోయినా కార్మికులే స్వచ్ఛందంగా పాల్గొని ఇన్ని రోజులు సమ్మేజేస్తే ఖమ్మం లాంటి చోట ప్రధానంగా aituc ముందుబడి సమ్మె నీరుగారిస్తే పిలిచినా

కూడా రాలేమని చెప్పిన ఉద్యమ సంస్తలు ఇవ్వాళ కార్మికుల పోరాటాన్ని , చైతన్యాన్ని కించ పర్చే విధంగా అంటే గాకుండా తెలంగాణకు ప్రధాన అద్దంకి అయిన కాంగ్రెస్స్ ను శకుని పాత్ర పోషిస్తున్న tdp

ని ఒక్క మాటకూడ అనకుండా ఒక వైపు rtc సమ్మె విరమించ బడ్డ తర్వాత నిరాశ నిస్పృహలకు లోనయినా కార్మికులకు ఆత్మ స్టయిర్యాన్ని ఇచ్చి మరో పోరాటానికి సంసిద్ధులను చేయాల్సింది పోయి

ఇలా కరపత్రాలు తీయడం పట్ల ఉద్యమం లో చురుకుగా పోల్గొన్న కార్యకర్తలు తాము నొచ్చుకున్నామని వ్యాసకర్తతో చెప్పినారు.

జిల్లాలో ప్రధాన వనరులు అయిన బొగ్గు, నీళ్ళు, గ్రానైటే, ఇసుక యధేచ్చగా సీమాంధ్ర గుత్తేదార్లతో బాటుగా, తెలంగాణ దొరలు కూడా దోచుకు తింటున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే లోగానే

ఈ వనరులు తరిలీ పోకుండా ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. సింగరేణి లో రోజు ఒక లక్ష తొంబై వేల తన్నుల బొగ్గు, అలాగే రెజు వేల క్యూబిక్ మీటర్ల గ్రానైట్ అదే విధంగా వేల క్యూబిక్ మీటర్ల ఇసుక

ఈ భూమి నుండి తరలిపోతుంటే ఇక్కడి నెల తరిగి పోవడం మాత్రమే గాకుండా స్టానిక ప్రజలకు జీవానాధారాలు అడుగంటి పోతున్నాయి.గుద్దెలుగులు, నెమళ్లు అంతరించి పోతున్నాయి తద్వారా పర్యావరణ

సమతుల్యత చెడిపోయి రేపు రేపు ఈ గడ్డ పైన జన్మించిన బిడ్డలకు పీల్చడానికి పరిశుభ్రమైన గాలి, తాగాదానికి నీళ్ళు, తినడానికి తిండిగుడా దొరుకని దుర్భర స్థితి దాపురించ బోతున్నది. ఈ సమాజం లో

ఆలోచించ గలిగిన ప్రతి మనిషి స్పందించ వల్సిన అత్యవసర పరిస్తితి కరీంనగర్ జిల్లాలో ఉంది.

No comments:

Post a Comment