Thursday, November 10, 2011

సామాజిక తెలంగాణ అవసరమా ఇప్పుడు?

మొదటి SRC రిపోర్ట్ హైద్రాబాద్ ప్రావిన్స్ ను యథాతథంగా కొనసాగించాలని చెప్పినా గూడా సీమాంధ్ర వాళ్ళ రాజధాని సమస్య తేలనందున కర్నూలు డేరాలల్లా

రాష్ట్ర రాజధాని కొనసాగించడం కష్టతరమై ఆనాటి నుండే లాబీయింగ్ లో ఆరితేరిన సీమాంధ్రులు అమ్ముడుపోయే నాయకత్వం తెలంగాణ లో ఉన్న ఖర్మానికి గోరేటి వెంకన్న

పాటలో చెప్పినట్టు సల్లంగా వచ్చి పట్నం లో పరుచుకొనే కుసున్న నాటి నుండే మేం వీళ్లతో కలిసి ఉండలేమన్న వాళ్ళు ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. ఆలాంటి ఉద్యమాలను

కాష్ చేసుకొనే వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు. అయినా పోరాటాలు చేస్తున్న వాళ్ళు మొక్కవోని ధైర్యం తో పోరాటాలు చేస్తున్నారు అమాయకులైన కొందరు యువకులు

ద్రోహులను దొరుకబట్టి చంపే ధైర్యం లేక వాళ్ళను వాళ్ళే అంతం జేసుకుంటున్నారు . ఆ శవాల మీద ప్రమాణం జేసిన నీతి లేని నేతలు వాళ్ళ చావుల పునాదిగా పదవులను

పదిలం జేసుకొనే వాళ్ళు కొందరయితే కొత్తగా పదవులను పొందే వాళ్ళు మరికొందరు దళారీలు బొందకాడి నక్కల లెక్క నక్కి నక్కి జూస్తున్నారు . నంగి నంగి మాట్లాడు

తున్నారు. ప్రజలు అందరినీ గమనిస్తూనే ఉన్నారు. తెలంగాణకు వ్యతిరేకులేవ్వరో, తెలంగాణ రాకుండా అడ్డుపడుతున్న వాళ్ళకు అమ్ముడు పోతున్న

దెవ్వరో , ఉద్యమాన్నీ కుదువబెట్టుకొని నెత్తుటి కూడు తెంతున్నదేవ్వరో ఎవరు ఏందో ప్రజలు చాలా జాగ్రత్తగానే గమనిస్తున్నారు.

1956 నుండి అసమ్మతి గళం వినిపిస్తున్న తెలంగాణ ప్రజలు 1969 లో చెన్నారెడ్డి ద్రోహం నాటికి 370 మందిని కాంగ్రెస్స్ ప్రభుత్వం కాల్పుల్లో చంపి వేస్తే అలా అణిచి

వేయబడ్డ ఉద్యమం లో చురుకైన పాత్ర పోషించిన యువత కేవలం ప్రాంతీయ అసమానతలు మార్చడం మాత్రమే గాకుండా ప్రజల మధ్యనున్న మొత్తంగా అసమానతలను

తోలింగించాలన్న లక్షమ్ తో ఇవ్వాళ దేశ వ్యాప్తంగా ఉద్యామిస్తున్న సంగతి చూస్తూనే ఉన్నాము. 1969 లో పడిలేచిన ఉద్యమం వరంగల్ డిక్లరేషన్ పేరుతో తెలంగాణ

జనసభ నేతృత్వం లో చంద్రబాబు ప్రభుత్వం లో మరో సారి కండ్లురిమి లేచింది, కానీ బాబు ప్రభుత్వం ఆ ఉద్యమాన్ని ఎంతక్రూరంగా అణిచి వేసిందో బెల్లి లలిత దేహం

ముక్కలు ముక్కలు గా నరుక బడిన తీరు చెప్తుంది( ఇప్పుడు మేము సైతం తెలంగాణ అంటూ పాటబాడుతున్న రెండుకండ్ల తెలుగు లీడర్లు ఏమి జవాబు చెప్తారో మరి)

2000 నుండి 2009 వరకు చుక్క రక్తం చింద కుండ ఏ ఒక్కరూ రోడ్డు పైకి రాకుండా తెలంగాణ తెస్తామన్న ఎన్నికల ఉద్యమ కారులు కడకు సకల జనులను రోడ్డు

మీదికి పిలువక తప్పలేదు. పసి పిల్లల నుండి పండు ముసలి వరకూ, గెజిటెడ్ ఆఫీసర్ల నుండీ రోజుకూలి జీతగాళ్ల వరకూ, వివిధ కులసంఘాలు, వృత్తి సంగాలు ,

విద్యార్థి ,కార్మిక, కర్షక సకల జనులు చారిత్రాత్మకంగా 43 రోజులు సమ్మె జేసినా అటు కేంద్ర ప్రభుత్వం గాని ఇటు రాష్ట్ర ప్రభుత్వం గాని స్పందించ లేదు. సరిగదా

ఆ పార్టీ గూడా తప్పించుకునే మాయమాటలే చేక్ప్పింది గాని ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్ష ను మన్నించిన పాపాన పోలేదు. పైగా రెండవ SRC అని మరో మోసానికి

తెరలేపే ప్రయత్నం చేస్తుంటే మరికొంత మంది సామాజిక తెలంగాణ అంటూ కొత్త రాగం ఎత్తుకున్నారు.సామాజిక అంశం తేలేదాకా భౌగోళిక తెలంగాన గురించిన ఆలోచన

వద్ధనీ అడ్డు వస్తున్నారు.

సామాజిక తెలంగాణ వస్తే ఎవరికి ఏమి లాభం? కొందరు SC, ST , BC లకు రాజకీయంగా పోటీలు జెసి గెలిసే అవకాశం ఉంటుంది గావచ్చు.ఈ రోజు ఎన్నికల్లో

గెలువాలంటే డబ్బులు లేన్దే గెలవడం సాధ్యపడదు.ఏ సామాజిక వర్గం అయినా గూడా ఆర్థికంగా ఎంతో కొంత బలంగా ఉంటే తప్ప ఎన్నికల్లో గెలువలేడు. అతడు ఆర్థికంగా

మరింత సంపన్నుడు అయ్యే కొరకు సంపన్న వర్గాలకు చాలా నిజాయితీ తో సేవజేస్తాడు డప్ప తన వర్గం వాళ్ళకు అసలు అక్కరకు రాదు సరిగదా తమ సామాజిక వర్గాన్నే

నిందిస్తాడు కూడా. కరీంనగర్ జిల్లాలో ఇల్లంతకుంట మండలం అనంత సాగర్ అనే వూళ్ళో ప్రాణహిత చేవెళ్ళ ఎత్తిపోతల ప్రాజెక్ట్ కాలువ పోయే తోవలో ఎత్తయిన కొండలు

అడ్డువస్తున్నాయని ఆ కొండల కిందుగా ఒక సొరంగా మార్గం తవ్వాలట. అసలు ఆ ప్రాజెక్ట్ కు ఇంత వరకు ఏ అనుమతులు కూడా లేవు అయినా YSR పుణ్యమా అని

1200 కోట్లతో ఒక ఆంధ్ర బినామీ కాంట్రాక్టర్కు పని అప్పగించి నారు. ఆయన రైతులకు మాయమాటలు జెప్పి సొరంగం కొంత మేరకు తవ్వి ఆ వెళ్ళిన మట్టి అంతా పక్కన

ఉన్న దళిత రైతుల పంటభూములల్లో పోసి బిల్లు ఎత్తుకొని జెండా ఎత్తేసినాడు. అమ్బ్గెడ్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం వచ్చిన రిజర్వేషన్ ద్వారా ఎన్నికయిన ఒక ప్రజా

ప్రతినిధి తనకు ఒత్లేసి గెలిపిచ్చిన ప్రజల పక్షాన మాట్లాడాల్సింది పోయి కాంట్రాక్టర్ పక్షాన నిలిచి దళితుల పక్షాన మాట్లాడిన వాళ్ళను ఘోరంగా అవమాన పర్చిన విషయం

వ్యాసకర్త ప్రత్యక్షానుభవం.

కళ్యాణ్ సింగ్ లోడీ వంశం , కర్పూర్ ఠాకూర్ మంగలి,కరుణా నిధి, లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, ఉమాభారతి వీళ్ళంతా బి‌సి ముఖ్య మంత్రులు

అజిత్ జోగి, బాబు లాల్ మరాన్దీ, అర్జున్ ముండా , శిబూసోరెన్, వీలు ఎస్టీ ముఖ్యమంత్రులు, మాయావతి ఎస్సీ ముఖ్యమంత్రి, అయితే ఏమి జరిగింది? BC,ST ,SC

సామాన్య పేదల బ్రతుకుల్లో ఏమయినా మార్పులు వచ్చినాయ? ఆయా సామాజిక వార్గాల ప్రజల సమస్యల్లో మౌలిక మయిన మార్పులు ఏమయినా జరిగినయా?

ఇప్పటి ఈ రాజులే కాదు, అప్పటి శాతవాహనులు కుమ్మరి వాళ్ళు, చాళుక్యులు గొల్లకుర్మలు, రాష్ట్రకూటులు ఎర్రగొల్లలు,కాకతీయులు కుర్మ, మౌర్యులు దాసి,

గూర్జరులు లంబాడ, పాలిస్తున్నది ఎవరయితే ఏమిటి వాళ్ళు ఏ వర్గ ప్రయోజనాల కొరకు పాటుబడుతున్నారనేదే ప్రధానం. పెంటయ్య్ వీరగొని.

2 comments:

  1. I appreciate your way of approach, The way of explanation, The way of analyses. Genuineness in your words. Then who cares about that.People are the only looser.

    ReplyDelete