Monday, March 26, 2012

ప్రభుత్వమా ఎంత దయలేని దానవే !
గోదావరి నది పైన కరీంనగర్ జిల్లాలో రామగుండము మండలం ఎల్లంపల్లి వద్ద శ్రీపాద ప్రాజెక్ట్ పేరుతొ ఒక ప్రాజెక్ట్ కడుతున్నారు. ఇది తెలంగాణా లో కట్టబడుతున్నది కనుక తెలంగాణా ప్రజలకు మేలు చేసేదని భ్రమ పడు తున్నారు కొందరు. ఈ ప్రాజెక్ట్ 20 టియంసి ల నీళ్ళ సామర్థ్యం తో నిర్మిస్తున్నారు.
7 . 5 టియంసి ల నీళ్ళు రామగుండం ఎన్టిపిసి కి పోతాయి. మన నీళ్ళు మన బొగ్గు తో ఇక్కడ తయారౌతున్న 2600 మేఘవాట్ల విద్యుత్తులో ఆంధ్రప్రదేశ్
వాటా 700 మేఘావాట్లు అయితే తెలంగాణాకు దక్కేది మాత్రం కేవలం 150 టిఎంసి లే. ఇక మంథని కి ఒక 2 .5 టిఎంసి లు ఇస్తుంటే మిగిలన 10 టిఎంసిల
నీల్లు మొత్తంగా హైదరాబాద్ కు తరలిస్తున్నారు. ఇప్పటికే గోదావరికి ఉపనది అయిన మంజీరా నుండి 30 టిఎంసిల నీళ్ళు హైదరాబాద్ కు ఎత్తుకేల్తూ మెదక్ , నిజామాబాద్ జిల్లాల రైతులను ఎండబెడుతున్నారు. అంతర్జాతీయ నది నీటి ఒప్పందం ప్రకారం ఒక నది పరీవాహక ప్రాంతానికి మరొక నది నీళ్ళు తరలించకూడదు.. కాని ఇక్కడ గొదావరినదీ జలాలను కృష్ణా పరీవాహక ప్రాంతానికి నిరాటంకంగా తీసుకొని పోతున్నారు. ప్రస్తుతం మనకు ఈ 10 టియంసిలే
కనిపిస్తున్నాయి కాని రేపు మొత్తంగా 20 టిఎంసి లకు 20 టిఎంసి లు ఎత్తుకొని పోతారు.
ఎల్లంపల్లి నుండి హైదరాబాదుకు 215 కిలోమీటర్ల దూరం చాలా పెద్దపెద్ద పైపుల ద్వారా లోయర్ మానేరు ద్యాములో ఉన్నన్ని తమకు ఒక నీటి చుక్క ఇవ్వకుండా తరలించుక పోతూ ఉంటె ఈ ప్రజలు చూస్తూ ఉండాల్సిందే. ఈ ప్రాజెక్ట్ వలన రామగుండం మండలానికి చెందిన ముర్మురు, ఎల్లం పల్లి, పోట్యాల,
మద్దిర్యాల, ఉండెడ, కొత్తపేట, వెమునూరు, చేగ్యాం, రామునూరు, ముత్తునూరు, మొక్కట్రావుపెట్ మరియు వెల్గతోఉకు కు చెందిన నాటి శాతవాహనుల
రాజధాని అయిన కోటిలింగాల ముంపుకు గురిఅవుతాయి.వీరికి చెందిన దాదాపు 10 వేల ఎకరాల భూమి మరో రెండు వేల నివాస గృహాలు లాగేసు కుంటున్నారు.అలాగే ఎలాంటి భూమి జాగా లేకపోయినా రెక్కల కష్టం జేసుఒని బతుకుతున్న వివిధ కుల వృత్తుల వారికి వారు ఎవరిపైనా అయితే ఆధార
పడి జీవేస్తున్నారో వాళ్ళను నిరాశ్రయులను చేయడం ద్వారా వీళ్ళూ జీవనోపాధి కోల్పోతున్నారు. తాటి, ఈత వనాలు, మామిడి, సీతాఫలాల, చెట్లను చంపెస్తున్నందున గౌడ, తెనుగు, ముదిరాజ్, గొల్ల కుర్మా కులాల వృత్తుల వాళ్ళు తమ జీవనోపాధి కోల్పోతున్నారు. అయితే వీరందరికీ పునారావాసం
కల్పించే సమయం లో ప్రభుత్వం ఎలా వ్యవహరించాలో జివో 68 లో చెప్పింది. ప్రాజెక్ట్ వలన ఆయా ప్రాంతాల ప్రజల సమస్త జీవనోపాధిని లాగేసు కుంటున్నాము
అనే సానుభూతి మాటలు చెబుతూనే ఆచరణలో తిరకాసు పెడుతున్నది.
ఈ గ్రామాలన్నీ సింగరేణి బొగ్గు గనులకు సమీపంగా ఉన్నాయి.బతుకు దెరువు కోసం కొందరు అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు.వాళ్లకు ఆయా గ్రామాలల్లో ఇండ్లు వ్యవసాయ భూములు ఉన్నాయ్. తాత్కాలికంగా పనిజేసే చోట ఉన్నప్పటికిని వాళ్ళ భూముల సేద్యం జేసుకోవడానికి తలిదండ్రులను చూసుకొవాదానికి వస్తుపొతూ ఉంటారు.అయితే పెద్దపల్లి రెవెన్యు అధికారులు మీరు పర్మనెంటు రెసిడెంట్స్ కాదని పునరావాస లబ్ది చెల్లించ నిరాకరిస్తున్నారు.
వాళ్ళ భూములు ,వాళ్ళ ఇండ్లు, వాళ్ళ సమస్త బతుకు దెరువు మరేవరికోసమో త్యాగం చేయండని బలవంతగా నిరాశ్రయులను చేస్తున్నారు. వాళ్ళ తాత
ముత్తాతల నుండి వాళ్లకు అన్నం బెడుతున్న భూమి, పెండ్లిళ్ళు పేరంటాలు చేస్తున్న భూమి, చస్తే వాళ్ళ శవాలను బొందబెట్టుకోవడానికి కడుపు తెరుస్తున్న
నేల తల్లి. ఇప్పటికి ఉద్యోగ రీత్యా ఎక్కడ ఉన్నా ఎక్కడ చనిపోయినా శవాలని తీసుక వచ్చి ఆయా గామాలల్లోనే ఖననం చేసుకుంటారు. అయినా మీరు శాశ్వత నివాసస్తులు కారు మీకు పునరావాస లబ్ది లభించదు అంటూ మిక్కిలి నిర్దయగా వ్యవహరిస్తున్నారు రెవెన్యు అధికారులు.
వాళ్ళ పేరుతొ రెవెన్యు రేకార్డులల్లో భూములు ఉంటాయి,పంచాయితీ రికార్డులల్లో ఇండ్లు ఉంటాయి, ఓటర్ల జాబితాలో పేర్లు ఉంటాయి, రేషన్ కార్డులు ఉంటాయి అయినా మీరు పర్మనెంటు రెసిడెంట్స్ కాదంటున్నారు. ఒక వ్యక్తీ ఆస్తి ఎక్కడైనా కలిగి ఉండడం ప్రాథమికమైన హక్కు, అలాగే జీవించి ఉండడం కూడా
ప్రాథమిక హక్కే! అయినపుడు ఈ అధికారులు ప్రజల ప్రాథమిక హక్కులు అయిన ఆస్తి హక్కు, జీవించే హక్కులను కాల రాయడం లేదా? ప్రజల ఉప్పుదిని
బ్రతుకుతున్న ఈ ప్రభుత్వానికి , అధికారులకు ప్రజల హక్కులను కాపాడాలన్న స్పృహ లేకుండా పోతున్నది.
వందల ఏండ్ల నుండి ఈ గ్రామాలు ఉన్నాయి, గ్రామాలను ఒరుసుకొని గోదావరి నది పారుతున్నది.అయిన ఈ గ్రామాలకు ఒక్కనాడు గోదావరి నీళ్ళ రుచిని
ప్రభుత్వాలు చూపించ లేదు. ప్రజలు వాళ్లకు వాళ్ళు కలుగ జేసుకున్న నీటి వనరులు దప్ప ప్రభుత్వాలు కల్పించిన సౌకర్యాల రాశి ఏమి లేదు. వందల సంవస్తరాల నుండి కలో గంజో దాగి కలిసి మెలిసి జీవేస్తున్న ప్రజలను ఒక్క కలం పోటుతో ఉళ్లు విడిచి వెళ్లి పోమ్మంటుంటే తుపాకి దెబ్బకు పక్షుల గుంపు చెదిరిపోయినట్టు ఆందోళన చెందుతున్నారు. అలాంటి ప్రజలకు సానిభుతితో సౌకర్యాలు కల్పించాల్సింది పోయి మీకు దిక్కున్న చోట చెప్పుకోండి అంటున్నారు.
ఈ గ్రామాలన్నీ ఒక నాడు ప్రజాపోరాటాల ఒరవడిలో ఎరుపెక్కిన చైతన్య వంతమైన గ్రామాలే. మా కాలి కింది దుమ్ము లాంటి వారురా మీరు అంటే ఆ దుమ్మే
వారి కండ్లల్లో ఎగిసి పడిన మట్టి ఇది. ప్రజా రాజకీయాలు నేర్పిన ఎందరో విప్లవ వీరులు నడయాడిన నేల ఇది. అన్నలె గనుక ఉండి ఉంటె మనకు ఈ దుస్తితి
దాపురించి ఉండి ఉండేదా అనుకొంటున్నారు వాళ్ళ సామూహ చర్చల్లో, ఓ ప్రభుత్వమా! సమస్య నీవే సృస్తిస్తావు, పరిష్కారం కోసం వస్తే నీకు దిక్కున్న చోట
చెప్పుకోమని వెక్కిరిస్తావు, ప్రజలను పోరాటాల వైపు ఎగదోస్తావు, ఆ తర్వాత ఆ ప్రజల పైననే తుపాకి ఎక్కుబెడుతావు.
తన ప్రజలను ఆ ప్రజల ప్రభుత్వమే కాల్చి చంపడం ప్రజాస్వామిక పాలన కాదు అని సుప్రీం కోర్టు ధర్మాసనం హెచ్చరించినా ఈ అధికారులకు తలకేక్కనపుడు
ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడ వేదుక్కోవాలో ఆలోచించే వైపు ప్రభుత్వాలే నేట్టివేస్తున్నాయి .
పెంటయ్య. వీరగొని.

No comments:

Post a Comment