Friday, April 6, 2012

ఆత్మహత్యలు ఆపుదాం.

ఆత్మా హత్యలు ఆపుదాం!
ఎందరు ఎన్ని తీర్ల విజ్ఞప్తులు చేసినా ఆత్మా హత్యలు ఆగడం లేదు. అసలు మరి ఈ ఆత్మా హత్యలు ఎందులకు జరుగుతున్నాయి. ఆ
పిల్లల మానసిక స్తాయి అలా ఎందుకు నిరాశావాదం వైపు పోతున్నదో ఆలోచించాల్సిన విషయం. తెల్నగాన లో ఉన్న రాజకీయ నాయకుల
స్వార్థ పూరిత వైఖరి కారణంగానే తెలంగాణా రావడం లేదు అన్న విషయం నిర్వివాదం.
ఇక్కడ మనం ఒక్కొక్క రాజకీయ పార్టీల అప్రజాస్వామిక విధానాల గురించి చూస్తే , తెలంగాణాకు తోలి శత్రువు కాంగ్రెస్. 1956 లో ఆనాటి హైదరాబాద్ రాష్ట్రం తెలంగాణా ప్రజల అభీష్టానికి మరియు ఫసల్ అలీ కమిషన్ కు వ్యతిరేకంగా ఆంధ్ర లో విలీనం కావడానికి ఆనాటి కాంగ్రెస్ పార్టి ప్రభుత్వమే కదా కారణం. అలాగే 1969 ఉద్యమాన్ని అణిచి వేసిన బ్రహ్మానంద రెడ్డి ప్రభుత్వం గాని లేదా తెలంగాణా ప్రజలకు వెన్నుపోటు పొడిచిన తెలంగాణా గడ్డ పైన చెడబుట్టిన చెన్నారెడ్డి గాని కాంగ్రెస్ పార్టి గన్నేరు పలుకుల గంధాలే కదా? బూర్గుల రామకృష్ణ రావు, సంజీవరెడ్డి, బ్రహ్మానంద రెడ్డి, వెంగల రావు , నుండి మొదలుకొని నిన్నటి రాజశేకర్ రెడ్డి రోశయ్య, ఇప్పటి కిరణ్ కుమార్ దాక అందరు తెలంగాణా రాష్ట్రం రాకుండా అడ్డుపడిన వారే. ఆ పార్టీకే చెందినా కొందరు ఎంపి ఏమ్మేల్లె లు తెలంగాణా తెచ్చేది మేమే ఇచ్చేది మేమే అని నమ్మబలుకు తుంటే ఇంకా మనయువకులు నమ్ముతూ వాళ్లకు జై కొడుతున్నారు.
ఇక తెలుగు దేశం పార్టి, అది మొదటి నుండే అంటే ఎన్టి రామారావు నుండే తెలంగాణాకు వ్యతిరేకంగానే ఉన్నది. తెలంగాణా రీజినల్ కమిటి రద్దు, రాష్ట్రపతి ఉత్తర్వులు రద్దు, ఉద్యోగ నియామకాలల్లో వివక్షత, తెలుగు జాతిమనది చక్కగా వెలుగు జాతి మనది అంటూ పాటలు పాడి గోదావరి కృష్ణ డేవలోప్మెంట్ ఫోరం కు రామోజురావు ను నాయకునిగా పెట్టి తెలంగాణా నీళ్ళను మద్రాస్ దాక తరలించుకు పోవడానికి పతక రచన చేసిన తెలంగాణా వ్యతిరేకి. ఆ తాను ముక్క చెంద్రబాబు ఏకంగా 2004 ఎన్నికల్లో తెలంగాణా విడిపోవడానికి వీల్లేదు, సమైక్యాంధ్ర నా నినాదం అన్న మానిఫెస్టో తో ఎన్నికల బరిలో నిలిచిన చరిత్ర టిడిపిది. 9 డిసెంబెర్ 2009 నాడు వచ్చినట్టే వచ్చి పోయిన తెలంగాణా రాష్ట్రాన్ని అడ్డుకున్నది టిడిపి. మొదటి నుండి కూడా అది తెలంగాణాకు వ్యతిరేకమే కనుక ఇవ్వాళ కొత్తగా అది తెలంగాణాకు ద్రోహం చేసేది కూడా ఏమీ లేదు. వాళ్ళు ఏమి చెప్పిన తెలంగాణా ప్రజలు నమ్మే స్తితిలో లేరు. ఆ మేరకు ఈ రెండు పార్టీలు ప్రజల్లో తమ ప్రాభవాన్ని కోల్పోయిన విషయం అంతా గమనిస్తూనే ఉన్నారు.
ఇక తెలంగాణా కోసమే పుట్టినం అని చెప్పుకుంటున్న టి, ఆర్ ఎస్ కూడా తన ఓట్ల సంఖ్యా సీట్ల సంఖ్యా పెంచుకునే కార్యక్రమం దప్ప తనకు తానుగా పెద్దగా చేసింది ఏమి లేదు. 2004 ,2009 , జగిత్యాల్ ఉప ఎన్నికలల్లో మీరు మాకు ఒత్లువేసి గెలిపించండి చుక్క రక్తం చిందకుండా తెలంగాణా తెస్తానని చెప్పింది. అన్నిసార్లు ప్రజలు టి,ఆర్ ఎస్ ను ఆదరించారు.నిన్నటికి నిన్న ఒక్క మహాబుబు నగర్ దప్ప అన్ని చోట్ల టి, ఆర్ ,ఎస్ ను గెలిపించినారు.కాని తెలంగాణా రానే లేదు. పైగా 2014 లో అన్ని సీట్లు గెలిపిస్తే తెలంగాణా వచ్చితీరుతుంది
అనే మాయ మాటలు చెబుతున్నారు. వచ్చే ఉగాది, వచ్చే దసరా, వచ్చే దీపావళి, వచ్చే బక్రీద్ తెలంగాణలోనే అని అబద్దపు మాటలు జెప్పి బిడ్డలను ఆశ పెడుతున్నారు. ఒత్లంటే ఓట్లు వేస్తున్నారు, పండుగల వెనుక పండుగలు పోతున్నాయి. కాని తెల్నగా మాత్రం రావడం లేదు.
కాంగ్రెస్ నాయకులే తెలంగాణకు అడ్డంకి అని ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి అంటడు. కిరణ్ కుమార్ అది కేంద్రం చుసుకున్తున్నది అంటాడు.గండ్ర వెంకట్ రామనా రెడ్డికి దిమ్మ తిరిగి ఇప్పుడు తెల్నగాన ఇచ్చేది మేమే అంటాడు. మేము తెలంగాను వ్యతిరేకం కాదు అని బాబు సన్నాయి నొక్కులు నొక్కుతాడు. ఇంకా ఇక్కడి నర్సింహులు నానా బూతులు మాట్లాడు తాడు, 4 కోట్ల మంది నీ విధానం ఎండని నిలదీస్తే పట్టించుకోదతకాని ప్రధాన మంత్రి, హోం మంత్ర అడిగేతే లేఖ ఇస్తాం అంటడు ఎర్రబల్లి.
ఇక్కడ ఎవ్వరు తెలంగాణాకు వ్యతిరేకం కాదు అంటరు తెలంగాణా మరి ఎందుకు రావడం లేదో అర్థం గాక అమాయకులైన బిడ్డలు ఆత్మాహుతికి పాల్పడుతున్నారు. కాని ఇక్కడే యువత జాగ్రత్తగా ఆలోచించాలి. గ్లోబలైజేషన్ పుణ్యాన ఇవ్వాళ అంతా వ్యాపారమే. డబ్బు సంపాదనే! సంపద ఇచ్చే సౌఖ్యలకు మొహం వాచిపోయిన మొఖాలే! అందునా రాజకీయ పార్టీలు మరీ దారుణం.ఘర్షణ లేకుండా ఎక్కడ మార్పు జరిగిన దాఖలా లేదు. శాంతియుతంగా గాది మహాత్ముడు దేశానికి స్వాతంత్రం తెచ్చాడన్నది పచ్చి అబద్దం. ఒక భగత్ సింగ్, ఒక సుఖ దేవ్, ఒక ఆజాద్ చెంద్ర శేకర్, 1857 సిపాయిల తిరుగుబాటు నుండి చౌరా చౌరీ సంఘటనలు, జలియన్ వాళ బాఘ్ దురంతాల దాకా రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడిన తర్వాతనే ఆంగ్లేయులు భారత దేశాన్ని విడువలేక విడువలేక విడిచిపోయిన విషయాలను మనం చరిత్రలో చదువుకున్నాము. ఇక్కడ 4 కోట్ల తెలంగాణా ప్రజల విముక్తి పోరాటం జరుగుతున్నది. ఇంత కాలం మంది అవకాశాలను , మంది సొమ్మును తిన మరిగిన .శక్తులు అంత సులభంగా తెలంగాణను వదిలి పొవాడానికి అంగీకరించవు.
అందుకని ఇది చదువుతున్న విద్యార్తులార, మేధావులారా, ముందుగా మనమంతా తెలంగాణా వ్యతిరేక శక్తుల తో పోరాటానికి సిద్ధ పడుదాం. మన చైతన్యాన్ని మన చుట్టుపక్కల పంచుదాం, కుత్తుకలకు ఉరితాల్ల్లు బిగించుకోవడం కాదు శత్రువుల ఆర్ధిక మూలాలను కత్తరిద్దాం.
పెంటయ్య,వీరగిని.

Reply

Forward

No comments:

Post a Comment