Wednesday, December 25, 2019

కథలు ఎందుకు రాయాలే? ఎట్లా రాయాలే ?

తెలంగాణ రచయితల వేదిక వాళ్ళు ఈ రోజు కథా వర్క్ షాప్ కార్యక్రమం నిర్వహిస్తే వెల్లుంటి. 
కథలు రాసే యువతరానికి చాలా సూచనలు , సలహాలు ఇచ్చారు సీనియర్ రచయితలు. చాలా మంచి ప్రయత్నం. ఈనాడు ఎవరిని చూసినా , ఏ డాక్తరో, ఇంజనీర్ ఓ, సివిల్ సర్వీసెస్ లోనో  ఉద్యోగం పొంది , బాగా డబ్బులు సంపాదించి ఆ డబ్బుల ద్వారా సేవలను కొనుక్కొని వాటి ద్వారా ఆనందం పొందండి అంటూ తలిదండ్రులు,కార్పొరేట్ విద్యాలయాలు పిల్లలకు, నేర్పిస్తున్నారు. ఈ క్రమం లో ఆ తలియదండ్రులు కూడా తమ జీవితాల్లో  అనేక ఆనందాలను కోల్పోతూ పిల్లలకోసమే , వారికి సంపాదించి పెట్టడం కోసమే జీవిస్తూ నత్త గుల్లల వలె జీవితాలను మోసుకొని తిరుగుతూ జీవిస్తున్నారు. పిల్లలను కూడా డబ్బులు సంపాదించి పెట్టె యంత్రాల వలె తయారు జేస్తున్నారు.దాని ద్వారా పిల్లలకు సామాజిక అవగాహన లేకుండా పోయి , తోటి వ్యక్తుల పైన బడి దౌర్జన్యంగా అయినా తమకు వాళ్ళ వద్ద నుండి  కావాల్సిందాన్ని వీళ్ళు లాగేసుకుంటున్నారు. అది ఒక రకంగా తమ హక్కు అని కూడా భావిస్తున్నారు. పౌర సమాజం ఒక శరీరం లాంటిది. శారీరానికి ఎక్కడ గాయమైనా శరీరం అంతా బాధ పడుతుంది. 

అందుకని పిల్లలకు మొదటి నుండి కన్న తలిదండ్రులు ,  తమతో బాటే పుట్టిపెరిగిన అక్క చెల్లెండ్రు, అన్నదమ్ములు, అమ్మమ్మ, , నాయనమ్మలు, తాతలు, ఇరుగు పొరుగు, వాడకట్టు, ఊరూ వాడా జనుల సహకారం తోనే నీవు పొందిన, లేదా పొందుతున్న ఏ జ్ఞానం అయినా ఏ సౌకర్యం అయినా సాధ్యం అయిందన్న విషయం వాళ్ళకు అర్థం చేయించాలి. అందుకు కథలు చాలా దోహద పడుతాయి. అందుకే పిల్లలు చిన్నప్పటి నుండి కథలు చెప్పుమని అడుగుతుంటారు. కానీ తలిదండ్రులు వారికి కథలు చెప్పే ఓపిక లేక, చెప్పగలిగిన పెద్దవాళ్లను ఇంట్లో ఉండనివ్వక వృద్ధాశ్రమాలకు పంపి, వీళ్ళు టీవీలకు గుడ్లప్పగిస్తే పిల్లలు సెల్ఫోన్లకు కల్లప్పగిస్తున్నారు. పిల్లలను బిజీగా ఉంచగలిగితే వాళ్ళు అసలు సెల్ఫోన్ జోలికి పోరుగాకపోరు. ఉపాధ్యాయులు గానీ తలిదండ్రులు గాని తలుచుకుంటే  అద్భుతమైన కథలను పిల్లలచేత రాయించ వచ్చు. ( నేను అలుగునూర్ హైస్కూల్లో ఉండగా మానేరు గొడపత్రిక ద్వారా పిల్లల రచనలు కొల్లలుగా రాయించాము). అయితే పిల్లలకు ముందుగా మనం కథలు చెప్పాలి. ఏ కథలు చెప్పాలి? పిల్లల స్తాయికి తగ్గ, వారు ఆర్థమ్ చేసుకోగలిగిన స్తాయి కథలు చెప్పాలి. అవి ఏవి అయినా పరస్పరం సహకార పద్దతిలో , ఆనందంగా కలిసి జీవించే విధమైన, అందులో కొంత హాస్యం పాలు, మరికొంత కుతూహలం తొంగి చూసే విధంగా ఉండాలి. కొన్ని కొన్ని పరుల కోసం పాటుబడే హీరో యిజం కథలు కూడా ఉండాలి. అందుకోసం మనం చెప్పే కథలు గాకుండా పిల్లల చేత తప్పకుండా వారానికి రెండు మూడైనా కథల పుస్త కాలు చదివించాలి. 

ఇక ఇక్కడ కతా వర్క్ షాప్ విషయానికి వస్తే , కథలు రాసే వాళ్ళు ఎందుకు కథలు రాయాలి? ఎలాంటి కథలు రాయాలి? అన్నప్పుడు, మనిషి సంఘ జీవి. తనకు తెలిసిన విషయాన్ని మరొకరితో పంచుకోవాలి అనేది మనిషి స్వభావం. అందుకని తనకు తెలిసినది అంతా పంచుకొనే పనిలో ఉంటే ఆ మనిషి ఇంకా మరే పని చేయలేడు. అయితే మరి ఏవి పంచుకోవాలి? ఆనందం తో కలిసి బతకడానికి , సహకారం తో కలిసి బతుకడానికి, పక్కవాళ్ళకు ఉపయోగం అయ్యే విషయాలను తెలుపడానికి మనకు తెలిసిన విషయాన్ని పంచుకోవాలి. ఎలా పంచుకుంటావు? అందరికీ నీవొక్కనివే చెప్పలేవుకదా? అందుకే రాతలు. , అవి కథలు, అవి కవితలు, అవి వ్యాసాలు, కతలైతే కుతూహలాన్ని కలిగిస్తాయి. చదివిస్తాయి.కనుక కథను ఏనూకున్నావు . సరే.  కథలు రాయడానికి మన వద్ద సమాచారం ఉండాలి. అందుకు పరిశీలనా జ్ఞానం కావాలి. ఎలా పరిశీలిస్తావు? అందుకు నీకోక దృక్పథం కావాలి. ఏమి దృక్పథం? కొందరికి భక్తి దృక్పథం. అది వారికి మాత్రమే ఆనందం ఇస్తుంది. కొందరికి భజన దృక్పథం అది వారికి మాత్రమే భుక్తిని ఇస్తుంది. కొందరికి వర్గ దృక్పథం. అది అశేష జనబాహుల్యానికి అన్నపానాదులను అందించడం మాత్రమే గాక సమ భావం తో సంతోషంగా కలిసి జెవించడం నేర్పిస్తుంది. మరి ఆ దృక్పథం అలవడాలంటే ఏమి చేయాలంటే, ఆదివరకే ఆ కోణం లో ఉన్న రచనలను చదువాలి. ఆ కోణం లో ఎవరెవరు రాశారో తెలుసు కోవాలి. పురాణ కాలం లో అయితే చార్వాకులు, లోకాయుతులు, ఆ తర్వాత మత రాజ్యాలు వచ్చిన తర్వాత వాటిని ప్రశ్నించిన భక్తి ఉద్యమ కారులు. భారత స్వాతంత్రోద్యమ కాలం నాటికి భగత్ సింగ్. ఆయనకు ఆ దారి చూపిన ప్రపంచ దేశాల వర్గ పోరాటాలు. వాటికి ఆలంబనగా నిలిచిన సిద్ధాంతాలు. హేతువాద దృక్పథం. హేతువాద కొనసాగింపుగా వచ్చిన అందరికీ అన్నీ సమానంగా దక్కాలి అన్న నినాదం.  ఈ బూమి పైన పుట్టిన మానవులంతా సమానమే. ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు. ఎవరైనా మేము ఎక్కువ మాకు మీ కంటే కొంచెం ఎక్కువ దక్కాలే అని అంటే మాత్రం ఖచ్చితంగా అలా కోరిన వాళ్ళు మరొకరి అవకాశాన్ని దోచుకున్నట్టే. కనుక ఉత్పత్తి అయినది అంతా సమానంగా పంచవడాలే. అనే వాదన ముందుకు వచ్చింది. ఆ వాదనను కాదనే వాడు ఎవడైనా వాడు దోపిడీ దారే. ఈ వర్గ స్పృహ పొందడానికి వర్గపోరాటాల పైన వచ్చిన సాహిత్యాన్ని విస్తృతంగా అధ్యయనం చేయాలి అని చెప్పాలే. ప్రస్తుతం హైద్రాబాద్ లో జరుగుతున్నా బుక్ ఎక్సిబిషన్ ను పుస్తక ప్రియులు వినియోగించుకోవాలి . 

No comments:

Post a Comment