భారతమా ఎటువైపు నీ పయనం !
మునుపెన్నడూ కనీవినీ ఎరుగని ఒక భయానకమైన ప అరిస్తితి. పులి దాడికి ఆలమంద జడిసి పరుగులిడినప్పటి పరిస్తితి. ఆనాడు ఆలమందకు ఓ బోయిడు ఉన్నాడు కనుక బతికున్న మందకు ధైర్యానికి నేనున్నాను భయం వీడి మేతమేయండి అని ధైర్యం చెప్పే ఉంటాడు. కానీ ఇప్పుడేమో సర్కారు మీడియా కలిసి కావాల్సినంత భయాన్ని కుమ్మరించి తడిసి వణుకుతున్న జనాల్ని పట్టించుకోకుండా రొమ్ తగలబడుతుంటే ఫిడేలు వాయించుకొన్న రొమ్ చక్రవర్తి చందంగా వారి కంఫర్ట్ జోన్ లో వాళ్ళు హాయిగా బాతాలు జెప్పుతూ బతికేస్తున్నారు.
రాష్ట్రంలో పార్టీ ఆఫీసుల నిర్మాణాల పైన, అడవులు, గుట్టలు నరికెసి నాటిన మొక్కల పైన, తమ కార్య కర్తలతో రివ్యూ చేసుకుంటున్నారు. అరే మేరే భయ్యా! ఇప్పుడు అది గాదు కదా కావాల్సింది? మీ ఉర్లే నర్సు, ఉందా? మీ మండలం లో ఉన్న దవాఖాంల డాక్టర్లు, నర్సులు ఎందరున్నారు? మందులున్నాయా? కారెంటైన్ కు సరిపోయే పబ్లిక్ ప్లేస్ లు ఉన్నాయా? ( స్కూల్ భవనమో, పంచాయత్ కార్యాలయామో, ఇంకా ఏదైనా) , మీ గ్రామం ఎవరికైనా కరోనా వస్తే సహకరించి ధైర్యం చెప్పడానికి ఎంతమందితో వాలెంటీర్ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నారు? నా నుండి ( MP,MLA,MPP,MPTC, Sarpanch) ఏ సహాయం కావాలో చెప్పండి, నేనున్నాను అధైర్యపడవద్దు అని ధైర్యం చెప్పే నాయకుడే కరువైపోయిండేంది?
ఇప్పుడు అర్జంటుగా మనుషులకు కావాల్సింది వైద్యశాలలు. కానీ మనం ఏంజెస్తున్నం? గుళ్ళు కడుతున్నం, ఇంకా అడిగితే ఉన్నవి కూలగొట్టి మరీ కొత్తై కడుతున్నం. భారత ప్రధాన మంత్రి గుడి శంకు స్తాపనకు పోతడు. నరేంద్ర మోడీకి తాను ఏ మతాన్నైనా కలిగి ఉండే హక్కు ఉంటది. కానీ ప్రధాన మంత్రి పదవికి ఏ మతము ఉండదు, రాజ్యాంగ పదవులు మతాతీతమైనవి అని మన రాజ్యాంగం చెబుతున్నది. కానీ మన ముఖ్యమంత్రులు తమ మత విశ్వాసాలమేరకు ప్రజల డబ్బులతో గుడులకు మొక్కులు చెల్లించుకుంటరు. రాజకీయ లబ్దికొరకు హజ్ యాత్రికులకు,మసీద్, మందిర పూజారులకు, ప్రభుత్వ ఖజానా నుండి డబ్బులు చెల్లిస్తారు. బోనాలు, ఇఫ్తార్ విందులు, క్రిస్మస్ ఈవ్ లు ప్రభుత్వ ఖర్చుతో నిర్వహిస్తారు. రాజ్యాంగ స్పూర్తి కి ఇది విరుద్ధమైనా మనం చేస్టలు ఉడిగి చూస్తుంటాము.
భారత రాజ్యాంగం లో ఉన్న సెక్యులర్ మరియు సోసియలిస్టిక్ అన్న రెండు పదాలకు ప్రస్తుతం చోటు లేకుండాపాలకులు జాగ్రత్త పడుతున్నారు. అప్పటి కేంద్ర హోమ్ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ రెండు పదాలను తొలగించి భారత రాజ్యాంగం రీరైట్ చేయాలని ఏకంగా భారత పార్లమెంట్ లోనే చెప్పారు. ఇలా ఎందుకు చేస్తున్నారు అంటే, వారు ఏ మతం పట్ల విశ్వాసం కలిగి ఉన్నారో ఈ దేశం లోని మిగతా ప్రజలంతా అదే విశ్వాసం కలిగి ఉండాలి అన్నది వాళ్ళ ఉద్దేశం . అవును అలా ఉంటే తప్పేమిటి అన్న ప్రశ్న వేసేవారు ఎక్కువగానే ఉన్నారు. అప్పుడు మరి రాజ్యాంగం లోని మతస్వేచ్ఛకు అర్థం లేకుండా పోతది కదా? అంటే , పోతే పోతది కావచ్చు, అయినా ఈ మతం గోల నీకెందుకయ్యా అని మీరనొచ్చు. అది అంతవరకే అయి ఊరుకోవడం లేదే? మతం ప్రాతిపదికన రాజ్యాధికారానికి వచ్చిన చరిత్ర మన కండ్ల ముందే కదలాడుతున్నది కదా? ఎల్ కె అద్వానీ, మురలి మనోహర జోషి లాంటి వాల్ల రథయాత్ర ఫలితమే గదా బిజెపికి అధికారం ప్రాప్తించింది? సరే ఇప్పుడు వాళ్ళను భూమి పూజకు పిలువనే లేదట. ఇదికూడా ఒక సంకేతమే, అధికారం ఎవరిచేతిలో ఉంటే వారిమాటే చెల్లుబాటు. అక్కడ అంతకు ముందు కృషి చేసిన వారి పట్ల కృతజ్ఞత, గౌరవ మర్యాదలు ఉండవలసిన అవసరం లేదని ఈ ఉదంతం నిరూపిస్తున్నది. సరే మత భావనలు పాలన లో అమలు జరిపేవారు రాజ్యాధికారం లోకి వస్తే నీకో, సామాన్యులకో జరిగే నస్టమ్ ఏమిటో అన్నది కదా మీ ప్రశ్న?
కస్తూరి రంగన్ కమిషన్ , బి ఎడ్ ను 4 సంవస్తారాల కోర్స్ చేసింది. 2 సంవస్తారాలు విద్యార్థులకు ఎలా బోధించాలో నేర్పిస్తారట. మిగతా రెండు సంవస్తారాలు దేశం లో అనాదిగా వస్తున్న సనాతన సంస్కృతి , ధర్మాలు, ఇతిహాసాల గొప్పదనం గురించి బోధిస్తారట. అవ్ , బోధిస్తారు, అయితే తప్పేమిటి? అంటే ఉపాధ్యాయుని సామాజిక చింతన ఏదైతే తన విద్యార్థులకు అదే బోధిస్తాడు. కనుక ఈ సమాజాన్ని తమ భావజాలానికి అనుగుణంగా, ప్రశ్నించే తత్వం లేకుండా, ఒకడు ఇచ్చేవాడు ఉంటాడు, మనం వాణ్ని ప్రార్థించి ప్రసన్నం చేసుకొని అడుక్కోవాలి అంతే గాని ఇవి మా హక్కులు అంటూ ప్రశ్నించ కూడదు అని నేర్పించే ఉపాధ్యాయుల ను తయారుజేస్తారట . ఒక మూస ఉంటుంది. ఆ మూసలో ఏ మట్టి నింపినా ఒకే రకమైన బొమ్మలు వస్తాయి. ఆ మూస ద్వారా ఎన్నయినా ఒకే రకమైన వినాయకుల విగ్రహాలు తయారు చేయవచ్చు. ఆ మూస తో రాముని విగ్రహాలు చేయలేము. కనుక కొత్త ఉపాధ్యాయ మూసలను సమాజ నిర్మాణం కోసం తయారు చేసి తేబోతున్నారట.
ఇక సోసియలిజం అంటే సమానత్వం. వ్యవసాయం మొదలైన తర్వాత ప్రపంచం లో ఏ సమాజం లో కూడా సమానత్వం లేకుండా పోయింది. భారత దేశం లో మరీ లేకుండా పోయింది. ఇక్కడ కులాలు, వర్ణాలు ఉన్న మూలంగా ఒక కులం ఎక్కువ మరో కులం తక్కువ అనేది అనాదిగా ఉంది. అలాగే స్త్రీలు పురుషులతో సమానం అనే భావన కూడా లేదు. న స్త్రీ స్వతంత్ర మర్హతి అన్నారు. పుస్తకం వనితా విత్తం , పర హస్తం గతం గతః అన్నారు. ఇట్లా ఎన్నయినా చెప్పవచ్చు. ప్రజాస్వామిక పోరాటాలు జరిగిన దేశాలల్లో రంగు, లింగ బేధాల వివక్ష ఉండకూడదన్నారు. ఆ స్పూర్తి మేరకే భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేడ్కర్ , దండలో దారం వలె రాజ్యాంగ స్పూర్తిలోనే సెక్యులర్ సోసియలిజం భావనల సువాసనలను భారత రాజ్యాంగానికి అద్దినాడు. కానీ ఆ రెండు పదాలకు నేడు కాలం చెల్లిపోయింది అంటున్నారు పాలకులు.
No comments:
Post a Comment