Wednesday, February 17, 2010

త్రాగు నీళ్ళకొరకు తెలంగాణలో గిరిజనుల వలసలు

అది ఆదిలాబాద్ జిల్లాలోని కెరమెరి మండలం నుండి 25 కిలోమేటర్ల దూరంలో బాబే ఝరి దాటిన తర్వాత ఉన్న జోడేఘాట్.ఆ పేరు వింటేనే ఒక

జలదరింపు,ఆ పేరు వింటేనే ఒక పూనకం,ఆ పేరు వింటేనే ఒక త్యాగం ఒక బలిదానం.రోడ్ సౌకర్యం లేదు.బస్ గాని ఆటో గాని లేదు.సెప్టెంబర్ ఒకటి

కొమురమ్ భీమ్ అమరుడైన రోజు గుర్తుగా అక్కడ ఒక సభ జరుపుతారు,ఆ రోజు అధికారులకు నాయకులకు జోడే ఘాట్ జ్ఞ్యాపకం వస్తుంది.ఆ రోజు అక్కడి

ప్రజల విజ్ఞప్తి ఏమిటంటే మాకు గొంతు తడుపుకోవడాని ఇన్ని నీళ్ళు,మాఉరికి మీరు రావడానికి ఒక తొవ్వ ఇది వాళ్ళు గత యాభై సంవస్తారాల నుండి

కోరుతూనే ఉన్నారు నాయకులు అధికారులు హామీలు ఇస్తూనే ఉన్నారు కానీ ఇప్పటికీ అది అమలుకు నోచుకోలేదు.
ఒక ఆటో కిరాయికి తీసుకొనే ఆ గుట్టల మీదుగా బండల మీదుగా పెద్ద దుమ్ములో కొమురమ్ భీము నేలకొరిగిన ఆ స్థలాన్ని చూడాలన్న తలంపుతో

వెలుతున్నాం. నెత్తిపైనమూటలతో కాలినడకన వస్తున్న జనం మా పరిస్థితి ఇప్పటి కి కూడా ఇలా ఉంది చూడండి అన్నట్లుగా మా వైపు అమాయకంగా

చూస్తున్నారు.ఆ చూపులు మేము పొందుతున్న సౌకర్యాలను నిలదీస్తున్నట్లుగా అనిపించాయి.ఎత్తయిన రాతి గుట్టలు,కిందికి చూస్తే ఒళ్ళు జలదరించే విధంగా

ఉన్న లోయలు కలపకు ఏమాత్రం పనికి రానందున వదలి వేయబడ్డ అందుగు,తపిశి,దుంపిడి,కొడిష.విషముస్టీ,కారెంగా ,తునికి ఇప్ప చెట్లు మాత్రం

పలుచగా ఉన్నాయి,జోడేఘాటులో ఆ గ్రామ పెద్దమనిషి కొమురమ్ భీమ్ మేనల్లుడు అయిన పెందురి సోము మమ్ములను చూసి ఎదురుగా వచ్చి రామ్

రామ్ అంటూ విష్ చేసినాడు.అన్నము లేదు కొన్ని మధురంబములున్నవి త్రావుమన్న అని అలనాడు రంతి దేవుడు అన్నట్లుగా సోము మాకు తాము

ఎంతో ప్రియంగా దాచుకున్న మంచినీళ్లు ఇచ్చాడు.మంచం మీద కూచున్న తర్వాత తమ సమస్యలు ఏకరువు పెట్టినాడు.
ఆ గ్రామం లో గొండు ,కోలామ్ లు కలిసి 40 కుటుంబాలలో 260 జనాభా ఉన్నారు.గుట్టల పైన అక్కడక్కడ సమానంగా ఉన్న భూమిలో జొన్నలు,కందులు,మక్కలు,పెసలు
పత్తి పండించుకొని పొట్టపోసుకుంటున్నారు.మేకలు కోళ్ళు సాదుతారు.గుట్ట కింద ఆడదస్నాపూర్ అని ఒక గ్రామం ఉంది.మోవాడ్ ఆడదస్నాపూర్ గ్రామాల

మధ్యగా పారుతున్న వాగు మట్టం నుండి జోడేఘాట్ 200 మీటర్ల ఎత్తులో ఉంది.వీళ్లకు రక్షిత మంచినీరు ఆ వాగు నుండి కాకుండా ఆ గుట్టపైన్ బోరు వేసి

8 లక్షలఖర్చుతో రక్షిత మంచినీరుకు టాంక్ అయితే నిర్మించారు .కానీ వాటర్ సోర్స్ లేనందున వాళ్ళకు తాగడానికి నీళ్ళు లేవు.జియాలోజికల్ సర్వే

వాళ్ళు బొర్లు వేస్తే నీళ్ళు పదే అవకాశం లేదు అన్నారట.అప్పటికే వేసి ఉన్న బోర్లా ను ఇప్పటికీ మూసివేయనే లేదు.అయితే తమ నీటిసమస్యను ఎప్పటిలాగానే

అందరికీ విన్నవించినారు.రెస్పాన్స్ రానందున రోడ్ పైకి వచ్చి ధర్నా చేశారు. ఐ టి డి ఏ ప్రాజెక్ట్ అధికారి గాని స్థానిక రాజకీయ నాయకులు గాని

స్పందించ లేదు.గత్యంతరం లేని ఆ గిరిజనులు గుట్ట కింద గల ఆడదస్నాపూర్ మోవాడ్ గ్రామాల మధ్య ప్రవహిస్తున్న వాగు ఒడ్డున అన్నీ గుడారాలు

వేసుకొనే పిల్లా పాప గొడ్డు గోదా కోళ్ళు కుక్కలు తీసుకొనే ఇండ్లకు తాడుకలు పెట్టి గ్రామానికి గ్రామం వలుస పోయింది.
స్థానిక పత్రికలు వార్తలు రాసినాయి.వార్తలు చూసి వెళ్లిన మానవ హక్కుల వేదిక తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ బా
ధ్యులకు గిరిజనులు చెప్పిన బాధలు

విన్న తర్వాత నాగరికుల అవసరం కోసం ప్రాణహిత నుండి 400 మెటర్ల ఎత్తుకు 400 కిలో మీటర్ల దురానికైన తరలిస్తారు నీటిని కానీ నోరులేని ఈ

గిరిజనులకు కేవలం 2కిలోమేటర్ల నుండి 20 లక్షల ఖర్చుతో నీళ్ళు తరలించ లేక వాళ్ళు వలసలు వెళ్ళే పరిస్థితి కలిపించడం సరియయింది కాదు

అనిపించింది..
ఈ రెండు ప్రజా సంఘాల పక్షాన అధికారులకు ప్రాతినిధ్యం చేసి వెంటనే తాగు నీటి సౌకర్యం కలిగించకపోతే మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు

చేస్తామని హెచ్చరించినాము.మానవ హక్కుల కమిషన్ కు భయ పడిన అధికారులు జియలాజిస్టులు సాధ్యపడదు అని చెప్పిన ఆ గుట్ట పైననే మరో బోరు

వేశారు.ఆ గిరిజనుల అదృష్టం ఏమో కానీ నీళ్ళు వచ్చినయి.తాత్కాలికంగా సమస్య తీరింది కానీ శాశ్వత ప్రరిష్కారం మాత్రం ఆడదస్నాపూర్ వాగు నుండే

అని అధికారులు గమనించాల్సిన అవసరం ఉంది.
అడవులు అంతరించిపోవడం వలన సంవస్తారానికి సంవస్తారానికి వర్షపాతం తగ్గి పోతున్నది.ఆదిల బాద్ జిల్లా లో ఈ సంవస్తారమ్ 50 శాతం వార్హాపాతం

తగ్గిపోయింది అని ఆధికారిక గణాంకాలే చెబుతున్నాయి.ఇప్పుడే ఈ పరిస్థితి ఉంటే ఏప్రిల్ మే మాసాలల్లో నీటి ఎద్దడి ఎంత అధ్వాన్నంగా ఉందనున్నదో

అధికారులు గమనించి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.ప్రతి సంవస్తారామ్ కేవలం శుభ్రమయిన మంచినీళ్లు లభించకనే వందలాదీ

అమయక గిరిజనులు ప్రాణాలు కోల్పోతున్నా విషయం ప్రభుత్వానికి తెలిసి కూడా ఇంత నిర్లక్షం వహిస్తున్నదంటే ఈ ప్రభుత్వాలు ప్రజల చేత,ప్రజల వలన

ప్రజల కొరకు ఉన్న ప్రభుత్వాలేనా అని ప్రజలు నిలదీసే రోజులు ఇంక ఎంతో దూరము లో లేవు.

No comments:

Post a Comment