Tuesday, July 6, 2010

పెట్రోల్ ధరల పెంపు బందులు.

పెట్రోల్ ఉత్పత్తుల పెంపు పైన దేశవ్యాప్తంగా బంధు జరిగింది.ప్రజల మద్దతు సంపూర్ణంగా ఉన్నది అనడానికి అనేక ఉదాహరణలు
ఉన్నాయి. ప్రభుత్వాలు ప్రజల ఇస్టమ్ మేరకే పరిపాలించాలి మరి. ఒకవైపు ప్రజలంతా పెట్రోల్ ధరల పెంపును వ్యతిరేకిస్తుంటే
ప్రభుత్వం మాత్రంససేమిరా అంటున్నది. అంతేగాకుండా భరత్ ఝన్ ఝన్వాలా లాంటి ప్రజా వ్యతిరేక మేధావులు ప్రభుత్వ
పాలసీలను సమర్థిస్తూ పత్రికల్లో వ్యాసాలు రాస్తుంటారు. మరో పాలక మేధావి ఇందర్ మల్హోత్రా రాజీవ్ గాంధీ చేసిన ఏకైక మంచి
పని భోపాల్ లో ఎం ఐ సి గాస్ లీక్ కు కారణమైన అందర్శన్ ను విడిచి పెట్టదమేనని కితాబు ఇస్తాడు. ఇంతటి ప్రజా వ్యతిరేకమైన
వ్యాసాలను మన పత్రికలు ప్రచురిస్తాయి.
బందు వలన 13 వేల కోట్లు నస్టమ్ జరిగిందట.ఇది జాతికి నస్టమట.కనుక బంధు జరుపవలసింది కాదని కొందరి వాదన.సరే వాదన
కొరకు ఒప్పుకుందాం. కానీ ప్రజల అభీస్టానికి వ్యతిరేకంగా పెంచబడిన ధరల వలన ఎన్ని లక్షల కోట్ల నస్టమ్ వాటిల్లనుందో ఈ
మేధావులు చెప్పరు. పైన చెప్పిన 13 వేలు ప్రజల నస్టమ్ కాదు అవి వాస్తవానికి ప్రజలకు మిగిలినాయి. కానీ ధరవరల పెరుగు
దలతో నస్టమ్ వాటిల్లేది ప్రజలకు. లాభాలు వచ్చేది పెట్టుబడి దార్లకు.
భరత్ ఝన్ ఝన్వాలా మాటల్లోనే మనం ఉపయోగిస్తున్నపెట్రోల్ లో దిగుమతి చేసుకుంటున్నది 80% మన దేశం లోనే లభిస్తున్నది
20%.మరి మన దేశం లోనే లభిస్తున్న 20% పెట్రోల్ పైన గూడ ఈ పెరిగిన ధరలు వర్తిస్తాయి. అది వివక్షత గాదా? ఈ డబ్బులు
ఎవరి ఖతాలోనికి పోతున్నాయో ఎందుకు లెక్కలు చెప్పరు? దరలు పెంచకుంటేనట ప్రభుత్వాలు ఆ ధరలు భరించడానికి
అదనంగా కరెన్సీ ముద్రించ వలసి ఉంటుందట? ఎంత అడ్డగోలు లెక్కలు చెప్తున్నారు ఈ మేధావులు? కరెన్సీ ఎలా ముద్రుస్తారు?
దేశం లో ఉత్పత్తి కానున్న సకల వస్తువులు సరుకులుగా మారి మార్కెట్ లోనికి వస్తే వాటిని మారకం చేసుకోవడానికి అవసరమైన
మేరకు కరెన్సీ ఉత్పత్తి చేస్తుంది ఏ దేశమైనా. ప్రభుత్వ నిర్వాహణ కొరకు సరుకుల పైన పన్నులు వేస్తాయి ప్రభుత్వాలు. అలా
కాకుండా ఇస్టమ్ వచ్చిన విధంగా కరెన్సీ ముద్రించుకుంటూ పోతే ఆ కరెన్సీ కి విలువే ఉండదు. ఇంతటి నగ్న సత్యాలను
సైతం అబద్దాలతో దేశ ఆర్థిక విధానాలను కూడా వక్రీకరించి రాస్తుంటే పత్రికలు ప్రచురిస్తాయి . ఈ పద్దతికి భిన్నంగా కరెన్సీ
ముద్రించరా అని అంటే ముద్రిస్తారు కానీ ఈలాంటి పరిస్తీతుల్లో కాదు. అట్లా ఇస్టమ్ వచ్చిన విధంగా ముద్రించుకుంటే ఇక
ఇన్ని దేశాలనుండి ఇంతేసి అప్పులు ఎందుకు మనకు?
సరే ఇక ఈ పెట్రోల్ ధరల ను ఎవరు ఎలా నిర్ణయిస్తారు? వాస్తవానికి గాలి,నీరు ఎలా సహజ సిద్దంగా లభిస్తున్నాయో పెట్రోల్
కూడా అంటే సహజసిడ్డంగా లభిస్తున్నది. నీళ్ళు బాటిల్లాలో,గాలి పంఖా బిగించిన తర్వాత సరుకులు అయినట్లుగా పెట్రోల్ కు
మానవ శ్రమ జోడించిన తర్వాత సరుకు అయింది. ఆ సరుకుకు అంతర్జాతీయ మార్కెట్లో వచ్చిన డిమాండ్ మేరకు రేట్లను
పెంచుతూ పోతున్నారు.అసలు ఏదైనా ఒక సరుకుకు రేటు ఎలా నిర్ణయించాలి?
ఉదాహరణకు ఒక కుండ రేటును ఎట్లా నింర్ణయించాలి? ఒక పది బండ్ల మట్టి ని తేవడానికి అయిన బండి కిరాయి, ఒక ఇద్దరు
మనుషులతో మట్టిని మెత్తగా నలుగ కొట్టేడానికి.మరో నలుగురు మనుషులతో నీళ్ళు పోయించి మెత్తగా తొక్కించడానికి,
రెండు రోజులు కుమ్మరి కుండాలను ఆనడానికి,ఒక రోజు వాటి అడుగులు మూయడానికి. ఒక నాలుగు బండ్ల కట్టేలా ఖరీదు,
ఈవెగాక ఇంకా ఏమయినా ఖర్చులు అయి ఉంటే మార్కెట్ రేటు ప్రకారం లెక్క వేసి ఆ కుమ్మరి వాము నుండి తీసిన కుండల్లో
నుండి పలిగి పోగా మిగిలిన ఒ ముప్పయి కుండలు ఉన్నాయి అనుకుంటే అయిన ఖర్చు ఒ 600 రూపాయలు అనుకుంటే ఒక్కక్క
కుండకు 20 రూపాయల ధర నిర్ణయించాలి. కానీ జరుగుతునది ఏమిటి? పరిశ్రమాధిపతి వస్తువు ఎంతకూ తయారు అయింది అన్నది
కాకుండా తనకు ఎంత లాభం కావాలో అంతకు ధర నిర్ణయిస్తున్నాడు.దీన్ని నియంత్రించ వలసిన ప్రభుత్వాలు విదిల్చ బడుతున్న
ఎంగిల్లి మెతుకులకు ఆశపడుతూ ఎవరు ఏ తీరుగా రేట్లు నిర్ణయించుకున్నా మాట్లాడకుండా పైగా వాటి పైన మరింత పన్నులు
వేసి ప్రజల కొనుగోలు శక్తి తో పరాచికాలు ఆడుతున్నాయి.
ప్రజాస్వామ్య వ్యవస్తాలో ప్రజల అభిస్టమ్ మేరకు ప్రభుత్వాలు నడుచుకోకుంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లను ప్రజలు చూసుకుంటారు.
ఇవ్వాళ బంధులతో ప్రభుత్వాలల్లో చలనం రాకుంటే ఇంతకంటే మెరుగైన పోరాట రూపాలను ప్రజలు తమ ఆచరణాలద్వారా
ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పోరాట రూపలల్లోనుండి వెతుక్కుంటారు,పోల్చి చూసుకుంటారు.

No comments:

Post a Comment