Wednesday, February 15, 2012

What happens if Education privatizes?

ఏ వ్యవస్తకయినా దాని మనుగడకంటూ ఒక ఆర్ధిక వ్యవస్థ ఉంటుంది. దాని ఆర్ధిక వ్యవస్తను కాపాడుకోవడానికి ఒక సాంస్కృతిక వ్యవస్తను ఏర్పాటు చేసుకుంటుంది ఆ వ్యవస్థ. ప్రస్తుతం మన దేశానిది పెట్టుబడి దారి ఆర్ధిక వ్యవస్థ. అయితే ఆ ఆర్ధిక వ్యవస్థ దాని పునాది అనుకుంటే దాన్ని కాపాడుకోవడానికి ఉపరితలామ్శాలు అయిన విద్య, కట్టు, బొట్టు లాంటివి ఉంటాయి. పునాది చెడి పోకుండా ఉపరితలామ్శాలు పైన ఉండి కాపాడుతాయి, అలాగే ఉపరితలాంశాలను అవిపడిపోకుండా పునాది కాపాడుతుంది. అంటే ఒక దానిని ఒకటి పరస్పరం కాపాడుకుంటూ వాటి మనుగడను కొనసాగిస్తాయి. ఇక్కడ ఉన్నట్టి ఆర్ధిక వ్యవస్థ సరయ్యిందే అని చెప్పడానికి విద్య వ్యవస్థ పని జేస్తుంది. అలాగే ఇలాంటి విద్యా వ్యవస్థ
అయితేనే ఈ ఆర్ధిక విధానం కొనసాగా గలుగుతుంది అని రాజ్యం తన విధానంగా చెబుతుంది. ఇక్కడ కొంత మంది విద్యా వేత్తలు మన దేశం లో
విద్యా వ్యవస్థ ప్రయివే టీకరిన్చబడుతున్నది, తద్వారా పెట్టుబడి దారులు తమ ప్రయోజనాలకు అనుగుణంగా విద్య వ్యవస్తను రూపొందిస్తారు, దాంతో
రేపు వ్యవస్తలోని విలువలే తలకిందులు అవుతాయి అని ఆవేదన చెందుతున్నారు.
జాతీయ విద్యావిధానాన్ని పర్యవేక్షిస్తున్న కపిల్ సిబాల్, మేము ఎలాంటి విద్యా విధానాన్ని ప్రవేశ పెట్టాన్నో పార్లమెంటులో చర్చిస్తాము విద్యా వేత్తలతో ,ఉపాధ్యాయులతో చర్చించ వలసిన అవసరమే లేదు అంటున్నాడు. మన పార్లమెంటులో దాదాపు 300 మంది సభ్యలు పెట్టుబడి దారులే ఉన్నారు. వాళ్ళ పెట్టుబడులు రెట్టింపు జేసుకోవడానికి విద్య ప్రయివెటీకరించబడవల్సిందే అంటారు. దానితో వాళ్లకు లాభాలు వస్తాయి. స్తూల జాతీయాదాయం పెంరిగింది అని మన ఆర్ధిక వేత్తలు లెక్కలు చెబుతారు. విద్య ప్రయివేటీకరించవడితే అసలు ఏమవుతుంది? ఎవరికీ ఏమి నష్టం జరుగుతుంది? వాళ్ళ మాటల్లో చెప్పాల్సి వస్తే మంచి నాణ్యమైన చదువు దొరుకుతుంది గదా?
కాని మనం ఇప్పుడే ప్రాథమిక విద్య లోనే చూస్తున్నాము, ఒక్కో విద్యార్థి లక్ష నుండి రెండున్నర లక్షల దాకా ఒక సంవస్తరానికే చెల్లించ వలసి వస్తున్నది.ఆ విధమైన పాఠాశాలలో చదివిన విద్యార్థి మన వీధి బడిలోని విద్యార్థిని తన తోటి విద్యార్థిగా తోటి మానవునిగా గుర్తిస్తాడ? దేశ పౌరులందరూ సమానమే అనే భావన ఆ పిల్లోడిలో రావడానికి ఈ కార్పొరేటు బడులు దోహద పడుతాయా? రాజ్యాంగం లో అందరు సమానమే , అందరికి సమాన హక్కులే అని రాసుకున్నాము. కాని నిన్నటికి నిన్న ఐ ఏ ఎస్సు లు మేము అందరి లాంటివాళ్ళం కాదు మాకు ప్రత్యేకమైన
హాక్కులు ఉన్నాయి అన్నారా? అంతెందుకు ప్రజలవద్ద గొల్లూడ గొట్టి పైసా పైసా పోకుండా పన్నులు వసూలు జేసున సోమ్ముల్లో నుండి మంత్రులు , ఏమ్మేల్లెలు,కోట్ల కొద్ది అక్రమంగా కొల్లగోట్టితే తమ తమ రాజకీయ ప్రత్యర్థులను ఇబ్బంది పెడుతున్నారు కాని తమ వర్గం వారి పైన ఈగ వాలనివ్వడం లేదుకదా? ఇప్పుడే ఈ విధంగా ఉన్నప్పుడు రేపు రేపు ఈ కార్పొరేటు బడులలో, కాలేజి లలో చదువుకొని వచ్చే విద్యావంతులైన పౌరులు ఎట్లా వ్యవహరిస్తారో ఉహించ వచ్చు. బ్రిటిషర్ల ఏలుబడి లో సంస్థానాదీశులకే ఓటు హక్కులు ఉన్నట్లు గా ఈ కులీనులైన విద్యాదికులకే అన్ని హక్కులు అన్ని అవకాశాలు ఉండే ప్రమాదం ఉంటుంది. ఏమి , ఉండకూడదా? ఎందుకు ఉండకుడదో చెప్పుమని అడిగే పౌరులు కూడా బయల్దేరుతారు. కాని అప్పుడు ఏమి జరుగుతుంది అంటే సమాజం లో అశాంతి నెలకొంటుంది. సమానా హక్కుల కోసం సమాన అవకాశాల కోసం అసమాన సమూహాల మధ్యన సంఘర్షణ మొదలవుతుంది. సమాజం మొత్తంగా అశాంతికి ఆలవాలం అవుతుంది.
అప్పటికి ఈనాటి చిదంబరం వారసులు, వీళ్ళంతా వామ పక్ష తీవ్రవాదులు మనం ఎంతో కస్టపడి కూడబెట్టుకున్న ఆస్తులల్లో వాటా అడుగుతున్నారు కనుక వీళ్ళను జైళ్ళల్లో తోసేద్దాం అంటారో లేక ఏకంగా మానవ రహిత విమానాల తోటి బాంబింగ్ జేసి కాల్చి చంపుతామంటారో కాలమే చెప్పాలి.
పెంటయ్య.వీరగొని.
కరీంనగ

No comments:

Post a Comment