Thursday, February 2, 2012

dikku leni prajalu okkatavutunnaru.

రాజ్యం - దాని స్వభావం,

ప్రతి దినం వార్త పత్రికలల్లో వందల , వేల కోట్ల రూపాయల కుమ్బకోనాల గురించిన వార్తలు... అందుకు కారణమైన వ్యక్తుల ను విచారిస్తున్నట్టు మరియు అరెస్టులు
చేస్తున్నట్టుగా చదువుతున్నాము. అలాగే అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు ఒకరిపైన ఒకరు నీవు ఇన్ని కోట్ల ప్రజాధనం దిగామింగావంటే , నీవేమి తక్కువ తిన్నావా
నీవు ఇన్ని కోట్లు తినలేదా అంటూ ఒకరి పైన ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. అధికార ప్రతిపక్ష అనే తేడా లేకుండా అంతా ప్రజలు పన్నుల రూపం లో కడుతున్న
సొమ్ములు మరియు ప్రజలకు దక్కవలసిన కోట్లాది రూపాయల వనరులు కొందరే బొక్కి కుచుంటున్నారు. అయితే రాజ్యాంగం ప్రకారం డబ్బు సంపాదించడం నేరం కాదని
ఒక వైపు చెబుతూనే మరో వైపు సక్రమంగా సంపాదించాలని చెప్పబడుతున్నది. ప్రజలందరికి చెందవలసిన సంపదను ఇట్లా కొందరే కోట్ల కొద్ది ప్రోగుజేసుకోవడం , సంపద
అంతా అందరికి సమానంగా పంచవలసిన బాధ్యత కలిగిన రాజ్యం కొందరికే సంపద దోచిపెట్టే కార్యక్రమం ఎందుకు చేస్తున్నట్లో ఆలోచించాల్సిన అవసరం ఉంది.
మానవులు ప్రక్రుతి నుండే అన్నీ నేర్చుకున్నారని చెప్పే ఒక మేధావి ఏమంటాడంటే , మొక్కలు ,వృక్షాలు ,తాము భూమి ,సూర్యుడు,గాలి ఆధారంగా సంపాదించిన సంపదను
అవి తమకు అవసరమైన మేరకు ఉపయోగించుకొంగా మిగిల ఆహారాన్ని గింజల రూపం లో , గడ్డల రూపం లో, తమ వేర్లల్లో ఆకుల్లో, కాండం లో దాచుకుంటున్నాయి.
అలాగే జంతువులూ కూడా తాము వేటాడిన మాంసాన్ని తినే కాడికి తినగా మిగిలిన దాన్ని దాచిపెట్టుకొని అవసరమైనపుడు తింటున్నాయి. అలాగే మానవుడు కూడా
తాను సంపాదించిన సంపద కూడబెట్టుకొని ఆ సంపదనే పెట్టుబడిగా పెట్టి మరింత సంపాదించడమే గాకుండా ఆ పెట్టుబడి తో శాస్త్ర సాంకేతిక రంగాలను అభివృద్ది పరిచి
అధిక మరియు నాణ్యమైన ఉత్పత్తిని సాధించడానికి దోహద పడుతున్నాడని అని వాదిస్తున్నాడు.
అది ప్రక్రుతి నియమం . దాన్ని అందరం అంగీకరిస్తాము. అయితే ప్రకృతిని ఏ శక్తి నియంత్రించడం లేదు. కాని మానవ సమూహాలను నియంత్రించడానికి రాజ్యం ఉన్నది.
రాజ్యం లో ఎవరికీ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు వ్యవహరించడానికి వీలు లేదు. దానికి ఒక ఆర్డర్ ఉన్నది.ఆ మానవ సమాజం ఎట్లా వ్యవహరించాలని మౌఖికంగా అనుకుంటారో
లేక రాజ్యాంగం లో రాసుకుంటారో అట్లానే వ్యవహరించాలి . అట్లా వ్యవహరించక ఉల్లంఘించిన వాళ్ళను రాజ్యం తన బలగాలతో నియంత్రించ వలసి ఉంటుంది.అయితే రాజ్యం
అనేదానికి వర్గ స్వభావం ఉంటుంది. అది తన వర్గానికి లబ్ది చేకూర్చిపెట్టె విధంగా వ్యవహరిస్తూనే ఆ పని అంతా తమ వర్గం కాని వారి క్షేమం కోసమే అలా చేస్తున్నానని
నమ్మించ వలసిన బాధ్యతా కూడా అది స్వీకరిస్తుంది.ఎట్లా అంటే ఒక అడవిలో ఒక యాభై పులులు ఉన్నాయనుకొందాం.. అవి విచ్చల విడిగా ఒక క్రమం ,పద్దతి లేకుండా
వేటాడినట్లు అయితే అడవిలో ఉన్న లేళ్ళు అన్నీ ఆనతి కాలం లోనే అంతరించి పోతాయి.అప్పుడు అన్ని ఆకలి తో నక నక లాడి చనిపోవాల్సి ఉంటుంది. కనుక అవి ఏమని
కట్టుబాటుచేసుకున్నాయి ఆటా అంటే, మనం ఈ విధంగా ఎవరికీ తోచినట్టు వాళ్ళు వేటాడి తింటే కొద్ది రోజులకే మనకు తిండి దొరుకని పరిస్తితి వస్తుంది కనుక ఓ పులిరాజు లాలా
మీకు ప్రతి రోజు ఒక్కొక్కరికి ఒక లేడి చొప్పున తినడానికి మేము ఏర్పాటు జేస్తాము. మీరు హాయిగా తింటూ ఉండండి . తల గాక ఎవరైనా మనం చేసుకున్న ఈ నియమాన్ని
ఉల్లంఘించి నట్లు అయితే మన సివ్నగి సేనలతో వాళ్లకు బుద్ద్ది చెప్పించ బడుతుంది అనుకోన్న్నాయి ఒప్పందం చేసుకొన్నాయి. ఇక రోజు ప్రతి పులి రాజుకు ఒక్కొక్క లేడి
పిల్ల ఆహారం గా పోయే టట్టు చూడ వలసిన బాధ్యతా సింహాల రాజు పైన పడ్డది.
సింహాల రాజు ఆ మరునాడే లేడి జాతినంతటిని సమావేశ పరిచింది. ఓ నా ప్రియమైన లేడి సోదరి సోదరులారా! మీకు జరుగుతున్నా అన్యాయం అంతా ఇంత కాదు.
అది తలచుకుంటూ ఉంటె నా కడుపు తరుక్క పోతూ ఉంది.ఇట్లా అయితే మీకు తీవ్ర అన్యాయం జరుగుతుంది మీ జాతి అంతరించి పోయే ప్రమాదం ఉంది. మిమ్ములను
కాపాడడం కేవలం నా వకననే సాధ్యం అవుతుంది. అన్నది.అందుకు లేడి జాతి అంతా సింహ రాజుకు ప్రణమిల్లి మహా రాజ ఎలాగైనా మీరే మమ్ములను రక్షించాలని
వేడుకున్నాయి. తాము చేసుకున్న కుటిల ఒప్పందం బయట పడకుండా సింహ రాజు లేడి జన ఉద్దారకుడువలె ఒక ఫోజు పెట్టి , నేను మీకోసం లేడీజీవ ఉద్ధారక
పథకం ప్రవేశ పెడుతున్నానని ప్రకటించగానే లేడి జాతిమొత్తం జయ హో సింహ రాజా అని నినాదాలు ఇచ్చింది .ఆ పథకం ఎట్లా ఉంటుందో చెబుతున్నా వినండి ,
అంటూ వివరించడం ప్రారంభించింది . రేపటి నుండి మిమ్ములను ఏ సింహం గూడా వేట ఆడకుండా చూసే బాధ్యత నాది .మీకు నేను రక్షణ గా ఉండి మీవైపు ఏ క్రూర మృగం కూడా కన్నెత్తి చూడ కుండా చేసే బాధ్యత నేను వహిస్తున్నాను , అనంగానే సంతోషం తో చప్పట్లు కొట్టినాయి లేళ్ళు.మీరు చీకు చింత లేకుండా హాయిగా కాపురాలు చేసుకోవడం వలన మీ సంతానం అభివృద్ది అవుతుంది. అభివృద్ది చెందిన మీలోనుండి కొందరిని మాత్రం రోజుకు ప్రతి సింహానికి ఒక్క లేడి చొప్పున కప్పం ఇచ్చుకోవాల్సి ఉంటుంది అన్నది.
అయ్యో అని బాధపడ్డా చేసేది ఏమి లేక తలాడించి వెళ్లి వచ్చినాయి.సింహ రాజులు , సింహ రాజులు కల్సి లేళ్ళను పంచుకు తిన్నట్టు రాజకీయ పార్టీలు,రాజకీయ పార్టీలు అన్ని
కలసి ప్రజలకు చెందవలసిన సంపద అంత దోచుక తినున్నాయి .
సంపద సృష్టి కర్తలం మా సంపద మాకే చెందాలంటున్న వాళ్ళు ,జాన్ మిర్డల్ ప్రఖ్యాత అంతర్జాతీయ రచయిత రాసినట్టుగా దిక్కు లేని ప్రజలంతా ఒక్కటవుతున్నారు.
.
పెంటయ్య,
కరీంనగర్.

No comments:

Post a Comment