Tuesday, April 17, 2012

ఈ ఏప్రిల్ 20 తో ఇంద్రవెల్లి మారణకాండకు 31 సంవస్తరాలు. 1981 ఏప్రిల్ 2o న గిరిజన రైతు కూలి సభ ఆధ్వర్యం లో గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములు వారికే చెందేవిధంగా పట్టాలు ఇవ్వాలని, ఎందుకంటే అప్పటికే గిరిజనుల భూములను మైదాన ప్రాంతం నుండి వచ్చిన గిరిజనేతరులు ఆక్రమిన్చుకుంటున్నారు. అలాగే తమ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించాలని, తప్పుడు కొలతలతో తప్పుడు తూకాలతో తమను మోసం జేస్తున్న వారినుండి రక్షణ కల్పించాలనే డిమాండ్ తో ఇంద్రవెల్లి లో గిరిజనులు సభ జరుపుకుంటున్నారు. వారి డిమాండ్స్ ఏమి రాజ్యాన్గెతరమైనవొ లేక రాజ్యాధికారాన్ని లాక్కునేవో కాదు. కాని రాజ్యం నిర్దాక్షిణ్యంగా దాదాపు 60 మంది గిరిజనులను కాల్చి చంపింది. అమరులైన వారి రక్తం ఏరులై గోదావరి, మానేరు , ప్రాణహిత, ఇంద్రావతి, శబరీ నదుల గుండా ప్రవహించి చత్తీస్ గడ్, అభూజ్ మాడ్ లో జల్, జంగల్, జమీన్ ల పైన హక్కులకు ఉద్యమించాలన్నశక్తులకు ఊపిరులూదిన్ది.
ఇదే సందర్భం లో డిల్లీ లో మన్మోహన్ సింగ్, చిదంబరం లు దేశ ముఖ్యమంత్రుల సమావేశం లో తమ ఆర్ధిక మూలాలకు తమ భద్రతకు రక్షణ లేదు కనుక ఎన్సిటిసి ఏర్పాటుకు అందరు సహకరించాలని ముఖ్య మంత్రులతో అభ్యర్థించారు. ఇక్కడ ఎవరి ఆర్ధిక మూలాలకు భద్రత లేకుండా పోయిందో ఎవరి భద్రతకు భంగం కలిగిందో చర్చించాల్సిన అవసరం ఉంది. దేశ వ్యాప్తంగా సెజ్ ల పేరుతొ, అనువిద్యుత్ కర్మాగారాల పేరుతొ , నీటి ప్రాజెక్టుల పేరుతొ, ఖనిజ సంపద తవ్వకాల పేరుతొ కోట్లాది పేద ప్రజల భూములను బలవంతంగా లాగుకొని ఒక వేదాంత , ఒక బ్రహ్మని, ఒక రహేజ , ఒక రిలయెన్స్ ఇట్లా బడా బాబులకు అప్పనంగా అప్పగించి వాళ్ళ ప్రయోజనాలకు రక్షణ కల్పించి వాళ్ళు సమర్పించే సుట్కేసులతో రాజకీయ నాయకుల వ్యక్తిగత ఆస్తులు పెంచుకుంటున్నారు. ఒక మధుకోడా , ఒక లాలు ప్రసాద్ యాదవ్, ఒక రాజశేకర రెడ్డి, ఒక రాజీవుగాంది , ఒక మాయావతి, ఒక జయలలిత, ఇలా వందల సంఖ్యలో నాయకుల పైన కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు వచ్చినాయి. అదంతా ప్రజలకు చెందవలసిన సొమ్మే. కాని ప్రజలు పాపం ఎప్పుడు కూడా తమ ఆర్ధిక మూలాలకు ఈ రాజకీయ నాయకుల చీడ పట్టిందని వీళ్ళను అంతమొందించాలని అనుకోలేదు. సమస్యల మూలాలను వెదికి శాస్త్రీయ పరిశ్కారాలకోరకు కోల్పోతున్న ప్రజా సమూహాలను సమీకరించే ప్రయత్నం జేస్తున్నారు. కాని మన్మోహనుడు, చిదంబరం లు మాత్రం వాళ్ళ సమూహాల దోపిడీ ని ప్రశ్నిస్తున్న ప్రజా రాశులను అది ఇంద్రవెల్లి గాని, అది కాకరాల పల్లి కాని, అంది నందిగ్రామ్ కాని ఎక్కడైనా ప్రజలను కాల్చి చంపుతున్నారు. అంతే భవిష్యత్ లో అట్లా కాల్చి చంపడానికి మనమంతా ఏకం కావాలని పిలుపు ఇస్తున్నారు.
మరొక్క విషయం విధ్వంసం. అసలు ఎవరు విధ్వంసం చేస్తున్నారు. అది ఇసుక, అది మట్టి. అది ముడి ఖనిజం, అది గ్రానైట్, గ్రాఫైట్, అల్యూమిన, నీరు ఇట్లా అన్ని వనరులను ఒక లెక్క పక్క లేకుండా భావి తరాలకు మిగులకుండా తవ్వి విధ్వంసం చేస్తున్నది రాజ్యం అండ దండలతో పెట్టుబడి దారలా లేక ప్రజలా? ఈ విధ్వంసం వలన ఎంతటి కాలుష్యం వస్తున్నకూడా వాళ్ళ ఆరోగ్యాలను ఫణంగా పెడుతిన్నారే కాని మా ఆరోగ్యాలకు హాని కలిగిస్తూ మా జీవించే ప్రాథమిక హక్కుకు భంగం కలిగిస్తున్నారని ఇప్పటికి ఇంకా ప్రజలు తిరుగ బడటం లేదు. ఎక్కడో చదివినట్లు వేటాడే తోడేళ్ళు వేటకు ఐక్యం అవుతున్నాయి కాని వేటకు గురయ్యే గొర్రెలు ఐక్యం కావడం లేదుఅన్నట్లుగా ఎక్కడో కాదు మన రాష్ట్రం లో మన హైద్ర బాద్ చుట్టూ పక్కలనే 34 వేల ఎకరాల అత్యంత విలువైన భూములను పేదలైన హక్కు దారుల నుండి బలవంతంగా లాగుకొని నామ మాత్రపు ధరలకు ఆ భూమిని బడా బాబులకు ధారాదత్తం జేశారు. వారు ఏ ప్రాజెక్టులు కట్టక పోయినా ఏ ఒక్కరికి ఉద్యోగం ఇవ్వక పోయినా పైగా అదే భూములను బ్యాంకులకు తాకట్టు పెట్టి కోట్ల కొద్ది బ్యాంకు రుణాలు పొందినా, ఉద్దేశించిన ప్రాజెక్టు కట్టక పోగా ప్లాట్స్పెట్టి అమ్ముకుంటున్నా కూడా ఏ ఒక్కరిని ఏమి అనరు. ఎందుకంటే అందులో వాటాలు మీకు అదివరకే అంది ఉన్నాయి కనుక. మీవి , మీ చందాదారుల అక్రమ సంపాదన 5oo లక్షల కోట్ల రూపాయలు విదెశీ బ్యాంకులల్లో దాచుకుంటారు. అవి తెప్పెంచే ప్రయత్నం అధికార, ప్రతిపక్షాలు ఏవీ కాని చేయవు, కాని ఇక్కడ పేద ప్రజల అవసరాలైన ఉప్పుల పై, పప్పుల పై చెప్పుల పై, గ్యాస్, పెట్రోల్, డీసెల్ పైన అలివి గాని పన్నులు వేస్తారు. ప్రజలు స్వేచ్చ ,స్వాతంత్రాలతో, బ్రతుకు భద్రతతో జేవించే పాలన అందించుమని అధికారాన్ని పాలకులకు అప్పగిస్తే పాలకులు చేస్తున్నది ఏమిటి, ప్రజలు నిలబడ్డ నీడను అడుగిడిన ఆధారాన్ని విదేశాలకు మల్టీ నేషనల్ కంపనీలకు గంపగుత్తాగా అమ్మివేస్తూ ప్రశ్నించే ప్రజలను ఖబర్దార్ మా అంతర్గత భద్రతకు మీరు ముప్పుగా ఉన్న్నారని, తమ ఆర్ధిక మూలాలకు నీళ్ళు అందకుండా జేస్తున్నారని హెచ్చరిస్తా ఉంటె ప్రజలు ఇంకా ఎంతో కాలం సహించరు.
పెంటయ్య,వీరగొని.
కరీంనగర్.

No comments:

Post a Comment