Thursday, April 12, 2012

రపంచ వ్యాప్తంగా  కోట్లాదిమంది అవకాశాలను కేవలం వేలాది మంది అత్యంత దురాశా పరులైన వ్యక్తులు ప్రజలందరికి చెందవలసిన సంపదను అలనాడు హిరణ్యాక్షుడు భూమిని చాప చుట్టినట్లు చుట్టి చంకలో పెట్టుకొని పోయినట్లుగా వీళ్ళు సంపదనంతా పోగుజేసుకొని తిరుగుబాటుకు కారనమౌతున్నారు. పైగా తిరుగుబాటు దారులనే దోపిడీ దొంగలుగా  తీవ్రవాదులుగా సృష్టిస్తున్నారు. 11 వ శతాబ్దానికి  పూర్వం ప్రజలనుండి గోల్లుడ గొట్టి  వసూలు జేసిన సంపద అంతా మతాధి పతులు ప్రార్థనా మందిరాలలో దాచి పెట్టినపుడు ఆకలి బాధితులు అది దోచుకొని పొతే వాళ్ళను దగ్గులు, పిండారీలు , బందిపోట్లు దొంగలు అన్నారు. 12 వ శతాబ్దం తర్వాత నుండి ఆంగ్లేయులు  రాజ్యాధికారానికి వచ్చేదాకా దొరల గడీల పైన, మొగల్ చక్రవర్తుల కోటల పైన, వాళ్ళ సామంతుల దేవిడీల  పైన  ఒక సర్వాయి పాపన్న గౌడ్, ఒక ఛత్రపతి శివాజీ లాంటి బహుజన యోధులు చేసిన తిరుగుబాట్లను  పాలక వర్గాల కు వందిమాగదులైన చరిత్రకారులు దొంగ తనాలుగా దొంగ దాడులు గా, అభివ్రుద్దినిరోధకులుగా విచ్చిన్న కారులుగా  చిత్రీక రించారు. అలాగే ఇప్పుడు సెజ్జులల్లో, అభాయారన్యాలల్లో, పోలవరం లో, శ్రీపాద సాగర్ లో,  నెల్లూరు జిల్లా ముత్త్కూరు మండలం చిల్లకూరు, వెంకటచలంలో, సింగూరు, నందిగ్రామ్ , పోస్కో, నియమగిరి,సోంపేట,కాకరాలపల్లి, ప్రాజేక్టులల్లో భూములు కోల్పోయిన , తమ ఉపాధి కోల్పోయిన లక్షలాది మంది నిర్వాసితులు తిరుగుబాటు జేస్తే వారిని  అభివృద్ది నిరోధకులు అంటున్నది రాజ్యం.
      రాజ్యం దాని స్వభావం ఎలా ఉండాలో ప్లేటో,అరిస్టాటిల్ నుండి చానుక్యుని  దాక రాజగురువులే ఏమని ప్రస్తావించారు? రాచరిక వ్యవస్థ లో గాని  శ్రేయో రాజ్యం లో గాని సంక్షేమ రాజ్యాలల్లో గాని ప్రజలనుండి తిరుగుబాటు రాకుండా రాజు ప్రజలను పాలించాలని చెప్పబడింది. అంతే గాని ప్రజలకు చెందవలసిన సమస్త సంపదలను తమ సైనిక బలం తో తమ తమ వ్యక్తిగత ఆస్తులు పెంచుకోవడం తో బాటుగా తమ తమ అనుచర బందుగానాలకు అందిన కాడికి దోచి పెట్టడం, రాజ రాజ వైభోగాలు  ప్రజల కన్ను కుట్టే ల అనుభ వించడం  ఉత్తమ పాలకులకు తగదు అని చెప్పినారు.కాని . ఇక్కడ భూ ప్రపంచం మీద ఎంత విధ్వంసం జరిగినా ఎంత కాలుష్యం విరజిమ్మినా సకల భద్రతల నడుమ బతుకుతున్న తమ జీవితాలకు ధోకా లేదన్న భరోసా తో గాలి, నీరు, రాయి, ఇసుక, మన్ను, ఖనిజ సంపద లను విచ్చల విడిగా భావి తరాలకు దక్కకుండా బొక్కేస్తున్నారు. ఇలా  కన్ను మిన్ను గానక బొక్కేస్తున్న దానికి అజీర్ణ రోగాలే ఈ ప్రజా ఉద్యమాలు అని వాళ్ళు అర్థం జేసుకోకుండా పోలీసు సైనిక బలగాలను ఉపయోగించి తమ రోగ నివారణ జేసుకోవచ్చు అని భ్రమ పడుతున్నారు. కాని పెట్టుబడి అనే లాభాపేక్ష కాన్సర్ తమ అన్నవాహికలకు సోకింది అన్న సోయి వాళ్లకు కలుగడం లేదు.
   ప్రైవేట్ విద్యుత్ సంస్తలకు ఇందన సరఫరా ఒప్పందానికి ప్రభుత్వ రంగ సంస్థ కోల్ ఇండియా మేడలు వంచి మార్కెట్ రేటు కంటే తక్కువకు బొగ్గు సరఫరా చేయండని సాక్షాత్ భారత రాష్ట్ర పతే స్వయంగా ఉత్తర్వులు ఇచ్చిన ఫలితంగా కోల్ ఇండియా సంస్థ 95 వేల కోట్లు నష్టపోయి అంతర్జాతీయ ఇన్వెస్ట్ మెంట్ సంస్థలు లాభ పడుతున్నాయి. ఒక టన్ను బొగ్గు బయటికి తీయడానికి ఎంత మానవ శ్రమ అవసరం అవుతుంది అనే దానితో బాటుగా ఆ ఫాజిళ్ ఇందనం మండించడం ద్వారా ఎంత క్షయ , కాన్సర్ కారకాలు వ్యాపిస్తాయో ఆయా వ్యాధుల రేట్ ఆఫ్ ఇంక్రీసేస్ ను చూస్తే అర్థం  అవుతూనె ఉంది. అంతే గాకుండా స్తానికుల అవసరాలు వారి ఆరోగ్యాలను పరిగణన లోకి తీసుకోకుండా విదేశీ అవసరాలకోసం పెట్టుబడి దారుల లాభాల కోసం అపురూపమైన, మల్లి పునరుత్పత్తికి అవకాశం లేనట్టి సహజ వనరులను దోచి పెట్టె వాళ్ళు దొంగలు అవుతార లేక భావి తరాల కోసం కొంచమైన మిగుల్చుదాం, ఇంతగా మానవ హననానికి మేము అవకాశం ఇవ్వం  అని అడ్డుకొనే వాళ్ళు దొంగలు అవుతారా ఆలోచించ వలసిన విషయం.
     ఖతార్ రాజు షేక్ హమదబిన్ ఖలీఫా అల థాని ఏకంగా 747 -8 ఇంటర్ కంటినేన్తల్ అతి పెద్దవిమానం 480 మంది పయనించే విమానాన్ని 25o కోట్లకు కొనుక్కొని అందులో తాను తన పరివారం తో విహార యాత్ర చేస్తాడట. అందులో గుర్రాలు, ఒంటెలు,పెంపుడు  గద్దలు.రెండు రోల్స్ రాయిస్ కార్లు కూడా పెట్టుకొని ఆకాశం లో విహరిస్తాడు. నేనేమి తక్కువ వాన్నా అనీ తన రాజసం చూపుకొవదానికి సౌదీ రాజు ఆల్వా బీద్ బిన్  తలాల్ ఏర్బస్ ఎ 380 డబుల్ డెక్కర్ విమానాన్ని కొనుక్కున్నాడు. ఈ భూమి లో ఇంతటి ఖనిజ సంపద ఇందన సంపద నింపింది వీళ్ళు గాని వీళ్ళ తాత ముత్తాతలు గాని కాదు.ఈ బొగ్గు, ఈ పెట్రోలు ఆ బావులల్లో నింపింది వీళ్ళు గాదు,తవ్వి తీస్తున్నది కూడా వీళ్ళు గాదు. కాని సంపద మాత్రం వీళ్ళదే ఎలా అవుతుందో వాళ్ళ ఆస్తి హక్కు కే తెలుసు..  మన దేశం లో అనిల్ అంభాని కట్టిన భవనాన్ని చూసి తోటి పెట్టుబడి దారు అయిన టాటా నే మనమే సంపదను ఇలా అనుత్పాదక రంగం లో విలాసాలకు ఖర్చు చేస్తే ఇక నక్షలైట్లు పుట్టుకు రమ్మంటే రారా అని కామెంట్ చేసినట్లు ఒక పత్రికలో చదివినం.మన రాజశేకర్ రెడ్డి పుత్రుడు జగన్ లోటస్ పాండ్ ఎన్ని కోట్లు మింగిందో ఎంత రాజసం వెలగబెడుతున్నదో పత్రికల్లో చదివినం, నిన్నటికి నిన్న పోలీస్ డైరెక్టర్ జెనరల్ దినేష్ రెడ్డి, ఐ పి ఎస్ ఆఫీసర్ ఉమేష్ కుమార్ ల ఒకరి పై ఒకరు అక్రమ సంపాదనల గురించి చేసుకున్న ఆరోపణల పైన నిగ్గు తేల్చండి అని  సాక్షాత్ ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ ఆదేశించిందంటే అక్రమ ఆస్తుల వ్యవహారం అతడు ఒక పెట్టుబడి దారుడా ? ఒక రాజకీయ వేత్తా ? ఒక ఐ ఎ ఎస్ ఆఫీసరా ? ఈ వ్యవస్థ లో అవినీతి అక్రమాలకూ అవకాశం లేకుండా అడ్డుగా నేను విధులు నిర్వహిస్తా నని చెప్పుకొంటున్న పోలీస్ అధికారా ? సర్పంచ్ నుండి ప్రధాన మంత్రి దాకా , గ్రామా పరిపాలనాధికారి నుండి కలెక్టర్ దాక , పోలీస్ కానిస్టేబుల్  నుండి సైన్యాధి పతుల దాకా స్వంత ఆస్తులు పెంచుకోవడానికి ఎలా తండ్లాడు తున్నారో రొజూ పత్రికలల్లో చూస్తున్నాము. కనుక స్వంత ఆస్తికి అవకాశం లేని రాజ్యం కోసం ఆనాడు చానిక్యుడు చెప్పక పోయినా ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న ఆలోచనలను స్వాగాతిన్చాకుండా అణిచి వేత పైననే ఆధార పడితే సమాజాలు మరింత సంక్షోభాలల్లో కూరుకు పోయి ఈ భూ గ్రహం మీద మానవ మనుగడే ప్రశ్నార్థకం కాగలదు.
పెంటయ్య. వీరగొని.

No comments:

Post a Comment