Monday, October 8, 2012

bio diversity meeting in hydrabad is a joke!


తెలంగానీయులను అపహాస్యం జేస్తున్న హైదరాబాద్ జీవ వైవిధ్య సదస్సు ! ఈ రోజు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ సదస్సులో మాట్లాడుతూ సేవ్ ఎర్త్, సేవ్ బయో దైవేర్సిటి అని ప్రజలకు పులుపునిచ్చినాడు.అసలు భూమిని కాని, జీవవైవిధ్యాన్ని కాని ధ్వంసం చేస్తున్నదెవరు? నిస్సందేహంగా ఆ పని చేస్తున్నది ప్రభుత్వాలే. ఎలాగో ఒక సారి పరిశీలిద్దాం.కరీంనగర్ జిల్లాలో కొన్ని కోట్ల సంవస్తరాల క్రితం భూమి ఏర్పడ్డనాడు పుడమి తల్లి పుక్కిలించి ఉమిసిన లావా గట్టి పడి గండు శిలలు గా మారిన క్రమం, ఆ గండు శిలలు మరికొన్నికోట్ల సంవస్తరాలు మంచుచే కప్పబడి ఉండడం, ఆ తర్వాత వాతావరణ ప్రభావం వలన క్రమంగా మంచుకరిగి నున్నని రాళ్ళు ఏర్పడడం అనేది అద్భుతము అయిన ఒక ప్రక్రుతి ప్రక్రియ.అనంతమయిన మంచు కరిగి బండ రాళ్ళను ఒరుసుకొని ప్రవహించిన ఫలితంగా పగిలిన రాళ్ళు దుమ్ము దుమ్ము అయి ఇసుక, మట్టిగా ఈ బండ రాళ్ళు రూపాంతరం చెందినాయి.కరిగిన మంచులో కొట్టుకొని పోకుండా మొండిగా నిలిచిన బండ రాళ్ళకు ఇన్ని కోట్ల సంవస్తరాల తర్వాత తాము గ్రానైటు సరుకై అటు ప్రభుత్వాలకు ఇటు క్వారీ యజమానులకు కరెన్సీ నోట్లము అయి సామాన్య ప్రజల బ్రతుకుల్లో బండలై పడుతామని పాపం మా సినారే అన్నట్లుగా మునులవోలె కారడవుల మూలలందు పడి ఉన్నఆ రాళ్ళ కు అప్పుడు తెలియదు. అలాగే ఇప్పుడుకరీంనగర్ లో మొత్తం 750 గుట్టలకు గ్రానైట్ క్వారీలు నడుస్తున్నందున ఆయా గుట్టల పైన నివసిస్తున్న గుడ్డేలుగులు,కోతులు, కొన్దేంగాలు,కొండచిలువలు,రామ చిలుకలు, నెమళ్ళు,గబ్బిలాలు,ఉడుతలు,తేనెటీగలు తమ ఆవాసాలు కొల్లగొట్టబడి నందున ఊళ్ళ పైన పడి మనుషుల చేతుల్లో చచ్చిపోతున్నాయి.సీతా ఫలాలు,దొరుకుత లేవు.పశువులకు మేతదొరుకక గొడ్డు,గొర్రె అంతరించి పాలు ,మాంసం దొరకటం గగనమే అయింది.వర్షాన్ని కురుపింప జేసే పర్వతాలు లేనందున వర్షాలు పడక వాగులు ఒంకలు పొర్లి పొంగక చెర్లు నిండక చేపలు దొరుకక పోవడం మాత్రమె గాదు వ్యవసాయాలు కూడా సాగడం లేదు. భుగర్భ జలాలు అడుగంటే పోయి తాగడానికి నీళ్ళు దొరుకని పరిస్తితి.ఇదంతా అభివ్రుద్దియే అంటున్నది ప్రభుత్వం, దాని ఘనులఅభివృద్ధి శాఖ....పైన జెప్పిన జీవులన్నీ అంతరించి పోవడానికి ప్రభుత్వ విధానాలే కారణం. ఇక మరో విషయం,ఇదే జిల్లాలో తిమ్మాపూర్ అనే మండలం లో పర్ల పెళ్లి అని ఒక మేజర్ గ్రామం ఉన్నది.అక్కడ చుట్టూ పక్కల వరి, మొక్క జొన్న విస్తారంగా పండించడానికి కారణం లోయర్ మానేరు డ్యాం సమీపాననే ఈ ఉరు ఉండడం.పచ్చని పంటపొలాలతో అలరారుతున్న ఈ గ్రామానికి ఇప్పుడు ప్రభుత్వం ఒక చీడ పట్టించింది. అది హరిత బయో ప్రోడక్ట్ కంపని.ప్రభుత్వం తన విధానాల్లో భాగంగా పెట్రోల్ కొనుగోలుకు విదేశీ మారకం ఆదా చేయాలనే కారణం తో బాటుగా వాతావరణ కాలుష్యాన్ని తగ్గించాలనే కారణం చూపుతూ పెట్రోల్ లో20% ఇథనాల్ కలిపి ఇందనం వాడాలని నిశ్చయించింది.అందులో భాగంగా అభివృద్ధి చెందిన దేశాలల్లో పర్యావరణ రక్షణ ఉద్యమాల వలన మూతబడిన పాత అవుట్ డేటెడ్ టెక్నాలజీ మిషనరీలను అతి తక్కువ ధరలకు ఇక్కడి పెట్టుబడి దారులకు సాంకేతిక సహాయం పేరుతొ అక్కడి ప్రభ్య్త్వాలు సప్లై చేసినాయి.అట్లా హరిత బయో కంపని యజమాని పర్లపల్లికి రావడానికి, కిరణ్కుమార్ సామాజిక వర్గానికి ఆ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్సి సైలెంట్ వర్కింగ్ పార్టనర్ కావడం కారణమయింది.అప్పటి సర్పంచ్ కూడా అదే సామాజిక వార్గానికి చెందిన వాడు అయినందున తనను వాళ్ళు మోసం చేయరన్న నమ్మకం తో వాళ్ళు చెప్పిన చోటనల్ల సంతకాలు చేసిండు. గత సంవస్తరం కంపని స్టార్ట్ అయింది.ఈ కంపని మొక్క జొన్న్, బియ్యం నూక తో ఇతోనాల్ తయారు చేస్తుంది.ఈ బియ్యం నూక లో కూడా ఒక మోసమే. బ్లాక్ మార్కెట్ అయిన ఉచిత రెండు రూపాయల కిలో బియ్యం లారీల కొద్ది ఇక్కడికే చేరిన కూడా అధికార పార్టి వాళ్ళది కనుక ఎవరు అడ్డగించఋ. సరే ఆ బియ్యాన్ని మరియు మక్కలను పెద్ద పెద్ద నీటి తోట్లల్లో పులియ బెడుతారు.అలా పులియ బెట్టడానికి ఒక లీటర్ ఇతోనాల్ తయారీకి 25 లీటర్ల నీరు కావాలి.అంటే దీని కెపాసిటీ రోజుకు 60 ,౦౦౦ లీటర్ల ఎతోనల్ తాయారు చేస్తుంది కనుక రోజుకు దీని నీళ్ళ వాడకం 15 లక్షల లీటర్ల నీరు. అట్లా మురిగిన 15 లక్షల లీటర్ల నీటిని రోజు బయటికి వదలడం వలన వాయు కాలుష్యం జరిగి గబ్బు కంపు వాసన దానితో ఆ చుట్టూ పక్కల పర్లపెల్లి,మొగిలిపాలెం,పీసుపల్లె,ములకనూరు,కొత్తపల్లి,నల్లగొండ,నాతకానిపల్లె,పోలంపల్లి,ఇప్పలపల్లె,నుస్తులాపూర్,మల్లాపూర్ ,మన్నేమ్పల్లి 12 గ్రామాల కు చెందిన దాదాపు యాబయ్ వేల మంది జనాబాకు వాంతులు, శరీరాల పైన దద్దులు, గర్బిణీ స్తీలకు గర్భ స్రావాలు అయిన సందర్భం కూడా ఉన్నది.అలాగే ఈ 15 లక్షల లీటర్ల నీరు భూమిలోకి ఇంకి పోయి జల కాలుష్యం ఏర్పడి త్రాగునీరు కలుషితం అయిపోయి వాంతులు విరోచనాలు,కరీంనగర్ నుండి వైద్య బృందం వెళ్లి ప్రజల అభియోగాలు వాస్తవమే నని చెప్పినాయి,ఈ 12 గ్రామాల కు చెందిన 50 వేల జనాభా,వారికి అన్నపానీయాలు అందిస్తున్న 45 వేల ఎకరాల సాగు భూమి,30 చెరువులు,100 కుంటల అస్తిత్వం ప్రశ్నార్థకం అయిన సందర్భం లో ప్రజలు ప్రతినిద్యాలు చేయడం మొదలుకొని ధర్నాలు రాస్త్త రోకో లు చేసి విసిగి పోయి ఆకరుకు ప్రజలంతా కలిసి కంపనిని ఆపి వేసిన తర్వాత పర్యావరణ శాఖ స్పందించి ప్రజల అభ్యంతరాలు వాస్తవమేనని తాత్కాలికంగా కంపనీని మూసి వేసింది. కాని హైదరాబాద్ లెవల్లో యజమానులకు ఉన్న పరపతిని ఉపయోగించుకొని మళ్ళీ కంపని తెరువడానికి అనుమతి తెచ్చుకున్నారు. ఎంతగానో పోరాడి కేసులు జైళ్ళ పాలు అయి మురుగును మూసివేయించుకుంటే ప్రభుత్వ పెద్దలు మల్లి ఈ పాకి ని తమ పైన రుద్దినారు గదా అని ఆందోళన చెందిన ప్రజలు ఈ రోజు దాదాపు ఒక 500 మంది మహిళలు సాయంత్రం రెండున్నర గంటల ప్రాంతం లో కలెక్టరేట్ ముట్టడించినారు.ఈ బయో ప్రాడక్ట్ విషాల వలన ఉర పిచ్చుకలు, బల్లులు చనిపోతున్నాయి.ఎలుకలు పిల్లులు కూడా ఆ నీళ్ళు ద్రాగి చనిపోతున్నాయి. రాష్ట్ర రాజధానిలో జీవ వైవిధ్య సదస్సు గురించి అంతంత గొప్పగొప్ప మాటలు చెబుతున్నా ఓ ప్రభుత్వమా 193 దేశాలల్లో పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిస్తున్నారే! మరి ఇక్కడ మా 12 గ్రామాల 50 వేల మంది ప్రజల ప్రాథమిక హక్కు అయిన జీవించే హక్కును కోల్పోతున్నాము,మా ఉర పిచ్చుకలు మా బల్లులు మా పిల్లలు అన్యాయమై పోతుంటే మేము ఐదు గంటల నుండి ఓ ప్రభుత్వమా మా కస్టాలు వినరండి అని మండుటెండలో మహిళలం పిల్ల పాపాలను వదిలి మీ కార్యాలయం ముందు పడిగాపులు పడి ఉన్నాము అని గొంతు ఎండిపోయేదాకా నినాదాలు చేసినారు.ఓ నాగరికమయిన ,ఆధునికమైన కరీంనగర్ ప్రజలారా!వినండి , ఈ సమస్య మా ఒక్కరిదే కాదు,రోజుకు 15 లక్షల లీటర్ల నీటిని ప్రస్తుతం మా భూగర్భం నుండే ఇస్తున్నా,,ఇప్పుడు కంపని మానేరు డ్యాం నుండి ఆ నీటిని తీసుకోవడానికి అనుమతి పొందింది,ఇప్పుడే మీకు రోజు విడిచి రోజు నీళ్ళు వస్తున్నాయి, మరి 15 లక్షల లీటర్లనీల్ల్లు రోజు బయో కంపనీకి పొతే కరీంనగర్, హనుమకొండ పట్టణవాసులకు విపరీతమయిన త్రాగు నీటి సమస్య వస్తుంది అని ఆ అమాయక పల్లె జనం నగరవాసులకు జ్ఞానోదయం కలుగ జేసినారు ఓ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమా! నీ పాలనా లోని 12 గ్రామాల కు చెందిన 50 వేల మంది కే స్వచ్చ మైన గాలి, స్వచ్చమైన నీరు, ఆరోగ్యంగా బ్రతికే ప్రాథమిక హక్కుకే భద్రత కల్పించ లేని నువ్వు 193 దేశాలకు చెందిన 200 కోట్ల పై చిలుకు ప్రజలకు ఏమి జీవ వైవిధ్యాన్ని ఉద్భోదిస్తావని పర్ల పల్లి బయో ప్రాడక్ట్ ను వ్యతిరేకించే ప్రజలంతా ఇవ్వాళ నిలదీస్తున్నారు. పెంటయ్య. వీరగొని విశ్రాంత విద్యా పర్యవేక్షనాదికారి, పర్యావరణ కార్యకర్త,

No comments:

Post a Comment