Friday, December 14, 2012


లాభం దోపిడీ మోసం నుండి మాత్రమె రాదు , మంచి వ్యాపారం నుంచి వస్తుంది, సమర్థవంతమైన ప్రణాళిక ఉంటె లాభాలు పోగేయ వచ్చు.___ సజ్జన్ జిందాల్ , చేర్మన్ & ఎండి , జిందాల్ కంపని. అసలు లాభం అంటే ఏమిటి?అది ఎట్లా వస్తుందో చూద్దాం . ఒకరి వద్ద వడ్లు ఉన్నాయి మరొకరి వద్ద కొన్ని కుండలు ఉన్నాయి. ఒక దాని అవసరం మరొకరికి ఉంది. వస్తు మార్పిడి నుండి డబ్బు మారకం ప్రారంభం అయిన తర్వాత ఎ వస్తువుకు ఎంత ధర నిర్నయించాలనే మీమాంస వచ్చింది. అపుడు ఏ వస్తువుకు అయినా ధర ఎలా నిర్నయించాలె అనే ఒక ఆలోచన చేయాల్సి వచ్చింది. కుండలు, చూద్దాం, ఒక మనిషి ఒక బండి తీసుకొని చెరువుకు పోయి రోజంతా మట్టి చేరవేసి మరునాడు ఆ మట్టిని రాళ్ళు రప్పలు లేకుండా నలుగ కొట్టి నీళ్ళు పోసి మెత్తగా తోక్కుకొని ఆ మరుసటి రోజు సారే పైన కుండలు అనుతాడు.వాటిని నీడలో ఎండపెట్టి కుమ్మరి వాములో పేర్చి నాలుగు బండ్ల ఊక నో కట్టెలో బొగ్గో వేసి కాల్చి అట్లా తయారైన ఒక 100కుండలను ఏ రేటుకు అమ్మాలనుకొన్నప్పుడు. ఒక రోజుకు ఎడ్లబండి మనిషి కూలి 400 రూ . రెండు రోజులు తయారు చేయడానికి రోజుకు 200 చొప్పున 400రూ.కుండలు పేర్చి కాల్చే దానికి ఒక రోజు 200రూ 4 బండ్ల ఇంధనానికి 1600రూ.మొత్తం 2600రూ.అంటే ఒక్కొక్క కుండను రూ .26 చొప్పున అమ్మవలసి ఉంటుంది. అలాగే ఒక్క ఎకరం పొలం మూడు సార్లు దున్ని నాటుకు అనుకూలంగా కైలు జేసి 10 బండ్ల ఎరువు పోసి,ఒక 20 kg ల విత్తనాలను నారుపోసి 10 మంది కూలీలతో నాటు వేసి రెండు సార్లు కలుపు తీసి పై ఎరువులుగా ఒక బస్తా డి ఎ పి ఒక బస్తా ఉరియా వేసి 100 రోజులకు కోత కు వచ్చేదాకా నీళ్ళు పెట్టి వరి కోసి, వడ్లు తాయారు జేసి అట్లా తయారైన 20 క్వింటాళ్ళ వడ్లను ఎ ధరకు మార్కెట్ లో రైతు విక్రయించుకొవాలి అన్నప్పుడు,దున్నడానికి ఒక 1500రూ,విత్తనాలు 500రూ,నాటు మరియు కలుపు కలిసి రూ.2500, వారి కోత వడ్లు తయారు చేయడానికి ఒక 1500రూ. అనుకొంటే 10 బండ్ల ఎరువు ఒక 2500రూ, రెండు బస్తాల రసాయనిక ఎరువకు ఒక 1000రూ. అనుకొంటే మొత్తం 9500రూ. అవుతున్నాయి.ఒక ఎకరానికి కౌలు 5000రూ. మరియు అతడు ఈ 100 రోజులు పొలాన్ని చూసుకుంటూ నీళ్ళు పెట్టడానికి గాను అతని కుటుంభం అంతా పనిజేస్తుంది వాళ్ళ కూలి ఒక 6500రూ. అనుకొంటే మొత్తం కలిసి రూ.21,000/ పండిన పంట 20 క్వింటల్లు. అంటే ఒక్కో క్వింటాల్ రూ.1050 చొప్పున అమ్మాల్సి ఉంటుంది. అట్లా గాకుండా కుండకు రూ.30 చొప్పున అమ్మితే తయారు దారుకు రూ. 4 లాభం ఉంటుంది. నేను ఇంత రిస్క్ తీసుకొని కుండలు తయారు జేస్తున్న కనుక నాకు ఒక్క 4 రూ. లాభం తీసుకొంటే తప్పా? అనేది తయారు దారు వాదన,అవును తప్పే అనేది సత్యం. ఎందు కంటే అక్కడ ప్రతి ముడి సరుకుకు మానవ శ్రమకు విలువ కట్టిన తర్వాత అదనంగా ఇంకా ధర కలుపుకొని అమ్ముతాననడం అనైతికత కాదా? అయితే యిక్కడే తయారి దారు ఒక కొత్త జిమ్మిక్కు చేసి విషయం సామాన్యులకు అర్థం గాకుండా చేసున్నాడు. ఏమిటంటే? ఆ కుండకు ఆకర్షనీయమైన రంగు,అందమైన డిసైన్ చేయడానికి,అందులో నీళ్ళు చల్లగా ఉండడానికి నా పరిశోధకుడు ఎంతోకాలం శోధించి సంపాదించిన జ్ఞానం నేను కొనుగోలు చేసి ఇవి రూపొందించిన కనుక ధరను నేను 30 కాదు 40 చేసి అమ్మితే తప్ప నాకు గిట్టుబాటు కాదు అని ఒప్పిస్తాడు. ఈ ఇంటెలెచ్త్చువల్ ప్రాపర్టీ అనేది ఒక మోసం అని ఎందుకు అంటున్నామంటే జ్ఞానం అనేది సమాజానుగతం అయినది. నీళ్ళలో పడితే మునిగి పోతం,అగ్గిలో చేయిబెడితే కాలుతది అనేది మనకు ఎవరో పనిగట్టుకొని చెప్పిన సైన్స్ కాదు.సమాజం నుండి నేర్చుకోన్నదే.అయితే నీళ్ళు.నిప్పు నుండి విద్యుత్తూ,సంకర విత్తనాల నుండి అధిక దిగుబడి,అభివృద్ది చెందినా టెక్నాలజీ ద్వారా శ్రమ తగ్గడం, కంపూటర్ ద్వార పనే వేగా వంతం , ఇవన్ని పరిశోధనలే కదా? అవును ఆనాడు శాశ్త్రగ్నులు ఇప్పటే వాలే తమ ఆవిష్కరణలకు డబ్బులు అడుగలేదు కాని ఇప్పటి పరిస్తితి వేరు కనుక లాభాలు సంపాదించే అవకాశం ఇవ్వకుంటే అభివృద్ధికి పరిశోధనలు జరుగవు అంటున్నారు, కాని పరిశోధనలు ప్రభుత్వాల బాధ్యత అయి ఉండాలే.అయితే ఇక్కడ లాభం ఎట్లా వస్తున్నదంటే ధరలు అధికంగా నిర్ణయించడం వల్లనే అనేది స్పష్టం అయ్యింది కదా? పరిశ్రమలల్లో తయారైన ఉత్పత్తులకు ధరలు పరిశ్రమాదిపతులే ధరలు నిర్ణయించుకుంటారు. దానికి ప్రభుత్వాలు అడ్డుచేప్పావు.వాళ్ళు ఎంత ఎక్కువ ధరకు నిర్ణయించుకుంటారు అంటే ప్రతి వస్తువుకు ప్రకటన రేటు ఒకటి ఉంటె దాని పైన కమిషన్ పోను అమ్మకపు రేటు ఇంత అని ధరల పట్టిక డీలర్ వద్ద ఉంటుంది. ఇదంతా మోసం కాదా? మోసం లేకుంటే లాభం అనేదే ఉండదు.తక్కువ మోసం ఎక్కువ మోసం తప్పితే. ఇక వడ్ల ధరకు వద్దాం. వడ్లు పండించేది రైతు కాని అతని ఉత్పత్తికి ధర నిర్ణయించేది సర్కారు.రైతుకు గిట్టుబాటు ధర రాకుంటే అతడు నష్టపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నాడు. వీలయితే కూలీలకు తక్కువ కూలి ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది. కాని ఇప్పుడు పనికి ఆహార పథకం వచ్చిన తర్వాత రైతుకు ఆ అవకాశం కుడా లేకుండా పోయింది.ఆయనకు నష్టం వస్తే అప్పుల పాలై ఉన్నకాడికి అమ్ముకోవడం లేదంటే ఆత్మహత్యలకు పాల్పడడం.అదే పార్సిశ్రామిక వేత్తలకైతే బ్యాంకులు ప్రభుత్వాలు అండగా నిలుస్తున్నాయి. పెట్టుబడి దార్లు పారిశ్రామిక వేత్తలు ఈ సర్కారు మాది అనుకుంటున్నారు.కాని రైతులు,కూలీలు మాత్రం అలా అనుకొనే విధంగా ప్రభుత్వాల చర్యలు ఉండడం లేదు. pentaih.veeragoni

No comments:

Post a Comment