Saturday, December 15, 2012


కాంగ్రెస్గ్రె వాళ్ళ అఖిల పక్షం అసలు రంగు సామాన్య జనులందరికి ఇప్పటికే తెలిసి పోయింది. కాని కాంగ్రెస్ ఎంపి లకు,ఏమ్మేల్లెలకు,ముఖ్యంగా తెలంగాణా ఉద్యమాన్ని పూర్వ పక్షం చేయడానికి కాంగ్రెస్ కుటిలత్వానికి పుట్టిన రంకు బిడ్డ లాంటి మంత్రి పదవులు చేపట్టిన పచ్చి స్వార్థ పరులకు మాత్రం ఇంకా జ్ఞానోదయం కావడం లేదు.2014 దాకా ఏమీ తేలదన్న భరోసా కలిగిన బాబు, జగన్ పార్టీల నేతలు మాత్రం మేము తెలంగాణాకు వ్యతిరేకం కాదనే ఒక దొంగ నాటకం ఆడుతున్నారు. అరే మీరు తెలంగాణా కు వ్యతిరేకం గాకుంటే మా తెలంగాణా మాకు వస్తది కదా? అప్పుడు ఇక మీరు దేనికి ముఖ్య మంత్రి అవుతారు. ఇక్కడి ప్రజల రాజకీయాలతో మీకు సంభంధం ఏమిటి? మీ కాళ్ళకు పుండ్లు బడుతుంటే,కీళ్ళు సడులుతుంటే, మేం ఎంత వద్దని ఛీ కొట్టినా ,ఎందుకు మా వెంట బడి తిరుగుతుండ్రొ అర్థం చేసుకో లేనంతటి అమాయకులం కాదుకదా? ఎన్నికల ఒక్క రోజు నా వెనుక ఉండండి ఆ తర్వాత 5 ఏండ్లు మీ వెనుక బడుత అని చెప్పుతనే ఉంటె ఇంకా 6 ఏండ్ల దాకా తెలంగాణా ఆశ వదులు కొండని చెప్పుతుంటే మీ మోచేతి నీళ్ళకు ఆశ పడి బతుకుతున్న మా తెలంగాణా నాయకులను మరియు ఆంధ్ర పార్టీల నాయకత్వాన్ని మా తెలంగాణా మేలు కోరే వారని ఎట్లా నమ్ము మంటారు? ఇక తెలంగాణా కోసమే మా తన్. మన్. ధన్ అని చెప్పుకుంటున్న వాళ్ళు కూడా, చెంద్ర బాబు విసుర్తున్న సవాలు " తెలంగాణా వస్తే మీ దుకాణం బంద్ ".అన్న దానికి సమర్థవంతంగా జవాబు ఇవ్వడం లేదు. 2000 సంవస్తరం లో స్తానిక సంస్తల ఎన్నికల్లో అంచనాలకు మించి మండలాధ్యక్షులను,జిల్లా పరిషద్ చేర్మన్ లను ప్రజలు గెలిపించినారు,2004 జన్రల్ ఎన్నికల్లో కాంగ్రెస్ చరిత్ర తెలిసి కుడా పొత్తు పెట్టుకొంటే వాళ్ళను, మిమ్ములను కలిపి అధికారం లోకి తీసుక వచ్చినారు ప్రజలు, మీ రాజకీయ పరపతి పలుచ బడ్డప్పుడల్లా ఓట్లేసి ఓట్లేసి అలసి పోయినారు గాని నీ సంగతేందని అడుగలేదు. ప్రజలు ఉద్యమాన్ని తీవ్రం చేయడానికి మిలియన్ మార్చ్ తలబెడితే వద్దంటిరి, మహత్తర పోరాట రూపం సకల జనుల సమ్మె ఒక వైపు తీవ్రాతి తీవ్రంగా జరుగుతుంటే నాయకత్వం అంతా కట్టగాట్టుకొని డిల్లీ కి వెళ్ళిపోయి శత్రువు వ్యూహానికి మన కోట ద్వారాలన్ని అప్పగించిపోతిరి. అధినాయకుడు హైదరాబాద్ రాలి కి హాజరు కాడు, వచ్చిన వాళ్ళు సైతం మమ్ములను సంప్రదించకుండానే నెక్లెస్ రోడ్ లో భైఠాయిమ్పు కొనసాగిస్తారా అంటూ అలిగి పోతిరి. ఇప్పుడేమో ఎన్నికల జ్వరం పట్టుకొని 100 అసెంబ్లీ,17 పార్లమెంటు సీట్లు గెలువాలని పిలుపు యివ్వబడితిరి. అంటే సీమాంధ్ర పార్టీలు అంటున్నట్లు గానే అందరూ 2014 ఎన్నికల దాకా తెలంగాణా అంశం తేలదని స్పష్టం జేస్తున్నారు గదా?2014 తర్వాత మల్లి 2019. ఇదేనా ఉద్యమ పార్టీల ముందు చూపు? వాటి వ్యూహం? ఇప్పట్కి రాజకీయ పార్టీలు తక్కువ ఉన్నయట ఇక ఉస్మానియా విద్యార్థులు ఒక రాజకీయ పార్టి బెడుతారట. సరే వాళ్ళను వద్దనే టందుకు మనం ఎవరం గని. ఎన్నికలపార్టీల తోటి సంబంధం లేదని చెప్పుకొంటున్న ప్రజసంగాల తీరు మరొతీరుగ ఉన్నది. దొరల తెలంగాణా కాదు సామాజిక తెలంగాణా అనేది ఒకరు.ఈ సామాజిక తెలంగాణా అనే విశేషణం పాపం సినిమా నటుడు చిరంజీవి వచ్చిన తర్వాత ఒక రూఢ్యర్థమ్ తో పిలువ బడుతున్నది. ఉత్తర ప్రదేశ లో దళిత బహుజన పార్టీ మాయావతి పుణ్యాన బాగా బదునాం అయిన తర్వాత ఇక్కడ మన తెలంగాణా లో సామాజిక తెలంగాణా అన్న మాట ప్రజాస్వామిక తెలంగాణను పక్కకు జరిపింది. వర్గ స్పృహ లేకుండా వెనుక బడిన కులాల ప్రాతిపదికన అధికారం సాధించుకున్నా ఆ అధికారం అగ్ర కులాలకు అగ్ర వర్గాలకు ఊడిగమ్ చేయడానికి దప్ప మరి దేనికి పనికి రాదన్న విషయం మాయావతి నుండి మౌర్య సామ్రాజ్యాధిపతి చెంద్ర గుప్తుని దాక, ఆ తర్వాత శాతవాహనులదాక చరిత్ర సమస్తం యురేషియా ఆర్యులైన బ్రాహ్మణ సేవలో తరించిన నగ్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. గొల్ల కులానికి చెందిన ముర కుమారుడు చంద్రగుప్త మౌర్య చక్రవర్తి క్రీ||పూ|| 317 నుండి 298 దాక ప్రపంచ విజేత గ్రీకు వీరుడైన అల్లెగ్జండర్ చక్రవర్తి అంతే వాసుల నుండి రాజ్యాన్ని హస్తగతం చేసుకొని చాణిక్యుని శిష్యుడు గా బ్రాహ్మణ వాదానికే సేవజేసిండు. కుమ్మరి కులానికి చెందిన శాత వాహనులు కరీంనగర్ జిల్లా కోటిలింగాల రాజదానిగాజేసుకొని క్రీ|| పూ|| 230 నుండి క్రీ|| శ|| 220 వరకు 500 ఏండ్లు పాలించినా కూడా ఇప్పుడు ఎక్కడ కుమ్మరులు పాలక వర్గాలుగా ఉన్న దాఖలా లేదు. పల్లవులు , చాళుక్యులు కుడా శూద్ర కులాలకు చెందిన వారే.క్రీ|| శ|| 200 నుండి 900 వరకు 700 ఏండ్లు పాలించినా కుడా ఇప్పుడు శూద్రులు రాజ్యాధికారం కోసం పోరాడాక తప్పడం లేదు.భారత దేశపు స్వర్ణయుగం అయిన గుప్తులు శుద్రులే.అయిన వీరి కాలం లో బ్రహ్మనిజానికి వ్యతిరేకంగా 4 వ శతాబ్దంలో భక్తీ ఉద్యమాలు వచ్చినాయి.చేర,చోర రాజులు కుడా సత్ శుద్ర కులానికి చెందిన రాజులే. కాకతీయులు కుర్మ కులం వాళ్ళు,క్రీ||శ|| 1083 నుండి 1323 వరకు దాదాపు 250 సంవస్తరాలు పాలించి నా కూడా ఇప్పుడు కుర్మ కులం ఎంత వెనుకబడి ఉన్నదో చూస్తున్నాము. మొన్న మొన్నటి శివాజీ మాలి కులం.అంటే శూద్రుడు. మరాఠ బ్రాహ్మలు శుద్రునికి రాజ్యాధికారం అర్హత లేదు అని అడ్డు తగిలితే కాశీకి వెళ్లి బ్రహ్మలను తీసుకొని వచ్చి అడిగిన దక్షిణ ఇచ్చి క్షత్రియ జంధ్యం వేయిన్చుకున్నట్లు చదువుకున్నాము.ముఖ్య మంత్రులు అయిన లాలూ ప్రసాద్ యాదవ్,ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్ ,యాదవులు,అజిత్ జోగి ఎస్టి. మాయావతి ఎస్సి,కర్పురి ఠాకూర్ సింగ్ మంగలి, కరుణానిధి బిసి , ఇందరు రాజులు, ముఖ్య మంత్రులు వందల సంవస్తారాలులుగా రాజ్యాధికారం పొంది దళిత బహుజనుల కోసం ప్రత్యేకంగా చేసింది ఏమీ లేదన్నది చరిత్ర సత్యమేనాయే . మన రాజ్యాంగం ప్రసాదించిన బిక్షతో ఏమ్మేల్లెలుగా, ఎంపీలు గా గెలిచిన మన దళిత ప్రతినిధులు అమెరిక సామ్రాజ్య పెట్టుబడికి ఎలా కోరలు తోముతున్నారో అది ఎఫ్ డి ఐ ల అనుమతా, అను ఒప్పందమా, అది బొగ్గు కుంభ కొనమా, అది 3జి కుంభ కొనమా, అది స్విస్ బ్యాంకుల నల్ల ధనమా , అన్ని విషయాల్లో సంపన్నుల వైపు నిలిచి పోరాడే శక్తులను అతి కిరాతకంగా అనిచివేస్తూ వాళ్ళ కాళ్ళ కింది నేలను,తల పైన నీడను లాక్కోవడానికి యధా శక్తిగా దోచుకొనే వాళ్లతో దోస్తీ కలిపి తమ తమ ఆస్తులు పెంచుకుంటున్నారు. అంటే ఇప్పుడేదో సామాజిక తెలంగాణా వస్తే దళిత బహుజనులకు ఒరిగేది ఏమీ ఉండదన్నది చరిత్ర చెబుతున్నది.వర్తమానం మన కళ్ళముందు కనబడుతున్నది.వర్గ స్పృహ కలిగిన కార్మిక వర్గ చైతన్యం కలిగిన పార్టీల నాయకత్వం లో మాత్రమే సంపద సమానంగా పంచె వ్యవస్థ ఏర్పడుతుంది. కనుక ప్రస్తుతం, కనీసం భౌగోళిక తెలంగాణా కోసం అయినా ఓట్ల సీట్ల పార్టీల తో బాటు గా అన్ని ఉద్యమ ప్రజా సంగాలు తమ తమ స్వార్థ రాజకీయాలను,ఇగొలను,పక్కన బెట్టి ఈజిప్ట్ తరహా లో ఒక దీర్ఘ కాలికమైన బ్రహ్మాండమైన ఒక సమిష్టి పోరాట రూపాన్ని ప్రజల ముందుకు తీసుకొని పోవాల్సిన అవసరం తక్షణం ఉన్నది. త్వమేవ శుంఠ, అంటే త్వమేవ శుంఠ అనుకుంటూ శిగ పట్ల తో ఇంకా కాలం వెల్ల దీస్తే భవిష్యత్ తరాలు ప్రస్తుత తెలంగాణా నాయకత్వాన్ని అసహ్యించు కుంటాయి . పెంటయ్య.వీరగొని. విశ్రాంత విద్యా పర్యవేక్షనాదికారి, సర్వాయి పాపన్న తెలంగాణ వనరుల రక్షణ సంఘం.

No comments:

Post a Comment