Friday, November 25, 2016

ఎవుసమ్ 4

                                                   ఎవుసం  3
  
పొద్దున్నే మిద్దె తోట కు నీళ్లు పెట్టె టందుకు పొయిన . తొట్లల్లో చల్లిన విత్తనాలు కొన్ని పండ్లిగిలించి నా మొఖాన చూస్తూ పలకరిస్తున్నయి .    సంబురమైంది.
అంతకు ముందు రోజు మిరప మొక్కలకు వేప నూనె స్ప్రే చేస్తున్నప్పుడు మొక్కలను కిందికి వంచి,  పైకి లేపి,  చెట్టంతా తడిసె తట్టు వేప నూనె నీళ్లు. స్ప్రే జేసిన తీరు ఎట్లని పిచ్చిందంటే   చిన్ననప్పుడు తల అటు దింపి , ఇటు దింపి నెత్తంతా సమరు బూసి,  పిల్లగాండ్లకు    తలంటి స్నానం చేయించినట్టు అనిపించింది. పసి పిలగాండ్లల్ల ,  పెరిగే మొక్కలల్ల దినాం దిరిగే మనుషులకు ఆయిశ్శు పెరుగుతదని మా నాయిన జెప్పేటోడు. ఆ లెక్కన రైతులు , బడి పంతుళ్లు మంచి అదృష్ట వంతులన్నట్టు . ఇగ రైతులంటేనేమో సాంప్రదాయకంగా జూసినప్పుడు ,  తప్పని సరి పరిస్థితులలో మరో నైపుణ్యం రాక లేదా ఇంకో పనిజేసుడు ఆ రోజుల్ల నాదాన్ అనిపించి ఎవుసాయం జేసెటోల్లు. బడి పంతుళ్లు అంటెనేమో కొందరు ఖాయిష్ తోటి ఆ నౌకరికి వస్తే మరికొందరేమో ఉన్న ఊళ్లే నౌకరి , ఎవుసం కూడా జేసు కోవచ్చ్చు , ఓ పూట పోయినా పోకపోయినా   సదువు చెప్పినా చెప్పక పోయినా నడుస్తదని ,  ఖాయిష్ జేసెటోల్లు. మొత్తం మీద ఎట్లైతే ఏందీ గాని వాళ్లకు తెలువకుంటనే ఆయుష్ పెంచుకునే పనిల వఛ్చి పడ్డరు .

ఇగ రైతులైతేనేమో నీయవ్వ ఇంత బతుకు బతికి గా బండ కింది సావు జత్తమారా  అని మా చిన్నప్పుడు రైతు కుటుంబాల యువకులు బొగ్గు బాయి పనికి పోకపోదురు. సరే తర్వాత దానికే పోటీలు బడి ఉరికురికి గెలుసుకున్నరనుకోండ్రి .

ఇంతల రఘోత్తం రెడ్డి సారు నుంచి  ఫోన్, ఏమయ్యా ! తోట పని జేత్త లెవ్వా అని . అరె నేను రోజు చేస్తనే ఉంటి , ఈ సారు గిట్ల అంటడేంది అని మనుసుల అనుకుంటనే , అయ్యో సారు , తలిగిచ్ఛుకున్నప్పుడు తప్పుత దా ఇగో గిప్పుడే నీళ్లు జల్లఛ్చిన నీ ఫోన్ వచ్చింది అన్న.

మరి రాస్త లెవ్వు గద అన్నడు .
రోజు తోట పని జేసినట్టే , చేసిన పని అనుభవం గురించి రోజూ రాయాలే , అన్నడు .
మల్ల నాకు మా పెద్ద సారు పల్లి సీతారాం సారు యాదికొచ్చిండు.
ఈ సదువు , ఎవుసం , ఈ రెండు నన్ను చివరి దాకా విడిచి పెట్టి పొయ్యేటట్టు లెవ్వుగదా అనిపించింది .
సారూ ! రాస్తే రామాయణమంత అయ్యేటట్టు ఉన్నది గదా అన్న.
రాయి , రామాయణమే రాయి నిన్నెవ్వరు వద్దంటున్నరు అన్నాడు.
రాస్తమ్ సార్, కానీ చదివేటోళ్లు ఉండద్దా అన్న.
సరే ! ఏంరాద్దామనుకొంటున్నవ్ అని అడిగిండు.
అదే నా ఎవుసం 1 ల మా నాయిన మట్టి పిసికిన నా చేతులను అవుదు కాడికి తీసుక పొయ్యి ఎందుకు కడిగిండు? ఒకప్పుడు మా నాయిన జేసే కుల కశ్పి నాదాన్ అనుకోని భూమి జాగా కొని ఎవుసం జేసిండు. అసొంటిది  ఆయనే నన్ను ఎవుసం వద్దని సదువుకో బిడ్డా అంటున్నడు . కుల వృత్తులు , ఎవుసాయం కూలి పోయి ఉత్పత్తి తో సంబంధం లేని సేవా రంగమే గొప్పదనే అభిప్రాయం వెనుక సమాజం ఎంత తండ్లాట ఉందొ రాద్దామని , అన్న.
నిజమే ! పెంటయ్య గారూ ! అసలీ కుల వృత్తులన్నీ వ్యవసాయం కోసమే వఛ్చినయాయే . వ్యవసాయాన్ని బలోపేతం జేసే టందుకే ఈ వృత్తులన్నీ వఛ్చినయి. వ్యవసాయం పైన్నే ఈ వృత్తులన్నీ బతికినై. కానీ పాలించేటోళ్లు తలకిందులు ఆలోచనల ఫలితంగా వ్యవసాయాన్ని దెబ్బదీసి నందున ఇవ్వాల కులవృత్తులన్నీ కూలిపోయినయ్. అన్ని వృత్తులల్ల వాల్లే చొరబడ్డరు . పేదోనికి బతుకు దెరువు లేకుంటయ్యింది. సరే ! ఆ రాజకీయం పక్కన బెడుదాం . ఇప్పుడైతే మనటువంటి వాళ్ళు మన స్థాయి లో చిన్న చిన్న ఎవుసం జేద్దాం  ! పెద్ద పెద్ద లాభాలు ఉన్నయని నిరూపిద్దాం అన్నడు ..
భేష్ !  బాగున్నదికదా !


No comments:

Post a Comment