Monday, November 28, 2016

ప్రజల పై యుద్దాలు

                                         ప్రజలపై  - యుద్దాలు . 1

గత ఇరవై రోజులు గా భారత దేశ వ్యాప్తంగా నోట్ల రద్దు వలన ప్రజలపైనా ఏ విధమైన యుద్ధం జరుగుతున్నదో , దేశ వ్యాప్తంగా ప్రజలు తమ తమ దిన చర్యలను మానుకొని నోట్ల వేటలో ఏ విధంగా వీధుల వెంట బారులు తీరి విసిగి వేసారు తున్నారో చూస్తున్నాము. వామ పక్ష పార్టీల బంద్ గానీ ప్రధాన ప్రతిపక్షం ఆక్రోశం గానీ ప్రజలను ప్రభావితం చేయలేక పోయింది. ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నాగూడా భరిస్తూనే ఉన్నారు తప్పితే ప్రభుత్వం పైన పెద్దగా తిరుగుబాటు తెలుపడం లేదు. సామాన్యంగా ప్రజలకు బాగా డబ్బు ఉన్న వాళ్ళ పైన సానుభూతి ఉండదు. ఈ నోట్ల రద్దు వలన వాళ్ళు చాలా నస్తపోతారని ప్రజలంతా భావిస్తున్నారు. కనుకనే నల్ల కుబేరులకు మోడి మంచి షాక్ ఇచ్చినాడని సంబుర పడుతుండ్రు. కానీ వాస్తవానికి ఇప్పుడైతే ఎక్కడా నల్లకుబేరులు నస్ట పడుతున్న దృస్టాంతా లెక్కడ మనకు కనిపించడం లేదు. భవిశ్యత్తులో ఏమి జరుగుతుందో చూద్దాం. అంతవరదాకా  మనలాంటి సామాన్యులు ఎదిరి చూడడం డప్ప ఎదిరించ లేని నిస్సహాయ పరిస్తితి.

ఇప్పుడిప్పుడే ఇంకో మాట కూడా విన వస్తున్నది. నగదు రహిత లావా దేవీలు, ఆస్తి పాస్తుల ఇ పాస్ , గుడ్ మంచిదే ఈ విధానాన్ని ప్రభుత్వం చిత్త శుద్ది తో అమలు చేయ గలిగేతే. మన దేశం లో చట్టాలు చాలానే ఉంటాయి కానీ అవి అమలుకు నోచు కోవు . ఈ నోట్ల రద్దు విషయమే చూడండి బొంబాయి కేంద్రంగా కొత్త రెండు వేల నోట్లు దేశ వ్యాప్తంగా పంపిణీ అయితూనే ఉన్నాయి. నల్ల ధనవంతులు వాళ్ళ ధనాన్ని బంగారం రూపం లో స్టిరాస్తుల రూపం లో ఇప్పెటికే ఎప్పుడో దాచుకున్నారని అంటున్నారు. కొద్ది గొప్ప ఉన్నోళ్ళు సైతం తమ పలుకు బడి ఉపయోగించి నస్ట నివారణ చర్యలు ఎప్పుడో తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి, ఇబ్బంది పడుతున్నది మాత్రం మన బోటి సామాన్యులే.

నగదు రహిత లావాదేవీలు, ఇ పాస్ వ్యవస్తా ప్రవేశ పెట్టడాన్ని నేనైతే స్వాగతిస్తాను , అక్షరాస్యతే అంతంత మాత్రం అనే విషయాన్ని చర్చ కోసం కాసేపు పక్కన బెడుదాం. ఇప్పుడు లాభాలు కొందరికి  ఇబ్బడి ముబ్బడి ఎందుకు వస్తాయి, సేల్స్ టాక్స్ కోసం వాళ్ళు రశీదు ఇవ్వాలని చెప్పే వ్యవస్త ఎందుకు నిస్తేజంగా ఉంది? రోడ్లు బిల్డింగులు, ప్రాజెక్టులు కట్టే కాంట్రాక్టర్లకు కోట్లాది రూపాయల సొమ్ము ఎలా మిగులుతది ? వాటి పర్యవేక్షకులకు లంచాల రూపం లో లక్షలాది నల్లధనం , ఆ కాంట్రాక్టర్లు కట్టబెట్టిన రాజకీయ నాయకులకు కోట్లాది ఎన్నికల ఫండు ఎట్లా వస్తున్నది? కడకు మిలట్రీ యూనిఫాం, వాళ్ళ బూట్లు,వాళ్ళకు ఇచ్చే ఆహారం దగ్గర నుండి ఆయుధాల దాకా  నాసి రకం ఇవ్వబడి బడా ఆయుధ వ్యాపారులు బలిసి పోతున్నారు . పరిపాలకులు జరిగే లబ్ది జరిగి పోతున్నది. నగదు రహిత లావాదేవీలు నిజంగా చిత్త శుద్దితో అమలు జరిగితే ఇవన్నీ ఆగి పోవాలి . కానీ మళ్ళా దేశ భద్రత, అఫిషియల్ సీక్రెట్ అని సన్నాయి నొక్కులు నొక్కితే సామాన్యుడు బలిగావడం తప్పితే ప్రయోజనం ఉండదు.

అలాగే ఇ పాస్ విధానం వలను ఒక వ్యక్తికి ఉన్న సమస్త ఆస్తులు, అంటే భూములు, ఇండ్లు, ఫ్యాక్టరీలు, స్తిర చరాస్తులన్నీ ఆన్ లైన్ లో పెడితేనే వాటిని తాను మళ్ళీ ఎవరికైనా అమ్ముకోవడం గానీ మార్చుకోవడం గానీ ఉండే పరిస్తితి ఉంటుందని నేను భావిస్తున్నాను. అలాంటి నిర్ణయమే గనుక ప్రభుత్వం తీసుకుంటే మనందరం దాన్ని ఆహ్వానిచాల్సిందే! ఆ నిర్ణయాన్ని పక్కా గా అమలు చేయాలని ఉద్యమాలు చేయాల్సిందే గానీ వద్దని ఎందుకు చెప్పాలి ఎవరైనా ?



No comments:

Post a Comment