Wednesday, September 5, 2018

చరిత్ర అధ్యయనం యొక్క ఆవశ్యకత.

                                    

ఈ రోజు ఉదయం ఆస్ట్రేలియా నుండి ;మా సుబ్బా  రావ్ సార్ చిన్న కొడుకు సుజిత్ బిల్లా మాకు పంపిన టీచర్స్ డే గ్రీటింగ్ మెసేజ్ విన్న తర్వాత నా అవహానన కొంత మిత్రులతో షేర్ చేసుకోవాలనిపించింది. మాహానుభావుడు మా ఆకుల  భూమయ్య సార్ ఉండంగా ఏ విషయం లో అయినా సరే ఏదైనా సందేహం వస్తే ఫోన్ లో అయినా మాకు విషయం అర్థం చేయించడానికి ఎంత సేపైనా మాట్లాడి విషయాన్ని కూలంకషంగా చర్చ చేసే వాడు. కానీ ఆయన తర్వాత అంతటి అవగాహన ఉన్న వ్యక్తి మాకు మరొకరు పరిచయం లేకుండా పోయారు.


మనుషుల జీవన విధానానికి, వనరుల వినియోగానికి, శ్రమయుక్తమైన ఉత్పత్తి నుండి సులభతర ఉత్పత్తికి మారే క్రమం లో అభివృధ్ధి అయిన సాంకేతికత, విద్య,  అందులో మనుషుల నాగరికతలు, సంస్కృతులు, చరిత్రతో ముడిపడి యున్న క్రమానుగత సంబంధం గురించి నాకున్న అవగాహన మేరకు కొంత మాట్లాడుకుందాం.


నాగరికతలు అంటే మనుషులు నగరాలను నిర్మించుకొని జీవించే విధానం. ఒక నాగరికత గుంరించి మాట్లాడుకోవాలంటే దాని భౌగోళికత, అది మనుగడలో ఉన్న కాలం, ఉపయోగించిన భాష, లిపి, సైన్స్ ఆండ్ టెక్నాలజీ అంటే గణిత శాస్త్రం, ఖగోళ శాస్త్రం, వైద్య శాస్త్రం, కొత్త కొత్త పనిముట్లను ఆవిష్కరించుకోవడం.మతము, ఫిలాసఫీ, సంస్కృతి అంటే పండుగలు, సంగీత సాహిత్యాలు, ఆటపాటలు, కుటుంబ జీవన విధానం, కర్మకాండలు, ఇవ్వన్ని నిర్వహించుకోవడానికి ఉత్పత్తి, (వ్యవసాయం, పశుపోషణ) , మారకం, అధికారం, అంటే రాజు, లేదా గణ పతి, లేదా కుటుంబ యజమాని. తగవులు కొట్లాటాలు, యుధ్ధాలు, వాటి నియమ  నిబంధనలు అంటే చట్టాలు అన్న మాట.


క్రీ.పూ. 10,500 నుండి క్రీ. పూ. 4500-2000 కాలం దాకా నియో లిథిక్.(కొత్త రాతి యుగం)  ఏరా అంటారు.ఈ కాలం లోనే వ్యవసాయం ప్రారంభం అయింది. క్రీ. పూ. 2900 నుండి క్రీ. పూ. 1150 వరకు కంచు యుగం, క్రీ.పూ. 1100 నుండి ఇనుప యుగం ప్రారంభం అయింది. అంటే కొత్తరాతి యుగం అంతరించిపోయి ఒకే సారి కంచుయుగం వచ్చినట్టు కాదు.ఎందుకంటే ఇప్పటికీ మనం పప్పు రుబ్బుకోవడానికి రాతి పోత్రాన్ని వాడుతున్నాం, ఒక క్రమానుగతంగా పాత పనిముట్ల స్తానమ్ లో ఆధునికమైన పనిముట్లు వస్తాయన్నా మాట. ఇప్పటికీ అదే విధానం అమలవుతున్న విషయం మనం గమనించవచ్చు.


క్రీ.పూ. 4500 నుండి ఈజిప్ట్ లో సుమేరియన్ నాగరికత వెళ్లివిరింది. ప్రజలు ఆకాడియన్ భాష మాట్లాడే వారు, క్రీ పూ.2300 కాలం లో వారికి ఒక రాజు ఉండేవాడు. అతని పేరు ఆకాడియన్ రాజు. మనం చరిత్రలో చదువుతున్న అనేక రాజ్యాల పాలన వలెనే సుమేరియన్ నాగరికత కాలం లో రాచరిక వ్యవస్త పాలన నడిచింది. ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ కర్మ కాండలో ఈజిప్ట్ మమ్మీల ను గమనిస్తాము. అంటే అప్పటికే మనిషి చనిపోతే మళ్ళీ పుడుతాదన్న విశ్వాసం ఉన్నట్లు తెలుస్తున్నది.


క్రీ. పూ. 3100 కాలం లో టైగ్రిస్ , ఇఫ్రాటస్ నదుల మధ్యగల సారవంతమైన  భూభాగాన్ని ఈ రెండు నదుల నీళ్ళు సస్యశ్యామలం చేయడం వలన ఇక్కడ్ మెసపుటోమియా నాగరికత విలసిల్లింది. ప్రస్తుతం ఉన్న ఇరాక్, ఇరాన్ బార్డర్, సౌదీ అరేబియా, టర్కీ, సిరియా భూభాగం నాటి ప్రాచీన మెసపుటోమియా నాగరికత విలసిల్లిన నేల. ఇక్కడ ఆకాడియన్ భాష మాటల్ల్దేవారని, దానికి లిపి లిటరేచర్ కూడా ఉండేదని వికె పీడియా వారి సమాచారం.


క్రీ. పూ. 3300 నుండి 1300 వరకు సింధు, జీలం, చీనాబ్, రాబి, బియాస్, సట్లెజ్ అను ఆరు నదుల పరీవాహక ప్రాంతం లో సింధు నాగరికత వెళ్ళి విరిసినట్లు 1920 లో బ్రిటిష్ ప్రభ్త్వమ్ వారు జరిపించిన తవ్వకాల్లో మన ములవాసుల , మన పూర్వీకుల ఆనవాళ్ళు లభించినాయి.


క్రీ.పూ. 2003 నుండి క్రీ. పూ. 539 మధ్యలో బాబిలోనియన్ నాగరికత ఇరాక్ లో ఉండేది. ఆకడియన్స్, అమరోటియన్స్,బాబిలోనియన్స్ వలసల వలన ఈ బాబిలోనియన్ నాగరికత ఏర్పడింది.


క్రీ.పూ. 1200 నుండి క్రీ. పూ. 600 వరకు సింధు నాగరికత స్థానం లో ఆర్యులు తెచ్చిన వేదిక్ ఏరా వచ్చింది. ఈ కాలం లో రాజులు , పురోహితులు,యజ్ఞయాగాదులు, క్రతువులు నిర్వహించిన ఫలితంగా వ్యవాసాయానికి పనికి వచ్చే పశువులను బలులు ఇచ్చినట్లు వాఋ రాసుకున్న వేదాల వలన తెలుస్తున్నది.


క్రీ.పూ 600 నుండి క్రీ. ష. 1 వ శతాబ్దం వరకు భారత దేశం లో జీవహింస కు వ్యతిరేకంగా బౌధ్ధ మతం ప్రజల జీవన విధానం అయింది. ఈ కాలం నుండే భారత దేశం లో బౌధ్ధ మత వ్యాప్తి కోసం మొట్టమొదటి సారిగా శాశ్వత నిర్మాణాలైన ఆరామాలు నిర్మించబడ్డాయి.


క్రీ. ష. 1 వ శతాబ్దం తర్వాత బౌధ్ధ మతావలంబుడైన అశోక చక్రవర్తి మునిమనుమడు బృహద్రతుణ్ణి అతని సర్వ సైన్యాధ్యక్షుడైన మెసపటోమియా నాగరికతకు చెందిన ఆర్య వంశజు రాలైన వనితా పుత్రుడైన పుష్యమిత్ర సంఘుడు సంహరించి హిందూ మతాన్ని స్టాపించినాడు.


క్రీ. పూ. 1200 శతాబ్దం లో యూరప్ ఖండం లో మైనో యాన్ , మైసినియాన్ నాగరికతలు వచ్చినాయి.


రాచరిక వ్యవస్తాలో పాలకుల వలన బాధలు పడిన సామాన్య ప్రజలు అనేక తిరుగుబాట్లు చేసి చనిపోయి తమ రక్తాన్ని ఎరులై పారించి నారు. ఈ క్రమం లో ఇంగ్లాండు లో ఒకటవ, రెండవ సివిల్ వార్స్ తర్వాత 1649 లో ఆలివర్ క్రామ్ వెల్ అను అతి సామాన్యుని నాయకత్వం లో ఇంగ్లాండ్ చక్రవర్తి చార్లెస్ 1 ను చంపివేసి ఈ భూమి పైన మొట్టమొదటి సారిగా రాచరిక వ్యవస్తా స్తానమ్ లో పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్తా ఆవిర్భవించింది.


క్రీ పూ. 10500 లోని నియో లిథిక్ కాలం అంటే కొత్తరాతి యుగం  కాలం తర్వాత వచ్చిన సింధు నాగరికత అంటే క్రీ.పూ 3300 కాలం నుండి 1947 లేదా 1952 సార్వత్రిక ఎన్నికల దాకా అంటే 5250  సంవస్తారాల కాలం పాటు ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ భారత దేశం లో రాచరిక పాలనయే నడిచింది. సింధు నాగరికత కాలం నాటికి ఈ దేశం లో కుల ప్రస్తావన లేకుండే అని. వైదిక కాలం లో కూడా లేకుండే అని ఒకరు, లేదు నారద  , పరాశర స్మృతుల కాలం లోనే శిక్షా స్మృతులల్లో శూద్రుల ప్రస్తావన ఉందని ఒకరు అంటున్నారు. కాకుంటే క్రీ. శ. ఒకటవ శతాబ్దం తర్వాత నుండి క్రీ. ష. 5 వ శతాబ్దం లోని గుప్తుల కాలం నాటి కైతే మను స్మృతి స్తిరపడి శూద్ర కుల వ్య్వస్త బలపడి ప్రతి క్లులానికి ఒక పని అప్పగించబడి ఆ కులం వాళ్ళు ఆ పని చేయవల్సిందే , చేయనంటే ధర్మం తప్పిన వారీగా కుల భ్రస్తులు గా శిక్షించ బడే శిక్షా స్మృతి ఏర్పడింది. సరే ఈ కుల వ్యవస్తా ద్వారా ఎంత అవస్తాలు అవమానాలు జరిగినాయో ఇక్కడ చర్చనీయ అంశం కాదు.


ప్రపంచ వ్యాప్తంగా తన సామ్రాజ్యాన్ని విస్తరించుకొని సంపద కూడబెట్టిన యూరప్ ఖండం లోని ఇంగ్లాండ్. జర్మనీ , ఫ్రాన్స్ , ఇటలీ. లాంటి దేశాలు ప్రపంచవ్యాప్తంగా  వనరులు కలిగియున్న దేశాలనుండి కొల్లగొట్టిన సంపదలను పారిశ్రామిక ఉత్పత్తులు గా మార్చి మార్కెటింగ్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అందుకని 1760 నుండి -1820- 1840 దాకా పారిశ్రామిక విప్లవం వచ్చింది. పారిశ్రామిక విప్లవం ఫలితంగా అధికమైన  ఉత్పత్తులను అమ్ముకోవడానికి మార్కెట్ కావాల్సి వచ్చింది. ఆ మార్కెట్ ను పంచుకొనే క్రమం లో వచ్చిన తగాదాల ఫలితంగా 1914 నుండి 1918 వరకు మొదటి ప్రపంచ యుధ్ధం , 1939 నుండి 1945 వరకు రెండవ ప్రపంచ యుధ్ధాలు వచ్చినాయి.


సామాన్య ప్రజలనుండి పన్నుల రూపం లో జమచేసిన సంపద ఒకవైపు, ఆ సంపదతో పెంచిపోషించుకుంటున్న రిసర్వ్ సైనిక బలగాల బలం మరో వైపు సంతరించుకున్న సంపన్న రాజ్యాలు ప్రపంచదేశాలను తమ కాలనీలుగా మార్చుకొనే క్రమం ప్రారంభమైంది. అంటే సంపద్వంతమైన, సైనిక బలవంతమైన సామ్రాజ్యాలకు వలసరాజ్యాల అవసరం పడ్డది.అట్లా ప్రపంచదేశాలను తమ వలసలుగా మార్చుకున్న తర్వాత దోచుకున్న వనరులతో పరిశ్రమలు స్తాపించి వస్తూత్పత్తి చేయడానికి పెట్టుబడి అవసరమైంది. ఈ పెట్టుబడి ఇండస్ట్రియల్ క్యాప్టలిజం , అగ్రేరియన్ క్యాప్టలిజం, మార్కంటెలిజం . మోనోపాలి క్యాప్టలిజం. వెల్ఫేర్ క్యాప్టలిజం కార్పొరేటిజం, ఇలా దాని విశ్వరూపం విస్తరించుకున్నది. అయితే ఈ పెట్టుబడి  అనే భావన వెనుక ఉన్న పెద్దమనుషుల చరిత్ర చూద్దాం.


క్యాప్టలిజం యొక్క ఎథికల్ ప్రొఫెన్సి ఇలా ఉంది. జుడాయిజం అన్న మతం మూలాలనుండి క్రిస్టియానిటి , క్రిస్టియానిటీ లోనుండి క్యాతెలిక్స్, ప్రొటెస్టెంట్స్, ఈ  రెండు గ్రూపుల నుండి రెండు చీలికలు, ఒకటి మాయా మంత్ర తంత్రాల విశ్వాసాలను తగ్గించే వర్గం ఒకటి , ఆర్థిక నీతి సూత్రాలను ఆచరిస్తామనే వర్గం ఒకటి. ఆర్హిక నీతి సూత్ర వాదుల నుండి స్పిరిట్ ఆఫ్ క్యాప్టలిజం వాదులు వస్తారు. వీరూ నిరంకుశుద్యోగ వర్గం కలిసి శ్రమ దోపిడి చేసిన ఫలితంగా  ఏర్పడ్డదే పెట్టుబడి. ఆ విధంగా బ్రిటిష్ వలస దోపిడి ప్రసాదించిన పెట్టుబడి ఇప్పుడు ఇక్కడి జాతీయవాదుల ఆరాధ్య దేవత అయి కూచున్నది. దాని ఫలితమే ఒక్క శాతం మంది దగ్గర ఎనభై శాతం సంపద పోగై ఉన్నది. ఈ సంపద అందరికీ సమానంగా పంచబడాలే అని మొట్టమొదటి సారి చెప్పినవాడు మార్క్స్. ఇట్లా అంటే అన్న వాళ్ళది విదేశీ జ్ఞానం అనో దేశ భక్తి లేని వాళ్ళు అనో నిందిస్తున్నారు.


భారత్ దేశం లో పురాణ పురుషుడు శ్రీ కృష్ణుడు ఒక తత్వవేత్త, ఈయన,  చేయించేది , చేసేది అంతా నేనే, నీవు నిమత్త మాతృడవ్, కర్మ చేయి ఫలితం ఆశించకూ. అంతా నేను చూసుకుంటా అని బోధించినట్లు పురాణాలు చెపుతున్నాయి. ఇక పురాణ కాలం తర్వాత మన దేశం లో చర్చ అంతా పునర్జన్మ , కర్మ సిద్ధాంతం, ఆత్మ,పరమాత్మ, ద్వైతం, కాదు కాదు, అద్వైతం అంటే ఆత్మ పరమాత్మ రెండు కాదు ఒకటే , విశిస్తాద్వైతం, ఆది శంకరా చార్యులు, మద్వైతాచార్యులు, శైవం ,వీరశైవం, వైష్ణవం, భక్తి ఉద్యమాలు, ఇలా ఉపరితల అంశాల పైననే విపరీతమైన చర్చ జరిగింది. కానీ సమాజాలకు ఆధారమైన పునాది ఐన ఆర్థిక విధానాల పైన చర్చ జరుగలేదు. చానుక్యుని అర్థశాస్త్రం కూడా రాచరిక అర్థశాస్త్రమే అయింది కానీ ప్రజల ఆర్థిక సమస్యల పైన కౌటిల్యుని అర్థ శాస్త్రం మాట్లాడ లేదు.


క్రీ పూ. 469- 399 వరకు నివసించిన  గ్రీకు తత్వవేత్త సోక్రటీస్ వాదించు,ప్రశ్నించు,నిరకుశత్వాన్ని నిలదీయుమని ప్రజలకు బోధించాడు. క్రీ.పూ. 428-348 వరకు నివసించిన ప్లాటో అధిభౌతిక వాదం గురించి ప్రపంచానికి వివరించాడు. ఈ పరంపరలో అరిస్టాటిల్. ఆదమ్ స్మిత్ , జీన్ పాల్ సార్టే, నికోలస్ మాక్వెల్లి , బెర్కెలే, లాంటి తత్వవేత్తలందరు ఉన్న ప్రపంచాన్ని , ప్రపంచం ఈ విధంగా ఉందని వారి వారి పద్దతులల్లో విశదీకరిస్తే , తలక్ళిందులగా ఉన్న ఈ ప్రపంచాన్ని , సరిగా మార్చడం ఎలాగో వివరించన వాడు మార్క్స్..

 

1 comment: