Saturday, January 28, 2012

గోదావరినది పైన కరీంనగర్ జిల్లాలో ఎల్లంపల్లి వద్ద శ్రీపాద సాగర్ ప్రాజెక్ట్ పేరుతొ ఒక ప్రాజెక్ట్ కడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 9 గ్రామాలు
కరీంనగర్ జిల్లాలో 9 గ్రామాలు ముంపుకు గురి అవుతున్నాయి. ప్రభుత్వం ఏదైనా ఒక ప్రాజెక్ట్ కడుతున్నపుడు ఆ ప్రాజెక్ట్ వలన సంభవించే
పర్యావరణ విఘాతం,గురించి ప్రజలకు జరిగే జీవనోపాధి నష్టం గురించి స్పష్టంగా తెలియ జెప్పి ప్రజాభిప్రాయ సేకరణ జరుగాలి. ప్రజలకు ఇవ్వజూపె
నష్టపరిహారం గురించి గూడా తెలియజేప్పవలసిన బాధ్యతా ప్రభుత్వానిదే . సమాచారహక్కు ప్రకారం ప్రభుత్వానిది పారదర్శకంగా ఉండాల్సిన బాధ్యత
మానవ హక్కుల వేదిక రాష్ట్ర అద్యక్షులు జీవన్ కుమార్ మరియు కరీంనగర్ జిల్లా అధ్యక్షులు సుధాకర్ రెడ్డి గారు. కుక్కల గూడూర్
గ్రామాన్ని దర్శించినారు. ప్రాజెక్ట్ నిర్మాణం వలన ఈ గ్రామం పాక్షికంగా ముంపుకు గురి అవుతున్నది. సర్వే జేసినా అధికారులు వ్యవసాయ భూములను నిర్మాణాలను సర్వే జేసి వ్యవసాయ భూములకు A క్యాటగిరికి 1.5 లక్ష లు నిర్నయిన్చినారట. నిర్మాణాలను కొలిచి ఒక్కొక్క చోట సగం ఇల్లు, ఒక బాత్ రూము వరకు మాత్రం తీసుకుంటాము మిగతాది మేము తీసుకోము అంతవరదాక నీళ్ళు రావు అంటూ అధికారులు బుకాయిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. నష్టపరిహారం తీసుకోవాలని పోలీసులతో బెదిరిస్తున్నారని ప్రజలు ఎంతో బేలగా బాధగా చెప్తున్నారు.
నిన్న గణతంత్ర దినోత్సవం నాడు భారత ప్రథమ పౌరురాలు tv లో ప్రసంగిస్తూ మన ప్రజలను మన ప్రజాప్రతినిధులను మనం నమ్మకుంటే ఎలా
అని మాట్లాడి నారు. మరి ఇక్కడ మన ప్రజల న్యాయమైన హక్కులను కాపాడవలసిన పోలీసులు ప్రభుత్వ అధికారుల మాటల ప్రకారం ఎందుకు అలా భయపెడుతున్నారో అర్థం కాదు. అంటే ప్రభుత్వం తమకు వేతనం చెల్లిస్తున్నది కనుక ప్రభుత్వం ఏది చెబితే దాన్ని పాటిస్తాం అని వాళ్ళు
అనుకోవడం సరిగాదు. ఉద్యోగులు ఎవరైనా వాళ్ళు వెతనరూపమ్ లో పొందుతున్న ప్రతి పైసా ప్రజల కస్తార్జితమే. ప్రజలు చెల్లిస్తున్న పన్నులనుండే
ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా వేతనం తీసుకొనేది అన్న స్పృహ ప్రతి ఉద్యోగికి ఉండాలి.
అల్లాగే rehabilitation and resettlement act ప్రకారం గ్రామం లో కొంత భాగాన్ని ప్రభుత్వం తన అవసరం కోసం తీసుకొని తక్కిన భాగం తనకు అవసరం లేదని వదలి వేయడానికి వీలులేదు . ఎందుకంటే తర తరాలనుండి ఆ ఊరి ప్రజలు కలిసిమెలిసి ఉంటున్నారు. వారిని కొందరిని అక్కడే ఉంచి కొందరిని వేరే చోటికి వేల్లిపోమ్మనడం న్యాయం కాదని ప్రభుత్వ పాలసీఏ చెపుతాఉన్నది. ఆ ఉరి మొత్తం ప్రజలందరికి అనువైన ప్రదేశం చూసి అక్కడ వారికి పునరావాసం కల్పించ వలసిన బాధ్యత ప్రభుత్వానిది. కేవలం భూమి ఇల్లు ఉన్న వారికి మాత్రమె నష్ట పరిహారం ఇస్తాం మిగతా వారికి ఇవ్వం అంటే కూడా కుదురాదు. చేతి వృత్తులు చేసుకునే వారికి దినసరి కూలీలకు కూడా నష్టపరిహారం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.
అందుకు గాను ముందుగా ప్రభుత్వం ఒక సంప్రదింపుల కమిటీ వేయాలి , ఆ కమిటీ లో ప్రాజెక్ట్ వలన బాధిత వ్యక్తీ , సర్పంచు, mla ఉండాలి .వీరు ఎవ్వరు లేకుండా నష్ట పరిహారం నిర్ధారించి తీసుకోవాలని పోలీసులను పెట్టి ఒత్తిడి చేయడం ప్రజాస్వామికం కాదు. అన్ని వ్యవస్తల ను నిర్వీర్యం చేసి ప్రజలకు ఆయా వ్యవస్తల పట్ల నమ్మకం లేకుండా చేస్తే ప్రజల్లో అశాంతి పెరుగుతుంది, అందు వలన వ్యవస్తలో హార్మని లేకుండా పోయి అలజడులు లేస్తాయి ,యానాం లో రిజెయిన్ సమస్త కార్మికులను పీడించి వేధించి వేధించి ఏమి సాధించింది.వందలాది కోట్ల రూపాయల ఆస్తులు బుగ్గి పాలు అయినాయి, ఆ సమస్త వైస్ చేర్మన్ అసువులు బాసినాడు. ఏ సంపద అయితే కార్మికులకు దక్కకుండా తానొక్కడే అనుభావిస్తానని అనుకొంటే
అతడే లేకుండా పోయినాడు. అంటే వ్యవస్తాలను కాపాడుకోకుంటే ఎంత మంది మార్బలం ఉన్న గూడా ఇవ్వాళ యానాం లో రిజెయిన్ సంస్త ఆస్తులు బుగ్గిపాలు అయినట్టే తమకే చెందాలి తాము మాత్రమె అనుభవించాలి అని అనుకుంటున్న ఈ సంపద వాళ్లకు దక్కకుండానే పోయే
పరిస్తుతులు ఏర్పడుతాయి.
పెంటయ్య. వీరగొని.
అడ్వకేట్, కరీంనగర్.

No comments:

Post a Comment