Sunday, May 7, 2017

మనుసుల మాట 4 .

                                                 

బాహుబలి వెయ్యి కోట్ల రికార్డ్ బ్రేక్  కలక్షన్లు చూసిన తర్వాత ఒక సినిమా చూడడం కోసమే ఇన్నేసి కోట్లు ఖర్చు చేయగలిగిన భారత ప్రేక్షకుల కళా పోషణను అభినందించ వలసిందే కదా అనిపించింది. కానీ మరొక  కోణం లో చూసినప్పుడు పెట్టుబడి దారి వ్యవస్త మానస పుత్రులైన బాహుబలి దర్శక నిర్మాతలు ఏదైతే కోరుకున్నారో భారత సమాజం వారికి అది ఇచ్చివేసింది అనిపించింది. . సినిమా ప్రారంభం లో మాహిష్మతి రాజ్యాన్ని చూపిస్తున్నప్పుడు , రామాయణం లోని సుందర కాండ లో హనుమంతుడు రావణాసురుని లంకా పట్టణాన్ని వర్ణించి నట్టుగా ఎత్తైన ప్రాకారాలు, అందమైన రాజప్రాసాదాలు, సుందరమైన ఉద్యాన వనాలు కలిసి " చూడా సొంపై ఉన్నదీ - రావణ లంక , ఎంతో సుందర మైనది - రావణ లంక "  అని హనుమంతుడు అన్నట్లు గానే అద్భుతమైన నగరాన్ని చూపిస్తారు. దేవ సేన ధరించిన పట్టు వస్త్రాలు, ఆభరణాలు, అలాగే మహేంద్ర భూపతి ఆహార్యం చూపెట్టిన విధానం గూడ రాజులు  చాలా భోగ భాగ్యాలతో తులతూగున్నట్లుగానే ఉంది.  బల్లాల దేవునుకి దేవసేనతో పెళ్లి జరిపించడానికి నిర్ణయం జేసిన శివగామి తన టంకశాలాధిపతికి ఆదేశమిస్తూ " మాహిష్మతి సామ్రాజ్యపు కాబోయే  యువరానికి  పెట్టిన ఆభరనం పెట్టకుండా  సంవస్తర కాలానికి సరిపోయినన్నీ ఆభరణాలు చేయించండని " ఆదేశిస్తుంది. వియ్యంపుల వారికి పసిడి దారాలతో వస్త్రాలు నేయించందని చెపుతుంది. అది రాజరిక వ్యవస్తే, ప్రజలు సంపాదించేదంతా రాజుల హక్కు భుక్తమే కనుక ప్రక్షకులకెవ్వరికీ అది అసంబద్ధంగా అనిపించలేదేమో. అలాంటి రామ రాజ్యమే మళ్ళీ రావాలని అలాంటి  భక్తులంతా కోరుకుంటున్నారు. అయితే మొదటి గంటన్నర సంపద, ఆభరణాలు, ఆకాశ హార్మ్యాలు చూసి సంబుర పడి  మై మరచిపోయిన  ప్రేక్షకులు  తర్వాత సగం లో అంతకంటే ఎక్కువ రక్తపాతం చూసి కూడా సంపద వెంటే రక్తపాతం ఉంటుందన్న స్పృహ లేకుండా, దుస్ట శిక్షణ జరిగిందని అంతే సంబుర పడి పోయీ ఆనందం తో థియేటర్ నుండి బయటకు వస్తారు. ఈ మొత్తం ఎపిసోడ్ పైన టీవీ లల్లో పొద్దాంత చర్చలు జరుగుతున్నాయి.

ఇక్కడ నిత్యం జీవన్మరణ సమస్యలతో సతమతమైపోతున్న సగటు మానవుడు వాస్తవ పరిస్తితులు చూసి దుఖ్ఖ పడీ దుఖ్ఖ పడీ అలిసి పోయి  , ఆ కాసేపైనా " తాను కలలో కూడా ఊహించని లోకం లో "  మై మరిచి పోవడానికి ఇలాంటి సినిమాలను ఆదరిస్తున్నారేమో అనిపించక మానదు.  టమాటాలు పండించి గిట్టుబాటు దరలేక పశువులను మేపుతారు,
ఉల్లిగడ్డలు పండిస్తే అదే పరిస్తితి, మిర్చీ రైతులతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాగుడు మూతలు ఆడుకుంటయి.  , గోలివాడల రైతుల గోస చూడవశం గాదు , మల్లన్న సాగర్ రైతుల గోస మరో చరిత్ర. ఏ పంట ఎందుకు దర పలుకదో రైతులకు అర్థం గాదు, పోనీ మరి వినియోగ దారులకు ఏమైనా సరసమైన దరకు సర్కులు లభిస్తున్నాయా అంటే అదీ లేదు. రైతుల గోస అట్లుంటే , నిరుద్యోగులైన యువత చేసే తందుకు చేతిల పనిలేక  దిక్కులు జూస్తున్నరు. పత్తిరైతులు ఈయేడంటే ఇట్లున్నరు కానీ వచ్చే యేడు ఎట్లుంటదో చెప్పలేని పరిస్తితి. చేనేత కార్మికుల చావులు ఆగుతనే లెవ్వు.

ఇన్ని సంక్షోభాలను మరిపిస్తూ తమ నెత్తిన పాలుబొయడానికి భారీ పెట్టుబడి తో వచ్చిన సినిమాను  కొరినంత ధరకు టికట్లు అమ్ముకోవడానికి సర్కారు దయతో అనుమతి ఇస్తది . ప్రజలుకూడా తమ ఊహకందని సంపద , కలలోకూడా ఊహించలేని ప్రేమలు, అనుభూతులల్లో కాసేపు తమను తాము అందులో పొందుపరుచుకొని కరిగిపోతూ  తమ కళా పోశన  చాటుకుంటారు . ప్రజలను నిద్రపుచ్చే కళలు, మద్యపానాలు వర్ధిల్లుతున్నంత కాలం రాజ్యమా నువ్వూ చల్లగా వర్ధిల్లుతూనే ఉంటావు.



No comments:

Post a Comment