Wednesday, May 31, 2017

మనుసుల మాట 7

                                                             

కేంద్ర సర్కారు పశువుల వధను నిషేదిస్తూ ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత ప్రధానంగా దక్షిణ భారత దేశం లో ప్రజల నుండి వ్యతిరేకత వస్తున్నట్లు పత్రికల్లో వార్తలు చూస్తున్నాము. దక్షిణ భారత దేశం లో సైతం సంగ పరివార్ రాజకీయాలు కలిగిన వారు ఇది చాలా గొప్ప నిర్ణయం అని కేంద్ర ప్రభుత్వాన్ని సమర్తిస్తున్న  వాళ్ళు కూడా ఉన్నారు. ఒక రాజకీయ విశ్వాసం ఉన్న వాళ్ళకు వాళ్ళ దార్శనికులు  ఏమి చేసినా అది గొప్పగానే కనిపిస్తుంటూ ఉంటుందేమో. ఎందుకంటే పెద్ద నోట్ల రద్ధును ఇప్పటికీ ఇంకా కొందరు సమర్థిస్తూనే ఉన్నారు. కొత్తలో నోట్ల ముద్రణ కు సమయం కావాలని సర్ది చెప్పినారు. . కాని ఇప్పటికినీ కరన్సీ లభించక సామాన్యులు నానా అగచాట్లు పడుతూనే ఉన్నారు. పెద్ద  నోట్ల రద్దువలన ఒనగూరిన ప్రయోజనం మా లాంటి ఆజ్ఞానులకు ఇంకా అర్థం  కావడమే  లేదు.  ఆ చర్యను ఓహో అంటే ఓహో అని వారి మీడియా, వారి మనుషులు తెగ పోగాడేస్తూనే ఉన్నారు. ఇప్పుడు పొగుడుకోవడానికి  పెద్దకూర లొల్లి అదనంగా వచ్చిచేరింది.

ఈ చర్యవలన పశు సంపద వృధ్ధి అవుతుందని  కొందరి వాదన. కానీ ఆచరణ లో అది సాధ్యమయ్యే పనిగాదు . వ్యవసాయదారులకు పశువులు ఒక సంపద. వాటిని సాదడం వలన పాలు, పెరుగు, నెయ్యి, వారికి ఆహారంగ పనికి వస్తే,  వాటిని అమ్మి నాలుగు డబ్బులు జేసుకొనే అవకాశం కూడా ఉంటుంది వారికి.  అలాగే అవి వేసిన పేడ తో అవసరమైన ఎరువు రైతుకు పనికి వస్తుంది.  అవి ఇచ్చిన లేగ దూడలను ఎద్దులుగా నాగలికి ఉపయోగిస్తారు.రైతుల  ఇదంతా రైతులు, లేదా వ్యవసాయం పైన ఆధార పడి జీవించే ప్రజలు చేసే పని. వారైనా అంతా వ్యయ ప్రయాసకు ఓర్చి ఎందుకు చేస్తున్నారంటే అందులో వారి బతుకు దెరువు ఉంది. ఇపుడు ఈ కేంద్ర ప్రభుత్వ చర్యను సమర్థించే వారిలో రైతులు మరియు ఆవులను సాది వాటి ద్వారా ఉపాధి పొందే వారు ఉన్నారని నేనైతే అనుకోవడం లేదు. ఎందుకంటే ఇప్పటికే యాంత్రికత వచ్చి ఎడ్ల బండ్లు, నాగండ్లు , సవారుబండ్లు, మోటలు , బంతులు కొట్టుడు, అన్నీ బందు అయిపోయినై. అక్కడక్కడ ఏదో చిన్న చిన్న అవసరాలకోసం రైతుల వద్ద ఇంకా ఎద్దులు ఆవులు ఉన్నాయి. అయితే తనకు ఉపయోగం లేదు అనుకున్న వాటిని రైతు అమ్మివేసి మరో కొత్తదాన్ని కొని తెచ్చుకుంటాడు. కానీ ఇప్పుడు ఈ చట్టం వలన  ఆయన అమ్ముకోలేని పరిస్తితి. ఈ చట్టాన్ని సమర్థిస్తున్న పూజారి వర్గం ఆవుల పెండ దీసేది గాదూ దాని ఉచ్చ ఎత్తిపోసేదీ గాదు. చేసేటోని చేతులు కట్టివేసిన తర్వాత వాటిని సాదేదేవ్వడు ? . రేపు రేపు తనకు నిరుపయోగమైన పశువులను ఏ రైతూ పోషించడు. అప్పుడు పశువుల సంతతి అభివృధ్ధి అవుతదా ఆగిపోతదా ? ఇది గొప్పపని అని సమర్థిస్తున్న గొప్పమనుషులు ,  ఆవుల మందలను ఏ లాభం లేకుండా రేపు ఎవరైనా ఎందుకు పోషిస్తారో జవాబు చెప్పాల్సి ఉంటుంది.


No comments:

Post a Comment