Thursday, November 9, 2017

.మనుసుల మాట 17.

                                                           
భారత దేశం లోని 2.19 లక్షల మంది కుబేరుల సంపద 87,700 కోట్ల డాలర్లు అంటే అక్షరాల 56.12 లక్షల కోట్ల రూపాయలు. దైనందిన జీవితం లో వారు ఉపయోగించుకొంటున్న స్తిర, చర ఆస్తుల విలువ , వారు సేకరించుకొన్న కళా ఖండాల విలువ కాకుండా కనీసం పది లక్ష్ల డాలర్లు అంటే 6.4 కోట్ల సంపద పై బడి ఆస్తులు కలిగి ఉన్న  లక్స్మీ పుత్రుల జాబితా ఇది. కాప్ జెమినీ అంతర్జాతీయ సంస్త సేకరించిన వివరం ఇది.  

ఆర్థిక శాస్త్రం లో నోబెల్ బహుమతి గ్రహీత స్టీగ్లిట్జ్ విశ్లేషణ ప్రకారం ప్రపంచం లోని 99 శాతం సంపద కేవలం 1 శాతం గా ఉన్న కుబేరుల వద్ద నే ఉందన్నాడు. ఈ లెక్కన భారత దేశం లోని ఈ 2.19 కుబేరుల పైన ప్రభుత్వం దృస్తి పెడితే సరిపోయే దానికి 130 కోట్ల మంది సామాన్య ప్రజలను నోట్ల రద్దు పేరుతో జి‌ ఎస్ టి పేరుతో రేపు బి టి టి అంటే బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ టాక్స్ పేరు తో ప్రజలను చావమోది చెవులు మూయడం  ఎందుకన్నది మా లాంటి మంద బుద్ధుల ప్రశ్న .  

ప్యారడైస్ పేపర్ లీక్ లో 740 మంది, పనామా పేపర్ లీక్ లో 500 మంది , స్విస్ బ్యాంక్ వివరాల లీక్ లో 1195 మంది, రాడియా టేప్స్ లో 100 మంది, భారతీయులు , అందులో ;దేశ భక్తుల పేరుతో బడా పెట్టుబడి దారులు,  బ్రాండ్ అంబాసిడర్లు  , కేంద్ర  ప్రబుత్వ క్యాబినెట్ మంత్రులు, వారి ఎంపీలు ఉంటారు కానీ వారిని ఎవరూ ఏమీ అనరు. పైగా ఆ లిస్టులల్లో పేర్లు ఉన్నంత మాత్రాన వారిని తప్పుబట్టలేమని ప్రభుత్వ పెద్దలే వెనుకేసుకొని వస్తున్నారు. మరి  ఇక దొంగలు ఎవ్వరు? సామాన్య ప్రజాలెనా? కండ్లు మూసుకొని మీకు ఓట్లు వేస్తున్నందుకా? మీరు వేస్తున్న పన్నులన్నీ నోరుమూసుకొని చెల్లిస్తున్నందుకా?  ఇన్నేసి కుంభ కొనాలకు ప్రభుత్వ పెద్దలు పాల్పడుతున్నాఏనాడూ కూడా  ఇదేందని అడుగని ప్రజల అమాయకత్వమే నేరమా?

ఇంత విస్పస్టంగా ప్రజలందరికీ చెన్దవలసిన సంపద ఎక్కడ పోగై ఉందో తెలుస్తున్నా గూడా అది వెలికి తీసే ప్రయత్నం ఏమాత్రం చేయకుండా నల్ల డబ్బు పనిబడుతాం, అవినీతి పరుల పై పోరాటం చేస్తాం అంటూ, సంపన్నుల పైన్నే పన్నులు వేసి అట్లా వచ్కిన సంపద పేదలకు పంచుతామని బీరాలు పోతూ  ఎంతకాలం నమ్మబలుకుతారని  ప్రజలు ప్రశ్నించే కాలం ఇంకా ఎంతో దూరం లో లేదు.

రోజూ పత్రికలల్లో చూస్తున్నాం ప్రభుత్వాలకు ఆదాయం సమకూర్చి పెట్టె సంస్తలల్లో పనిజేసే అధికారుల ఇండ్లల్లో, సంక్షేమ పథకాలను అమలుపరిచే సంస్టల్లో పనిజేస్తున్న అధికారుల ఇండ్లల్లో, రక్షణ, నిఘా విభాగాలల్లో పనిజేస్తున్న అధికారుల ఇండ్లల్లో సోదాలు నిర్వహిస్తున్నప్పుడు లెక్కకు మిక్కిలి కోట్లాది రూపాయుయల ఆస్తులు బట్టబయలు అవుతున్నాయి. తెలుస్తూనే ఉంది కదా సంపద ఎక్కడ పొగైతున్నదో.

ప్రభుత్వాలకు నిజంగానే చిత్త శుద్ది ఉంటే నీతి గా పాలన చేయాలన్న సంకల్పమే ఉంటే మన లాంటి వారం ఎవ్వరమ్ కూడా ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరమే లేకుండా చాలా తేట తెల్లంగా కనిపిస్తున్న సత్యాలను చూడ  నిరాకరించకుండా చర్యలు గైకొంటే సామాన్యుల పైన భారం తప్పుతుంది.

No comments:

Post a Comment