Tuesday, November 28, 2017

మనుసుల మాట 18.

                                                 


ఈ రోజు ఉదయం  నుండి హైద్రాబాద్ లో ఒక వైపు మెట్రో రైల్ ప్రారంభోస్తవం మరోవైపు ఇవాంక నాయకత్వం లో  ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సు ను టి వి లో చూస్తూ మెదడు వేడెక్కింది. ఏదైనా ఒక మంచి పాట విని  మనుసును ప్రశాంత పర్చుకుందామని యు ట్యూబ్ ను  ఓపెన్ చేసిన. లతా మంగేష్కర్ పాడిన "యే మేరే వతన్ కీ లోగో " పాట ఎంతో హృద్యంగా అంతకంటే ఎక్కువ గంభీరంగా దేశ సరిహద్దుల్లో దేశ ప్రజల స్వేచ్చా స్వాతంత్రాల రక్షణ  కొరకు తమ ప్రాణాలను అరిస్తున్న అమర జవాన్ ల  కుర్బాణీ ని కీర్తిస్తున్నపాట వింటుంటే నిజంగానే షహిదొంకా యాద్ సే అంఖోమే ఆంసూ ఆయా.

"యే మేరే వతన్ కే లోగో
జర ఆంఖ్ మే భర్ లో పానీ

తుమ్ ఖూబ్ లగాలో నారా
యే శుభ్ దీన్ హై హమ్ సబ్కా "
కింది రెండు లైన్లు ఇవ్వాళ చాలా మందే అన్నారు. ఈ రోజు చాలా శుభదినం అనే అన్నారు అందరూ. ఒకటి కాదు రెండు కాదు 180 దేశాల వ్యాపార ప్రతినిధులు భారత దేశం లో  పెట్టుబడులు పెట్టడానికి వచ్చిండ్రు . . వారికి ఫలకు నామా ప్యాలస్ లో నీతి ఆయోగ్ ద్వారా భారత ప్రజల కస్టార్జిత సొమ్ము తోటి  ఒక్కొక్క భోజనానికి 18000 రూపాయల పెట్టి భోజనాలు కూడా పెట్టిచ్చిండ్రు . . వాళ్ళకు మంచిగా తినవెడితే తాగవెడితే వాళ్ళు ఖుషీ అయి చాలా ఉద్యోగాలు కల్పిస్తారని ప్రజల సొమ్ము దండిగానే ఖర్చు చేసి చాలా ఆశలే కల్పిస్తున్నరు అందరు.  ఉద్యోగాలు వస్తే మంచిదే కానీ గత చరిత్ర అనుభవాలు అందుకు భిన్నంగా ఉన్నయి మరి.

1964-65 లో నేను మంథని హైస్కూల్ లో చదువుతున్నప్పుడు అమెరికా నుండి ఇద్దరు వ్యవసాయ శాస్త్ర వేత్తలు వచ్చిండ్రు. వాళ్ళు ఇక్కడ మనకు కొత్త కొత్త విత్తనాలు ఇచ్చి ఇక్కడి మన వ్యవసాయాన్ని అభివృధ్ధి చేస్తామని వచ్చిండ్రు అన్నరు , కానీ తీరా వాళ్ళు వెళ్ళు పోయిన తర్వాత తెలిసింది వాళ్ళు మన విత్తనాల జీన్స్ ను ఎత్తుకెళ్లి పోయిండ్రని.

మోన్సాంటో కంపనీ అట్లనే బి టి విత్తనాలను ప్రవేశ పెట్టినప్పుడు కూడా ఇక పంట కు ఢోకా ఉండదు రైతుల ఇండ్లు బంగారు గోడలతోటే కట్టుకుంటరు అని ప్రచారం చేసిండ్రు. కానీ మనం ఇక్కడ రోజూ చూస్తున్నం  రైతుల  మరణాల వార్త లేని రోజు ఉంటలేదు.

చంద్రబాబు హయాం లో జినోమ్ వ్యాలీ తోటి ఇంక ఇక్కడ ఔషధాలు కారు చౌకగా లభిస్తాయని అన్నరు. కానీ తీరా ఇక్కడి భూములు పోయినై, ఉన్న భూములల్లో కూడా భూగర్భ జలాలు కలుషితమై కాలకూట విషపు నీళ్ళ నే తాగునీటికి సాగు నీటికి వాడుకొనవలసిన పరిస్తితులు వచ్చినై.

పరాయి దేశం నుండి వస్తున్న వాళ్ళకు కారు చౌకగా భూములు, నీళ్ళు( ఈ నీళ్ళను వేల కోట్ల ప్రజాధనం వెచ్చించి ప్రజలను అప్పులల్లో ముంచుతున్నరని  ప్రతి పక్షపొల్లు ఇప్పటికే ఆడిపోసుకుంటున్నరు), కరెంటు ఉచితంగా ఇచ్చుకుంట వాళ్ళు విసిరేసే చిన్నా చితకా ఉద్యోగాలను మహాప్రసాదంగా భావిస్తున్న పరిస్తితి. కానీ ఆ భూములకే వీళ్ళకు ఇచ్చినట్లే నీళ్ళు కరెంటు, ఎరువులు, విత్తనాలు ,  ఇస్తే మన రైతులే , వీళ్ళు వెదజీమ్మే కాలుష్యం లేకుండా కాలుష్య రహితంగా ఎందరికో ఉపాధి కల్పించే అవకాశం మన వ్యవసాయం లోనే ఉన్న పరిస్తితిని పాలకులు మరిచి పోతున్నరు.

ఆనాడు ఇక్కడి వనరులు దోచుకొనే పోతున్నరని  300 యేండ్లు కోట్లాడి ఒక్క ఆంగేయులను వెళ్లగొట్టగలిగినం . అదీ ఇప్పుడు , ఒక్కరు  కాదు ఇద్దరు కాదు 180 దేశాల వాళ్ళను రెడ్ కార్పెట్ పరిచి ఆహ్వానిస్తున్నాం . దానికి ,

" తుమ్ ఖూబ్ లగాలో నారా
యే శుభ్ దిన్ హై హమారా  

అంటున్నం. కానీ ,

"యే మేరే వతన్ కే లోగో
జర ఆంఖ్ మే భర్ లో పానీ  "

అనే పరిస్తితి రాకుండా జాగ్రత్త పడినమా అనేది నా లాంటి సామాన్యుని ప్రశ్న.

.

No comments:

Post a Comment